breaking news
-
అమెరికా–చైనా చర్చలపర్వం
ఎడతెగని చర్చలు జరుగుతున్నాయంటే, అయినా కనుచూపుమేరలో పరిష్కారం కానరా లేదంటే... కనబడని కారణాలేవో అడ్డుపడుతున్నాయని అర్థం. సమస్య తీవ్రంగా ఉన్నదని తాత్పర్యం. ఈనెల ప్రారంభంనుంచి అమెరికా–చైనాలమధ్య భిన్న అంశాలపై చర్చోపచర్చలు సాగుతూనే వున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్లు నేరుగా ఫోన్లో సంభాషించుకున్నారు. నాలుగు నెలలక్రితం తొలిసారి మాట్లాడుకున్న ఈ నేతలిద్దరూ మళ్లీ మాట్లాడుకోవాల్సిన పనిబడటం గమనించదగిందే. వారం తిరగకుండానే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎలెన్ చైనా సందర్శనకొచ్చి ప్రధాని లీ కియాంగ్తోపాటు చైనా ఉన్నత స్థాయి అధికారులను కలిసి మాట్లాడారు. అంతకుమునుపే ఇరు దేశాల ఉన్నతాధికారులు నాలుగు రోజులపాటు చర్చించుకున్నారు. త్వరలోనే అమెరికా విదేశాంగమంత్రి ఆంథోనీ బ్లింకెన్ చైనా వెళ్లబోతున్నారు. ఇలా సంభాషణల పరంపర కొనసాగుతున్నది గానీ పరిష్కారం కానరావటం లేదు. వీటికి సమాంతరంగా చైనాను కట్టడి చేసే ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా 2021లో రూపుదిద్దుకున్న సైనిక సహకార సంస్థ ‘ఆకస్’ కార్యకలాపాలు చురుకందు కున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ రక్షణమంత్రులు ఇటీవల భేటీ అయ్యారు. ఇందులో మనదేశాన్ని కూడా చేర్చు కోవాలని అమెరికా తహతహలాడుతున్నా ఎలాంటి సైనిక ఒడంబడికల్లోనూ భాగం కారాదన్న విధానానికే ఇంతవరకూ మన దేశం కట్టుబడివుంది. మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని జపాన్ మాత్రం చేరే అవకాశం ఉందంటున్నారు. అలాగని మన దేశం మౌనంగా ఏమీ లేదు. దక్షిణ చైనా సముద్రంలో చైనానుంచి తరచు బెదిరింపులు ఎదుర్కొంటున్న ఆగ్నేయాసియా దేశాలకు మద్దతుగా నిలుస్తామని చాటుతూనేవుంది. ఇటీవల చైనా గస్తీ నౌకలు చేసిన దాడుల్లో ఫిలిప్పీన్స్ వాణిజ్య నౌకలు రెండు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవలే ఆ దేశాన్ని సందర్శించి అండగా వుంటామని ప్రకటించారు. దక్షిణ చైనా సముద్రంలో 90 శాతం తన సొంతమని చైనా చెప్పుకుంటోంది. నిరంతర గస్తీ కాస్తోంది. సమస్యేమంటే ప్రపంచ సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంలో 60 శాతం దక్షిణ చైనా సముద్రం వైపే సాగుతోంది. అంతర్జాతీయంగా చైనాను కట్టడి చేయటమే అత్యవసరమని భావిస్తున్న అమెరికాకు రష్యా దూకుడు ఊహించని పరిణామం. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించాక దృష్టి అటువైపు మళ్లింది. ఉక్రెయిన్కు ఆయుధాలందించటం ద్వారా రష్యాను దారికి తేవొచ్చని భావించిన అమెరికాకు నిరాశే ఎదురైంది. రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు సైతం ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. రష్యాకు ఇరాన్ నుంచి డ్రోన్లు అందుతున్నాయి. ఎడాపెడా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవటం ద్వారా రష్యాకు చైనా అండగా నిలుస్తోంది. ఉత్తర కొరియా సైతం చైనా ద్వారా రష్యాకు సహాయసహకారాలందిస్తోందని అమెరికా భావిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ దుందుడుకుతనంతో గాజా మండుతోంది. ఇజ్రాయెల్ను ఎలాగైనా దారికి తేవా లన్న బైడెన్ ఎత్తుగడలు ఫలించటం లేదు. కనుకనే దౌత్యరంగంలో వున్నంత దూకుడు రక్షణరంగంలో కనబడటం లేదన్నది బైడెన్పై వున్న ప్రధాన విమర్శ. ఈ ఏడాది చివర అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నందున ఈ విమర్శలు బైడెన్ను కలవరపెడుతున్నాయి. పర్యవసానంగా చైనాతో చర్చోప చర్చలు సాగుతున్నాయి. వాణిజ్యపరంగా అమెరికాకు మరో ప్రత్యేక సమస్య కూడా వుంది. అంతర్జాతీయ మార్కెట్లోకి అపరిమితంగా వచ్చిపడుతున్న చైనా ఎలక్ట్రిక్ కార్లు, సౌరశక్తి ప్యానెళ్లు, ఇతర ఉపకరణాలు అమెరికాకు తలనొప్పి తెస్తున్నాయి. వాటివల్ల అమెరికా ఉత్పత్తులు అమ్ముడుకావటం కష్టమవుతోంది. అమెరికా పరిశ్రమలు సంక్షోభంలో పడుతున్నాయి. ఈ నెల మొదట్లో జో బైడెన్, షి జిన్పింగ్ మధ్య ప్రధానంగా తైవాన్, దక్షిణ చైనా సముద్రం అంశాలపై చర్చలు నడిస్తే... చైనా తమ వాణిజ్య దూకుడుకు కళ్లెం వేయటంపై జానెట్ ఎలెన్ ప్రధాని లీ కియాంగ్తో చర్చించారు. దీన్ని ఆపకపోతే మరో మూడేళ్లలో అవసరానికి మించి ఏటా 50 లక్షల నుంచి కోటి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్కొస్తాయన్నది అమెరికా అంచనా. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ తదితర అంశాల్లో తమ ఎదుగుదలను నిరోధించేలా అమెరికా వ్యవహరిస్తున్నదని చైనా ఆరోపణ. కనుకనే ఇరుదేశాల ఉన్నతాధికారులమధ్యా వరసగా నాలుగురోజులపాటు చర్చలు సాగినా... నేరుగా ఎలెన్, లీ కియాంగ్లు సంభాషించుకున్నా పరిష్కారం దొరకలేదు. చిత్రమేమంటే అమెరికా, చైనాల మధ్య అనేక అంశాల్లో తీవ్ర విభేదాలున్నా వాణిజ్యపరంగా ఆ రెండు దేశాలూ పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడక తప్పని స్థితి. అందుకే ఇండో–పసిఫిక్ అంశంలో దూకుడుగా వున్నట్టు కనిపిస్తున్నా వాణిజ్య సమస్యలపై ఏదోవిధంగా చైనాను దారికి తెచ్చుకోవాలని అమెరికా తాపత్రయపడుతోంది. ట్రంప్ హయాంలో చైనాపై విధించిన ఆంక్షల్లో చాలా భాగం బైడెన్ కొనసాగించారు. వీటికి మరిన్ని జోడిస్తానన్న బైడెన్ హెచ్చరికలు ఆచరణలోకి రాకపోయినా అవసరాన్నిబట్టి అప్పుడప్పుడు సడలింపు వైఖరితో ఉన్నామన్న సంకేతాలు రెండు దేశాలూ ఇస్తున్నాయి. ఎలాంటి సమస్యలకైనా ఓర్పుగా సాగించే సంభాషణలు పరిష్కారాన్ని చూపుతాయి. ఘర్షణల నివారణ ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే ఘర్షణలవల్ల అంతిమంగా విధ్వంసం తప్ప మరేమీ మిగలదు. అయితే ఏ చర్చలైనా నిర్మాణాత్మకంగా వుండాలి. చిత్తశుద్ధితో సాగాలి. లేనట్టయితే నిష్ఫలమవుతాయి. -
నెతన్యాహూతో ఇజ్రాయెల్కు నష్టమే: బైడెన్
విలి్మంగ్టన్: గాజాలో హమాస్పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తన సొంత దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. నెతన్యాహూ అనాలోచిత చర్యల వల్ల ఇజ్రాయెల్కు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని అన్నారు. గాజాలో సాధారణ పౌరుల మరణాలను నియంత్రించడంలో నెతన్యాహూ దారుణంగా విఫలమవుతున్నారని ఆక్షేపించారు. బైడెన్ శనివారం మీడియాతో మాట్లాడారు. తిరుగుబాటుతో సంబంధం లేని పాలస్తీనియన్ల ప్రాణాలు కాపాడాలని, ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్కు సూచించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిని తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. హమాస్ను వేటాడే హక్కు ఇజ్రాయెల్కు ఉందని వెల్లడించారు. కానీ, సాధారణ ప్రజలపై దాడి చేయడం సరైంది కాదని తేల్చిచెప్పారు. గాజాలో మరణాల సంఖ్య ఇజ్రాయెల్ చెబుతున్నదానికంటే ఎక్కువగానే ఉన్నట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. గాజాలో అమాయకుల మరణాలు ఇంకా పెరిగితే ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతును కోల్పోతుందని బైడెన్ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
