breaking news
-
సరిహద్దులో చైనాతో కొత్త బెడద
‘షావోకాంగ్’ పథకం ద్వారా వందల ఆధునిక గ్రామాలను సరిహద్దుల్లో చైనా నిర్మించింది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి పేరిట సాగుతున్న ఇది పూర్తిగా నిర్బంధ విస్తరణపై కేంద్రీకృతమైంది. లద్ధాఖ్, బారాహోతి, అరుణాచల్ ప్రదేశ్లను తన భూభాగాలుగా చూపిస్తూ చైనా ‘భౌగోళిక పటాల దాడి’ని కూడా ప్రారంభించింది. ఈ ప్రాంతాల్లోని స్థలాలకు మాండరిన్ పేర్లను ఇవ్వడం అనేది చైనా ‘త్రిముఖ యుద్ధవ్యూహం’లో భాగం. టిబెట్, షిన్జాంగ్ లలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత మాత్రమే, సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, ఉపరితల కమ్యూనికేషన్ లను అప్గ్రేడ్ చేయడం భారత్ మొదలుపెట్టింది. ‘ఎత్తుకు పై ఎత్తు’ వేయడం కాకుండా, చైనా విస్తరణవాద నమూనాలను సమర్థంగా ఎదుర్కోవడానికి, నవ్య విధానం అవసరం. సరిహద్దులలో చైనా ఆధునిక గ్రామాలను నిర్మించడం, వాటిని నివాస ప్రాంతాలుగా చేసుకోవడం గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. మార్చ్ 28న, టిబెట్ను చైనా స్వాధీనం చేసుకున్న ఘటన 65వ వార్షికోత్సవం సందర్భంగా, భారత్, భూటాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న కొత్త గ్రామాలలో చైనా ప్రభుత్వం అనేక వేడుకలను నిర్వహించింది. తాజా వార్తల ప్రకారం, ఇప్పటికే ఉన్న 628 ‘సవొకాంగ్’ (సంపన్న గ్రామా లు)తో పాటు, మరో 175 సరిహద్దు గ్రామాలను చైనా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి పేరిట, షావోకాంగ్ చొరవ అనేది నిర్బంధ విస్తరణపై కేంద్రీకృతమైంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన ద్వారా చైనా సమాజపు సమాన అభివృద్ధిని నిర్ధారించ డానికి 1979లో డెంగ్ జియావోపింగ్ ఈ నమూనాను ప్రతిపాదించారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ దీనిని, ప్రధాన భూభాగంతో సరిహద్దు ప్రాంతాల ఏకీకరణ వ్యూహంగా మార్చారు. తద్వారా అరుణాచల్ప్రదేశ్కు ఎదురుగా ఉన్న టిబెట్లో దాని భూసరిహద్దుల భద్రతను మెరుగుపరిచారు. షావోకాంగ్ పథకంలో భాగంగా, 427 మోడల్ గ్రామాలను ఫ్రంట్ లైన్లో నిర్మించగా, 201 గ్రామాలు రెండవ శ్రేణిలో ఉన్నాయి. ఈ సంపన్న గ్రామాలు షిగత్సే, లోహ్కా, న్యింగ్చి, ఎన్గారి వంటి ముఖ్య మైన పట్టణాలతో సహా 21 సరిహద్దు కౌంటీలలో విస్తరించి ఉన్నాయి. భూటాన్, అరుణాచల్ప్రదేశ్లతో సరిహద్దును పంచుకునే లోహ్కా ప్రాంతంలోనే, చైనా 354 ‘సంపన్న’ సరిహద్దు స్థావరాలను అభివృద్ధి చేసింది. ఈ గ్రామాలలో దాదాపు మూడింట ఒక వంతు వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) సమీపంలో నిర్మించారు. మౌలిక సదు పాయాలు సహా, ఈ ఆవాసాల నిర్మాణం కోసం సుమారుగా 4.6 బిలి యన్ డాలర్లు కేటాయించారు. 2017 అక్టోబర్లో జరిగిన 19వ పార్టీ కాంగ్రెస్లో, ప్రతిభావంతులైన చైనీస్ పౌరులు మారుమూల జాతిపరమైన మైనారిటీ ప్రాంతాలలో పని చేయాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. దీంట్లో నిగూఢంగా దాగి ఉన్నది, ప్రధానంగా అక్కడి జనావాసాల స్థితిగతులను మార్చడమే. గత దశాబ్దంలోనే, టిబెట్లో హాన్ జనాభా సుమారు 12 శాతం పెరిగింది. కమ్యూనిస్ట్ పాలన అంతిమ లక్ష్యం, టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో పూర్తిగా చైనీకరణను సాధించడం. భారత్, నేపాల్, భూటాన్ సరిహద్దు ప్రాంతాలలో అన్ని సరిహద్దు గ్రామాలకు రోడ్లు, విద్యుదీకరణ, ఆఖరికి ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి నాణ్యమైన సౌకర్యాలు అందించారు. అదనంగా, దాదాపు 206 పారిశ్రామిక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. సరిహద్దు నిర్వహణను బలోపేతం చేయడానికి చైనా ఇటీవలి సంవత్సరాలలో రెండు జాతీయ చట్టాలను ప్రవేశపెట్టింది. 