breaking news
Ad - Sakshi_Home_Sticky
-
హీరోగా సీనియర్ నటుడు.. మూవీ టీజర్ రిలీజ్
చాలా ఏళ్ల నుంచి చాలా సినిమాల్లో పలు పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజా రవీంద్ర. ఇప్పుడు ఇతడు ప్రధాన పాత్రలో ఓ మూవీ చేశాడు. అదే 'సారంగదరియా'. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మే నెలలో సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇన్నేళ్ల ఒంటరి జీవితానికి కారణమేంటి?) టీజర్ రిలీజ్ చేసిన యంగ్ హీరో శ్రీవిష్ణు.. మూవీ యూనిట్కి విషెస్ చెప్పారు. ఓ మధ్య వయస్కుడైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో సంసారాన్ని వెల్లదీస్తుంటాడు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి.. తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి. సమాజం అతన్ని నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఆ కన్నతండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.. అనే కథతో సినిమా తీసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ప్రముఖ బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..!) -
దేవర భామ స్పై యాక్షన్ థ్రిల్లర్.. టీజర్ చూశారా!
దేవర మూవీతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా జాన్వీ ప్రధాన పాత్రలో తెరెకక్కుతోన్న తాజా చిత్రం ఉలజ్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ విదేశీ రాయబారి పాత్రలో కనిపించనుంది. సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో గూఢచర్యంపై కథాంశంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాతో యాక్షన్ అవతార్లోకి అడుగు పెట్టింది. కాగా.. ఈ యాక్షన్ థ్రిల్లర్లో గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిల్ హుస్సేన్, రాజేష్ తైలాంగ్, మెయాంగ్ చాంగ్, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జంగిల్ పిక్చర్స్ పతాకంపై వినీత్ జైన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా జాన్వీ కపూర్ యాక్షన్ జోనర్లో అడుగు పెట్టింది. కాగా.. టాలీవుడ్లో కొరటాల డైరెక్షన్లో వస్తోన్న దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కనిపించనుంది. ఆ తర్వాత రామ్ చరణ్తోనూ జతకట్టనుంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఆర్సీ16లో జాన్వీ హీరోయిన్గా నటించనుంది. అంతే కాకుండా బాలీవుడ్లోనూ కరణ్ జోహార్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. -
తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. మరో క్రేజీ రికార్డ్ సొంతం!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం దక్కించుకున్న రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. పుష్ప-2 టీజర్ను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 8న విడుదలైన పుష్ప-2 యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. అతి తక్కువ టైమ్లో మిలియన్ల వ్యూస్ సాధించిన టీజర్.. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగిన టీజర్గా నిలిచింది. ఇప్పటివరకు పుష్ప-2 టీజర్కు 110 మిలియన్లకు పైగా వ్యూస్, 1.55 మిలియన్ల లైక్స్తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని పుష్ప టీం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. #Pushpa2TheRuleTeaser becomes the first teaser to be 𝗧𝗥𝗘𝗡𝗗𝗜𝗡𝗚 #𝟭 on YouTube for a record 138 HOURS ❤🔥 Takes over the nation with 𝟏𝟏𝟎𝐌+ 𝐕𝐈𝐄𝐖𝐒 & 𝟏.𝟓𝟓𝐌+ 𝐋𝐈𝐊𝐄𝐒 🔥🔥 ▶️ https://t.co/5Mvmxzyfrp Grand release worldwide on 15th AUG 2024 💥💥… pic.twitter.com/LderAMGCRg — Pushpa (@PushpaMovie) April 14, 2024 -
పుష్ప-2 టీజర్.. ఆ సినిమాను దాటలేకపోయింది!
ఐకాన్ స్టార్ పుష్ప-2 ది రూల్ చిత్రానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు బర్త్ డే రోజే అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పుష్ప-2 టీజర్ను పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు. అయితే విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ను షేక్ చేసింది. ఒక్కసారిగా నంబర్వన్ ప్లేస్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. అయితే ఆ ఒక్క విషయంలో మాత్రం పుష్ప-2 రికార్డ్ బ్రేక్ చేయలేకపోయింది. ప్రభాస్ సలార్ మూవీ టీజర్ రికార్డ్ను అధిగమించలేకోపోయింది. సలార్ టీజర్ రిలీజైనప్పుడు కేవలం 6 గంటల 15 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. అదే లైక్స్ పుష్ప-2 టీజర్కు రావడానికి 9 గంటల 59 నిమిషాలు పట్టింది. ఇక ఇదే జాబితాలో ఆర్ఆర్ఆర్ చిత్రం 36 గంటల 4 నిమిషాలతో మూడుస్థానంలో ఉంది. ఏదేమైనా యూట్యూబ్లో మాత్రం రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Allu Arjun Jatara Look Secret: పుష్పరాజ్ భీకర రూపం రహస్యం ఇదేనా?
పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పీక్కు చేరింది. ఈ మూవీకి జాతీయ ఉత్తమ అవార్డు గెలుచు కుని మరో మెట్టు ఎక్కాడు అల్లు అర్జున్. దీనికి సీక్వెల్గా వస్తున్న 'పుష్ప 2: ది రూల్' పై అంచనాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే పుష్ప 2 సినిమా టీజర్లో అల్లు అర్జున్ నీలి రంగు చీర, నగలు, నిమ్మకాయ దండలతో వెరైటీ లుక్ హాట్టాపిక్గా నిలిచింది. దీంతో అభిమాన హీరో కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ ..ఈ మూవీలో లేడీ గెటప్తో కనిపించి అలరించాడు. తాజాగా పుష్ప-2 సినిమాలో కూడా అమ్మవారి భీకర రూపంతో ఫ్యాన్స్ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఎర్రచందనం, తిరుపతి జిల్లాలో కథ సాగుతుంది కనుక ఇది గంగమ్మ జాతర నేపథ్యమే ఈ లుక్అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటీ గంగమ్మ జాతర తెలుసుకుందాం రండి. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలని భావిస్తారు. వారం రోజుల పాటు జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. గంగమ్మ జాతర విశిష్టత పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించి వేధించేవాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కోవడంతో అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసి, పాలెగాడిని అంత మొందించిందని భక్తుల విశ్వాసం. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేసుకుంటారు. ఈ జాతరలో తొలి రోజున బైరాగివేషం ,రెండోరోజు బండవేషం,మూడోరోజు తోటివేషం,నాలుగోరోజు దొరవేషం వేసుకుంటారు. నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి వేషం ధరిస్తారు. ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాళ్ళ వేషం వేస్తారు.మగవారు ఆడవేషం వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. పేరంటాలు వేషంలోఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్నితయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచిమట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. బన్నీ న్యూ లుక్ రహస్యం వీడాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు పుష్ప 2: ది రూల్ టీజర్కి రెస్పాన్స్ ఒక రేంజ్లో ఉంది. బన్నీ మాతంగి లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘‘మరో బ్లాక్బస్టర్..బన్నీకి మరో జాతీయ అవార్డు పక్కా" అని కమెంట్ చేశారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019