breaking news
-
సీఎం జగన్పై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం..
-
ఇప్పుడవి రాళ్లు విసిరే చేతులు కాదు
ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి.ఇప్పుడు జమ్ము–కశ్మీర్లో కేవలం బాలికల కోసం ఫుట్బాల్ అకాడెమీ నడుపుతున్న ప్రోఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్.ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు.యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్ ఆషిక్ ఒక ఉదాహరణ. కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిక్. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్బాల్ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది. ‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమిప్రోఫెషనల్ స్టోన్ పెల్టర్ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్బాల్ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్ ఆషిక్. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె. ముంబై వెళ్లి కశ్మీర్ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్ను తగిన ్రపోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి తొలి ప్రోఫెషనల్ ఫిమేల్ ఫుట్బాల్ ప్లేయర్ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్బాల్ నేర్చుకుని ఏం చేస్తావ్ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మాప్రాంంతం నుంచి ఫుట్బాల్లోకి రాలేదు. కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్ విమెన్స్ లీగ్లో ఆడాను. గోల్ కీపర్గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్బాల్ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మాప్రాంంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్ బాలికల కోసం యునీక్ ఫుట్బాల్ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్. మరింత గుర్తింపు నేడు జమ్ము కశ్మీర్లో మహిళా ఫుట్బాల్ పేరు చెప్తే అఫ్షాన్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్ పెల్టర్ని కాను. గోల్ కీపర్ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె. -
ప్రజాహిత యాత్రపై రాళ్లదాడి
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలో బీజేపీ జాతీయ కా ర్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బండి సంజయ్, మంత్రి పొన్నం మధ్య మాటల యుద్ధమే ఇందుకు కారణమని అంటున్నారు. మంగళవారం ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ మండలం రాములపల్లిలో కొనసాగుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బండి దిష్టి»ొమ్మను దహనం చేసేందుకు కొందరు కార్యకర్తలు యాత్రలోకి చొచ్చుకునిరాగా.. బీజేపీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఓ కార్యకర్తను బీజేపీ నాయకులు చి తకబాదారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పో లీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. పొన్నం సిద్ధమా: యాత్ర హుస్నాబాద్కు చేరుకు న్న సందర్భంగా బండి మాట్లాడుతూ.. కరీంనగర్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే రాజకీయ సన్యాసానికి పొన్నం సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యమని పొన్నం అన్న మాట నిజం కాదా అని అన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని, అక్కడే రామమందిరం ఉన్నట్లు కచ్చితంగా చెబుతామన్నారు. పొన్నంకు రాముడంటే కోపమంటూ.. అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మించే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. సంచలనం కోసమే పొన్నం యాత్రను అడ్డుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. పొన్నం తన తల్లిని అడ్డుపెట్టుకొని.. మంత్రి పొన్నం ప్రభాకర్ తన తల్లిని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. స్వర్గంలో ఉన్న పొన్నం తండ్రి ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో ఆలోచించుకోవాలన్నారు. పొన్నం తల్లి నిండు నూరేళ్లు బతకాలని కాంక్షించారు. ‘అందరు తల్లులు నా తల్లితో సమానం. ఆయన తల్లిని నేను అవమానించలేదు. వాళ్ల తల్లిని అవమానించడమంటే నా తల్లిని నేను అవమానించినట్లే’అని బండి చెప్పారు. -
రాజస్థాన్ ఎన్నికలు: ఫతేఫూర్లో రాళ్ల రాడి, భారీగా మోహరించిన పోలీసులు
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య హారా హోరీగా సాగుతున్న ఈ పోరులో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజా మధ్యాహ్నం 1 గంటల వరకు 40శాతానికి పైగా ఓటింగ్ నమోదుగా తాజా సమాచారం ప్రకారం 55.63శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు సికార్లోని బోచివాల్ భవన్, ఫతేపూర్ షెఖావతి సమీపంలో కొంతమంది రాళ్ల దాడికి దిగారు.దీంతో వారిని చెదరగొట్టేందుకు భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రాష్ట్రంలో అన్ని చోట్లా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోంది. అయితే ఫతేపూర్ షెకావతి నుంచి హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది.. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ కారణంగా ఉద్రిక్తత నెలకొంది. ఉద్రిక్తత సమయంలో జనం అదుపు తప్పి భారీగా రాళ్లు రువ్వారు. హింసాకాండతో కొంత సేపు ఓటింగ్ నిలిచిపోయింది. అయితే భద్రతా బలగాలు అప్రమత్తమై జనాన్ని అదుపు చేశారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఓటింగ్ ప్రారంభమైంది. ఇది ఇలా ఉంటే ఈసారి ట్రెండ్ రివర్స్ అవుతుందని, అధికారం తమదేనని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. భాజపా అఖండ మెజారిటీతో అధికారంలోకి రానుంది. రాజస్థాన్ ప్రజలు గత ఐదేళ్ల దుష్పరిపాలనకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఓట్లు వేస్తున్నట్లు కనిపిస్తోంది. నేరాలు, అవినీతి పాలన అంతంకోసం జనం ఓటు వేస్తున్నారుని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యానిచారు. ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులెవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైందికాదనీ కొత్త ఓటర్లు ఈ పరిణామాల్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాగా రాజస్థాన్లోని 200 నియోజకవర్గాల అసెంబ్లీలలో 199 అసెంబ్లీలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ సాయంత్రం 6 గంటలక పోలింగ్కు కొనసాగుతుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలింగ్కు సంబంధించి గట్టి భద్రత ఏర్పాటు చేశామని డీజీపీ పుమేష్మిశ్రా తెలిపారు. ఇదిబ ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు డీజీపి పిలుపునిచ్చారు. #WATCH | Rajasthan Assembly elections: Stone pelting reported near Bochiwal Bhawan, Fatehpur Shekhawati in Sikar. Heavy Police deployed. pic.twitter.com/AAXLlkp5pn — ANI (@ANI) November 25, 2023 -
బీఆర్ఎస్, కాంగ్రెస్ రాళ్లదాడి.. నారాయణపేటలో ఉద్రిక్తత
నారాయణపేట: నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జఖాన్ పేట గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. ఐదుగురు టీఆర్ఎస్ నాయకులు, ఇద్దరు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులు కోస్గీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు అడ్డు తగిలారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. మొదట వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ వాహనాలపై రాళ్లురువ్వడంతో ఘర్షణ ప్రారంభమైంది. రెండు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. అయితే దాడిపై పోలీసులు చర్య తీసుకోవాలంటూ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కోస్గి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ పరిణామాల అనంతరం శినాజీ చౌరస్తాలో ఇరువర్గాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. పరిస్థితి మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘర్షణల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికి కేసీఆర్ పోటీ.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019