breaking news
-
సివిల్స్లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్: సివిల్స్లో ర్యాంకు సాధించడం దేశంలో చాలామంది కల. ఇందులో ఈసారీ తెలుగు విద్యార్థులు సత్తా చాటి తమ లక్ష్యాన్ని అందుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించారు. వంద లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగువాళ్లే ఉన్నారు. నందాల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధిస్తే, కేఎన్ చందన జాహ్నవి 50, మెరుగు కౌశిక్ 82వ ర్యాంకు సాధించారు. మొత్తం ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు 36 మంది ఉన్నారు. అలాగే, ఇతర కేంద్ర సర్వీసులకు 20 మందికిపైగా ఎంపికయ్యారు. మొత్తమ్మీద కేంద్ర సర్వీసులకు 56 మందికిపైగా తెలుగు తేజాలు ఎంపికవడం విశేషం. అఖిల భారత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్– 2023 కోసం గత ఏడాది మే 28న ప్రిలిమ్స్ నిర్వహించింది. ప్రిలిమినరీలో అర్హత పొందిన వారికి గత నవంబర్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్ష ఫలితాలను డిసెంబర్ 8న వెల్లడించారు. మెయిన్స్లోనూ అర్హత పొందిన వారికి జనవరి 2, ఏప్రిల్ 9 మధ్య వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తంగా పొందిన మార్కుల ఆధారంగా ర్యాంకులను యూపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఆలిండియా టాపర్గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ నిలవగా, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రదాన్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించారు. 2022 సివిల్స్లోనూ తెలుగు విద్యార్థి ఉమాహారతి మూడో స్థానం పొందడం విశేషం. 1,016 మంది ఎంపిక సివిల్స్–2023 కోసం యూపీఎస్సీ 1,016 మందిని ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీలో 347 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీల నుంచి 165, ఎస్టీ విభాగం నుంచి 86 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్కు 37 మంది, ఐపీఎస్కు 200 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్–ఏ కేటగిరీకి 613 మంది, గ్రూప్ బీ సర్వీసెస్కు 113 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు పొందిన మార్కులను 15 రోజుల్లో తమ వెబ్సైట్లో ఉంచుతామని ప్రకటించింది. విజేతలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల విజేతలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఏపీ నుంచి ఈసారి 50 మందికి పైగా ఎంపికవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహేష్ భగవత్ కృషి ఫలించింది సివిల్స్ పరీక్షల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ గైడెన్స్ మంచి ఫలితాలను ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా శిక్షణ పొందుతున్న వారితో ప్రత్యక్షంగా, ఇతర రాష్ట్రాల వారితో ఆన్లైన్ ద్వారా ఆయన ఇచ్చిన సూచనలతో 200 మందికి పైగా ర్యాంకులు సాధించారు. అందులో తెలంగాణ నుంచి అనన్య రెడ్డి సహా జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న వారు కూడా ఉన్నారు. సివిల్స్ ప్రిపేరయ్యే వారికి వ్యక్తిత్వ వికాసం, పరీక్ష సమయాల్లో ఒత్తిడి, సమయ పాలన, ఇంటర్వ్యూలో వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలపై మహేష్ భగవత్ సూచనలు చేశారు. -
సివిల్స్లో ఉదయగిరి యువతి సత్తా
ఉదయగిరి: యూపీఎస్సీలో మండలంలోని గంగులవారి చెరువుపల్లికి చెందిన బడబాగ్ని వినీష ప్రతిభ చూపింది. మంగళవారం ఫలితాలు విడుదల చేయగా 821 ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి శ్రీనివాసులు వ్యవసాయాధికారి. తల్లి విజయభారతి గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వినీష ప్రాథమిక విద్యాభ్యాసం నెల్లూరులో జరిగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్లో పూర్తి చేసింది. మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివింది. అమెరికాలో ఎంఎస్సీ చేసింది. అనంతరం గ్రూప్–1 పరీక్షలు రాసి మున్సిపల్ కమిషనర్గా ఎంపికై ంది. ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తోంది. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ర్యాంకు సాధించడం విశేషం. వినీష సోదరుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతను కూడా సివిల్స్కు సిద్ధమవుతున్నాడు. మారుమూల గ్రామంలో జన్మించి, చదువులో రాణించి సివిల్స్లో ర్యాంకు సాధించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
UPSC: సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు
