breaking news
-
రేపటి నుంచే నామినేషన్ల పర్వం, సర్వేలన్నీ బంద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు (ఏప్రిల్ 18) నోటిషికేషన్ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. అదే విధంగా నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26న నామినేషన్ల పరిశీలించి.. 29న నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వేలు బంద్ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్స్టాప్ పడ్డట్టయింది. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు, ప్రజలకు వెల్లడించకూడదు. ప్రీపోల్ సర్వే కానీ, ఒపినియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించకూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు తెలంగాణలోనూ మే 13నే ఎన్నికలు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. -
లైలా.. ఓ అంబాసిడర్
సాక్షి, హైదరబాద్: లైలా ఓరుగంటి. ఒక ట్రాన్స్జెండర్. దశాబ్దాలుగా ట్రాన్స్జెండర్ల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం పని చేస్తున్న సామాజిక కార్యకర్త. లోక్సభ ఎన్నికల సందర్భంగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆమెను అంబాసిడర్గా నియమియారు. వివిధ సామాజిక వర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, అన్ని వర్గాలకు చెందిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఎన్నికల కమిషన్ వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ చేపట్టిన క్యాంపెయిన్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి లైలా ఎన్నికల అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్వహించే కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని కొనసాగించనున్నారు.‘తెలంగాణలో సుమారు 1.5 లక్షల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.కానీ ఓటర్లుగా నమోదైన వాళ్లు కనీసం 3 వేల మంది కూడా లేరు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది.’అని లైలా అభిప్రాయపడ్డారు. వివక్ష తొలగలేదు... చాలామంది ట్రాన్స్జెండర్లుగా జీవనం కొనసాగిస్తున్నప్పటికీ ఓటింగ్లో మాత్రం ‘పురుషులు’ లేదా ‘మహిళలు’గా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.‘ట్రాన్స్జెండర్లు’గా నమోదు కావడం లేదు. దీంతో సామాజికంగా లక్షన్నర మంది ట్రాన్స్జెండర్లు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో కేవలం 2,737 మంది మాత్రమే ట్రాన్స్జెండర్లుగా నమోదయ్యారు. ఈ వర్గంపైన ఉండే సామాజిక వివక్ష కారణంగా తమ ఉనికిని చాటుకొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. సాధ్యమైనంత వరకు గోప్యంగా జీవించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సంఖ్యరీత్యా మెజారిటీగా ఉండే ఓటర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపే రాజకీయ పారీ్టలు ట్రాన్స్జెండర్లను గుర్తించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ సామాజిక రుగ్మతను తొలగించుకొనేందుకు ప్రతి ట్రాన్స్జెండర్ ఓటరుగా నమోదు కావలసి ఉందని లైలా పేర్కొన్నారు. గత పదేళ్లలో ట్రాన్స్జెండర్ల సంఖ్య రెట్టింపయింది.‘అనేక రకాలుగా ‘ట్రాన్స్’గా జీవనం కొనసాగిస్తున్నవాళ్లు ఉన్నారు.కానీ కుటుంబం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాల కారణంగా ఇళ్ల నుంచి బయటకు వచి్చన వాళ్లు నిర్భయంగా తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారు.’ అని చెప్పారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కమ్యూనిటీకి చెందిన పుష్ప ఎన్నికల్లో పోటీ చేయగా, 2018లో జరిగిన ఎన్నికల్లో చంద్రముఖి ఎన్నికల బరిలో నిలిచారు. ట్రాన్స్ కమ్యూనిటీలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఈ పోటీ ఎంతో దోహదం చేసిందని ఆ వర్గానికి చెందిన పలువురు అభిప్రాయపడ్డారు.ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ లైలాను అంబాసిడర్గా నియమించడాన్ని కూడా ట్రాన్స్జెండర్లు, సామాజిక సంస్థలు ఆహ్వానిస్తున్నాయి.కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో ఎంఏ చదివిన లైలా ... స్వచ్చంద సంస్థల ద్వారా ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. పథకాలు అందడం లేదు... వివిధ కారణాల వల్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఎలాంటి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేకుండా బతుకుతున్న తమను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, చదువుకున్న వాళ్లకు కూడా ఉద్యోగా లు లభించడం లేదని లైలా ఆవేదన వ్యక్తం చేసింది. దివ్యాంగులు, పేద మహిళలు, తదితర వర్గాలకు లభించే రాయితీ సదుపాయాలు కూడా తమకు అందడం లేదని, అణగారిన వర్గాలకు ఇళ్లు, ఇంటిస్థలాలు అందజేస్తున్నట్లుగానే తమకు కూడా సొంత ఇళ్లకు ఆర్ధికసహాయం అందజేయలని ఆమె కోరారు. ఈ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్ల సంఖ్య 1.50 లక్షలు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్లుగా నమోదైన ఓటర్లు : 2000 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు : 2,885 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న ట్రాన్స్జెండర్లు : 2,557 ప్రస్తుతం జరుగనున్న 2024 లోక్సభ ఎన్నికల కోసం నమోదైన ట్రాన్స్జెండర్ ఓటర్లు : 2,737. -
తెలంగాణ ఎన్నికలు.. నేటి అప్డేట్స్
జంగ్ తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికలు 2023 లైవ్ అప్డేట్స్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ రేపటి కౌంటింగ్ నేపథ్యంలో కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ హ్యట్రిక్ లోడింగ్ 3.0... వేడుకలకు సిద్ధంగా ఉండండి.. గెలుపుపై ధీమా Hattrick Loading 3.0 👍 Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w — KTR (@KTRBRS) December 2, 2023 రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత 29 వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ కిపంపించని అధికారులు.. విషయం తెలిసి ఆర్డీఓ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో కొద్ది సేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన అధికారులు పోస్టల్ బ్యాలెట్ తరలించిన తరువాతే ఇప్పుడు సీల్ వేసిన అధికారులు పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్ కు తాళం లేకపోవడం కాంగ్రెస్ నాయకుల తీవ్ర అభ్యంతరం ఆర్డీఓ ను నిలదీస్తున్న కాంగ్రెస్ శ్రేణులు, ఉద్రిక్తత కర్ణాటక నుండి ఎమ్మెల్యేలను పిలిచిన కాంగ్రెస్ ఒక్కో నియోకవర్గానికి ఒక్కో ఎమ్మెల్యేను పంపనున్న కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్ తీసుకొని వచ్చే బాధ్యత గజ్వేల్ ఫలితాలు ఆలస్యం!: కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రేపు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 10గం. తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం గజ్వేల్ నియోజకవర్గం ఫలితం ఆలస్యంగా వెల్లడి పోటీ అభ్యర్థులు ఎక్కువగా(44 మంది) ఉండడమే కారణమన్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రాత్రి 8గం. తర్వాతే గజ్వేల్ ఫలితం రావొచ్చనే అంచనా 23 రౌండ్లలో కౌంటింగ్ ఇప్పటికే మాక్ కౌంటింగ్ పూర్తైందన్న కలెక్టర్ చాలా ఇబ్బంది పెట్టారు: సీతక్క ములుగు జిల్లాలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఆడబిడ్డల ములుగు ప్రజలు ఆదరించారు చిన్న పిల్లలు కూడా నాకే మద్దతు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు నా జీవితానికి ఇంకేం కావాలి నా గెలుపుకోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు నేనెప్పుడూ మీ సేవకు రాలినే నేను ములుగు ప్రజల వెంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంతో అభివృద్ధి చేస్తాను నన్ను రీల్ అన్నారు. నేను కష్టకాలంలో ప్రజల వెంటే ఉన్నా వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు ఆడబిడ్డ ఉసురు తగులుతుంది మార్ఫింగ్ వీడియో, ఫోటోలతో దుష్ప్రచారం చేశారు నా కార్యకర్తలను పైసలతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు ఏ కష్టం వచ్చినా జనం వెంటే ఉంటా