breaking news
-
బస్సు యాత్ర విజయవంతం
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభ విజయవంతమయ్యాయని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గురువారం తణుకులోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భీమవరంలో సిద్ధం సభ జనసంద్రమైందని, బస్సు యాత్రకు ప్రజలు నీరాజనాలు పట్టారన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అ వ్వాతాతలు, యువత, చిన్నారులు, మహిళలు సైతం రోడ్లపైకి వచ్చి సీఎం జగన్కు అభివాదాలు చేసిన దృశ్యాలు కనిపించాయన్నారు. రాజకీయంగా ఇంతటి ప్రజాదరణ పొందిన సీఎం జగన్ చరిత్రలో నిలుస్తారన్నారు. బస్సుయాత్ర, సిద్ధం సభలతో వెన్నులో వణుకు పుడుతున్న చంద్రబాబు అండ్కో దాడులకు దిగుతున్న పరిస్థితుల్లో సైతం జగన్ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వస్తున్నారన్నారు. బస్సుయాత్రను జయప్రదం చేసిన పార్టీ శ్రేణులు, ప్రజలకు మంత్రి కారుమూరి కృతజ్ఞతలు చెప్పారు. యాత్ర సాగిందిలా.. పశ్చిమగోదావరి జిల్లా తేతల్లిలో రాత్రి బస క్యాంపు నుంచి సీఎం జగన్ తణుకు, సిద్దాంతంమీదుగా డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గోపాలపురం, ఈతకోట, రావులపాలెం, జొ న్నాడ జంక్షన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి మూలస్థానం క్రాస్, చెముడులంక, మడికి జంక్షన్, పొట్టిలంకకు చేరుకున్నాక బస్సు యాత్ర భోజన విరామానికి కొద్దిసేపు ఆగింది. సా యంత్రం వేమగిరి జంక్షన్, ధవళేశ్వరం ఇండస్ట్రియల్ ఏరియా, బొమ్మూరు సెంటర్ రాజ మండ్రి సిటీ ముఖద్వారం మోరంపూడి జంక్షన్ కు సాయంత్రం 5.34 గంటలకు సీఎం జగన్ చే రుకున్నారు. అక్కడ నుంచి రాజమండ్రి నగరంలోకి యాత్ర ప్రవేశించింది. మోరంపూడి జంక్షన్ నుంచి తాడితోట, షెల్టన్ సెంటర్, దేవీచౌక్, పేపరు మిల్లు, కాతేరు గామన్ బ్రిడ్జి, ది వాన్చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రా జాపురంలో రాత్రి బస క్యాంపునకు చేరారు. -
ఉప్పొంగిన జనగోదావరి
మేమంతా.. మీ వెంటే.. తేతలిలో అభిమానుల సందడిరావులపాలెం.. జన సంద్రం.. రావులపాలెంలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న సీఎం జగన్●సాక్షి, భీమవరం: జననేత జనాదరణ ముందు మండు వేసవి చిన్నబోయింది.. ఓ వైపు నిప్పుల కొలిమిని తలపిస్తూ ప్రచండ భానుడి ప్రతాపం.. మరోవైపు వేడిసెగలు కక్కుతున్న జాతీయ రహదారి.. సంక్షేమ సారథిని చూసేందుకు పోటెత్తిన జనాభిమానం ముందు ఇవన్నీ వెలవెలబోయాయి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో జన గోదారిని తలపిస్తూ దిగ్విజయంగా ముగిసింది. ఒకరోజు విరామం తర్వాత శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బుధవారం విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. తణుకు మండలం తేతలి వద్ద రాత్రి బస క్యాంపు నుంచి గురువారం ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమైంది. అప్పటికే వేడిగాలులతో సూర్యప్రతాపం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా సీఎం జగన్ను చూ సేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు, అభిమానులు క్యాంపు సమీపంలోని జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. సీఎం జగన్ వారందరినీ చూసి బస్సు ఆపి బయటకు వచ్చి అభివాదం చేస్తూ, పలకరిస్తూ ఉత్సాహం నింపారు. ‘ప్లీజ్ హెల్ప్’ అంటూ ప్లకార్డులతో ఉన్న మహిళలను చూసి.. వారితో మాట్లాడారు. తేతలి సెంటర్, తణు కు వై.జంక్షన్, శర్మిష్ట్ట జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, పెరవలి వై.జంక్షన్ మీదుగా బస్సు యాత్ర సా గింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాదిగా ప్రజలు ఆయా కూడళ్ల వద్దకు చేరుకుని జననేత రా క కోసం ఎదురుచూశారు. బస్సులోని సీఎం జగన్ ను చూసి జై జగన్, సీఎం.. సీఎం.. అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి సైతం జనం ఉన్న ప్రతిచోటా బస్సు ఆపి బయటకు వచ్చి వారితో మాట్లాడారు. అలాగే వారి వినతులపై తక్షణమే స్పందిస్తూ, చిరునవ్వుతో అభివాదం చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. సత్వరమే స్పందించి.. పక్షవాతంతో బాధపడుతున్న తన 12 ఏళ్ల చిన్నారికి పింఛన్ ఇప్పించాలని వడ్డూరుకు చెందిన తల్లి కో రగా, తేతలిలో జన్యుపరమైన సమస్యలతో బాధడుతున్న నరసింహ అనే దివ్యాంగునికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల పింఛన్ రూ.5 వేలు చేయాలని అతని కుటుంబ సభ్యులు సీఎం జగన్ను కోరారు. ఆయా వినతులపై వెంటనే స్పందించిన ముఖ్య మంత్రి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సిద్ధాంతం.. ఘన స్వాగతం గోదావరి వశిష్ట వారధి (సిద్దాంతం బ్రిడ్జి) సమీపంలో ఆచంట నియోజకవర్గం దొంగరావిపాలెం వద్ద ఎమ్మెల్యే, ఆచంట అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో బస్సుయాత్రకు ప్రజలు ఘ నంగా స్వాగతం పలికారు. సీఎం జగన్ బయటకు వచ్చి వారిని పలకరించారు. దొడ్డివారిపాలెంకు చెందిన రవికుమార్ రెండు కిడ్నీలు పాడయ్యాయని, వైద్యానికి ఇబ్బంది పడుతున్నానని, సిద్ధాంతానికి చెందిన కొబ్బరి బొండాల వ్యాపారి వేండ్ర మోహనరావు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పెనుగొండకు చెందిన విద్యార్థి మైలే డేవిడ్ జార్జ్ ప్రైజ్ ట్రై స్కూటీ, జగనన్న విద్యాదీవెన కోసం అభ్యర్థించగా ఆయా వినతుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ తన సిబ్బందికి సూచించారు. అనంతరం వశిష్ట వారధి దాటి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి యాత్ర ప్రవేశించడంతో పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర దిగ్విజయంగా ముగిసింది. బస్సు యాత్రలో మంత్రి, తణుకు అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల సీఎం జగన్ పక్కన ఉన్నారు. అదృష్టంగా భావిస్తున్నా.. సీఎం జగన్ను స్వయంగా కలవడం అదృష్టంగా భావిస్తున్నా. నా సమస్యను సావధానంగా విని సత్వర పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. నాకు ట్రైస్కూటీ మంజూరు చేయమని, జగనన్న విద్యాదీవెన ఆఖరి విడత నిలిచిపోయిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాను. – మైలే డేవిడ్ జార్జ్ ప్రైజ్, పెనుగొండ సావధానంగా విన్నారు కొబ్బరి బొండాల వ్యాపారంలో తీవ్రంగా నష్ట పోయానని, ఆర్థికంగా చితికి పోవడంతో అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్నానని సీఎం జగన్కు విన్నవించుకున్నా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా.. ఆయన నా సమస్యను సావధానంగా విని భరోసా ఇచ్చారు. – వేండ్ర మోహనరావు, సిద్ధాంతం అడుగడుగునా అమితాదరణ సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన జాతీయ రహదారిపైకి పోటెత్తిన జనం జై జగన్ నినాదాలతో మార్మోగిన హైవే ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన ముఖ్యమంత్రి పశ్చిమగోదావరి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర -
నామినేషన్లకు పటిష్ట బందోబస్తు
భీమవరం: ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ డాక్టర్ అజిత తెలిపారు. నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు పాటించాల్సిన ఎన్నికల నియమావళికి సంబంధించి గురువారం ఆమె ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానానికి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు, సానుభూతిపరులు ఎన్నికల సంఘం విధివిధానాలను తప్పక పాటించాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నామినేషన్ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు పొందాలని, సమయం, వారు ప్రయాణించే మార్గాం వివరాలు ముందుగా తెలియజేయాలని సూచించారు. ఊరేగింపులో పది వాహనాలకు మించి ఉండరాదని, డీజేలు, మందు గుండు సామగ్రిని ఉపయోగించాదన్నారు. అభ్యర్థుల ప్రసంగాల్లో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం పరిధిలో 100 మీటర్ల లోపులో అభ్యర్థికి చెందిన మూడు వాహనాలను మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. గుడాల గోపికి రిటైర్డ్ ఎస్పీ మూర్తి మద్దతు పోడూరు: పాలకొల్లు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్ధి గుడాల గోపికి పెనుమదం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్పీ జీవీఎస్ మూర్తి మద్దతు తెలియజేశారు. పెనుమదంలో గురువారం వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో స్ధిరపడిన