USA: బైడెన్ వద్దు.. మిషెల్లీ ఒబామా బెటర్.. ఆసక్తికర పోల్స్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు ఫోకస్ పెట్టాయి. దీంతో, రెండు పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే, అధికార డెమోక్రటిక్ పార్టీలో ఆసక్తికర పరిమాణం చోటుచేసుంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బదులుగా.. మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా బరిలో నిలవాలని అమెరికన్లు కోరుకుంటున్నారని రాస్ముస్సెన్ రిపోర్ట్స్ పోల్ పేర్కొంది. వివరాల ప్రకారం.. 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మరో దఫా ఎన్నికల్లో నిలబడేందుకు అమెరికన్లు ఇష్టపడటం లేదు. ఆయన వయసు, మానసిక ఆరోగ్య స్థితిని ఇందుకు కారణంగా చూపుతున్నారు. అలా చెబుతున్నవారు దాదాపు 48 శాతం ఉన్నారని తేలింది. బైడెన్ బదులు.. మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామాను కోరుకుంటున్నారని రాస్ముస్సెన్ రిపోర్ట్స్ పోల్ పేర్కొంది. కాగా, 38 శాతం మంది జో బైడెన్ను కోరుకోవడం లేదని ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఒక వార్తను ప్రచురించింది. If Michelle Obama decides to replace President Biden ,then it's an absolute game over for Trump or Republicans . She will win presidency hands down, and for us, staunch Gandhian will be the most powerful person on the face of earth. Let the game begin @MichelleObama pic.twitter.com/pFkyFrYO67 — Prashant shah (@prashantsapp) February 28, 2024 ఇక, అదే సమయంలో బైడెన్ను మార్చే అవకాశాలు లేవని 45 శాతం మంది అభిప్రాయపడుతున్నారని సర్వేలో వెల్లడైంది. బైడెన్ మరోసారి ఎన్నికకు సిద్ధపడకపోతే ఆయన స్థానంలో ఎవరైతే బాగుంటందనే ప్రశ్నతో సర్వే నిర్వహించారు. ఇందులో మిషెల్లీ ఒబాబాకే ఎక్కువ సంఖ్యలో మద్దతు పలికారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తదితరులు తదుపరి స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. మిషెల్లీ ఒబామా మాత్రం తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితోలేనని ఇప్పటికే ప్రకటించారు. కాగా, జనవరిలో ఒక పాడ్క్యాస్ట్ ఇంటర్వ్యూలో మిషెల్లీ ఒబామా మాట్లాడుతూ 2024 అధ్యక్ష ఎన్నికల్లో వచ్చే ఫలితం గురించి తాను భయపడుతున్నానని వ్యాఖ్యానించారు. అలాగే, తనకు ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదన్నారు. -
సన్నగిల్లిన బైడెన్ జ్ఞాపకశక్తి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిందనే విషయాన్ని ఒక నివేదిక తగిన సాక్ష్యాధారాలతో బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బైడెన్ వృద్ధాప్యాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచు కున్న రిపబ్లికన్లకు తాజా నివేదిక మరో శక్తివంతమైన ప్రచారాస్త్రమైంది. అయితే ఈ నివేదికలోని అంశాలన్నీ తప్పు అని 81 ఏళ్ల బైడెన్ ఖండించినా ఆ నివేదికలో పేర్కొన్న విషయాలను గమనిస్తే అవన్నీ నిజాలే అని అనిపించకమానవు. తక్కువ జ్ఞాపకశక్తి ఉన్న వృద్ధుడు అని బైడెన్ను నివేదిక అభివర్ణించింది. గత జనవరిలో వాషింగ్టన్లోని బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలను సిబ్బంది కనిపెట్టడంతో ఆ విషయం అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్దాకా వెళ్లింది. దీంతో ఆయన న్యాయశాఖ స్పెషల్ కౌన్సిల్గా రాబర్ట్ హుర్ను నియమించారు. ఈయన ఇటీవల బైడెన్ను ఏకధాటిగా ఐదు గంటలపాటు ఇంటర్వ్యూ చేసి ఆయన జ్ఞాపకశక్తిపై ఒక అంచనాకొచ్చారు. ఇదిగాక ఇతరత్రా సాక్ష్యాధారాలను ఆయన తన నివేదికలో వెల్లడించారు. గురువారం విడుదలైన ఆ 345 పేజీల నివేదికలో ఏమన్నాయంటే.. ► బరాక్ ఒబామా హయాంలో ఉపా« ద్యక్షుడిగా పనిచేసినకాలంలో అఫ్గానిస్తాన్ లో అమెరికా స్థావరాలు, సైన్యం మొహరింపు రహస్యాలను ఒక ప్రైవేట్ వ్యక్తితో బైడెన్ పంచుకున్నారు. సంబంధిత రహస్య పత్రాలను డెలావర్లోని తన