పార్లమెంట్ ఎన్నికల్లో రాహూల్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తా ఎన్నికల్లో కష్ట పడ్డ అందరికీ కృతజ్ఞతలు వచ్చేది ఇందిరమ్మ రాజ్యం. వెలుగులే ప్రతి ఇంటా.. కేసీఆర్కు బైబై చెప్తున్నారు: షర్మిల ఫలితాల ముందర.. వైఎస్సార్టీపీ నేత షర్మిల స్పందన తెలంగాణ ప్రజలు కేసీఆర్కు బైబై చెప్పారని కామెంట్ బైబై కేసీఆర్ సూట్కేసును ప్రదర్శించిన షర్మిల కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులుగా సమర్థులైనవాళ్లు ఉన్నారు ఉత్తమ్, భట్టిలాంటి వాళ్లు ఉన్నారు బ్లాక్మెయిలర్స్ మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు సీఎం అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ వాళ్లు నిర్ణయించుకుంటారు సీఈవోను కలిసిన తర్వాత మీడియాతో కాంగ్రెస్ నేత ఉత్తమ్.. బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారు రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోంది రైతు బంధు నిధుల్ని కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారు భూరికార్డులు మారుస్తున్నట్లు కూడా మాకు సమాచారం ఉంది రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్లోకి మారుస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదు అసైన్డ్ భూముల రికార్డుల్ని మార్చకుండా చూడాలని సీఈవోను కోరాం ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కోరాం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరాం మొత్తం నాలుగు అంశాలపై ఫిర్యాదు చేశాం రంగారెడ్డి జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల లెక్కింపు కోసం.. ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ లో రేపు ఉదయం ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇబ్రహీంపట్నం,మహేశ్వరం,కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు కౌంటింగ్ కేంద్రాల చుట్టూ మూడు అంచల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇబ్రహీం పట్నం నియోజకవర్గం 14 టేబుల్ 25 రౌండ్లు లెక్కింపు కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు విజయావకాశాలపై వీహెచ్ స్పందన తెలంగాణలో కాంగ్రెస్ విజయావకాశాలపై సీనియర్ నేత వీహెచ్ స్పందన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది దళితబంధు, డబుల్ బెడ్రూంల విషయంలో ప్రజలు విసిగిపోయారు మై హీరో: కవిత ట్వీట్ మై హీరో అంటూ తండ్రి కేసీఆర్ వీడియోను షేర్ చేసిన కవిత My hero❤️#KCR#JaiTelangana pic.twitter.com/LU5AEuOCi7 — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 2, 2023 ఈసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కమిషనర్తో కాంగ్రెస్ నేతల భేటీ ఈసీ కార్యాలయానికి వెళ్లిన రేవంత్రెడ్డి, మధు యాష్కీ, ఉత్తమ్, పొంగులేటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదు డిసెంబర్ 4న ఏర్పాటు చేయనున్న కేబినెట్ భేటీపైనా ఫిర్యాదు ప్రభుత్వ లావాదేవీలపై నిఘా ఉంచాలని ఫిర్యాదు చేయనున్న టీ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కీలక భేటీ హైదరాబాద్ హైదర్ గూడ ఎమ్మెల్యే. క్వార్టర్స్ లో భేటీ అయిన టీ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఇంఛార్జి మాణిక్రావ్ ఠాక్రే అధ్యకతన భేటీ అయిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పలువురు ముఖ్య నేతలు.. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఫలితాల తర్వాత ఎలాంటి వ్యూహం అమలు చేయాలనేదాని పై చర్చ కౌటింగ్ నేపథ్యంలో రేపు తెలంగాణ అంతటా మద్యం దుకాణాలు బంద్ ఎల్బీ నగర్ ఏర్పాట్లు ఇలా.. రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి ఎల్బీనగర్ నియోజకవర్గంకి సంబంధించి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ చౌహాన్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ మూడంచెల భద్రత నడుమ ఇండోర్ స్టేడియం ఎలాంటి ర్యాలీలు, విజయోస్తవ సంబురాలు చేయయూడదని ఇప్పటికే నేతలకు ఆదేశాలు కౌటింగ్ కేంద్రం చుట్టూ అరకిలోమీటరు దూరం వరకు 144 సెక్షన్ అమలు