breaking news
-
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
రాష్ట్రంలో ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఇరు వర్గాలూ జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రతిపక్ష కూటమి ముప్పొద్దులా జగన్పై విరుచుకుపడడమే వారి పంథాగా బరిలోకి దిగింది. వారి వైఖరి గమ నిస్తే ఎన్నికలకు ఒకటే అజెండా పెట్టుకున్నట్టున్నారు – జగన్ని వ్యతిరేకించడం! సిద్ధాంతపరంగా కాక కేవలం ఒక వ్యక్తిని వ్యతిరేకించడం ఏమి విధానం? పవన్ కల్యాణ్ వంటి వారైతే ‘జగన్ వ్యతిరేక ఓటు’ అని కొత్త నామ కరణం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే ఒక నిర్వచనం ఉంది. ‘జగన్ వ్యతిరేక ఓటు’ ఏంటి? జగన్ అమలు చేసిన సంక్షేమ వ్యతిరేక ఓటా? మరి అదే వారి ఉద్దేశం అయితే ‘మేము ప్రభుత్వం నెలకొల్పితే జగన్ సంక్షేమ పథకాలు రద్దు చేస్తాం’ అని చెప్పే ధైర్యం చేయగలరా? పైపెచ్చు వారు ‘సూపర్ సిక్స్’ పేరుతో సంక్షేమ పథకాలు ప్రకటించారు. అంటే వీరు చేస్తే గొప్ప, జగన్ చేస్తే ఖజానా కుప్పకూలుటా? ఇదెక్కడి తర్కం? చంద్రబాబు నాయుడు ప్రతి సభలోనూ ‘ఈ దుర్మార్గుడు’ అని జగన్పై అక్కసు వెళ్లగక్కడం తనలోని కార్పణ్యానికి తార్కాణం. డీబీటీ పద్ధతి ద్వారా ప్రజల డబ్బుని లక్షల కోట్ల రూపాయల మేర పేద ప్రజలకే చేర్చడం దుర్మార్గమా? అదే అయితే బాబు పదే పదే ‘నేను వస్తే ఆడబిడ్డకు 15,000 చొప్పున మీ బ్యాంకు ఖాతాలలో వేస్తాను అనే ‘దుర్మార్గ’పు హామీ ఎందుకు ఇస్తున్నారు? అంటే, ‘జగన్ వ్యతిరేక ఓటు’ రాబట్టడానికి కూటమి దగ్గర ఉన్న ప్రణాళిక... అదే సంక్షేమం అనే మందుని కొత్త సీసాలో అమ్మదలచటమా? ‘జగన్ వ్యతిరేక ఓటు’ అంటే ఎక్కువగా యెల్లో మీడియా ప్రభావంతో నిజాన్ని చూడలేకపోతున్న వారి ఓటు. నిజానికి ‘జగన్ వ్యతిరేక ఓటు’ అనే నినాదంతో వెళ్ళడం లోనే భావదారిద్య్రం కనిపిస్తుంది. నిబద్ధత ఉన్న ప్రతిపక్షం అయితే వారు వేరేగా ఏమి చేస్తారో చెప్పాలి. 14 ఏళ్లు వెలగబెట్టి చేయని మేలు ఈ రోజు కొత్తగా చేస్తాము అంటే జనం నమ్మే పరి స్థితి లేదు. గత 10 ఏళ్లు కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా ఆంధ్ర ప్రదేశ్కు ఇవ్వవలిసిన ప్రత్యేక హోదా ఇవ్వని బీజే పీతో కూటమి ఏర్పరిచి, ఈసారి గెలిచేది మళ్ళీ మోదీ కాబట్టి మమ్మలిని గెలిపించండి అనడం దివాళాకోరుతనానికి పరాకాష్ఠ. ఈ మధ్య జరుగుతున్న సభల్లో చంద్రబాబు రైతులపై వల్లమాలిన ప్రేమ వొలకపోస్తుంటే జుగుప్స కలుగుతోంది. ‘ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోడానికి తప్ప పనికిరావు’ అని బాబు ఎద్దేవా చేయలేదా? ఆలూరు సభలో పత్తి రైతులకు మేలు చేస్తాను అని బాబు అంటుంటే అప్పట్లో ఇదే రైతుల ఇళ్లలోకి ప్రభుత్వమే చొరబడి బకాయిలకు బదులుగా వంట పాత్రలు, గిన్నెలు జప్తు చేసిన వైనం గుర్తుకొస్తుంది. ఒక పక్క నోరు విప్పితే ఆడవారిని కించ పరిచి, హత్యారోపణలు ఎదుర్కొని మతి స్థిమితం లేదనే నెపంతో చట్టానికి దొరక్కుండా బయట పడ్డ బాల కృష్ణ, మరో పక్క సొంత పార్టీకి చెందిన బహుజన నాయకులను కాలరాస్తూ బాబు బినామీలు అయిన వారికి తన పార్టీ సీట్లు కట్టబెట్టిన పవన్ తారా శక్తి చాలక సరికొత్తగా చిరంజీవి కూడా కూటమి కుంపట్లో కాలు పెట్టారు. చిరంజీవి అప్పట్లో ఒక బలమైన ప్రత్యా మ్నాయం కోసం కృషి చేసి, ఓర్పు లేక కేంద్ర మంత్రి పదవి కోసం కాంగ్రెస్ దరిచేరి, దాన్ని పూర్తిగా అనుభవించి ఇప్పుడు కాషాయ మాత్రలు మింగుతూ సీఎం రమేశ్ లాంటి వారి కోసం ప్రత్యేక వీడియో సందే శాలు ఇస్తున్నారు. ఇంకో అడుగు ముందు కేసి చంద్రబాబు తన తమ్ముడితో కలిసి కూటమి ఏర్పాటు చేయడం రాష్ట్రానికి మేలు అని చెప్ప డంతో, అదే కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసిన పురందేశ్వరిలానే ఈయన కూడా ఏ ఎండకి ఆ గొడుగు పట్టే ఫక్తు రాజకీయ కళాకారుడు అని తేలిపోయింది. ఇలాంటి విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని ప్రజలు తిరస్కరిస్తారని ఆశిద్దాము. డా‘‘ జి. నవీన్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకులు ‘ naveen.prose@gmail.com -