రిటైర్డ్ ఎస్పీ మూర్తి ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల గోపికి తన మద్దతు తెలిపారు. ఆత్మీ య సమావేశం సందర్భంగా ఆయన మండల కన్వీనర్ పితాని చిన్నా, గ్రామక కమిటీ అధ్యక్షుడు గెద్దాడ ఏసులతో ఫోన్లో మాట్లాడారు. ఎన్నడూ లేనివిధంగా అన్నివర్గాలకు సమన్యాయంతో పరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు తన సంఘీభావం తెలుపుతూ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల గోపికి, ఎంపీ అభ్యర్ధి గూడూరి ఉమాబాలకు తన మద్దతు తెలియజేస్తున్నట్లు మూర్తి స్థానిక నాయకులతో మాట్లాడుతూ చెప్పారు. మూర్తి మద్దతుతో మరింత ఉత్సాహంతో ఎమ్మెల్యే అభ్యర్ధి గుడాల గోపి, ఎంపీ అభ్యర్ధి గూడూరి ఉమాబాల విజయానికి మరింత ఉత్సాహంగా కృషి చేస్తామని పెనుమదం వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. -
నామినేషన్లసందడిషురూ
తొలిరోజు పార్లమెంట్కి ఒకటి, అసెంబ్లీకి ఆరు ఏలూరు (మెట్రో): నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన మొదటి రోజు ఏలూరు జిల్లాలో ఏలూరు పార్లమెంట్కు ఒకటి, అసెంబ్లీ నియోజకవర్గాలకు 6 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున మెండెం సంతోష్ కుమార్ తన నామినేషన్ను కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్కు అందజేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ నుంచి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), దెందులూరు నియోజకవర్గానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఆలపాటి నరసింహమూర్తి, పోలవరం నియోజకవర్గానికి జనసేన పార్టీ నుండి చిర్రి బాలరాజు, గోండ్వానా దండకారణ్య పార్టీ నుంచి మడకం వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. నూజివీడు నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థులుగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, ముద్దరబోయిన రాధిక నామినేషన్లు దాఖలు చేశారు. ఉంగుటూరు, చింతలపూడి, కై కలూరు నియోజకవర్గాలలో నామినేషన్లు దాఖలు కాలేదు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: సార్వత్రిక ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ఏలూరు జిల్లాలో ఆరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి పశ్చిమలో రాజకీయ సందడి తారాస్థాయిలో ఉంది. అన్ని పార్టీల అభ్యర్థుల హోరాహోరీ ప్రచారం, పాదయాత్రలతో పొలిటికల్ హీట్ పెరిగింది. తొలిరోజు ఏలూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ముహూర్తాలు చూసుకుని.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 25 వరకు కొనసాగనుంది. పార్లమెంట్ అభ్యర్థులు ఆయా జిల్లాల కలెక్టర్లకు, అసెంబ్లీ అభ్యర్థులు తహసీల్దార్ కార్యాలయాల్లోని రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు సమర్పించాలి. అధికార వైఎస్సార్ సీపీతో పాటు ప్రతిపక్ష కూటమి పార్టీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. నేడు భారీగా నామినేషన్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం భారీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు తణుకు నుంచి పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆచంట నుంచి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం నుంచి చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, భీమవరం నుంచి ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్, ఉండి నుంచి పీవీఎల్ నర్సింహరాజు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల భారీ ర్యాలీలతో వెళ్లి నామినేషన్లు వేయనున్నారు. ఏలూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు దెందులూరు నుంచి ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి భారీ బైక్ ర్యాలీతో నామినేషన్ వేయనున్నారు. అలాగే పశ్చిమలో కూటమి అభ్యర్థులుగా టీడీపీ నుంచి పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, తణుకు నుంచి ఆరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం నుంచి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 25 వరకు నామినేషన్ల సందడి ● 20న