breaking news
-
జర్నీ టు అయోధ్య
శ్రీరామ నవమిని పురస్కరించుకుని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ అధినేత వేణు దోనేపూడి ‘జర్నీ టు అయోధ్య’ (వర్కింగ్ టైటిల్) పేరుతో సినిమా ప్రకటించారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘విశ్వం’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ బేనర్లో ‘జర్నీ టు అయోధ్య’ రెండో సినిమా. దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ‘‘అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే వీఎన్ ఆదిత్య నేతృత్వంలో అయోధ్య సహా పలు చోట్ల లొకేషన్స్ పరిశీలిస్తున్నారు. ఒక యంగ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి దర్శక– నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. -
దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలకు ఏర్పాట్లు
దశాధిక రంగాల్లో అసాధారణ స్థాయిలో రాణించి, శతాధిక చిత్ర దర్శకునిగా... అనుపమాన దార్శకునిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆచంద్రతారార్కం నిలిచిపోయే పేరు ప్రఖ్యాతులు గడించిన దర్శక శిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆయన ప్రియ శిష్యులు సన్నాహాలు చేస్తున్నారు. దాసరి బహుముఖ ప్రతిభను నేటి తరానికి గుర్తు చేస్తూ... వారిలో స్ఫూర్తిని నింపేందుకు "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" పేరిట తెలుగు సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచినవారికి పట్టం కట్టి, దాసరికి ఘన నివాళులు అర్పించనున్నారు. దర్శకరత్నతో సుదీర్ఘమైన అనుబంధం కలిగిన ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు - ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ అధ్యక్షకార్యదర్శులుగా ఇందుకోసం ఏర్పాటైన కమిటీలో ఆడిటర్ గా, ఆర్ధిక సలహాదారుగా దాసరితో ప్రత్యేక అనుబంధం కలిగిన బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్, శిల్పకళావేదికలో అత్యంత వైభవంగా మే 5న నిర్వహించనున్న ఈ వేడుక వివరాలు వెల్లడించేందుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో "దర్శకరత్న డి.ఎన్. ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" జ్యురీ మెంబర్స్ తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రభు, అప్పాజీలతోపాటు... తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ... "దశాధిక రంగాల్లో రాణించిన దాసరికి నివాళులు అర్పిస్తూ... "అభినవ దర్శకరత్న, అభినయ రత్న, నిర్మాణరత్న, పంపిణీరత్న, ప్రదర్శనారత్న, కథారత్న, సంభాషణారత్న, గీతరత్న, పాత్రికేయరత్న, సేవారత్న" పురస్కారాలు ప్రదానం చేయనున్నాం. ఇతర అవార్డులను స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాల నుంచి ఎంపిక చేయనున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించేందుకు నడుం కట్టిన సూర్యనారాయణ గారిని అభినందిస్తున్నాను" అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ... "దాసరి లేని లోటు ఎప్పటికీ తీరనిది. ఈ అవార్డుల ఎంపిక అత్యంత పారదర్శకంగా, ప్రామాణికంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాసరి భౌతికంగా దూరమై ఏడేళ్లు కావస్తున్నా ఆయనపై అపారమైన ప్రేమాభిమానాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బి.ఎస్.ఎన్. సూర్యనారాయణకు అభినందనలు" అన్నారు. బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ మాట్లాడుతూ... "దాసరి ప్రధమ జయంతిని ఘనంగా నిర్వహించాం. కరోన కారణంగా కంటిన్యూ చేయలేకపోయాయాం. ఇకపై ప్రతి ఏటా ఈ వేడుక నిర్వహిస్తాం" అన్నారు. టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ... "దురదృష్టవశాత్తూ మన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డుల విషయంలో చిత్రపరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయి. అలక్ష్యం చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ గారు చొరవ తీసుకుని భారతదేశం గర్వించదగ్గ మహానుభావుడైన దాసరి పేరిట అవార్డ్స్ ఇస్తుండడం ఎంతైనా అభినందనీయం" అన్నారు. ప్రభు మాట్లాడుతూ... "చిత్ర పరిశ్రమలోని ప్రతి విభాగంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన ఒకే ఒక్కడు దర్శకరత్న డాక్టర్ దాసరి. ఆయన స్మారకార్ధం నిర్వహిస్తున్న ఈ పురస్కారాల వేడుకకు యావత్ చిత్ర పరిశ్రమ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను" అన్నారు. ధీరజ అప్పాజీ మాట్లాడుతూ... "అవార్డ్స్ కమిటీలో చోటు దక్కించుకోవడం తనకు "లైఫ్ టైమ్ అచీవ్మెంట్"లాంటిదని పేర్కొన్నారు. -
అవినీతి బాబు చుట్టూ..రాజకీయమేంటి?