2021లో ఆమోదించిన నేషనల్ డిఫెన్స్ లా, జాతీయ ప్రయోజనాల కోసం పౌర సంస్థలతో కలిసి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పనిచేయడానికి అధిక పాత్రను అందిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత, ఆక్రమిత ప్రాంతా లపై చైనా పట్టును ఏకీకృతం చేసేందుకు భూ సరిహద్దు చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టంలోని ఆర్టికల్స్ 10, 43... సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి యథాతథ స్థితిని సవాలు చేస్తున్నాయి. ఇది భారతదేశ సరిహద్దు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. లద్ధాఖ్, బారాహోతి, అరుణాచల్ ప్రదేశ్లను తన భూభాగాలుగా చూపిస్తూ చైనా ‘మ్యాప్ల దాడి’ని ప్రారంభించింది. ఈ ప్రాంతాల్లోని స్థలాలకు మాండరిన్ పేర్లను ఇవ్వడం అనేది చైనా ‘త్రిముఖ యుద్ధవ్యూహం’లో భాగం. ఇది ప్రచారపరమైన, మానసికపరమైన, చట్టపరమైన కోణాలను కలిగి ఉంటుంది. జూలై 2021లో, జిన్పింగ్ లాసాను సందర్శించారు. గత మూడు దశాబ్దాలలో చైనా దేశాధినేత చేసిన మొదటి సందర్శన. ఆయన టిబెట్ను ‘ఇనుప కవచం’గా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దీని ప్రకారం, డోక్లామ్, లాంగ్ జు వంటి వివాదాస్పద ప్రాంతాలలోని సరిహద్దు గ్రామాలు ఫార్వర్డ్ పోస్ట్లుగా వ్యవహరించడానికి చైనా సైన్యపు రక్షణ ప్రణాళికలలో విలీనం చేయబడ్డాయి. హాన్ జాతికి చెందిన మాజీ సైనిక సిబ్బంది సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. చైనా చర్యలు దాని ‘గ్రే జోన్ వార్ఫేర్’కు అనుగుణంగా ఉన్నాయి. ఇందులో పౌరులు, పౌరసైనికులు ‘నాన్–కాంటాక్ట్’ యుద్ధంలో భాగమ వుతారు. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ కార్యాచరణ దీనికి ఒక ఉదాహరణ. ఒక స్పష్టమైన విధానం లేనందున, ముఖ్యంగా చైనాకు ఎదు రుగా ఉన్న భారత సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. టిబెట్, షిన్జాంగ్లలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి తర్వాత మాత్రమే, సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, ఉపరితల కమ్యూనికేషన్ లను అప్గ్రేడ్ చేయడం భారత్ మొదలుపెట్టింది. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ (వీవీపీ)ని గతేడాది ప్రారంభించారు. దీని ప్రకారం, చైనా సరిహద్దులో కనెక్టివిటీ లోపించిన 168 గ్రామాలను ఈ ఏడాది చివరి నాటికి అనుసంధానం చేయనున్నారు. 19 జిల్లాల్లోని 663 సరి హద్దు గ్రామాల్లో తగిన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4,800 కోట్ల బడ్జెట్ను కేటాయించారు.చైనా నియంత్రణలో పూర్తిగా ఉండే సవొకాంగ్ పథకానికి విరు ద్ధంగా, భారత్ కార్యక్రమం ‘హబ్ అండ్ స్పోక్’(ఒక దగ్గరి నుంచి అందరికి) నమూనాను అనుసరిస్తోంది. ఇది జిల్లా పరిపాలన, గ్రామ పంచాయతీల ద్వారా అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వ పాత్ర నిధులు ఇవ్వడానికే పరిమితమైంది. వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ప్రధాన దృష్టి సామాజిక–ఆర్థిక కార్యక్రమాల ప్రచారంపై ఉంది. అయితే, భద్రతా అంశాలను కూడా చేర్చడం ద్వారా ద్వంద్వ–వినియోగ విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది. రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, దిబాంగ్ జల విద్యుత్ ప్రాజెక్టు, జలమార్గాలతో సహా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సరిహద్దుల్లో భారత్ చేపడుతోంది. ఈశాన్య ప్రాంత సమగ్ర అభివృద్ధికి రూ. 12,882.2 కోట్ల నిధులను ‘స్థూల బడ్జెట్ సహాయం’ కింద సమకూర్చారు. వివాదాస్పద సరిహద్దు, లద్ధాఖ్లలో కొనసాగుతున్న ప్రతిష్టంభన దృష్ట్యా, చైనా ప్రణాళిక తీవ్రమైన వ్యూహాత్మక పరిణామాలను కలిగి ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ స్థితిని ఏకపక్షంగా మార్చాలనే బీజింగ్ ఉద్దేశం, సవొకాంగ్ పథకంతో మరింత తోడ్పాటును పొందు తుంది. 2005 (ఆర్టికల్ 7)లో పొందుపర్చిన ‘సరిహద్దు సమస్య పరి ష్కారానికి రాజకీయ పరామితులు, మార్గదర్శక సూత్రాలు’ ఒప్పందాన్ని కూడా చైనా విస్మరించింది. ఈ ఒప్పందం ప్రకారం సరిహద్దుల వెంబడి జనాభా ప్రస్తుత అమరికకు ఎవరూ భంగం కలిగించకూడదు. చైనా విస్తరణవాద నమూనాలను సమర్థంగా ఎదుర్కోవడానికి, నవ్య విధానం అవసరం. ‘ఎత్తుకు పై ఎత్తు’పై ఆధారపడిన మన ప్రస్తుత ప్రతిస్పందనా విధానానికి కాలం చెల్లిపోయింది. సరిహద్దు నిర్వహణ మొత్తంగా సమగ్ర సమీక్షకు గురికావాలి. ఇది జాతీయ భద్రతా వ్యూహంలో కీలకమైన అంశంగా ఉండాలి. దురదృష్టవశాత్తూ ఇది ఇప్పటికీ రూపు దాల్చుతూనే ఉంది! మేజర్ జనరల్ జిజి ద్వివేది (రిటైర్డ్) వ్యాసకర్త చైనాకు భారత మాజీ డిఫెన్స్ అటాచె (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఆ ఆరు జిల్లాల్లో జీరో ఓటింగ్.. కారణమిదే?
