breaking news
-
సన్రైజర్స్తో మ్యాచ్.. హైదరాబాద్ చేరుకున్న విరాట్ కోహ్లి! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్ పరంగా పర్వాలేదన్పిస్తున్న ఆర్సీబీ.. బౌలింగ్ పరంగా మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రం విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. వరుస పరాజయాలతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి కూడా దాదాపు నిష్క్రమించినట్లే. అయితే కనీసం మిగిలిన మ్యాచ్ల్లోనూ విజయం సాధించి టోర్నీని ఘనంగా ముగించాలని ఆర్సీబీ భావిస్తోంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో మరో కీలక పోరుకు ఆర్సీబీ సిద్దమైంది. ఏప్రిల్ 25న హైదరాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హైదరాబాద్ చేరుకున్నాడు. జట్టు కంటే ముందే విరాట్ భాగ్యనగరంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో స్టైలిష్ లూక్లో విరాట్ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ నిరాశపరుస్తున్నప్పటికి.. కోహ్లి మాత్రం అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన విరాట్.. 379 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. #ViratKohli arrived in Hyderabad for the upcoming IPL match, #SRHvsRCB on Thursday. pic.twitter.com/ljkoyENfmy — Gulte (@GulteOfficial) April 23, 2024 -
టీ20 వరల్డ్కప్లో ఓపెనర్లుగా రోహిత్, జైశ్వాల్.. గిల్కు నో ఛాన్స్?
ఐపీఎల్ 2024 సీజన్ ప్రస్తుతం క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. ఈ క్యాష్ లీగ్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే మరో మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూన్1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా టీ20 వరల్డ్ కప్-2024 షురూ కానుంది. అయితే ఈ టోర్నీ ఆరంభానికి నెల రోజుల పైగా సమయం ఉన్నప్పటికి.. ఐసీసీ నిబంధనల ప్రకారం మే 1లోపు ఆయా జట్లు తమ వివరాలను సమర్పించాల్సిందే. ఈ క్రమంలో ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్లను ఖారారు చేసే పనిలో పడ్డాయి. బీసీసీఐ కూడా తమ జట్టును ఏప్రిల్ 28న ప్రకటించే అవకాశముంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి వరల్డ్కప్లో భామయ్యే జట్టును వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీ20 వరల్డ్కప్లో భాగమయ్యే భారత టాప్-3 ఆటగాళ్లను ఎంచుకున్నాడు. భారత ఇన్నింగ్స్ను కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ను కలిసి ప్రారంభించాలని పఠాన్ అభిప్రాయపడ్డాడు. జైశ్వాల్ ముంబై ఇండియన్స్పై అద్బుతమైన సెంచరీతో చెలరేగాడని, కాబట్టి అతడు కచ్చితంగా ఓపెనర్గా రావాలని పఠాన్ అన్నాడు. అదే విధంగా ఫస్ట్ డౌన్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పఠాన్ ఎంపిక చేశాడు. వరల్డ్కప్ జట్టులో కోహ్లి కచ్చితంగా ఉంటాడని ఇర్ఫాన్ థీమా వ్యక్తం చేశాడు. స్ట్రైక్ రేట్ పరంగా క్రిస్ గేల్ కంటే కోహ్లినే మెరుగ్గా ఉన్నాడని, టీ20 వరల్డ్కప్ వంటి మెగా ఈవెంట్లో స్ట్రైక్ రేట్ పెద్ద సమస్య కాదని పఠాన్ ఎక్స్లో రాసుకొచ్చాడు. Now that World Cup is nearing. My top 3 for team India. 1) Rohit Sharma (in form as well as captain) 2) Yashasvi Jaiswal (been saying that he should be there even before his 100 purely cos he was performing well for team India before the ipl) 3) Virat Kohli. (Shouldn’t be… — Irfan Pathan (@IrfanPathan) April 23, 2024 -
రోహిత్తో కలిసి అతడే ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్-2024 కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, అదే సమయంలో యశస్వి జైస్వాల్ కూడా రేసులో ఉన్నాడనే విషయం కూడా మర్చిపోద్దని దాదా పేర్కొన్నాడు. కాగా వరల్డ్కప్ జట్టు ఎంపికకు ఐపీఎల్-2024 ప్రదర్శన కీలకం కానుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2022 తర్వాత సుదీర్ఘకాలం టీ20 జట్టుకు దూరమైన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఇటీవల స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మెగా టోర్నీలో వీరిద్దరు ఓపెనర్లుగా దిగనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో కోహ్లి ఎనిమిది మ్యాచ్లలో కలిపి 379 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఓ సెంచరీ(113 నాటౌట్) కూడా ఉంది. మరోవైపు.. రోహిత్ శర్మ కూడా శతకంతో చెలరేగాడు. ఎనిమిది మ్యాచ్లలో కలిపి 303 పరుగులతో ప్రస్తుతం టాప్-5లో ఉన్నాడు. వీరిద్దరు ఇలా ఫామ్లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇక రాజస్తాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభంలో తడబడ్డా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అజేయ సెంచరీ(104)తో దుమ్ములేపి రేసులోకి దూసుకువచ్చాడు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు. 40 బంతుల్లోనే సెంచరీ చేయగల సత్తా విరాట్ కోహ్లికి ఉంది. వెళ్లి హిట్టింగ్ ఆడటమే పనిగా పెట్టుకోవాలి. 5-6 ఓవర్ల తర్వాత ఫలితం అదే కనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం వరల్డ్కప్లో రోహిత్- విరాట్ కలిసి ఓపెనింగ్ చేయాలి. సెలక్టర్ల మనసులో ఏముందో మనం అంచనా వేయలేం. కానీ నేను మాత్రం ఇది బాగుంటుందనే అనుకుంటున్నా. అలా అని యశస్వి జైస్వాల్ పేరును సెలక్టర్లు మర్చిపోతారని భావించడం లేదు. అతడొక ప్రత్యేకమైన ఆటగాడు. నిలకడైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఏదేమైనా యువ, అనుభవజ్ఞులైన జట్టుతో టీమిండియా వరల్డ్కప్ బరిలోకి దిగాలి’’ అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కాగా మే 26న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది. చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ 2024లో సగానికి పైగా మ్యాచ్లు పూర్తయ్యాయి.. టాప్లో కోహ్లి, బుమ్రా