కులం పునాదులతో రాజకీయాలేంటి? ఎవరో కొందరు..ఎవరి కోసమో ఈ నాటకాలాడితే ఎలా? మాసిపోయిన ‘సెటిలర్స్’ గాయాన్ని గెలికి గెలికి... పుండుగా చేయడం న్యాయమా?.. ప్రముఖ సినీ దర్శకుడు, తెలుగు సినీ కార్మికుల నేతగా ప్రసిద్ధి చెందిన తమ్మారెడ్డి భరద్వాజ సంధించిన ప్రశ్నలివి. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన చంద్రబాబుకు కులం ప్రాతిపదికన సానుభూతి తెలిపే విధానం వల్ల జరిగే నష్టాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదే అదనుగా అందరికీ ‘కమ్మ’ రంగు పులమడం సరికాదని తమ్మారెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. దివంగత ఎన్టీఆర్ కూడా టీడీపీని కేవలం ఒక సామాజికవర్గానికే పరిమితం చేయలేదని చెప్పారు. తికమక పెట్టే రాజకీయాలు..ఇబ్బందులు సృష్టించే నాయకులను ఈసారి ఎన్నికల్లో చూస్తున్నామనేది ఆయన భావన. తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్న పబ్లిక్ మూడ్ మొదలుకొని, మారుతున్న రాజకీయాలపై తమ్మారెడ్డి విస్పష్టమైన వైఖరిని వెల్లడించారు. ఆయనేమన్నారంటే....? పవన్ రాజకీయమేంటి? పవన్కల్యాణ్ రాజకీయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతోనే ఉంటానంటాడు. బీజేపీని వదిలేస్తానంటాడు. తెలంగాణకు వచ్చి బీజేపీకి మద్దతిస్తాడు. కలిసి పోటీ అంటాడు. చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాతే కదా... జనసేన, టీడీపీ పొత్తు బంధం బయటకొచ్చింది. చంద్రబాబు జైలు నుంచి రాగానే పవన్కే కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇదేంటి? చంద్రబాబు పార్టీ వాళ్లేమో తెలంగాణలో కాంగ్రెస్ జెండా మోస్తామంటున్నారు. పవన్ మాత్రం బీజేపీ గొడుక్కిందకు వెళ్తానంటున్నాడు. విచిత్రం ఏమిటంటే తెలంగాణలో తన కేడర్ ఏ పార్టీ వైపు ఉండాలనేది చంద్రబాబు చెప్పడు. టీడీపీ అయినా జనసేన అయినా అంతా తానే అని చెప్పే పవన్ ఇంకా వ్యూహం ఖరారు చేయలేదు. పవన్, చంద్రబాబు ఎవరి మాట ఎవరు వింటారో గానీ... తెలంగాణ ఎన్నికల్లో ఒకే వ్యూహంతో వెళ్లగలరా? ఈ తరహా రాజకీయాలు కొంత గందరగోళపరుస్తున్నాయి. ఇక్కడ సెటిలర్స్ హ్యాపీ.. కానీ ఇప్పుడు ఆ నిరసనలేంటి? తెలంగాణ ఏర్పడిన రోజుల్లో స్థానికేతరుల్లో కొంత టెన్షన్ ఉన్నమాట నిజం. ఇప్పుడది లేదు. అంతా కలిసిపోయి ఉంటున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత కొంతమంది మళ్లీ ఈ విభజన రేఖ తెస్తున్నారు. సెటిలర్స్ పేరుతో ముందుకొస్తున్నారు. దీన్ని ఓ సామాజికవర్గం నెత్తికెత్తుకోవడం విశేషం. సెటిలర్స్ అనేది మాసిపోయిన గాయం. కొంతమంది కోసం ఈ గాయాన్ని రేపుతున్నారు. పుండులా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సెటిలర్స్ పేరుతో చంద్రబాబు వ్యవహారంపై నిరసనలేంటి? సెటిలర్స్లో కమ్మవాళ్లే ఉన్నారా? అన్ని కులాల వాళ్లూ ఉన్నారని గుర్తించాలి. ఇది అందరి ప్రయోజనాలు దెబ్బతీస్తుందని తెలుసుకోవాలి. ‘చిత్రం’లోనూ మార్పులు రాజకీయాలపై సినిమా ప్రభావం కీలకం. రాజకీయాల నుంచే సినిమా వస్తుందా? సినిమా రాజకీయాలకు ప్రేరణ ఇస్తుందా? అనేది చెప్పలేం. కానీ ప్రజాజీవితాలకు దగ్గరగా ఉండే రాజకీయ సినిమాలను జనం ఆదరిస్తున్నారు. అంతే కాదు... కరుడుగట్టిన కాషాయం రంగుతో తీసిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. అంటే మార్పును ప్రజలు స్వాగతిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనూ అది కనిపిస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇది గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ మాత్రమే. అలా అని నిరుద్యోగమూ పూర్తిగా పోలేదు. యువత ఆలోచనకు ఇదే కారణమైంది. రైతుబంధు ఇస్తున్నామని చెప్పే నేతలు... రూ.కోట్లు ఉన్నవాడికి కూడా ఇవ్వడం న్యాయమేనా? అనేక కష్టనష్టాలకోర్చే కౌలు రైతులకు ఇవ్వకపోవడం ధర్మమేనా? సామాజిక పరిస్థితుల నుంచే ప్రజాతీర్పు వస్తుంది. ఒకటి మాత్రం నిజం. గెలిచే వాళ్ల వైపే ప్రజలు ఉంటారు. అందుకే వామపక్షాలు ఉద్యమించే చరిత్ర ఉన్నా, ఓట్లు పొందలేకపోతున్నాయి. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రజలిచ్చిన అధికారం రాచరికంగా భావించే నాయకులను ఓటు ఆ«యుధంతోనే ప్రజలు బుద్ధి చెప్పాలి. వాళ్ల కోరలు పీకి వేయాల్సిందే. అసలేంటీ వైఖరి? చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ అవినీతి ఆరోపణల కేసులో అరెస్టు అయ్యారు. దీన్ని కొంతమంది తమ సామాజికవర్గం చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు సత్య హరిశ్చంద్రుడని వాళ్ల నమ్మకం కావొచ్చు. అది కోర్టులో తేలాలి. కానీ ఆ కసి తెలంగాణ రాజకీయాలపైనా చూపించే ప్రయత్నమేంటి? ఒక సామాజికవర్గం మొత్తం గంపగుత్తగా ఓ పార్టీని సమర్థిస్తుందని ప్రచారం చేయడంలో అర్థమేంటి? టీడీపీ ఒక సామాజిక వర్గానిదేనా? అదే నిజమైతే ఎన్టీఆర్ 50 శాతం బీసీలకే టికెట్లు ఎందుకిచ్చా రు? అసలు కులం ప్రస్తావనేంటి? వాళ్లు చెప్పే కులమే అంత బలమైనది అయితే, 2014లో ఎందుకు తెలంగాణలో ఓడిపోయింది? ఇలా ప్రచారం చేయడంలో ఓ కుట్ర కనిపిస్తోంది. తెర వెనుక కీలకమైన వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చు. - వనం దుర్గాప్రసాద్ -
చిరంజీవి అలాంటి సినిమాలు చేస్తే బెటర్: స్టార్ ప్రొడ్యూసర్
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే 'భోళా శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాధారణ ప్రేక్షకులకే కాదు మెగా ఫ్యాన్స్కి కూడా ఇది నచ్చలేదు. దీంతో చిరుతో పాటు దర్శకుడు మెహర్ రమేశ్పైనా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. చిరు రీమేక్స్పై కౌంటర్స్ వేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా వ్యాపారమైంది 'అప్పట్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లకు పని తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. ఇప్పటికీ అలాంటి వాళ్లు ఉన్నప్పటికీ.. దాన్ని వ్యాపారంగా చూసేవాళ్లు ఎక్కువైపోయారు. కథ చెప్పమని అడిగితే అప్పట్లో రైటర్స్ సూటిగా సుత్తిలేకుండా చెప్పేవారు. ఇప్పుడేమో 'ఓపెన్ చేస్తే' అని ఎలివేషన్స్ ఇస్తున్నారు. రైటర్స్ డైరెక్టర్స్ కావడం దీనికి కారణమై ఉండొచ్చు. ప్రేక్షకులకు పనికొచ్చే అంశం, అది కూడా నేచురల్గా ఉండాలి. ఇది పక్కనబెట్టి ఏదో చేస్తే సినిమాలు ఆడవు.' (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) చిరు అలా చేయాలి 'ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, చిరంజీవి.. ఇలా హీరోలందరూ కెరీర్ మొదట్లో మెథడ్ యాక్టింగ్ చేసినట్లు ఉంటుంది. చిరునే తీసుకోండి. శుభలేఖ, స్వయంకృషి, రుద్రవీణ, విజేత లాంటి సినిమాలకే అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. అమిర్ 'దంగల్' లాంటి సినిమా చిరంజీవి చేసినా జనాలు చూస్తారు. భోళా శంకర్, గాడ్ ఫాదర్ లాంటివి చేసి డిసప్పాయింట్ కావడం కంటే నేచురల్ మూవీస్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం' చెప్పాలని ప్రయత్నించా 'అయితే ఇదే విషయాన్ని చిరంజీవితోనూ చెబుదామని ప్రయత్నించాను. కానీ ఎందుకో కుదరలేదు. ఒకప్పటి సినిమాల్లో చిరంజీవిని చూస్తే మన ఇంట్లో మనిషిలా కనిపించేవారు. ఇప్పుడు ఆ చిరంజీవి మళ్లీ కనిపిస్తే చూడాలని ఉంది. అలానే సినిమాలు ఆడుతాయి అనేది నా నమ్మకం' అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. ఈయనే కాదు చాలామంది అభిమానులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చిరు రాబోయే సినిమాల విషయంలో ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?) -
ఎలక్షన్స్ చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు: తమ్మారెడ్డి
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
Multiple cat checj
Check international block
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019