breaking news
-
sri rama navami 2024: బాలరాముడికి సూర్య తిలకం
అయోధ్య: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అయోధ్య బాలరాముడికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్ది ఆశీస్సులందించాడు. సరిగ్గా నుదుటిన చుంబించి రఘుకుల పురుషోత్తముడి పట్ల ఆతీ్మయత చాటుకున్నాడు. భవ్య రామమందిరంలోని గర్భాలయంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత తొలిసారిగా కనిపించిన ఈ అద్భుత దృశ్యాలను భక్తులు కనులారా తిలకించి పరవశించిపోయారు. జైశ్రీరామ్ అంటూ నినదించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో దర్శించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సూర్యతిలకం ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ సమయంలో గర్భగుడిలో అర్చకులు ప్రత్యేక హారతి ఇచ్చారు. అరుదైన వజ్రాలు, రత్నాలు పొదిగిన కిరీటంతోపాటు ప్రత్యేక ఆభరణాల అలంకరణతో బాలరాముడు మరింత సుందరంగా మెరిసిపోయాడు. ప్రతిఏటా శ్రీరామనవమి సందర్భంగా రాముడికి 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యతిలకం దిద్దేలా ఆలయంలో దర్పణాలు, కటకాల సాయంతో ప్రత్యేక ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సూర్యతిలకం దృశ్యం 4 నుంచి 5 నిమిషాల పాటు కొనసాగిందని ఆలయ ప్రతినిధి ప్రకాశ్ గుప్తా చెప్పారు. సూర్యకిరణాలు నేరుగా బాలరాముడి విగ్రహం నుదుటి భాగంపైకి ప్రసరించాయని వెల్లడించారు. ఈ సమయంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించలేదని అన్నారు. వారు బయటి నుంచే దర్శించుకున్నారని తెలిపారు. మరోవైపు, అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉత్సవాలు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది దర్శనం కోసం బారులు తీరారు. భావోద్వేగపూరిత క్షణం: ప్రధాని మోదీ దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి తనకెంతో ఆనందంగా కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ రోజు కోస మే కోట్లాది మంది ఎదురుచూశారని వెల్లడించారు. అస్సాంలోని నల్బారీలో ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని మోదీ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ బాలరాముడి సూర్యతిలకం ఘట్టాన్ని ఆన్లైన్లో వీక్షించి, భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని చూసి తరించానని చెప్పారు. కోట్లాది మంది ప్రజల్లాగే తనకు కూడా ఇది భావోద్వేగపూరిత క్షణమని వెల్లడించారు. -
‘సూర్య తిలక్’ వేడుక.. ట్యాబ్లో వీక్షించిన ప్రధాని
గువహతి:అయోధ్య బాలరాముని నుదుట సూర్యుడు తిలకం దిద్దిన ‘సూర్య తిలక్’ వేడుకను ప్రధాని నరేంద్రమోదీ అస్సాంలో తిలకించారు. బుధవారం నల్బరీ జిల్లాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని సభలోని వారందరినీ సెల్ఫోన్ టార్చ్లైట్ ఆన్ చేసి కాసేపట్లో జరిగే సూర్యతిలక్ ఉత్సవానికి సంఘీభావం తెలపాలని కోరారు. సెల్ఫోన్లైట్ కిరణాలు కూడా పంపాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ‘దేశ వాసుల 500 ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరింది. అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇది తొలి రామ్ నవమి. కాసేపట్లో సూర్యతిలక్ వేడుక జరగనుంది. మీరందరూ మీ సెల్ఫోన్ లైట్లను వెలిగించండి.. జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలివ్వండి’అని ప్రధాని కోరారు. ర్యాలీ తర్వాత ప్రధాని తన వద్ద ఉన్న ట్యాబ్లో సూర్యతిలక్ వేడకను వీక్షించారు. ఈ దృశ్యాలను ఆయన తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్టు చేశారు. #WATCH | PM Narendra Modi watched the Surya Tilak on Ram Lalla after his rally in Nalbari, Assam "Like crores of Indians, this is a very emotional moment for me. The grand Ram Navami in Ayodhya is historic. May this Surya Tilak bring energy to our lives and may it inspire our… pic.twitter.com/hA0aO2QbxF — ANI (@ANI) April 17, 2024 ఇదీ చదవండి..బాలరాముడికి సూర్య తిలకం -
15 ఏళ్ల బాలుడు.. రూ.100 కోట్ల కంపెనీ.. ఎలా సాధ్యమైందంటే..
