breaking news
-
ప్రేమాయణంతో బయటపడ్డ నిత్యపెళ్లి కొడుకు వ్యవహారం
సాక్షి, వరంగల్: సుందరయ్య నగర్లో నిత్య పెళ్లి కొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా మరొకరిని మూడు వివాహాలు చేసుకున్న ఘనుడు.. మరో యువతితో తిరగడంపై మూడో పెళ్లికూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్కు చెందిన రాజేష్ హైదరాబాద్లో కార్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఫిబ్రవరి 2022న నగరంలోని చార్ బౌలీకి చెందిన సుమన ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మే 2022న ఆంధ్రాకు చెందిన శ్రావణి హైదరాబాదులో రెండో పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల అనంతరం సుందరయ్య నగర్కు వచ్చిన రాజేష్ సుందరయ్య నగర్కు చెందిన సారికతో ప్రేమాయణం సాగించి 2024 ఫిబ్రవరిలో తీసుకెళ్లి హైదరాబాద్ ఆర్య సమాజంలో మూడో వివాహం చేసుకున్నాడు. వీరి ముగ్గురిని వేరు వేరు చోట్ల అద్దెకు అద్దెకు ఉంచాడు. రాజేష్ ఇప్పుడు వీరి ముగ్గురిని కాదని కరుణ అనే యువతతో తిరుగుతుండడంతో నిన్న సుందరయ్య నగర్కు రావడంతో సారిక తల్లిదండ్రులు రాజేష్తో గొడవకు దిగడంతో వారి కళ్లు తప్పి రాజేష్ పరారయ్యాడు. సారిక తల్లిదండ్రులు డయల్ 100కు కాల్ చేయగా ఇంతే జారిగంజ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి విడాకులు ఇవ్వకుండా తన కూతురిని మూడో పెళ్లి చేసుకున్న రాజేష్పై చర్యలు తీసుకొని తన కూతురి జీవితాన్ని కాపాడాలంటూ సారిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
సీఎం జగన్ కు ఓటమి లేదు...
-
మహిళా ఓటర్లు తలచుకుంటే.. గత ఐదేళ్లలో జరిగిందిదే!
దేశంలోని మహిళలు ఓటు వేసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. గత ఐదేళ్లలోని గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని పలు నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదికలోని వివరాల ప్రకారం గత ఐదేళ్లలో ఎన్నికలు జరిగిన 23 రాష్ట్రాల్లోని 18 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తేలింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ఈ 18 రాష్ట్రాల్లోని 10 రాష్ట్రాల్లో తిరిగి అదే ప్రభుత్వం ఏర్పడటం విశేషం. దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్గా మారుతున్న మహిళా ఓటర్లు 2029 ఎన్నికల్లో పురుషుల కంటే అధికంగా ఉండనున్నారు. 17వ లోక్సభలో మొత్తం ఎంపీల్లో 15 శాతం మంది మహిళలు ఉన్నారు. మొదటి లోక్సభలో ఈ సంఖ్య ఐదు శాతంగా ఉంది. నివేదిక ప్రకారం రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనే అంచనాలున్నాయి. వీరిలో 33 కోట్ల మంది అంటే 49 శాతం మంది మహిళా ఓటర్లు ఉండనున్నారు. 85.3 లక్షల మంది మహిళలు తొలిసారిగా ఓటు వేయనున్నారు. 2047 నాటికి (2049లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది) మహిళా ఓటర్ల సంఖ్య 55 శాతానికి (50.6 కోట్లు) పెరుగుతుందని, పురుషుల సంఖ్య 45 శాతానికి (41.4 కోట్లు) తగ్గనుందని నివేదిక పేర్కొంది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు ఉంటారని, వీరిలో 80 శాతం మంది అంటే 92 కోట్ల మంది ఓటు వేస్తారని నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో మహిళా లబ్ధిదారులు ముందంజలో ఉన్నారు. స్టాండప్ ఇండియాలో వారి వాటా 81 శాతం. ముద్రా లోన్లో మహిళలకు 68 శాతం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 37 శాతం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 శాతం వాటా ఉంది. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణలలో మహిళా ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని నివేదిక చెబుతోంది. -
అప్పు తీర్చమన్నందుకు.. మహిళను దారుణంగా..