చింతలపూడి వైఎస్సార్సీపీ అభ్యర్థి కంభం విజయరాజు, 22న కై కలూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్, నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, చింతలపూడి టీడీపీ అభ్యర్థి సొంగా రోషన్, నరసాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్, ఉండి టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు (అభ్యర్థిత్వం ఖరారు అయితే) నామినేషన్లు వేయనున్నారు. ● 23న నూజివీడు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప అప్పారావు, కై కలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్, ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి, ఉంగుటూరు జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ● 24న పోలవరం వైఎస్సార్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి, పాలకొల్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి నామినేషన్లు వేయనున్నారు. ● 25న తాడేపల్లిగూడెం వైఎస్సార్ సీపీ అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఘట్టం తొలిరోజు ఏలూరు జిల్లాలో 6, పశ్చిమలో ఒకటి దాఖలు ఏలూరు అసెంబ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆళ్ల నాని నేడు రెండు జిల్లాల్లోనూ భారీగా నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు -
భవన్స్లో ముగిసిన త్రోబాల్ పోటీలు
పాలకొల్లు (సెంట్రల్): భవన్స్ ఇంటర్ స్కూల్ బాలికల త్రోబాల్ పోటీలు భారతీయ విద్యా భవన్స్ గ్రీన్ ఫీల్డ్స్ పాఠశాలలో ఘనంగా నిర్వహించామని పాఠశాల డైరెక్టర్ ఎంఎస్ఎన్ మూర్తి చెప్పారు. భీమవరం, పాలకొల్లు, వడ్లవానిపాలెం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, గుంటూరు భవన్స్కు చెందిన క్రీడాకారిణులు పాల్గొన్నారన్నారు. వడ్లవానిపాలెం భవన్స్ విద్యార్థిని వై.వైష్ణవి బెస్ట్ సర్వర్ అవార్డును కై వసం చేసుకుందని తెలిపారు. పోటీల్లో తాడేపల్లిగూడెం ప్రథమస్థానం, గుంటూరు ద్వితీయ స్థానం, భీమవరం తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. పీడీ గొట్టుముక్కల శేఖరరాజు గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సామంతపూడి శ్రీరామరాజు, ప్రిన్సిపాల్ ఐ.మనోహర్, వైస్ ప్రిన్సిపాల్ ఎంవీ సూర్యన్, అధ్యాపకులు, పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ పరిశీలన భీమవరం (ప్రకాశంచౌక్) : ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు గురువారం భీమవరం కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించారు. ముందుగా వ్యయ పరిశీలకులు పియూష్ శుక్లా, మోహన్ అగర్వాల్, విక్రమాదిత్య మీనా కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టరేట్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్లో విభాగాలను పరిశీలించారు. ఎంసీసీ, ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్, వ్యయ మానిటరింగ్ సెల్, సీజర్స్, సువిధ, గ్రీవెన్స్–రిడ్రెసల్ సెల్ తదితర విభాగాల గురించి కలెక్టర్ వారికి వివరించారు. కంట్రోల్ రూమ్ సేవలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. జేసీ సీవీ ప్రవీణ్ ఆదిత్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్ తదితరులు ఉన్నారు. నేటి నుంచి బాస్కెట్బాల్ అంతర్ జిల్లా పోటీలు నూజివీడు: పట్టణంలోని బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆవరణలో ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు ఏపీ స్టేట్ 9వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాలుర, బాలికల బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు బాస్కెట్బాల్ కోచ్ వాకా నాగరాజు గురువారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ అసిసోయేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన బాస్కెట్బాల్ జట్లు పాల్గొంటాయన్నారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో నిర్వహించే ఈ పోటీలను బేతస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్, విక్టోరియా పురమందిరంలో ఉన్న బాస్కెట్బాల్ కోర్టులలో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019