ఒక మంచి ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అవసరాలే సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాయి. ఆ పరిష్కారాలను మంచి బిజినెస్ ఐడియాగా మలుచుకుంటే రాబడి పెరుగుతుంది.. జీవనోపాధి లభిస్తుంది. 15 ఏళ్ల ఓ బాలుడు తన సమస్యను పరిష్కరించుకునే క్రమంలో మంచి ఐడియాతో బిజినెస్ ప్రారంభించి ఏకంగా రూ.100 కోట్ల కంపెనీని సృష్టించాడు. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. బడికెళ్లే వయసులో కోట్లు విలువైన కంపెనీ నిర్మించటం అంత ఈజీ కాదు. వినటానికి కొంచెం వింతగానే అనిపిస్తున్నప్పటికీ ముంబైలో నివసిస్తున్న 15 ఏళ్ల గుజరాతీ బాలుడు తిలక్ మెహతా ఇది సాధ్యమని నిరూపించాడు. చదువుతో పాటు వ్యాపారాన్ని కొనసాగిస్తూ రెండేళ్లుగా విజయవంతంగా వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. తన సంస్థ ద్వారా దాదాపు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. తిలక్మెహతా 2008లో గుజరాత్లో జన్మించాడు. వృత్తిరీత్యా తిలక్ తండ్రి విశాల్ ముంబయి వచ్చి కుంటుంబంతో సహా అక్కడే నివసిస్తున్నారు. విశాల్ ఒక లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తుండేవారు. తల్లి గృహిణి. తిలక్కు సోదరి కూడా ఉంది. తిలక్కు తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ద్వారా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. ఒకరోజు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన తండ్రిని తనకు కావాల్సిన స్టేషనరీ వస్తువులను తీసుకురమ్మని అడిగాడు. అప్పటికే అలసటగా ఉన్న విశాల్ అందుకు నిరాకరించారు. దాంతో తనే వెళ్లి అవసరమైన వస్తువులు తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడే తనకు మంచి ఐడియా వచ్చింది. తనలాగే ఎంతోమంది పిల్లలు, పెద్దలు కొన్ని కారణాల వల్ల వారికి అవసరమైన స్టేషనరీ వస్తువులు తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని గ్రహించాడు. దాంతో సమస్యకు పరిష్కారం గురించి ఆలోచిస్తూ.. ఇంటికే పుస్తకాలు డెలివరీ చేసే సర్వీస్ ప్రారంభిస్తే బావుంటుందనే ఐడియా వచ్చింది. వెంటనే ఈ ఆలోచన గురించి తండ్రికి వివరించాడు. అలా తిలక్ తన కొరియర్ సర్వీస్ ప్రారంభించేందుకు అవసరమైన పూర్తి ప్రణాళిక సిద్ధమైంది. దీనికి అవసరమైన పెట్టుబడిని తన తండ్రి సమకూర్చారు. ఇదీ చదవండి: అది నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే: బాబా రామ్దేవ్ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనతో పెట్టుబడిదారుల కోసం వెతికారు. తండ్రి సహాయంతో తిలక్ ఓ బ్యాంకు అధికారికి తన వ్యాపారం గురించి వివరించాడు. దాంతో ఆ అధికారి తిలక్ ఆలోచన విని కొంత పెట్టుబడి పెట్టారు. తర్వాత బ్యాంకు ఉద్యోగం వదిలేసి తన వ్యాపారంలో చేరాడు. వీరంతా కలిసి ‘పేపర్స్ ఎన్ పార్సెల్స్’ పేరుతో కొరియర్ సర్వీస్ను ప్రారంభించారు. పేపర్స్ ఎన్ పార్సెల్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా షిప్పింగ్, లాజిస్టిక్స్ సేవలు అందిస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసిన అదేరోజు స్మాల్ పార్సెళ్లు, డాక్యుమెంట్లు, స్టేషనరీ వస్తువులు అందిస్తారు. ఈ కంపెనీ ముంబయిలో సేవలు అందిస్తోంది. ఇందులో 200 మంది పనిచేస్తున్నారు. దాదాపు 300 మంది డబ్బావాలా ఉద్యోగాల సహకారంతో రోజూ 1200 డెలివరీలు ఇస్తున్నారు. గరిష్ఠంగా 3 కిలోల వరకు బరువున్న పార్సెళ్లు చేస్తున్నారు. ప్రతి పార్సెల్కు కనీసం రూ.40 నుంచి రూ.180 వసూలు చేస్తున్నారు. ముంబయి ఇంట్రాసిటీ లాజిస్టిక్ మార్కెట్లో 20 శాతం వాటాను కలిగి ఉన్నారు. -
కేసులో మేటర్ లేదు..చేతులెత్తేసిన చంద్రబాబు లాయర్
-
ఆధునిక అభ్యుదయ కవి తిలక్
తణుకు టౌన్: ఆధునిక తెలుగు సాహిత్యాన్ని అభ్యుదయ, భావ కవిత్వం వైపు నడిపించిన గొప్ప కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ అని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో సాహిత్య అకాడమీ, తిలక్ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన దేవరకొండ బాల గంగాధర్ తిలక్ శత జయంతిని పురస్కరించుకుని సాహితీ సదస్సును ఆయన ప్రారంభించారు. సదస్సుకు సాహితీ అకాడమీ, తెలుగు అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ కె.శివారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తిలక్ తన రచనల్లో భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్దపీట వేశారని, జాతి, మత తత్వాలకతీతంగా ఆయన రచనలున్నాయని కొనియాడారు. రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు మాట్లాడుతూ తిలక్ కవిత్వం 20వ శతాబ్దపు సాహిత్య ప్రపంచంలో ఎక్కువ జనాదరణ పొందిందన్నారు. తెలుగు సాహిత్యంలో శ్రీ శ్రీ తర్వాత అంతటి ప్రభావం చూపిన రచనలు తిలక్వని కొనియాడారు. నా కవిత్వంలో నేను దొరుకుతాను అని ప్రకటించుకున్న కవి తిలక్ అని, ఆయన కవిత్వానికి మధ్యవర్తులు అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ తెలుగు శాఖ ఆధ్వర్యంలో తిలక్ రచనలపై ముద్రించిన పుస్తకాలను చిన వీరభద్రుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తణుకు నన్నయ భట్టారక పీఠం అధ్యక్షుడు జేఎస్ సుబ్రహ్మణ్యం, పలువురు కవులు తదితరులు పాల్గొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019