నిజామాబాద్: నవీపేట మండలంలోని కోస్లీ శివారులో ఉన్న అలీసాగర్ కాలువలో ఈనెల 10వ తేదీన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పుతీర్చమన్నందుకు సదరు మహిళను హత్య చేశారని తేల్చారు. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీశ్, నవీపేట ఎస్సై యాదగిరిగౌడ్ సోమవారం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రెంజల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన చంద్రకళ వద్ద అదే గ్రామానికి చెందిన భార్యాభర్తలు గోదావరి, గంగాధర్ రూ.50వేలు అప్పుగా తీసుకున్నారు. గడువు సమీపిస్తున్న తరుణంలో డబ్బులు తిరిగిచెల్లించాలని చంద్రకళ వారిని కోరగా, వారు సమాధానం ఇవ్వలేదు. చంద్రకళను హతమార్చాలని పథకం పన్నిన గోదావరి, గంగాధర్ ఈనెల 10న ఆమెను డబ్బులు చెల్లిస్తామని ఇంటికి రప్పించి గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. ఆ తరువాత ద్విచక్రవాహనంపై చంద్రకళ మృతదేహాన్ని తీసుకువచ్చి అలీసాగర్ కాలువలో పారేశారు. నిందితులైన భార్యాభర్తలు గోదావరి, గంగాధర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇవి చదవండి: తండ్రి మరణం.. బెంగతో కూతురి విషాదం! -
Sydney Mall Attack మహిళలపై అంత పగ ఎందుకు? ఎవరీ జోయెల్?
సిడ్నీ వెస్ట్ఫీల్డ్ షాపింగ్ మాల్లో మారణహోం సృష్టించిన నిందితుడిని జోయెల్ కౌచీగా పోలీసులు గుర్తించారు. మహిళలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డాడని పోలీసులు సోమవారం వెల్లడించారు. జోయెల్ మొత్తం ఆరుగురిని పొడిచి చంపగా అందులో ఐదుగురు మహిళలే ఉన్నారని చెప్పారు. అలాగే ఈ దుర్మార్గుడి దాడిలో గాయపడిన 12 మందిలో మహిళలే ఎక్కువ ఉండటం గమనార్హం. దీనిపైనే పోలీసులు ఇపుడు దృష్టి సారించారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి మాల్లో పెద్ద కత్తితో తిరుగుతూ అరగంట పాటు హల్ చల్ చేశాడని, ఈ దాడిలో మహిళల్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆస్ట్రేలియా పోలీసులు సోమవారం తెలిపారు. బాధితులను చైనాకు చెందిన విద్యార్థిని యియువాన్ చెంగ్ గుర్తించారు. మిగిలిన వాళ్లలో ఒక డిజైనర్, ఒక స్వచ్ఛంద సేవకురాలు, ఒక పారిశ్రామికవేత్త కుమార్తె, 9 నెలల పసిబిడ్డ, ఆమె తల్లితోపాటు, పాకిస్థాన్కు చెందిన 30 ఏళ్ల సెక్యూరిటీ గార్డు ఫరాజ్ తాహిర్గా గుర్తించారు. Joel Cauchi’s father: “This crime should never have happened.” @6NewsAU pic.twitter.com/zNEoAveb4E — Roman Mackinnon (@RomanMackinnon6) April 15, 2024 కాబోయే భర్తతో మాట్లాడుతూ ఉండగా ఆరో బాధితురాలు, చైనా విద్యార్థిని తన కాబోయే భర్తతో ఫోన్లో మాట్లాడుతుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం విషాదం. Sydney is a city reeling, in mourning, and desperate for answers to explain Joel Cauchi's heinous knife attack at Bondi Junction. #9News LATEST: https://t.co/BaBiRjwTXk pic.twitter.com/Vd453KKrBU — 9News Sydney (@9NewsSyd) April 15, 2024 ఎవరీ జోయెల్ కౌచి? ♦ జోయెల్ కౌచి సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం, క్వీన్స్లాండ్లోని బ్రిస్బేన్ సమీపంలోని టూవూంబా నుండి వచ్చాడు. స్థానిక ఉన్నత పాఠశాల , విశ్వవిద్యాలయంలో చదివాడు. ♦ జోయెల్ కౌచి తన కుడి చేతిపై పలు రంగుల్లో డ్రాగన్ టాటూ ఉంది. ఇదే అతణ్ణి గుర్తించడంలో కీలకంగా మారింది. ♦ టీనేజ్నుంచి మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాడని కుటుంబం చెబుతోంది. ♦ అడపాదడపా మెసేజ్లద్వారా మాత్రమే టచ్ లో ఉండేవాడని అతని తల్లిదండ్రులు మీడియాకు చెప్పారు. ♦ దాడికి ఒక నెల ముందు, జోయెల్ కౌచి సిడ్నీకి వెళ్లి ఒక రూం అద్దెకు తీసుకున్నాడు. అక్కడ జోయెల్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019