గ్యారేజీలో మర్చి పోయారు. ► తన కుమారుడు బ్యూ బైడెన్ క్యాన్సర్ తో ఏ సంవత్సరంలో చనిపోయిందీ బైడెన్ ఠక్కున చెప్పలేకపోయారు ► ఉపాధ్యక్షుడిగా ఏ సంవత్సరంలో దిగిపోయారు అనేదీ ఈయనకు సరిగా గుర్తులేదు ► తన జీవితచరిత్ర రాస్తున్న ఒక రచయితకు సున్నితమైన అంశాలున్న ఒక నోటు పుస్త కం ఇచ్చారు. అందులో అఫ్గానిస్తాన్కు సంబంధించిన రహస్య సమాచారం ఉంది. అవన్నీ అబద్ధా్దలు: బైడెన్ ‘దాదాపు 40 సంవత్సరాల క్రితం విషయాలను ఠక్కున చెప్పాలంటే ఎలా?. నా కుమారుడి మరణాన్ని చర్చించకూడదనే ఆ ప్రశ్న సమయంలో స్పందించలేదు. రెండోసారీ అమెరికాకు అధ్యక్షుడిగా కొనసాగే శక్తిసామర్థ్యాలు నాకున్నాయి’’అని బైడెన్ పనరుద్ఘాటించారు. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలపై తడబడుతూ, పొరబడటం గమనార్హం. -
USA: అధ్యక్ష రేసులో ట్రంప్ లైన్ క్లియర్!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేందుకు మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ దాదాపు లైన్ క్లియర్ అయ్యింది. న్యూ హాంప్షైర్లో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ ప్రత్యర్థి నిక్కీ హేలీ ఓటమి చెందారు. దీంతో, ట్రంప్ అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్నారు. అయితే, ట్రంప్ విజయం అనంతరం నిక్కీ హేలీ స్పందించారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్కు అధినందనలు తెలిపారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి నామినేషన్ కోసం పోటీపడిన అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీలో పోటీ అంతా ట్రంప్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్యనే కేంద్రీకృతమైంది. భారత సంతతికే చెందిన మరో అభ్యర్థి వివేక్ రామస్వామి, న్యూ జెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్లు బరినుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. వీరిలో రామస్వామి, డిశాంటిస్లు ట్రంప్నకు మద్దతు ప్రకటించారు. ఇక హ్యాంప్ షైర్ గవర్నర్ సునును మద్దతు ఉన్న హేలీ ఆ రాష్ట్ర ప్రైమరీలో ట్రంప్నకు గట్టి పోటీ ఇస్తారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ట్రంప్కు మద్దతు ఇవ్వడంతో ఆయన ముందంజలో నిలిచారు. డొనాల్డ్ ట్రంప్కు 55.5 శాత ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా 41,423 ఓట్లు పడ్డాయి. 46.1 శాతంతో 36,083 ఓట్లను సాధించారు నిక్కీ హేలీ. కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరి ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. BREAKING: Essential projects Donald Trump will win the #NewHampshirePrimary pic.twitter.com/yitff269Fg — Essential Filmworks 🇺🇸 (@Real_EF_News) January 24, 2024 ఇదిలా ఉండగా, అంతకుముందు.. అయోవా స్టేట్లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్- 21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి- 7.2 శాతం ఓట్లు పడ్డాయి. El expresidente de #EEUU🇺🇲 Donald Trump gana las primarias republicanas en #NewHampshire pic.twitter.com/4spzM0jPmQ — Allan Berfield 🌎 (@allanberfield) January 24, 2024 అయితే, ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్లో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. దీంతో, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ.. ఎన్నికల కోసం సన్నాహాలు చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుంది. 2019 నాటి ఎన్నికల్లో ఓడినా మళ్లీ ట్రంప్ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019