breaking news
-
వేమిరెడ్డి దంపతులకు ప్రసన్న కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన పాపాలు.. మొత్తం బయటపెట్టిన ప్రసన్నకుమార్ రెడ్డి..
-
కోవూరులో బెడిసికొడుతున్న టీడీపీ వ్యూహాలు
డబ్బుతో ఏమైనా చేసేయొచ్చనే కొందరి అంచనాలు తారుమారవుతున్నాయి. నగదును వెదజల్లి తద్వారా గెలవొచ్చనే టీడీపీ కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అంచనాలు ప్రజాక్షేత్రంలో తలకిందులవుతున్నాయి. తన విజయం అంత సులభం కాదనే విషయం బోధపడటం.. పైగా వ్యూహాలు బెడిసికొడుతుండటంతో ఏమి చేయాలో పాలుపోక తలపట్టుకోవడం ఆమె వంతవుతోంది. కోవూరు: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కోవూరు నియోజకవర్గంలో టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. నగదు ప్రలోభాలతో నేతలను టీడీపీలో చేర్చుకోవడం.. దురాయి పేరుతో మత్స్యకార గ్రామాలు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్యాకేజీలను వేమిరెడ్డి దంపతులు ప్రకటించడం.. ఈ విషయాలు బయటకు పొక్కడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడికెళ్లినా సమస్యల స్వాగతం ప్రచారంలో భాగంగా ప్రశాంతిరెడ్డి ఎక్కడికెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఓ వైపు వర్గపోరు.. మరోవైపు నేతల మధ్య సమన్వయం కొరవడటంతో ఆమె చేతులెత్తేశారు. ఆత్మీయ సమావేశాలు.. ప్రచారాలు.. పార్టీ కార్యాలయాల ప్రారంభం.. ఇలా సందర్భమేదైనా గొడవలు మాత్రం కామన్గా మారుతున్నాయి. కోవూరు టీడీపీ సీటును ఆశించి భంగపడిన పోలంరెడ్డి దినేష్రెడ్డి.. ప్రశాంతిరెడ్డి విజయానికి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవమో అర్థం కాని పరిస్థితి. టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న కుమ్ములాటలకు వెన్నుపోటు రాజకీయాలే కారణమనే ప్రచారం జరుగుతోంది. అడుగడుగునా ప్రతికూలతలే.. క్షేత్రస్థాయిలో టీడీపీకి అనుకూల వాతావరణం లేదు. చంద్రబాబు గత పాలనను ప్రజలు నేటికీ మర్చిపోలేదు. రుణ మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళల ను గతంలో ఆయన మోసగించారు. తాజాగా టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ఎవరూ నమ్మడం లేదు. మరోవైపు వలంటీర్ల సేవలను ఎన్నికల కమిషన్ ద్వారా చంద్రబాబు అడ్డుకోవడం బూమరాంగ్ అయింది. చంద్రబాబు వ్యూహాలు, గత పాలన టీడీపీ అభ్యర్థులకు శాపంగా మారాయి. ఆడియో కలకలం కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్రెడ్డితో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఆడియో బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. తాము గెలిస్తే ప్రజల్లో ఉంటామని.. ఓటమిపాలైతే వ్యాపారాలు చూసుకుంటామని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. నిత్యం వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే వేమిరెడ్డి దంపతులు గెలిచినా.. ఓడినా ప్రజల్లో ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆడియో దుమారంతో వీరిపై నమ్మకం మరింత సన్నగిల్లింది. -
వేమిరెడ్డి దంపతులకి ప్రసన్నకుమార్ రెడ్డి వార్నింగ్
-
SPSR Nellore: ఓటమి భయం.. వేమిరెడ్డి దంపతుల అడ్డదారులు
ఓటమి తప్పదనే సంకేతాల తరుణంలో టీడీపీ నెల్లూరు లోక్సభ, కోవూరు అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు అడ్డదారులు తొక్కుతున్నారు. కోవూరు నియోజకవర్గంపై ప్రధానంగా దృష్టి సారించిన వీరు నోట్లతో ఓట్ల కొనుగోలుకు సన్నద్ధమయ్యారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నగదును ఎర వేసి ఈ వికృత పర్వానికి తెరలేపారు. మత్స్యకార గ్రామాల్లో దురాయి దురాచారాన్ని అడ్డుపెట్టుకొని ఓట్ల కొనుగోలుకు రూ.80 లక్షలతో బేరం పెట్టిన అంశం వెలుగులోకి రావడం.. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం నిఘా ఉంచడంతో ప్రజాప్రతినిధులపై వీరు తాజాగా దృష్టి సారించారు. కోవూరు: ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా విలువల్లేని రాజకీయాలకు వేమిరెడ్డి దంపతులు శ్రీకారం చుట్టారు. ఓటమి భయంతో నేతలకు వీరు రేట్లు ఫిక్స్ చేసి తమ వైపునకు తిప్పుకొనే దుస్సాహసానికి తెరలేపారు. కోవూరు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను తమ శిబిరాలకు రహస్యంగా ఆహ్వానించి ఈ రకమైన మంతనాలకు శ్రీకారం చుట్టారు. ప్యాకేజీలు ఖరారు.. ఆయా గ్రామాల్లో విజయం సాధించిన సర్పంచ్లు, ఎంపీటీసీలకు రూ.15 లక్షలు.. ఎంపీపీలు, జెడ్పీటీసీలకు రూ.25 లక్షల చొప్పున ప్యాకేజీలను ఫిక్స్ చేశారని స్థానిక నేతలే పేర్కొంటున్నారు. ఓట్లు వేయించే బాధ్యత మీదేనంటూ వారికి ఈ మొత్తాలను ఎర వేస్తున్నారు. ఓటర్లకు సైతం భారీగానే ముట్టజెప్తామని, ఈ నగదు పంపిణీ బాధ్యతా మీదేనంటున్నారనే ప్రచారమూ జరుగుతోంది. బంధుగణంతో టీమ్ ఏర్పాటు ప్రజాప్రతినిధులతో పాటు ఆయా గ్రామాల్లో బలమైన నేతలకు సైతం ప్యాకేజీలు అందించేందుకు వేమిరెడ్డి తన బంధుగణంతో ఓ టీమ్ను ఏర్పాటు చేశారని తెలుస్తోంది. సదరు టీమే ఈ వ్యవహారాలను ముందుండి నడిపిస్తోంది. ప్యాకేజీ ఆశ చూపి కొందర్ని ఇప్పటికే తమ శిబిరంలో చేర్చుకున్నారు. తాజాగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఓటర్లు భగ్గుమంటున్నారు. రానున్న ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ఓటేయాలని ప్యాకేజీ ఒప్పందం చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు చెప్తుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో తమకు అండగా ఉండి.. సంక్షేమ పథకాలను అందించి ఆదుకున్న సీఎం జగన్మోహన్రెడ్డికి కాకుండా మరెవరికీ ఓటేయబోమని వారు తెగేసి చెప్తున్నారు. అధికార యంత్రాంగం నిఘా స్వేచ్ఛాయుత పోలింగ్పై దృష్టి సారించిన ఎన్నికల కమిషన్ జిల్లా స్థాయిలో నిఘా ఉంచింది. మత్స్యకార గ్రామంలో దురాయి పేరిట ఓట్లు కొనుగోలు చేస్తున్న సమాచారం నిఘా వర్గాల ద్వారా అధికారులకు అందింది. దీనిపై ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019