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సగానికి పైగా మ్యాచ్లు (38 మ్యాచ్లు) పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్ బెర్తులపై పూర్తి క్లారిటీ రానప్పటికీ ఓ అంచనా అయితే వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ (8 మ్యాచ్ల్లో 7 విజయాలు) పాయింట్ల పట్టికలో టాప్లో ఉండగా.. కేకేఆర్ (7 మ్యాచ్ల్లో 5 విజయాలు), సన్రైజర్స్ (7 మ్యాచ్ల్లో 5 విజయాలు), సీఎస్కే (7 మ్యాచ్ల్లో 4 విజయాలు), లక్నో సూపర్ జెయింట్స్ (7 మ్యాచ్ల్లో 4 విజయాలు) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం ఈ ఐదు జట్ల మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే గుజరాత్, ముంబై, ఢిల్లీల్లో ఏదో ఒక జట్టుకు లైన్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్ (8 మ్యాచ్ల్లో 4 విజయాలు) ఆరు, ముంబై (8 మ్యాచ్ల్లో 3 విజయాలు) ఏడు, ఢిల్లీ (8 మ్యాచ్ల్లో 3 విజయాలు) ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. 8 మ్యాచ్ల్లో రెండిట గెలిచిన పంజాబ్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. 8 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ చివరి స్థానంలో పాతుకుపోయింది. ప్రస్తుత సీజన్లో 70 మ్యాచ్లు (క్వాలిఫయర్స్, ఎలిమినేట్, ఫైనల్స్ కాకుండా) జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 38 మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వ్యక్తిగత విభాగాల్లో (అత్యధిక పరుగులు, వికెట్లు) విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా టాప్లో కొనసాగుతున్నారు. విరాట్ ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 63.17 సగటున 150.40 స్ట్రయిక్రేట్తో 379 పరుగులు చేయగా.. బుమ్రా 8 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీసి చహల్, హర్షల్ పటేల్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఈ సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానాల్లో ఉన్న ఆటగాళ్ల వివరాలు.. అత్యధిక పరుగులు-విరాట్ కోహ్లి (379) అత్యధిక వ్యక్తిగత స్కోర్-విరాట్ కోహ్లి (113) అత్యధిక సగటు-రవీంద్ర జడేజా (141) అత్యధిక స్ట్రయిక్రేట్-రొమారియో షెపర్డ్ (280.00) అత్యధిక శతకాలు-బట్లర్ (2) అత్యధిక హాఫ్ సెంచరీలు-రియాన్ పరాగ్, శాంసన్, క్లాసెన్, డికాక్ (3) అత్యధిక బౌండరీలు-ట్రవిస్ హెడ్ (39) అత్యధిక సిక్సర్లు- క్లాసెన్ (26) బౌలింగ్ విషయానికొస్తే.. అత్యధిక వికెట్లు-13 (బుమ్రా, చహల్, హర్షల్) ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో అత్యధిక బౌలింగ్ సగటు లక్నో సంచలన పేసర్ మయాంక్ యాదవ్ (9.0) పేరిట ఉంది. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు-సందీప్ శర్మ (5/18) (బుమ్రా,యశ్ ఠాకూర్, సందీప్ శర్మ.. ఈ ముగ్గురు చెరోసారి ఐదు వికెట్ల ఘనత సాధించారు) అత్యుత్తమ సగటు-మయాంక్ యాదవ్ (6.00) -
కోహ్లి, రోహిత్ కాదు.. వారిద్దరే టాప్ 2 టీ20 బ్యాటర్లు?
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్స్టో దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన బెయిర్ స్టో.. 16.00 సగటుతో కేవలం 96 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో గురువారం(ఏప్రిల్ 18) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో బెయిర్ స్టోకు ఆడే అవకాశం దక్కలేదు. అతడిని పంజాబ్ మెనెజ్మెంట్ పక్కన పెట్టి రిలీ రూసోను జట్టులోకి తీసుకువచ్చారు. కానీ రూసో కూడా నిరాశపరిచాడు. అయితే తాజాగా బెయిర్ స్టో ప్రముఖ క్రీడా వెబ్సైట్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రస్తుత వరల్డ్ క్రికెట్లో టాప్ 3 టీ20 బ్యాటర్లు ఎవరన్న ప్రశ్న బెయిర్స్టోకు ఎదురైంది. బెయిర్ స్టో వెంటనే తన తొలి రెండు ఎంపికలగా దక్షిణాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్, భారత విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్లను ఎంచుకున్నాడు. మూడో ప్లేయర్ను ఎంచుకోవడానికి జానీ కాస్త సమయం తీసుకున్నాడు. కాస్త ఆలోచించి తన సహచర ఆటగాడు, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ను తన మూడో ఛాయిస్ గా ఎంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈఎస్పీఎన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ప్రస్తుత ఐపీఎల్లో అదరగొడుతున్న టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి,రోహిత్ శర్మలను బెయిరో స్టో ఎంచుకోపోవడం గమనార్హం. Can you argue with this? 🤔 #25Questions with Jonny Bairstow 👉 https://t.co/u7aCIY24E4 pic.twitter.com/jIg4WSd7YQ — ESPNcricinfo (@ESPNcricinfo) April 19, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019