సాక్షి, ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్కు రెండో ర్యాంకు, దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంకు దక్కింది. ఇక ఈ యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్కు చెందిన ఇద్దరు సెలక్ట్ అయ్యారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ర్యాంకుల పంట పండింది. మొత్తం 1,016 మంది ఎంపికయితే.. అందులో తెలుగు అభ్యర్థులు కనీసం 50కి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దోనూరు అనన్యారెడ్డికి మూడో ర్యాంకు అన్షుల్ భట్ 22వ ర్యాంకు నందల సాయి కిరణ్కు 27 ర్యాంకు మెరుగు కౌశిక్కు 82వ ర్యాంకు పింకిస్ ధీరజ్ రెడ్డి 173 ర్యాంకు అక్షయ్ దీపక్ 196 ర్యాంకు భానుశ్రీ 198 ర్యాంకు ప్రదీప్ రెడ్డి 382 ర్యాంకు వెంకటేష్ 467 ర్యాంకు హరిప్రసాద్ రాజు 475వ ర్యాంకు పూల ధనుష్ 480 ర్యాంకు కె. శ్రీనివాసులు 526 ర్యాంకు సాయితేజ 558 ర్యాంకు కిరణ్ సాయింపు 568 ర్యాంకు మర్రిపాటి నాగభరత్ 580 ర్యాంకు పీ. భార్గవ్ 590 ర్యాంకు అర్పిత 639 ర్యాంకు ఐశ్వర్య నీలిశ్యామల 649 ర్యాంకు సాక్షి కుమార్ 679 ర్యాంకు రాజ్కుమార్ చౌహన్ 703 ర్యాంకు జి.శ్వేత 711 ర్యాంకు ధనుంజయ్ కుమార్ 810 ర్యాంకు లక్ష్మీ భానోతు 828 ర్యాంకు ఆదా సందీప్ కుమార్ 830 ర్యాంకు జె.రాహుల్ 873 ర్యాంకు హనిత వేములపాటి 887 ర్యాంకు కె.శశికాంత్ 891 ర్యాంకు కెసారపు మీనా 899 ర్యాంకు రావూరి సాయి అలేఖ్య 938 ర్యాంకు గోపద నవ్యశ్రీ 995 ర్యాంకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి ర్యాంకులు వచ్చాయి. వరంగల్ నగరానికి చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంకు వచ్చింది. గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్కు 568 ర్యాంకు వచ్చింది. శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్కు 764వ ర్యాంకు వచ్చింది. జయసింహారెడ్డికి IAS వచ్చే అవకాశం ఉంది. కిరణ్కు IPS లేదా IRS రావొచ్చు. అనిల్ కుమార్కు IRS వచ్చే అవకాశం ఉంది. (సయింపు కిరణ్) గతేడాది మే 28వ తేదీన యూపీఎస్పీ ప్రిలిమ్స్ పరీక్ష జరిగాయి. ప్రిలిమ్స్ పరీక్షల అనంతరం మేయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో జరిగాయి. మేయిన్స్ పరీక్షల ఫలితాలను డిసెంబర్ ఎనిమిదో తేదీన విడుదల చేశారు. అనంతరం జనవరి రెండో తేదీ నుంచి ఏప్రిల్ రెండు నుంచి ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. నేడు తుది ఫలితాలు వెలువడ్డాయి. UPSC has announced the final results of the Civil Services Examination. Congratulations to all achievers who have cleared this prestigious milestone! Your hard work and dedication have paid off.#Upsc_final_result#UPSC2024 #upsc#upsc2023 pic.twitter.com/jkj3sCPoSD — आदर्श यादव(Adarsh Yadav) (@AdarshY59491482) April 16, 2024 -
యూపీఎస్సీ ఇంటర్వ్యూకు వెళ్లి.. ఎంపీ టిక్కెట్తో తిరిగొచ్చి..
ఎన్నికల సమయంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటుంటాయి. వీటిని విన్నప్పుడు ఒకపట్టాన నమ్మాలని అనిపించదు. ఒకప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు హాజరుకాబోతున్న యువకునికి కాంగ్రెస్ ఎన్నికల టిక్కెట్టు ఇచ్చింది. ఈ ఉదంతం బీహార్ కాంగ్రెస్ నేత రామ్ భగత్ పాశ్వాన్ విషయంలో జరిగింది. 1970లో బీహార్లోని దర్బంగాకు చెందిన రామ్భగత్ పాశ్వాన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అనంతరం ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి వెళ్లారు. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు మాజీ మంత్రులు లలిత్ నారాయణ్ మిశ్రా, వినోదానంద్ ఝా, నాగేంద్ర ఝాలను కలుసుకున్నారు. ఆ సమయంలో వారంతా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్పై పోటీ చేయాలని పాశ్వాన్ను కోరారు. దీనికి ఎంటనే ఆయన అంగీకరించారు. గతంలో రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ, పాశ్వాన్ ఎన్నికల బరిలో దిగేందుకు ఆసక్తి చూపారు. 1971 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని రోస్రా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్పై పాశ్వాన్ బరిలోకి దిగారు. సైకిల్పై ప్రచారం సాగించారు. నాటి ఎన్నికల్లో ఆయన సంయుక్త సోషలిస్టు పార్టీ అభ్యర్థి రామ్సేవక్ హజారీని ఓడించారు. రోస్రా ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరకాలంలో కాంగ్రెస్ అతనిని రాజ్యసభకు పంపింది. దాదాపు 17 ఏళ్ల పాటు రామ్భగత్ పాశ్వాన్ ఎంపీగా ఉన్నారు. నాడు రామ్భగత్ పాశ్వాన్ పోస్ట్మాస్టర్గా ఉంటూనే సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన పోస్ట్మాస్టర్ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పట్లో అతని జీతం నెలకు రూ.150. ఉద్యోగం మానేయడంతో భార్య జీతం రూ.75పైనే ఆయన ఆధారపడాల్సి వచ్చింది. భర్త ఎంపీ అయిన తర్వాత కూడా రామ్భగత్ పాశ్వాన్ భార్య విమలాదేవి ఉద్యోగం వదల్లేదు. ఆమె ప్రధానోపాధ్యాయురాలిగా పదవీ విరమణ చేసి, ప్రస్తుతం లాహెరియాసరాయ్లో ఉంటున్నారు. రామ్భగత్ పాశ్వాన్ దంపతులకు ముగ్గురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. -
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం మే 26న జరగాల్సిన రాతపరీక్షను.. జూన్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. ఈ మేరకు UPSC తన వెబ్సైట్లో ఓ ప్రకటనలో తెలిపింది. ‘త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష - 2024ను వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయించింది. మే 26న కాకుండా జూన్ 16న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్కు కూడా వర్తిస్తుంది’ అని పేర్కొంది. కాగా యూపీఎస్సీ-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 14 విడుదలైంది. సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా పరిగణిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎఎస్ అయ్యేందుకు ప్రతి సంవత్సరం లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019