కౌంటింగ్.. కౌంట్డౌన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి రాష్ట్రవ్యాప్తంగా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 49 కేంద్రాల్లో కౌంటింగ్ ఉదయం 8గంటలకే తెరుచుకోనున్న బాక్స్లు తొలి అరగంట బ్యాలెట్.. ఆ తర్వాతే ఈవీఎంల్లో పోలైన ఓట్ల లెక్కింపు కౌంటింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ టెలీ కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించిన ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు అప్రమత్తంగా ఉండండి: డీజీపీ రేపు జరుగనున్న ఓట్ల కౌంటింగ్ అప్రమత్తంగా ఉండాలని ఉన్నతస్థాయి అధికారులకు డీజీపీ అంజనీకుమార్ ఆదేశం కౌంటింగ్ ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీలతో ఇవాళ డీజీపీ టెలీ కాన్ఫరెన్స్ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి పాల్వంచ అనుబోస్ ఇంజనీర్ కళాశాల లో స్ట్రాంగ్ రూం.. కౌంటింగ్ కేంద్రం అనుబోస్ కళాశాల వద్ద కేంద్ర బలగాలతో భద్రత నియోజకవర్గాల వారీగా కౌంటింగ్కు ఏర్పాట్లు.. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ళు పోలింగ్ బూత్ ల వారీగా రౌండ్స్ కేటాయింపు మొత్తం 80 రౌండ్లలో.. జిల్లా లోని 5 నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తి చేయనున్న అధికారులు కొత్తగూడెం నియోజకవర్గంలోని 253 బూత్లలకు సంబంధించి 18 రౌండ్స్ లో కౌంటింగ్ ఇల్లందు నియోజకవర్గం లోని 241 బూత్ లలో 17 రౌండ్స్ లో కౌంటింగ్ పినపాక నియోజకవర్గం లోని 244 బూత్ లలో 17 రౌండ్స్ లో కౌంటింగ్ అశ్వారావుపేట నియోజకవర్గం లోని 184 బూత్ లలో 13 రౌండ్స్ లో కౌంటింగ్ భద్రాచలం నియోజకవర్గం లోని 176 బూత్ లలో 12 రౌండ్స్ లో కౌంటింగ్ జిల్లా లో భాగానే నమోదైన పోలింగ్ జిల్లా వ్యాప్తంగా 78.67 శాతం పోలింగ్ నమోదు జిల్లాలో అత్యధికంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 80.13 శాతం పోలింగ్ నమోదు కౌంటింగ్ విధుల్లో.. 5,250 మంది సిబ్బంది క్లాస్ ఓటు బీఆర్ఎస్కే: పోచారం బీఆర్ఎస్ విజయావకాశాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ స్పందన బీఆర్ఎస్కు 70-75 సీట్లు పక్కా మాస్-క్లాస్ ఓటర్ల పల్స్ వేరు క్లాస్ ఓటర్లంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు సైలెంట్ ఓటు KCRకు అనుకూలంగా ఉంది కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. కరీంనగర్ జిల్లా నాలుగు నియోజకవర్గాలు కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, మానకొండూర్.. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఒక్కో గదిలో 14 టేబుల్స్ ఏర్పాటు కరీంనగర్ ఓట్ల లెక్కింపు 28 రౌండ్లు మానకొండూరు ఓట్ల లెక్కింపు 23 రౌండ్లు చొప్పదండి ఓట్ల లెక్కింపు 24 రౌండ్లు హుజురాబాద్ ఓట్ల లెక్కింపు 22 రౌండ్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలు... బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు.. వేములవాడ ఓట్ల లెక్కింపు 19 రౌండ్లు....పొస్టల్ బ్యాలెట్ కొసం 3 టేబుల్స్ సిరిసిల్ల ఓట్ల లెక్కింపు కొరకు 21 రౌండ్లు , పోస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని మూడు నియోజకవర్గాలు.. మంథని జేఎన్టీయూ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు రామగుండం ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్, 11 రౌండ్లు పొస్టల్ బ్యాలెట్ కొసం 4 టేబుల్స్. పెద్దపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్,15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ 4 టేబుల్స్ ఏర్పాటు మంథని ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్, 14 రౌండ్లలో లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కొరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల కోసం వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు జగిత్యాల నియోజకవర్గం కోసం 14 టేబుల్స్ 13 రౌండ్లలొ ఓట్ల లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు కోరుట్ల నియోజకవర్గం కోసం14 టేబుల్స్ పై 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కోసం నాలుగు టెబుల్స్ ధర్మపురి నియోజకవర్గం కోసం 14 టేబుల్స్ 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కొసం నాలుగు టేబుల్స్ ఏర్పాటు బెట్టింగ్లో పొలం కూడా..? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోరుగా పందేలు అభ్యర్థుల గెలుపోటములు.. మెజార్టీ ఎంత సాధిస్తారనేదానిపై బెట్ యాప్ల సాయంతో నెలరోజులుగా బెట్టింగులు వేస్తున్న ముఠా సిర్పూర్లో లక్షల్లో బెట్టింగ్ డబ్బులతో పాటు పొలంపైనా పందేలు వేస్తున్న కొందరు తన రెండు ఎకరాల భూమిని పందేంలో ఉంచిన ఓ వ్యక్తి! బీజేపీ ధీమా ఏంటంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విచిత్ర పరిస్థితి పోలింగ్ ముందుదాకా ప్రభుత్వం రాబోతోందంటూ ప్రకటనలు ఆ స్టేట్మెంట్తోనే అగ్రనేతల హడావిడి ఎగ్జిట్పోల్స్తో ఢీలా పడ్డ పార్టీ కేడర్ తాజాగా బీజేపీ మరో ధీమా 2018 కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామంటూ లీడర్ల స్టేట్మెంట్లు ఓట్లు-సీట్లు పెరుగుతాయని అంచనా 2018లో కేవలం 14 లక్షల ఓట్లు ఈసారి మాత్రం పోలైన ఓట్లలో.. 20 శాతం ఓట్లు వస్తాయని బీజేపీ అంచనా ..అయినా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళనే! తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ భవితవ్యంపై టెన్షన్ పడుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామని.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ధీమా నిన్న ప్రగతి భవన్లో నేతలతో సమావేశం వార్ రూమ్ నివేదికపైనా సుదీర్ఘమైన చర్చ బయటకు వచ్చిన విక్టరీ సింబల్ చూపించిన కొందరు నేతలు హైదరాబాద్ దాటిన తర్వాత మళ్లీ గెలుస్తామా? లేదా? అని చర్చలు నేతల అధైర్యంతో.. కేడర్లోనూ ఆందోళన సీనియర్లలోనూ కొందరికి ఓటమి భయం? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్లో జోష్ 10:06AM రేపు కాంగ్రెస్ బిగ్ ప్లాన్ రేపు డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి అభ్యర్థులు చేజారకుండా అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ రేపు కాంగ్రెస్ అభ్యర్థుల వెంట ఏఐసీసీ పరిశీలకులు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను నేరుగా హైదరాబాద్ తాజ్కృష్ణకు తీసుకురానున్న పరిశీలకులు మంచి మెజారిటీ వస్తే నో క్యాంప్ ఇవాళే హైదరాబాద్కు కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ ఈ మొత్తం వ్యవహారాలను డీకే శివకుమార్కే అప్పగించిన అధిష్టానం హమ్మయ్యా.. ఇక రిలాక్స్ తెలంగాణలో రిలాక్స్ అవుతున్న పొలిటీషియన్స్ ఇంతకాలం ప్రచారంతో బిజీబిజీ రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఇంటింటికి తిరిగి ప్రచారం అలసిపోయిన లీడర్లు పోలింగ్ ముగియడంతో ఇళ్లకు చేరుకున్న వైనం కుటుంబ సభ్యులతో గడుపుతూ కూల్ అవుతున్న నేతలు రేపు ఎలాగూ కౌంటింగ్ టెన్షన్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. ఖమ్మం జిల్లా లో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి తల్లంపాడు శ్రీ చైతన్య ఇంజనీర్ కళాశాల లో స్ట్రాంగ్ రూం.. అక్కడే కౌంటింగ్ కేంద్రం శ్రీ చైతన్య కళాశాల వద్ద కేంద్ర బలగాలతో భద్రత నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కు ఏర్పట్లు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ళు పోలింగ్ బూత్ ల వారీగా రౌండ్స్ కేటాయింపు 104 రౌండ్లలో ఖమ్మం జిల్లా లోని 5 నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తి చేయనున్న అధికారులు ఖమ్మం నియోజకవర్గం లోని 355 బూత్ లకు సంబంధించి 25 రౌండ్స్ లో కౌంటింగ్ పాలేరు నియోజకవర్గం లోని 289 బూత్ లలో 20 రౌండ్స్ లో కౌంటింగ్ మధిర నియోజకవర్గం లోని 268 బూత్ లలో 19 రౌండ్స్ లో కౌంటింగ్ వైరా నియోజకవర్గం లోని 252 బూత్ లలో 18 రౌండ్స్ లో కౌంటింగ్ సత్తుపల్లి నియోజకవర్గం లోని 292 బూత్ లలో 20 రౌండ్స్ లో కౌంటింగ్ జిల్లా లో భారీగా నమోదైన పోలింగ్ 5250 మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు జిల్లా వ్యాప్తంగా 83.83 శాతం పోలింగ్ నమోదు జిల్లా లో అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్ నమోదు కేసీఆర్పై నమ్మకం ఉంది సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు అనుకూలంగా పలువురి పోస్టులు కేసీఆర్పై నమ్మకం ఉందంటూ వ్యాఖ్యలు ఎగ్జిట్పోల్స్ ఫలితాల నేపథ్యంతో ఢీలా పడిన బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ప్రగతి భవన్ మీటింగ్ ధైర్యం నూరిపోసిన కేసీఆర్ అండ్ కేటీఆర్ ప్రజల కారువైపే ఉన్నారంటూ.. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామంటూ నేతలకు భరోసా ఎగ్జిట్ పోల్స్ చెత్త అంటూ ఖండన ఎగ్జాక్ట్(కచ్చితమైన) పోల్స్ తమకు అనుకూలంగా ఉంటాయంటూ ప్రకటనలు అదే సమయంలో కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విశ్వాసం 09:40 AM 20 రౌండ్లలో మహబూబాబాద్ కౌంటింగ్ మహబూబాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ మహిళ గురుకులంలో రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయము 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం.మొదట పోస్టల్ బ్యాలెట్,మరియు హోం ఓటింగ్ ఓట్ల లెక్కింపు ఉదయం 8:30 నిమిషాలకు ఈవీయము ఓట్ల లెక్కింపు ప్రారంభం మహబూబాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో కలిపి 283 పోలింగ్ బూతులు కలవు,మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 53 వేల 342 పోలింగ్ శాతము 82.34.పోలైన ఓట్లు మొత్తం 2 లక్షల 8 వేల 958 ఓట్లు మొత్తం కౌంటింగ్ కి 14 టేబుల్స్ ఏర్పాటు,ఒక్కో టేబుల్ కి ఒక్కో ఈవీఎం లెక్కింపు, ప్రతి రౌండ్ కి 14 ఈవీఎం లెక్కింపు మొత్తం 20 రౌండ్లలో మహబూబాబాద్ కౌంటింగ్ ప్రతి రౌండ్ కౌంటింగ్ కి 20 నిమిషాల సమయము పట్టే అవకాశం మొదటి రౌండ్ పలితము కొద్దిగా ఆలస్యము అయ్యే అవకాశం 9:30 నిమిషాలకు మొదటి ఈవీఎం రిజల్ట్! మధ్యాహ్నాం 2 గంటల వరకు చివరి ఫలితం తేలే ఛాన్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు స్ట్రాంగ్ రూంలు ఉదయము 6 గంటలకే ఓపెన్ చేసే అవకాశం 09:23 AM జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి రేపు ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో కౌంటింగ్ కు ఏర్పాట్లు ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ఓట్ల లెక్కింపు ప్రారంభం 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 23 రౌండ్లలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడి 14 టేబుళ్లలో ఒక్కో టేబుల్కు నలుగురు సిబ్బంది చొప్పున మొత్తం 56 మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొంటారు. ముగ్గురు నోడల్ ఆఫీసర్లు, ఆరుగురు కౌంటింగ్ సూపర్వైజ ర్లు, 12మంది కౌంటింగ్ అసిస్టెంట్లు కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారు. ఈవీఎంలను అంబేద్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు 09:15 AM కుట్ర జరుగుతోందంటూ కాంగ్రెస్ ఫిర్యాదు తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(సీఈవో) వికాస్ రాజ్ను కలవనున్న టీ కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతోపాటు ముఖ్య నాయకులు కూడా ప్రస్తుత ప్రభుత్వం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే కుట్ర జరుగుతోందని ఫిర్యాదు ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్ లో అటు ఢిల్లీ లో ఎన్నికల సంఘం, ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామంటున్న కాంగ్రెస్ 07:59 AM తెలంగాణ ఫలితాలు.. కాయ్రాజా కాయ్! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా సాగుతున్న బెట్టింగులు? ఏపీలోనూ యాప్ల ద్వారా బెట్టింగ్లు సాగుతున్నట్లు సమాచారం గెలుపుపై అన్ని పార్టీల ధీమా ఎగ్జిట్పోల్స్ వచ్చాక.. రెట్టింపు అవుతున్న బెట్టింగ్ సొమ్ము ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు అంటేనే బెట్ వేయాలంటూ జోరుగా పందేలు సామాజికవర్గాలు, అనుకూల,ప్రతికూల అంశాలపై లెక్కలేసుకుని మరీ.. కీలక నేతల గెలుపోటములపైనా భారీగా.. కీలక నేతల మెజార్టీ ఫిగర్పైనా బెట్టింగులు బెట్టింగ్ ముఠాలపై పోలీసుల నజర్ 07:31 AM ఆ అంచనాలు నిజం అవుతాయా? తప్పుతాయా? ఆసక్తికరంగా తెలంగాణ ఎగ్జిట్పోల్స్ ఫలితాలు కాంగ్రెస్కే ఎక్కువ అవకాశాలున్నాయంటూ మెజార్టీ సర్వే సంస్థల వెల్లడి పోలింగ్ ముగిసిన సాయంత్రం 5గం. వరకే అభిప్రాయ సేకరణ కానీ.. ఆ తర్వాత జరిగిన ఓటింగ్ తమకు కలిసొస్తుందంటున్న బీఆర్ఎస్ ఎగ్జిట్పోల్స్ ఫలితాలతో.. కాంగ్రెస్ సంబురాలు అధైర్య పడొద్దంటూ బీఆర్ఎస్ కేడర్కు కేసీఆర్ ధైర్యం ఎగ్జిట్పోల్స్ను రబ్బిష్ అంటూ కొట్టిపారేసిన కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ను తామూ తారుమారు చేస్తామంటూ బీజేపీ ప్రకటన ఫలితాలు షాకింగ్గా ఉంటాయంటూ బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలు 07:22 AM ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపటి కౌంటింగ్ ఇలా.. ఉమ్మడి ఆదిలాబాద్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారుల ఏర్పాట్లు నాలుగు జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో టీటీడీసీ కేంద్రంలో ఆదిలాబాద్ , బోథ్ నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్న అధికారులు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో పీవీటీజీ బాలికల పాఠశాలలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మంచిర్యాల జిల్లా ముల్కల ఇంజనీరింగ్ కళశాలలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఓట్ల లెక్కింపు నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మల్ , ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కౌంటింగ్ సందర్భంగా.. ఆయా కేంద్రాల వద్ద ఆంక్షల అమలు.. 144 సెక్షన్ విధింపు ఉదయం 6గం. నుంచి సాయంత్రం 6గం. ఆంక్షలు అమలు కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబురాలు నిషేధం 7:16 AM కాంగ్రెస్ గెలవబోతోంది: రేవంత్రెడ్డి ఎగ్జిట్పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వస్తుందనే ధీమా విజయం తమదేనంటూ నేతల సంబురాలు.. టీపీసీసీ రేవంత్రెడ్డి ఇంటికి క్యూ ఓట్ల లెక్కింపు వరకూ ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచన 9న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం.. అదే రోజు గ్యారంటీ హామీలపై మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంటుందంటూ నేతల ప్రకటనలు నేడు సీఈవో వికాస్రాజ్ను కలవనున్న టీ కాంగ్రెస్ నేతల బృందం ఓటమి భయంతో కేసీఆర్ రైతు బంధు నిధుల్ని దారి మళ్లిస్తున్నారనే ఆరోపణతో ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ నేతలు 07:09 AM పటిష్ట భద్రత.. పక్కా ఏర్పాట్లతో కౌంటింగ్: సీఈవో వికాజ్రాజ్ స్ట్రాంగ్రూంలలో ఈవీఎంలు మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల బందోబస్తులో రేపు తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం అభ్యర్థుల్లో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్జెండర్ పోలింగ్ అనంతరం అన్నింటినీ పార్టీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్రూంలకు ఈవీఎంల తరలింపు స్ట్రాంగ్రూంలకు అన్ని రకాలుగా భద్రత చర్యలు సీసీ కెమెరాలు ఏర్పాటు 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు కౌంటింగ్ కోసం మొత్తం 1,766 టేబుల్స్ ఏర్పాటు ఒక్కొక్క నియోజకవర్గానికి ఉండే టేబుల్స్14 కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది జీహెచ్ఎంసీ పరిధిలో 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగింపు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగం ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అరగంట తర్వాత.. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు 07:00 AM మళ్లీ హైదరాబాద్కు డీకేఎస్ మళ్లీ తెలంగాణకు రానున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కౌంటింగ్.. ఫలితాల నేపథ్యంలో రేపు సాయంత్రం హైదరాబాద్కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడిగా డీకేఎస్ను నియమించిన ఏఐసీసీ రిసార్ట్ రాజకీయాల అవసరం ఉండబోదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకేఎస్ 06:57 AM ఆగం కావొద్దు.. మనమే వస్తాం: కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారిలోనే ధీమా పార్టీ కేడర్ను ధైర్యం నూరిపోసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలతో నిన్న భేటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి గాబరా పడొద్దు.. మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ భరోసా ఫలితాలు వెల్లడయ్యే వరకూ ప్రశాంతంగా ఉండండి.. 