breaking news
-
ఇజ్రాయెల్ ప్రతీకార దాడి లక్ష్యాలపై ఐరాస ఆందోళన!
ఇజ్రాయెల్పై ఇరాన్ 300లకు పైగా డ్రోన్లు, మిసైల్స్లతో శనివారం దాడి చేసింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులతో భీకరంగా విరుచుకుపడింది. అయితే ఈ దాడులను ఇజ్రాయెల్ 99 శాతం మిత్ర దేశాల సహకారంతో అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తున్న ఇజ్రాయెల్.. ప్రాంతీయ సంఘర్షణ తీవ్రతరం కాకుండా ఉండేందుకు సంయమనం పాటించాలని మిత్రదేశాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది. ప్రతీకార దాడి చేసేందుకు ఇరాన్లోని అణ కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవటం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని ఐక్యరాజ్యసమితి నిఘా విభాగం చీఫ్ రాఫెల్ గ్రాస్సీ పేర్కొన్నారు. గత రాత్రి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి వార్ కేబినెట్లో ప్రతీకార దాడులకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్పై ప్రతీకాక దాడి చేయడికి సిద్ధంగా ఉందని ఆ దేశ ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. అమెరికా, ఇండియా, యూకేతో పాటు పలు దేశాలు ఇరాన్పై ప్రతీకార దాడులతో పరిస్థితులను తీవ్రతరం చేయవద్దని ఇజ్రాయెల్ను కోరుతున్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి స్పందిస్తూ.. ఇరాన్పై ప్రతీకార దాడి చేయడానికి సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే దాడికి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నుంచి ఆమోదం ఇంకా లభించలేదని అన్నారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే తాము సెకండ్లలోనే శనివారం కంటే అతిభీకరమైన దాడులు చేయడానికి కూడా వెనకాడబోమని ఇరాన్ హెచ్చరిస్తోంది. -
ఇరాన్ మిసైల్ దాడులు: తొలిసారి స్పందించిన నెతన్యాహు
జెరూసలెం: తమ దేశం మీద డ్రోన్లు, మిసైళ్లతో ఇరాన్ జరిపిన దాడులపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం(ఏప్రిల్14) స్పందించారు. ఇరాన్ దాడులకు ఎలా స్పందించాలనేదానిపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన వార్ క్యాబినెట్ భేటీకి వెళ్లే ముందు నెతన్యాహు మాట్లాడారు.‘మేం అడ్డుకున్నాం. కూల్చివేశాం. కలిసికట్టుగా గెలుస్తాం’అని ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లను అమెరికా,బ్రిటన్ సహకారంతో కూల్చివేయడంపై స్పందించారు. కాగా శనివారం(ఏప్రిల్13)అర్ధరాత్రి ఇరాన్,ఇజ్రాయెల్పై వందల కొద్ది డ్రోన్లు, మిసైళ్లతో దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తునేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ‘ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్ ఇంకా ముగియలేదు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం’అని ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి యోవ్ గల్లాంట్ అన్నారు. కాగా, సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు దిగింది. ఇదీ చదవండి.. ఇరాన్ దాడులు.. ఇజ్రాయెల్కు పోప్ కీలక సూచన -
ఇరాన్ దాడులు.. ఇజ్రాయెల్కు పోప్ కీలక సూచన
వాటికన్సిటీ: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. ఇరాన్ డ్రోన్ దాడులకు ఇజ్రాయెల్ స్పందించవద్దని లేదంటే హింస పెరుగుతుందని పోప్ అన్నారు. ‘యుద్ధం చాలు, దాడులు చాలు, హింస చాలు. శాంతి కావాలి. చర్చలు కావాలి’అని వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ స్క్వేర్ వద్ద సందర్శకులను ఉద్దేశించి పోప్ ప్రసంగించారు. కాగా, ఇజ్రాయెల్పై శనివారం(ఏప్రిల్ 13) రాత్రి వందల కొద్దీ డ్రోన్లతో ఇరాన్ దాడులు చేసింది. ఈ డ్రోన్లు, మిసైళ్లలో చాలా వాటిని ఇజ్రాయెల్ కూల్చి వేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనేది ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు పోప్ సూచన కీలకంగా మారింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేసి ఆ దేశ ఆర్మీ ఉన్నతాధికారులను ఇజ్రాయెల్ చంపినందుకే ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఇదీ చదవండి.. ఇరాన్ దాడులు అమెరికా వ్యూహం ఫలించిందా -