బస్సు యాత్ర దెబ్బకు రామోజీ కి మైండ్ బ్లాక్
-
రోడ్డు ప్రమాద బాధితుడు మరణించాడని ఎల్లో మీడియా తప్పుడు వార్తలు..
-
ఇటు ఖండన.. అటు హేళన
సాక్షి, అమరావతి: అమానుషత్వం, వక్రీకరణల్లో తలపండిన చంద్రబాబు పరివారం సీఎం జగన్పై హత్యాయత్నం ఘటనలో తన ప్రతిభనంతా రంగరించి ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే దాన్ని హేళన చేస్తూ పచ్చ మూకలు స్వైర విహారం చేయడాన్ని చూస్తుంటే ఆయనపై వారు ఎంత ఈర్ష్య, ద్వేషంతో ఉన్నారో స్పష్టమవుతోంది. ప్రధాని మోదీ నుంచి పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు ఈ దాడిని ఖండిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం జుగుప్సాకరంగా కామెంట్లు చేయటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తమకు రాజకీయాలు మినహా మానవత్వం అనేదే లేదని టీడీపీ నేతలు మరోసారి రుజువు చేసుకున్నారు. ఏం జరిగిందో తేల్చే పనిలో పోలీసులుంటే ఈలోపే తమకు నచ్చినట్లు ఊహించుకుని వక్రీకరించేందుకు పచ్చమూక పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. వైఎస్ జగన్కు రాజకీయంగా ఎక్కడ లబ్ధి చేకూరుతుందోననే భయంతో ఆయనే దాడి చేయించుకున్నట్లు టీడీపీ నేతలు నీచాతినీచంగా దుష్ప్రచారం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నేను ఖండిస్తా.. మీరు హేళన చేయండి ‘ఈ ఘటనను నేను ఖండిస్తా.. మీరు, మన మీడియా, సోషల్ మీడియా బృందాలు మాత్రం ఈ అంశాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించాలి’ అని టీడీపీ పరివారానికి చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం శనివారం రాత్రి 11.30 గంటల నుంచి వారంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. నిజానికి దాడి జరిగిన రెండు గంటల వరకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా స్పందించలేదు. రాత్రి 11 గంటల తర్వాత దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. అప్పటివరకు ఎల్లో మీడియా ఛానళ్లు సీఎంపై జరిగిన దాడి ఘటనను ప్రసారం చేయలేదు. చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో సీఎం జగన్పై దాడి ఘటనను ఖండించగా అదే సమయంలో టీడీపీ ఖాతాలో మాత్రం 2019లో విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన హత్యాయత్నంతో పోలుస్తూ పోస్టులు పెట్టారు. ఇక అక్కడి నుంచి వరుసగా టీడీపీ నేతలు వక్రీకరిస్తూ పత్రికా ప్రకటనలు, వాయిస్ వీడియోలను విడుదల చేశారు. చంద్రబాబు ఖండించిన సమయంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, లోకేష్ తదితరులు హేళన చేస్తూ పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది. సీఎం జగన్పై దాడి తర్వాత దాన్ని ఎలా తప్పుదోవ పట్టించాలనే వ్యూహాన్ని ఖరారు చేయడానికి చంద్రబాబు రెండు గంటల పాటు తర్జనభర్జన పడినట్లు వెల్లడవుతోంది. టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యాలయ ఆస్థాన విద్వాంసులు చంద్రబాబు ఆదేశాల మేరకు తమ నైపుణ్యాన్ని రంగరించి మరీ అక్కసు వెళ్లగక్కారు. పచ్చ కామెర్ల రోగిలా.. సీఎంపై హత్యాయత్నం జరిగితే ఇంత దారుణంగా వక్రీకరిస్తున్న చంద్రబాబు తన విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీలో తన భార్యను అవమానించారంటూ మీడియా సమావేశం పెట్టి మరీ భోరున ఏడ్చి సానుభూతి కోసం ప్రణాళిక రచించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నేత మీడియా ముందు ఏడవడం ద్వారా తన పరువును తానే బజారుకు ఈడ్చుకున్నారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు అందరూ తన మాదిరిగానే డ్రామాలు ఆడతారని భావిస్తూ చంద్రబాబు కుటిల రాజనీతిని ప్రదర్శించారు. 