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందాం చివరి గంటలో జరిగిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఉండొచ్చని కేసీఆర్ అభిప్రాయం ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తూ విక్టరీ సింబల్ చూపించిన పలువురు నేతలు డిసెంబర్ 4వ తేదీన సచివాలయంలో కేబినెట్ భేటీకి సీఎం కేసీఆర్ నిర్ణయం 06:54 AM నగరంలో రేపు అక్కడ ఆంక్షలు ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్లు ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఆంక్షలు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు మైక్లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫోటోలు, సింబల్స్, ప్లకార్డులు ప్రదర్శించకూడదు విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలటరీ, ఎలక్షన్ అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై నిషేధం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాల బంద్ 06:40 AM రేపే కౌంటింగ్.. తెలంగాణలో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ మధ్యాహ్నాం కల్లా ఫలితాలపై రానున్న క్లారిటీ తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ వన్ సైడెడ్గా ఎగ్జిట్ పోల్స్ అయినా గెలుపుపై ఎవరికి వారే ధీమా 06:38 AM అత్యల్పంగా రాజధానిలోనే.. పోలింగ్ కేంద్రాలకు మోహం చాటేసిన రాజధాని వాసులు జిల్లా వారీగా.. హైదరాబాద్లో అత్యల్పంగా నమోదు అయిన పోలింగ్ కేవలం 47.88 శాతం మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గం వారీగా.. అత్యల్పంగా యాకుత్ పురాలో కేవలం 39.64 శాతం ఓటింగ్ మలక్పేట్లో 41.32 శాతం, చార్మినార్లో 43.27 శాతం, చాంద్రాయణగుట్టలో 45.26 శాతం బహదూర్ పురాలో 45.50 శాతం, జూబ్లీహిల్స్ లో 47.49 శాతం, అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లిలో 48.75 శాతం, ఎల్బీనగర్లో 49.07శాతం, కంటోన్మెంట్లో 49.36 శాతం పోలింగ్ మేడ్చల్ - మల్కాజ్ గిరిలో 56.17 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతం, హన్మకొండలో 68.81 శాతం ఓటింగ్ 06:36 AM పోలింగ్ ఇలా.. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,793 మంది పోలింగ్ పాల్గొన్న 2,32,59,256 మంది ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్లలో.. .. 1,15,84,728 మంది పురుషులు, మహిళలు 1,16,73,722 మంది, ఇతరులు 806 మంది జిల్లాల వారీగా చూస్తే.. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.36 శాతం పోలింగ్ నియోజకవర్గాల వారీగా చూస్తే.. నల్గొండ మునుగోడులో 91.89 శాతం ఓటింగ్ ఖమ్మం పాలేరులో 90.89, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 90.77 శాతం పోలింగ్ 06:32 AM ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ ఇలా.. నవంబర్ 30వ తేదీ గురువారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గం. నుంచి సాయంత్రం 5.గం దాకా.. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గం. కే ముగింపు అప్పటికే లైన్లో ఉన్నవాళ్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాత్రి 10:30గం. దాకా కూడా క్యూలో ఓటర్లు ఆలస్యంగా శుక్రవారం సాయంత్రం అధికారిక పోలింగ్ శాతం విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నమోదైన తుది పోలింగ్ శాతం 71.34 శాతం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ 73.37 శాతం నమోదు గతంలో కంటే రెండు శాతం పోలింగ్ తగ్గింది -
ఎన్నికల విధుల్లో లక్షమంది పోలీస్ సిబ్బంది
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019