breaking news
-
'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం'.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో బన్నీ మేనరిజం అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు మన ఐకాన్ స్టార్. దుబాయ్లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్లో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఈ విషయంపై ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు.. నా మొదటి చిత్రం గంగోత్రి 2003లో ఈ రోజే విడుదలైంది. ఇదే రోజు నా మైనపు విగ్రహాన్ని దుబాయ్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభిస్తున్నా. నా 21 సంవత్సరాల సినీ కెరీర్ ఒక మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను. ముఖ్యంగా నా అభిమానుల (ఆర్మీ) అమితమైన ప్రేమ, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే సంవత్సరాల్లో మీ అందరూ మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నా.' అని పోస్ట్ చేశారు. It’s a very spl day today 🖤 . My 1st movie #Gangotri was released today in 2003 & today I am launching my Wax statue at #madametussauds dubai . It’s been an unforgettable journey of 21 years . I am grateful to each and every one of you in this journey & special thanks to my Fans… pic.twitter.com/kWRQemlwgi — Allu Arjun (@alluarjun) March 28, 2024 -
ఐకాన్ స్టార్ అరుదైన ఘనత.. ఆ రోజే ముహుర్తం ఫిక్స్!
పుష్ప సినిమాతో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్తో బిజీ ఉన్నారు. అయితే బన్నీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన అల్లు అర్జున్ కొలతలను గతేడాది అక్టోబర్లోనే సేకరించారు. దీంతో తమ అభిమాన హీరో విగ్రహం ప్రారంభోత్సవం కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అభిమానుల నిరీక్షణకు తెరదించారు. బన్నీ మైనపు విగ్రహం ప్రారంభోత్సవానికి తేదీని నిర్ణయించారు. మార్చి 28న అల్లు అర్జున్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లనున్నారు. మార్చి 28న రాత్రి 8 గంటలకు ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ విషయాన్ని దుబాయ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో బన్నీ విగ్రహం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. View this post on Instagram A post shared by Madame Tussauds Dubai (@tussaudsdubai) -
పార్కింగ్ స్థలంలో 1800 ఏళ్ల నాటి పురాతన విగ్రహం!
కొన్ని పురాతన వస్తువులు చాలా విచిత్రంగా బయటపడతాయి. పురావస్తు శాస్త్రవేత్తలకు చిక్కని కొన్ని మిస్టీరియస వస్తువులు సాధారన కూలీలకు లేదా భవన నిర్మాణ కార్మికులకు కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పాపం వారు అదేదో సాధారణ వస్తువుగా పరిగణిస్తారు. అదికారులకు చెంతకు చేరే వరకు అదేంటన్నది తెలియదు. అలాంటి విచిత్ర ఘటన యూకేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఇంగ్లండ్లోని లింకన్ షైర్ కౌంటీలో ఉన్న 16వ శతాబ్దపు పురాతన భవనం బర్గ్లీ హౌస్ పార్కింగ్ స్థలంలో నిర్మాణ పనులు చేస్తుండగా పాలారాతి శిల్పం కనిపించింది. అదేదో రాయిగా భావించానని గ్రెగ్ క్రాలే అనే కార్మికుడు చెబుతున్నాడు. దాన్ని ఒక బకెట్లో పెడుతుండగా తిరగబడటంతో అది విగ్రహం తల అని అర్థమయ్యింది. దాన్ని అధికారుల వద్దకు తీసుకెళ్లి చూపగా అది పురాతన రోమన్ విగ్రహమని చెప్పడంతో ఒక్కసారిగా షాక్కి గురయ్యానని అన్నాడు క్రాలే. చాలా ప్రత్యేకమైనది, పురాతనమైనదని తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు క్రాలే. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ విగ్రహం మెండెం భాగం కూడా లభించింది. ఆ తర్వాత తలను, మెండెంను దగ్గరకు చేర్చి అసలు రూపంలోకి మార్చారు నిపుణులు. ఇది మొదటి లేదా రెండో శతాబ్దానికి చెందిన పురాతన విగ్రహ అవశేషాలుగా చెబుతున్నారు. ఈ విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్ధే ప్రక్రియలో నిమగ్నమయ్యారు అధికారులు. ఇలాంటి పురాతన ప్రతిమలను ఇటలీలో గ్రాండ్ టూర్ అని పిలిచే కులీనులే తయారు చేస్తారని, ఆ ప్రతిమ చెక్కిన తీరులో అది కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు దీన్ని 9వ ఎర్ల్ తన గ్రాండ్ టూర్ ఆఫ్ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఈ శిల్పాన్ని బర్గ్లీకి తీసుకువచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: వందేళ్ల క్రితం కరెంట్ లేకుండా పనిచేసిన ఫ్రిడ్జ్) -