2019లోనూ అదే హేళన 2019లో విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్పై దాడి జరిగిన సమయంలోనూ చంద్రబాబు, టీడీపీ ఇదే రీతిలో స్పందించాయి. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు తన హోదాను మరచిపోయి ఆ ఘటనను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా గంటల వ్యవధిలో మీడియా సమావేశం పెట్టి జగన్ మనుషులే ఆయనపై దాడి చేశారని హేళన చేశారు. నాటి డీజీపీ ఆర్పీ ఠాగూర్పై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్సీపీ అభిమాని దాడి చేసినట్లు చెప్పించారు. ఇప్పుడు విజయవాడలో జరిగిన దాడిపైనా అదే సూత్రాన్ని అనుసరించారు. అయితే ఈసారి వ్యూహాత్మకంగా చంద్రబాబు ఖండించగా టీడీపీ, తోక పార్టీ జనసేన నేతలంతా దుష్ప్రచారానికి దిగారు. -
సీఎం జగన్పై దాడి పిరికిపంద చర్య: సజ్జల
సాక్షి, విజయవాడ: సీఎం జగన్పై రాళ్ల దాడి దారుణమని.. ఈ ఘటనను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్పై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేది. కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేది. ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఇది ఆకతాయిల చేసిన పని కాదు.. పక్కా ప్లాన్ ‘‘ఎయిర్గన్ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా ఉంది. చేతితో విసిరి ఉంటే ఇంత బలంగా తగలదు. ఇది ఆకతాయిల చేసిన పని కాదు.. పక్కా ప్లాన్తో చేశారు ప్రధానితో సహా రాజకీయాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించారు. ఘటనపై విచారణ జరపాలని ఎవరైనా చెబుతారు. ఎల్లో మీడియా భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతోంది. టీడీపీ నేతలు దీనిని నటన అంటూ ముర్ఖంగా మాట్లాడారు. కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇలా మాట్లాడరు’’ అంటూ సజ్జల మండిపడ్డారు. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు ‘‘ఇది సాధారణంగా జరిగిన ఘటన కాదు. పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్. దెబ్బ స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఇలా మాట్లాడతారా?. ప్రతీ చోట చంద్రబాబు రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు. ఓటమి ఖాయమైపోవడంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. దేవుడు, ప్రజలు ఆశీస్సులతో జగన్ క్షేమంగా ఉన్నారు. వైద్యుల సలహా మేరకు ఇవాళ విరామం తీసుకున్నారు. నటన చంద్రబాబుకు అలవాటు. నటించాల్సిన అవసరం జగన్కు లేదు. సింపతీతో ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించాయి’’ అని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు.. ‘‘సీఎం జగన్ బస్సు యాత్ర వల్ల టీడీపీకి నష్టం జరిగింది. చంద్రబాబు కూడా అందుకే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. కొట్టండి అంటూ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు. అధికారం రాదన్న అసహనంతో ఇలా రెచ్చగొడుతున్నాడు. సీఎం జగన్ బస్ యాత్ర సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ దాడి చేశారు. చంద్రబాబు రాజకీయ సిద్దాంతంలోనే ద్వేషం, రెచ్చగొట్టడం, అలజడి సృష్టించడం ఉన్నాయి. చంద్రబాబు అలిపిరి ఘటన తర్వాత సానుభూతి కోసం ఎలా నటించాడో తెలుసు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేతికి కట్టుతో వెళ్లి పాల్గొన్నాడు. కానీ చంద్రబాబు డ్రామాలకు ప్రజలు బుద్ధి చెప్పారు. చంద్రబాబు అల్లర్లు ఎలా సృష్టిస్తాడో దగ్గుపాటి వెంకటేశ్వర రావు ఒక పుస్తకంలో రాశాడు. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని ఉన్న నాయకుడు. ప్రజలతో ఇలానే మమేకం అవుతూ ముందుకు సాగుతారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: సీఎం జగన్పై దాడి ఎలా జరిగిందంటే..?
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019