నాగాలాండ్లోని ఆరు తూర్పు జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల వద్ద సిబ్బంది తొమ్మిది గంటల పాటు వేచి ఉన్నప్పటికీ ఒక్క ఓటరు కూడా ఓటు వేయలేదు. ‘ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ’ (ఎఫ్ఎన్టీ) బంద్ పిలుపుతో ఈ ప్రాంతంలోని నాలుగు లక్షల మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్పీఓ)ఎఫ్ఎన్టీ డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేదని ముఖ్యమంత్రి నీఫియు రియో వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్త అధికారాలను సిఫారసు చేశారన్నారు. కాగా 20 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ప్రాంతంలోని 738 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సిబ్బంది ఉన్నారని నాగాలాండ్ అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవ లోరింగ్ తెలిపారు. అయినప్పటికీ ఓటు వేసేందుకు ఎవరూ రాలేదని సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. నాగాలాండ్లోని 13.25 లక్షల మంది ఓటర్లలో తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో 4,00,632 మంది ఓటర్లు ఉన్నారు. కాగా తౌఫెమాలో ఓటు వేసిన అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఎఫ్ఎన్టీకి సంబంధించిన ‘డ్రాఫ్ట్ వర్కింగ్ పేపర్’ను కేంద్ర హోంమంత్రికి అందజేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతాన్ని విస్మరించాయని ఆరోపిస్తూ ఈఎన్పీవో ఆరు జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తోంది. నాగాలాండ్లో లోక్సభ ఎన్నికలు ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈఎన్పీవో గురువారం సాయంత్రం 6 గంటల నుండి రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో నిరవధిక బంద్ను ప్రకటించింది. -
భారత బలగాలు మా భూభాగంపై వద్దేవద్దు
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత వ్యతిరేకతను వెళ్లగక్కారు. సాధారణ పౌర దుస్తుల్లోనైనా సరే భారత సైనిక సిబ్బంది తమ భూభాగంలో మే 10వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని అన్నారు. మాల్దీవుల్లో భారత్ మూడు వైమానిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడి ప్రభుత్వం మార్చి 10వ తేదీ కల్లా భారత సైనిక సిబ్బంది వాటిని విడిచి వెళ్లిపోవాలని గడువు ప్రకటించింది. దీంతో, సైనిక సిబ్బంది నుంచి ఆ కేంద్రాల బాధ్యతలను చేపట్టేందుకు భారత్ నుంచి పౌర సిబ్బందితో కూడిన మరో బృందం అక్కడికి చేరుకున్న నేపథ్యంలో చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు ముయిజ్జు మళ్లీ తన బుద్ధిని బయటపెట్టారు. భారతీయ సిబ్బంది ఏ రూపంలోనైనా సరే తమ దీవిలో ఉండరాదన్నారు. -
విపక్షాల లొల్లి నడుమే... ‘ఢిల్లీ’ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’పై గురువారం లోక్సభలో ఆమోద ముద్రపడింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్యే మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనగా విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు ఈ బిల్లుపై లోక్సభలో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు?: కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ బిల్లును ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ప్రభుత్వ పాలనా సరీ్వసులపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు ఉన్నాయంటూ న్యాయస్థానం చెప్పిందని గుర్తుచేశారు. