breaking news
-
హనుమాన్ హీరో కొత్త మూవీ.. గ్లింప్స్ చూస్తే గూస్బంప్సే!
హనుమాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా. ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్నారు. తేజ మరో హిస్టారికల్ మూవీ చేసేందుకు రెడీ అయిపోయారు. తేజ సజ్జాకు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన రవితేజతో ఈగల్ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హైదరాబాగ్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో టైటిల్ రివీల్ చేశారు. తేజ సజ్జా తాజా చిత్రానికి మిరాయి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో తేజ సూపర్యోధ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్లో కనిపించారు. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్ల్ చూస్తే అర్థమవుతోంది. మిరాయి సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీతో పాటు చైనీస్ భాషల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. From the hush of ancient narratives📜 Comes a thrilling adventurous saga of a #SuperYodha 🥷⚔️#PMF36 x #TejaSajja6 Titled as #𝐌𝐈𝐑𝐀𝐈 ⚔️#MIRAITitleGlimpse out now💥 -- https://t.co/k4tycunRkA In Cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥 SuperHero @tejasajja123… pic.twitter.com/WN2MB2EPlE — People Media Factory (@peoplemediafcy) April 18, 2024 -
విజేత తరుణ్ మన్నేపల్లి
కజకిస్తాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్కు చెందిన తరుణ్ మన్నేపల్లి విజేతగా నిలిచాడు. అస్తానాలో శనివారం జరిగిన ఫైనల్లో తరుణ్ 21–10, 21–19 స్కోరుతో ఎనిమిదో సీడ్, మలేసియాకు చెందిన సూంగ్ జూ విన్పై విజయం సాధించాడు. గత ఏడాది జాతీయ చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచిన తరుణ్కు ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్ కావడం విశేషం. మహిళల సింగిల్స్లో భారత షట్లర్ అనుపమ ఉపాధ్యాయ టైటిల్ సాధించింది. ఫైనల్లో భారత్కే చెందిన ఇషారాణి బారువాపై 21–15, 21–16తో అనుపమ గెలుపొందింది. మరో వైపు మిక్స్డ్ డబుల్స్లో హైదరాబాద్ అమ్మాయి కె.మనీషా రన్నరప్గా నిలిచింది. మనీషా – సంజయ్ శ్రీవత్స జోడి ఫైనల్లో 21–9, 7–21, 12–21తో వాంగ్ టిన్ సి – లిమ్ చూ సిన్ (మలేసియా) చేతిలో పరాజయంపాలైంది. టైటిల్ సాధించే క్రమంలో తరుణ్ సహచరుడు గగన్ బల్యాన్, 2022 వరల్డ్ జూనియర్ చాంపియన్íÙప్ రన్నరప్ శంకర్ ముత్తుసామి, దిమిత్రీ పనరియన్ (కజకిస్తాన్), ఏడో సీడ్ లీ డ్యూక్ (వియత్నాం)లను ఓడించాడు. -
రజనీకాంత్ కళుగు?
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ను ఈ నెల 22న అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ‘కళుగు’ (తెలుగులో ‘గద్ద’ అని అర్థం) అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. మరి... ఇదే టైటిల్ ఖరారు అవుతుందా? లేక మరో టైటిల్ ఫిక్స్ అవుతుందా అనేది తెలియాలంటే ఈ నెల 22 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం షూటింగ్ జూన్ చివర్లో లేదా జూలై మొదటి వారంలో ్ర΄ారంభం కానుందని తెలిసింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
బోపన్న–ఎబ్డెన్ జోడీకి మయామి మాస్టర్స్ టైటిల్
ఫ్లోరిడా: ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ టైటిల్ సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (3/7), 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంటపై నెగ్గింది. బోపన్న–ఎబ్డెన్లకు 4,47,300 డాలర్ల (రూ. 3 కోట్ల 72 లక్షలు) ప్రైజ్మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఒక గంట 42 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న ద్వయం ఆరు ఏస్లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్విస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. బోపన్న కెరీర్లో ఇది 26 డబుల్స్ టైటిల్కాగా... ‘మాస్టర్స్ సిరీస్’లో ఆరో టైటిల్ కావడం విశేషం. 44 ఏళ్ల బోపన్న గతంలో ‘మాస్టర్స్ సిరీస్’లో ఇండియన్ వెల్స్ (2023), మోంటెకార్లో ఓపెన్ (2017), మాడ్రిడ్ ఓపెన్ (2015), పారిస్ ఓపెన్ (2012), పారిస్ ఓపెన్ (2011) టైటిల్స్ సాధించాడు. లియాండర్ పేస్ (2012లో) తర్వాత మయామి ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా బోపన్న గుర్తింపు పొందాడు. ఈ విజయంతో బోపన్న సోమవారం విడుదల చేసే డబుల్స్ ర్యాంకింగ్స్లో మళ్లీ ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంటాడు. -
ఆ రోజే టైటిల్
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ టీజర్ను ఏప్రిల్ 22న రిలీజ్ చేయన్నుట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జూన్లో చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ సమాచారం. ఇక ప్రస్తుతం ‘వేట్టయాన్’ సినిమాతో బిజీగా ఉన్నారు రజనీకాంత్. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019