breaking news
-
టీడీపీ అభ్యర్థి కంపెనీలో సోదాలు.. కంటైనర్లో భారీగా నగదు
సాక్షి, బాపట్ల: బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు సోదాలు చేపట్టారు. చీరాల మండలం కావూరి వారిపాలెంలోని కంపెనీలో సోదాలు చేపట్టారు. కంటైనర్లో రూ.56 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన నగదుగా గుర్తించారు. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కంటైనర్లో ఉన్న నగదును పోలీసులు సీజ్ చేశారు. -
పిఠాపురం మున్సిపల్ ఆఫీసు వద్ద చెత్త వేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ
పిఠాపురం: టీడీపీ ‘కుళ్లు’ రాజకీయాలకు తెర లేపింది. నిరసన పేరుతో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ మంగళవారం మురికి కాలువల్లోని మురికి, చెత్త తెచ్చి మున్సిపల్ కార్యాలయం వద్ద వేశారు. ఈ సంఘటన పట్టణ ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. గడప గడపకూ మన ప్రభుత్వం కింద సచివాలయాలకు విడుదల చేసిన నిధులతో పట్టణంలోని మురికి కాలువల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. తక్షణమే కాలువలను గుర్తించాలన్నారు. నెల రోజులుగా మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి పర్యటించి వర్షాలకు ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి, కాలువలు మూసుకుపోయి సమస్య ఉత్పన్నమవుతోందని గుర్తించారు. ఆయా కాలువల అభివృద్ధికి పనులు చేపట్టారు. ఏ పని చేస్తూంటే దానిపై ఆందోళన ప్రభుత్వం ఏ మంచి పని చేసినా బురద జల్లి ఆందోళన చేయడం.. పని పూర్తి అవ్వగానే తమ వల్లేనంటూ గొప్పలు చెప్పుకోవడం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారింది. ఇందులో భాగంగానే మురికి కాలువల అభివృద్ధి పనులు చేస్తూంటే.. మరోపక్క ఆ పార్టీ నాయకుడు వర్మ వార్డుల్లో తిరుగుతూ మురికి కాలువలు శుభ్రం చేయడం లేదంటూ విమర్శిస్తున్నారు. ప్రధాన కాలువల అభివృద్ధికి చర్యలు తీసుకున్నా ఏమీ పట్టించుకోవడం లేదంటూ కాలువల మురికిని వాహనాలపై తెచ్చి స్వయంగా మున్సిపల్ కార్యాలయం ముందు వేశారు. ఎమ్మెల్యే దొరబాబుపై విమర్శలు గుప్పించారు. మండిపడిన కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ శ్రేణులు వర్మ తీరుపై మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బాధ్యత గల నాయకుడు ఇలా మూర్ఖంగా మురికిని తెచ్చి కార్యాయం వద్ద వేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తెచ్చిన మురికితోనే వర్మ చిత్రపటానికి అభిషేకం చేశారు. వర్మపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని నినదించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ, వర్మకు పిచ్చి ముదిరి ఇలాంటి పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ఐదేళ్ల పాలనలో పట్టణ పారిశుధ్యాన్ని గాలికొదిలేశారన్నారు. మురికి తెచ్చి ఇక్కడ వేయడం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వైఎస్సార్ సీపీ శ్రేణులకు సర్ది చెప్పి, ఆందోళన విరమింపజేశారు. 18 మందిపై కేసు మున్సిపల్ కార్యాలయంపై దౌర్జన్యంగా మురికి వేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ సహా 18 మందిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. మున్సిపల్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
టీడీపీ అనే పదాన్ని వదిలేసి ‘మీ ఇంటికి మీ వర్మ’
పిఠాపురం: తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట తారస్థాయికి చేరింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ శుక్రవారం టీడీపీ నుంచి కొందరు నేతలను బహిష్కరించగా వారు ఆయన తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. గొల్లప్రోలులో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబు మాట్లాడుతూ 45 ఏళ్లుగా రామ లక్ష్మణులుగా కలిసిమెలిసి పోతున్న అన్నదమ్ములను (తునిలో యనమల సోదరులను) కుటిల రాజకీయాలతో విడదీసిన ఘనుడవు అంటూ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నియంతలా పరిపాలించడమే కాకుండా పదవి పోయాక కూడా కింది స్థాయి నాయకులను అణగదొక్కే ప్రయత్నాలు మానలేదని అన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లను కీలు బొమ్మలుగా చేసిన నీచుడని వర్మపై నిప్పులు చెరిగారు. కాకినాడకు చెందిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు మాదేపల్లి శ్రీను మాట్లాడుతూ కాపు సామాజిక వర్గ నేతలను ఎదగనీయకుండా చేశారన్నారు. డబ్బులిచ్చుకుని తనకు సొసైటీ పదవి ఇచ్చారని అన్నారు. టీడీపీ అనే పదాన్ని వదిలేసి ‘మీ ఇంటికి మీ వర్మ’ అని పెట్టుకుని తిరిగినప్పుడే మీరు పార్టీని నాశనం చేస్తున్నారని, ఇతర పార్టీల వైపు చూస్తున్నారని అధిష్టానానికి అర్థమయ్యిందన్నారు. గతంలో నాయకులందరం కలిసి కట్టుగా పని చేస్తేనే ఆయన ఎమ్మెల్యే అయ్యారన్న సంగతి మర్చి పోయి గ్రూపు రాజకీయాలు చేసి అందరిని విడగొట్టి విభజించు పాలించు అనే ధోరణితో పార్టీని ముక్కలు చేస్తున్నారని ఆయన వర్మపై మండిపడ్డారు. నన్ను రెచ్చగొడితే నీ జాతకాన్ని బయటపెడతానంటూ హెచ్చరించారు. నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు జ్యోతుల సతీష్, మాట్లాడుతూ కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని సస్పెండ్ చేసినట్లు ప్రకటించడం వర్మ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. అసలు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నది ఎవరో పార్టీ అధిష్టానం దగ్గరే తేల్చుకుంటామని అన్నారు. టీడీపీ నేతలు కె.సత్యనారాయణ, పినకా వెంకట్రావు, వీఎస్ నారాయణ, గురాల వీరాస్వామి, చోడిశెట్టి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడి, బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని ఆ పార్టీ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ అన్నారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా దంతాలపల్లిలోని పీహెచ్సీని ఆయన ఆదివారం సందర్శించారు. తొలుత కురవిలో వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్లో లోక్సభ ప్రవాస్ యోజన కోర్ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. బీజేపీ అభివృద్ధి పథకాలను తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకం నేరుగా లబ్ధిదారులకు చేరుతోందన్నారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద కోట్లాది మంది పేదలు ఇళ్లు నిర్మించుకుంటున్నారని తెలిపారు. కోవిడ్ సమయంలో దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్ అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని, ఫ్రీ రేషన్తో పేదలందరికీ ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి వంటివాటిని నేటికీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
యూపీ ఎన్నికల ఫలితాలు; వర్మ ఓవరాక్షన్.. అక్కడే మకాం
మీరట్: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ నాయకుడు యోగేశ్ వర్మ మాత్రం బైనాక్యులర్తో చూస్తున్నారు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఎదుట యోగేశ్ వర్మ, ఆయన మద్దతుదారులు గస్తీ కాస్తున్నారు. బైనాక్యులర్తో కనిపెట్టి మరీ చూస్తున్నారు. 8 గంటల చొప్పున షిప్టులవారీగా 24 గంటలూ కాపలా కాస్తున్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా చూసేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. సొంతంగా భద్రత ఏర్పాటు చేయడంపై యోగేశ్ వర్మను ప్రశ్నించగా.. ఎన్నికల సంఘంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజల తీర్పును జాగ్రత్తగా కాపాడాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్టు తెలిపారు. ‘ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, దాని చుట్టూ ఉన్న ఇతర కదలికలపై నిఘా ఉంచాలని మా పార్టీ అధ్యక్షుడు (అఖిలేష్ యాదవ్) ఆదేశించారు. ఎగ్జిట్ పోల్స్పై మాకు నమ్మకం లేదు, అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారు. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ’ని యోగేశ్ వర్మ అన్నారు. (క్లిక్: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?) తాజా ఎన్నికల్లో మీరట్ జిల్లాలోని హస్తినాపూర్ నుంచి సమాజ్వాదీ పార్టీ తరపున ఆయన పోటీ చేశారు. కాగా, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద యోగేశ్ వర్మ ఓవరాక్షన్పై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. (క్లిక్: మొదలైన నంబర్ గేమ్; ఎత్తుకు పైఎత్తులు.. ఎవరిది పైచేయి!)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019