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే, రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నికైన శాసనసభలపై కేంద్ర ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రం అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అధికారులే నడిపిస్తే ఇక ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ఎందుకని నిలదీశారు. ‘చెక్స్ అండ్ బ్యాలెన్సెస్’ వ్యవస్థను విచి్ఛన్నం చేయొద్దని కోరారు. డీఎంకే సభ్యుడు దయానిధి మారన్ మాట్లాడుతూ.. ‘ఇండియా’ కూటమి బలంగా ఉందని, మీ గురించి ఆలోచించుకోండి అని బీజేపీకి హితవు పలికారు. 2024లో తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. ప్రజలను బానిసలుగా మారుస్తారా?: కేజ్రివాల్ ఢిల్లీ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ గురువారం ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజలను బానిసలుగా మార్చడానికే ఈ బిల్లు తీసుకొచ్చారని ఆక్షేపించారు. ప్రజల హక్కులను లాక్కొనే బిల్లు ఎందుకని నిలదీశారు. బిల్లుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వద్ద సరైన వాదన ఒక్కటి కూడా లేదన్నారు. బిల్లు విషయంలో తప్పు చేస్తున్నట్లు కేంద్రానికి కూడా తెలుసని పేర్కొన్నాను. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే..: అమిత్ షా ఢిల్లీకి సంబంధించిన చట్టాలు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 239ఏఏ కింద పార్లమెంట్కు ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఢిల్లీ బిల్లుపై లోక్సభలో తొలుత ఆయన చర్చను ప్రారంభించారు. కేవలం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ఢిల్లీలోని అధికార ఆప్ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. ఢ్రిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కలి్పంచాలన్న సూచనను జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభ్బాయి పటేల్, సి.రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్ సైతం తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఢిల్లీ బిల్లు విషయంలో అసలు సమస్య అధికారుల బదిలీలు, పోస్టింగులపై నియంత్రణ గురించి కాదని, ఇప్పటిదాకా జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బిల్లును వ్యతిరేకిస్తున్నారని కేజ్రివాల్ పారీ్టపై అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బిల్లులు, చట్టాలు కేవలం ప్రజల సంక్షేమం కోసమేనని తేలి్చచెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, అందుకే మీరు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారని కాంగ్రెస్ సహా ఇతర పారీ్టలను ఉద్దేశించి అన్నారు. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాక ‘ఇండియా’ కూటమిలో ‘ఆప్’ భాగస్వామిగా ఉండబోదన్నారు. -
రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
సాక్షి, తిరువనంతపురం: కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 2020కి ముందున్న స్టేటస్కోను కొనసాగించేందుకు చైనా తిరస్కరించిందని పేర్కొన్నారు. అంతేకాదు.. వెయ్యి కిలోమీటర్ల భూభాగాన్ని ప్రధాని మోదీ, చైనాకు అప్పగించారంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ. ఈ భూభాగాన్ని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారో..కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారాయన. ఈ మేరకు ఈ ఉదయం(బుధవారం) ఆయన ట్విటర్లో ట్వీట్ చేశారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం కేరళలో యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే.. ఆయన తన యాత్రను ముందుకు సాగిస్తున్నారు. China has refused to accept India’s demand of restoring status quo of April 2020. PM has given 1000 Sq Kms of territory to China without a fight. Can GOI explain how this territory will be retrieved? — Rahul Gandhi (@RahulGandhi) September 14, 2022 ఇదీ చదవండి: అమిత్ షాపై రాజస్థాన్ సీఎం సంచలన ఆరోపణలు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019