విగ్రహంపైనా టీడీపీ విష రాజకీయం
సాక్షి ప్రతినిధి, కడప: కాదేదీ దుష్ప్రచారానికి అనర్హం అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతిష్ట దెబ్బతీసేలా వారి వైఖరి ఉంది. వాస్తవాలతో నిమిత్తం లేకుండా దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ జిల్లా పులివెందుల కేంద్రంగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సైతం రాజకీయ లబ్దికోసం వాడుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. పులివెందుల మోడల్ టౌన్లో భాగంగా వివిధ సర్కిల్స్లో జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుకు పాడా (పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జాతిపిత మహాత్మాగాం«దీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను తెలంగాణ నుంచి తీసుకువచ్చారు. ఇవి శుక్రవారం సాయంత్రానికి పులివెందుల చేరుకున్నాయి. పాత బస్టాండు సమీపంలో డాక్టర్ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటుకు పిల్లర్ సిద్ధం చేశారు. అక్కడే విగ్రహాలు క్రేన్ సహాయంతో లారీ నుంచి దించారు. వైఎస్సార్ విగ్రహాన్ని పిల్లర్పైన పెట్టారు. అలాగే జాతిపిత విగ్రహం ఆవిష్కరణకు కోర్టు సర్కిల్ వద్ద ఏర్పాట్లు చేశారు. గరండల్ బ్రిడ్జి సమీపంలో సుందరీకరణతోపాటు అక్కడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచారు. ఇంకా పిల్లర్, సుందరీకరణ పూర్తికాకపోవడంతో కాంట్రాక్టర్ నిరంజన్రెడ్డి ఇంట్లో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని భద్రపర్చారు. అంతలోనే క్రేన్ నుంచి కిందికి దించిన విగ్రహాన్ని ఫొటో తీసి టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో అంబేడ్కర్ విగ్రహాన్ని వైఎస్సార్ విగ్రహం కింద ఉంచారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు మోడల్ టౌన్లో భాగంగా సుందరీకరణ పనులు, జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుకు పాడా కృషి చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు పనులు కొనసాగుతున్నాయి. అంతలోనే రాజకీయ స్వలాభం కోసం సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రతిష్టను దెబ్బతీసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పిల్లర్ లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమేనా అని ప్రశి్నస్తున్నారు. క్రేన్ సహాయంతో వాహనం నుంచి దించి ఉన్న విగ్రహాన్ని ఫొటో తీసి ప్రచారం చేయడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు. అంబేడ్కర్ను కించపరిచే విధంగా అవాస్తవాలు ప్రచారం చేసిన టీడీపీ శ్రేణులు భారత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత సుందరంగా అంబేడ్కర్ విగ్రహం పులివెందుల మోడల్ టౌన్లో భాగంగా సుందరంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసినట్లు కౌన్సిలర్ పార్నపల్లె కిశోర్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం పులివెందులలో మాటా్లడుతూ స్థానిక గరండాల్ బ్రిడ్జి దగ్గర విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్, పార్టీ పట్టణ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి స్థానిక ఎస్సీ, బీసీ నాయకులతో కలిసి స్థల పరిశీలించారని తెలిపారు. అందులో భాగంగా శిల్ప కళాకారుడితో ప్రత్యేకంగా కళాత్మకంగా రూపొందించిన అంబేడ్కర్ విగ్రహం కూడా పులివెందులకు చేరుకుందన్నారు. టీడీపీ నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. -
TS: గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమ గొంతుక.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో విగ్రహ ఏర్పాటు కోసం జాగా కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేసింది. దానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథార్టీ(HMDA) ఆమోదించింది. ఈ క్రమంలోనే అవసరమైన స్థలాన్ని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. విగ్రహ ఏర్పాటు కావల్సిన స్థలం హెచ్ఎండీఏ పరిధిలోకి రావటంతో అనుమతులకు కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించటం పట్ల గద్దర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019