breaking news
-
YSRCP: ఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. జాతీయ సర్వేలో ఎన్ని సీట్లంటే..
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు. రాజకీయ విశ్లేషకులు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. గతంలో ఏం చేశామన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక, భవిష్యత్లో ఫలానా చేస్తామని నమ్మకంగా చెప్పడంలో విశ్వసనీయత లేక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓటమి బాటలో పయనిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయభేరి మోగించింది. వచ్చే ఎన్నికల్లో కూడా లోక్సభ ఎన్నికల్లో ఇదే స్థాయిలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు సర్వేలు ఇదే విషయాన్ని చెప్పాయి. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం.. రానున్న లోక్సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో 20 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. అలాగే, టీడీపీ కూటమికి 4-5 స్థానాల వస్తాయని వెల్లడించింది. సర్వే ప్రకారం ఫలితాలు ఇలా... 👉: YSRCP: 19-20. 👉: TDP: 3-4. 👉: JSP: 0. 👉: BJP: 1-1. Others: 0. TIMES NOW- @ETG_Research Survey Andhra Pradesh (Total Seats: 25) | Here are seat share projections: YSRCP: 19-20 TDP: 3-4 JSP: 0 BJP: 1-1 Others: 0 @PadmajaJoshi also takes us through vote share projections. pic.twitter.com/dzSNkzsEXB — TIMES NOW (@TimesNow) April 17, 2024 READ THIS ARTICLE IN ENGLISH : YS Jagan Again as CM: Top Surveys ఇది కూడా చదవండి: ఏపీ ఎన్నికల ఫలితాల గురించి అన్ని సర్వేలు ఏం చేబుతున్నాయంటే.. -
YSRCP మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని సర్వే రిపోర్ట్
-
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 383 స్థానాలు.. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాగ్రెస్ పార్టీకి 22, తెలంగాణలో కాంగ్రెస్కు 9 ఎంపీ సీట్లు... టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే వెల్లడి .. ఇంకా ఇతర అప్డేట్స్
-
Lok sabha elections 2024:ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయం
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ–ఈటీజీ సర్వే పేర్కొంది. ఎన్డీఏకు 383 స్థానాలొస్తాయని, విపక్ష ఇండియా కూటమి 118 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అధికార బీజేపీ ఏకంగా 344 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 37 లోక్సభ స్థానాలతో కుదేలవనుందని పేర్కొంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 49 శాతం ఓట్లు ఒడిసిపడుతుందని, ఇండియా కూటమికి 34 శాతం వస్తాయని తేల్చింది. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 సీట్లు సాధించి లోక్సభలో మూడో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని వెల్లడించింది. తమిళనాట డీఎంకేకు కూడా 22 స్థానాలొస్తాయని, పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు 19, ఒడిశాలో బిజూ జనతాదళ్కు 11 సీట్లొస్తాయని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభంలో పడ్డట్టు కని్పస్తున్న ఆప్ 6 స్థానాలతో మెరుగైన ప్రదర్శన చేస్తుందని సర్వే పేర్కొనడం విశేషం. ఇక అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్కు 9 దక్కుతాయని, బీజేపీ 5, మజ్లిస్ ఒక స్థానం గెలుచుకుంటాయని వివరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమికి తోడు నేతల వలస తదితరాలతో కుంగిపోయిన బీఆర్ఎస్ 2 స్థానాలకు పరిమితబమవుతుందని తెలిపింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. అందులో ఒక్క బీజేపీయే ఏకంగా 303 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. యూపీఏకు 91, ఇతరులకు 98 సీట్లొచ్చాయి. -
Times Now ETG Survey: ‘ఫ్యాన్’ ప్రభంజనమే
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ–ఈటీజీ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశంలో అన్ని రాష్ట్రాలతోపాటు ఏపీలోనూ ప్రజల అభిప్రాయాన్ని టౌమ్స్ నౌ సంస్థ నెల రోజులపాటు విస్తృతంగా సర్వే చేసింది. ఈ సర్వే ఫలితాలను గురువారం రాత్రి టైమ్స్ నౌ ఛానల్ ప్రసారం చేసి చర్చ నిర్వహించింది. అత్యంత శాస్త్రీయంగా నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రంలో 21 నుంచి 22 లోక్సభ స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంటుందని వెల్లడైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టి జట్టుగా వచ్చినప్పటికీ ఘోర పరాభవం తప్పదని సర్వేలో తేలింది. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా రాదని తేల్చింది. టీడీపీ, జనసేన కూటమి మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలతో ఒకింత ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది. విశ్వసనీయతకు పట్టం.. సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయని చర్చలో పాల్గొన్న విశ్లేషకులు స్పష్టం చేశారు. గత ఎన్నికలతో పోల్చితే వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా అవతరించడానికి కారణాలపై ప్రధానంగా చర్చ సాగింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం వాగ్దానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేసి ‘‘చెప్పాడంటే.. చేస్తాడంతే..’’ అనే నమ్మకాన్ని ప్రజల్లో పెంచుకున్నారు. మీ బిడ్డగా మీ ఇంటికి మంచి చేశానని నమ్మితే ఓటేయాలంటూ సీఎం జగన్ ఇచ్చిన పిలుపు ప్రజల్లోకి బలంగా వెళ్లింది. రాష్ట్రంలో ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో సాకారమైన మార్పులు కళ్లెదుటే కనిపిస్తుండటంతో ప్రజలంతా సంక్షేమ సర్కారుకు జై కొడుతున్నారు. కూటమిగా చేరిన టీడీపీ, బీజేపీ, జనసేన పారీ్టలు నైతిక స్థైర్యం కోల్పోయి ఉనికి కోసం కుట్రలు చేస్తున్నాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
Multiple cat checj
Check international block
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019