ఇజ్రాయెల్ వణుకుతోంది: మళ్లీ హెచ్చరించిన ఇరాన్
టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా దాడి జరగొచ్చని ఇరాన్ మరోసారి హెచ్చరించింది. ‘ఇరాన్ ఏం చేయబోతోందో ఇజ్రాయెల్కు తెలియదు. తమ దేశంపై ఎక్కడ దాడి జరుగుతుందోనని వణుకుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్లో చాలామంది షెల్టర్లలోకి పారిపోయారు. అసలైన యుద్ధం కంటే ఈ మానసిక, మీడియా, రాజకీయ యుద్ధమే వారిని మరింత భయపెడుతోంది’అని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ సలహాదారుడు యాహ్యా రహీం సఫావీ పేర్కొన్నారు. మరోవైపు.. హార్ముజ్ జలసంధి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగిన ఇరాన్ కమాండోలు దాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. నౌకలో 17 మంది భారతీయులు ఉండడంతో వారి విడుదల కోసం ఇరాన్ అధికారులతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇటీవల ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి బదులు తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించినప్పటి నుంచి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇదీ చదవండి..ఇజ్రాయెల్ నౌకపై ఇరాన్ దాడి.. నౌకలో 17 మంది భారతీయులు -
ఇజ్రాయెల్ నౌకపై ఇరాన్ దాడి.. నౌకలో 17 మంది భారతీయులు
దుబాయ్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్పై దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ బిలియనీర్కు చెందిన ఎమ్ఎస్సి ఎరిస్ కంటెయినర్ షిప్ను గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఇరాన్ నేవీ ఆధీనంలోకి తీసుకుంది. పోర్చుగల్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 17 మంది భారతీయులుండటం కలవర పరుస్తోంది. వీరి విడుదల కోసం భారత ప్రభుత్వం ఇరాన్తో ఇప్పటికే సందప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. నౌకను ఇరాన్ తీసుకెళుతున్నట్లు ఇరాన్ నేవీ ప్రకటించింది. నౌక డెక్పై ఇరాన్ కమాండోలు కూర్చున్న వీడియో బయటికి వచ్చింది. ఇజ్రాయెల్ బిలియనీర్ వ్యాపారవేత్తకు చెందిన జోడియాక్ మారిటైమ్ గ్రూపు ఈ నౌకను నిర్వహిస్తోంది. హెలికాప్టర్ ద్వారా ఇరాన్నేవీ సిబ్బంది నౌకపై దాడి చేసి లోపలికి ప్రవేశించారు. హర్మూజ్ జలసంధివైపు వెళుతుండగా చివరిసారిగా ఎంఎస్సి ఎయిరిస్ను గుర్తించారు. ఘటన తర్వాత ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి స్పందించారు. ఇరాన్ గార్డ్స్ను ఉగ్రవాదులుగా గుర్తించాలని ప్రపంచ దేశాలను కోరారు. ఇరాన్లో ప్రస్తుతం క్రిమినల్స్ పాలన కొనసాగుతోందని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి పైరేట్ ఆపరేషన్లను ఆ దేశం నిర్వహిస్తోందని ఫైర్ అయ్యారు. హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కూడా ఇరాన్ మద్దతిస్తోందని మండిపడ్డారు. కాగా, ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడిలో ఏడుగురు ఇరాన్ ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు. ఘటనతో ఆగ్రహించిన ఇరాన్, ఇజ్రాయెల్పై దాడులు చేస్తామని ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇదీ చదవండి.. అలర్ట్.. 48 గంటల్లో యుద్ధం
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019