breaking news
-
Apoorva Srinivasan Wedding: సైలెంట్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ (ఫోటోలు)
-
రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు
రెక్కల పురుగులన్నీ సీతాకోక చిలుకలు కావు.కాని సీతాకోకచిలుకలన్నీ రెక్కల పురుగులే.హిమాలయప్రాంతాలకు చెందిన మాత్ (రెక్కల పురుగు)లపై తీసిన ‘నాక్టర్న్స్’ డాక్యుమెంటరీ అమెరికాలో జరిగిన ‘సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ పొందింది. ఇండియా నుంచి అవార్డ్ గెలిచిన డాక్యుమెంటరీ ఇదొక్కటే. డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ పరిచయం. అమెరికాలో ప్రతి ఏటా జరిగే సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నామినేషన్ పొందడమే పెద్ద గుర్తింపుగా భావిస్తారు. అవార్డు రావడం ఇంకా పెద్ద గౌరవం. ఈ సంవత్సరం ఉటాలో జనవరి 18–28 తేదీల మధ్య జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మన దేశం నుంచి ‘వరల్డ్ డాక్యుమెంటరీ కాంపిటీషన్’లో ‘నాక్టర్న్స్’లో చోటు సంపాదించడమే కాకుండా ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ క్రాఫ్ట్’ అవార్డు పొందింది. అనిర్ బన్దత్తాతో కలిసి అనుపమా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ రెక్కల పురుగుల లోకంలో ప్రేక్షకులను విహరింపచేస్తుంది. ఢిల్లీ కృత్రిమత్వం నుంచి ‘నేను, అనిర్ బన్ దత్త ఢిల్లీలో జీవిస్తుంటాము. రోజూ ఒకే రకమైన ట్రాఫిక్, ΄÷ల్యూషన్. ప్రకృతితో మాకు ఏమీ సంబంధం లేదనిపించేది. ఆ సమయంలో మాకు మాన్సీ అనే పర్యావరణ శాస్త్రవేత్త పరిచయం అయ్యింది. హిమాలయాలలో ‘మాత్స్’ (రెక్కల పురుగులు) మీద పరిశోధన చేస్తున్నానని చెప్పింది. వాతావరణ మార్పుల వల్ల వీటికి కలుగుతున్న నష్టం ఏమిటో ఆమె తెలుసుకుంటోంది. ఇది డాక్యుమెంటరీ చేయాల్సిన విషయం అనుకున్నాం. గత కొన్నేళ్లుగా నేను, అనిర్బన్ డాక్యుమెంటరీలు తీస్తున్నాం. మెయిన్స్ట్రీమ్ పట్టించుకోని విషయాలను మేం పట్టించుకుంటాం. దీనికి ముందు మేము ఇండో–మయన్మార్ సరిహద్దులోని తోరా అనే పల్లెకు (మణిపూర్లో ఉంది) కరెంటు రావడం గురించి డాక్యుమెంటరీ తీశాం. దాని పేరు ‘ఫ్లికరింగ్ లైట్స్’. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా కరెంటు లేని పల్లె ఉండటం, దానికి కరెంటు కోసం కొందరు ఎదురు చూడటం, దేశంలోనే ఉన్నా పరాయీకరణ భావన ఎదుర్కొనడం దీనిలో చూపించాం. ఈ డాక్యుమెంటరీకి ఆమ్స్టర్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు దక్కింది. ఇప్పుడు మాత్స్ గురించి తీసిన ‘నాక్టర్న్స్’కు కూడా సండాన్స్ ఫెస్టివల్లో అవార్డ్ వచ్చింది. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది అనుపమా శ్రీనివాసన్. కష్టనష్టాలకు ఓర్చి ‘నాక్టర్న్స్ డాక్యుమెంటరీలో రెండే పాత్రలుంటాయి. ఒకటి పర్యావరణ శాస్త్రవేత్త మాన్సీ, రెండు హిమాలయాల స్థానిక బగున్ తెగకు చెందిన బికి అనే గిరిజనుడు. అతని సాయంతో ఆమె రెక్కల పురుగులను అన్వేషణ చేస్తుంటే మేం రికార్డు చేస్తూ వెళ్లాం. సాయంత్రం అయ్యాక మాన్సీ పలచటి తెర కట్టి దాని వెనుక నీలం రంగు బల్బు వెలిగించేది. ఆ తర్వాత కాసేపటికే వేలాది రెక్కల పురుగులు వచ్చి ఆ స్క్రీన్ మీద వాలేవి. వాటి రంగులు, రూపాలు, ఆకారాలు అన్నీ అద్భుతం. అవి తాము మనిషితో కలిసి జీవిస్తున్నామన్నట్టు ఉన్నాయి. మనమే వాటితో కలిసి జీవిస్తున్నాం అన్న ఎరుకలో లేము’ అంటుంది అనుపమా శ్రీనివాసన్. ‘హిమాలయాల్లో షూటింగ్... అదీ అడవుల్లో అంటే చాలా శ్రమ. అక్కడంతా తేమగా ఉంటుంది. ఏ క్షణమైనా వాన పడొచ్చు. అంతేగాక రాత్రి వేళల్లో విపరీతమైన చలి. జలగలు పట్టి పీక్కుతినాలని చూసేవి. కాని ఇన్ని సమస్యల మధ్య ఆ రెక్కల పురుగుల జీవనం, వాటి కదలికలు ఎంతో ఆసక్తి కలిగించేవి. మా డాక్యుమెంటరీకి అవార్డు రావడానికి కారణం మేము ప్రకృతి ధ్వనులను పరిపూర్ణంగా రికార్డు చేశాం. ఆ ధ్వనుల వల్ల అడవిలో ఉంటూ మాత్స్ను చూస్తున్న అనుభూతి కలుగుతుంది’ అంది అనుపమా శ్రీనివాసన్. -
ABC: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఛైర్మన్గా శ్రీనివాసన్ స్వామి
న్యూస్ పేపర్ల సర్క్యులేషన్ను ప్రకటించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్, ABCకి కొత్త కార్యవర్గం ఎన్నికయింది. 2023-24 ఏడాదికి గాను ABC ఛైర్మన్గా శ్రీనివాసన్ K.స్వామి ఎన్నికయ్యారు. శ్రీనివాసన్ ఎన్నికకు సంబంధించి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఒక అధికారిక ప్రకటన చేసింది. శ్రీనివాసన్ ప్రస్తుతం RK స్వామి హన్స గ్రూప్కు ఛైర్మన్గా ఉన్నారు. పత్రికా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీనివాసన్.. వివిధ హోదాల్లో ఎన్నో సేవలందించారు. గతంలో ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసొసియేషన్కు ఛైర్మన్గా, అలాగే ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసొసియేషన్ ఛైర్మన్గా పని చేశారు. మద్రాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అసొసియేషన్లోనూ ఆయన సేవలందించారు. అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసొసియేషన్ ఆఫ్ ఇండియా తరపున లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును గతంలో అందుకున్నారు శ్రీనివాసన్. చదవండి: మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశ 2023-24కు గాను ఎన్నికయిన కార్యవర్గం వివరాలు ► డిప్యూటీ ఛైర్మన్ - రియాద్ మాథ్యూ (చీఫ్ అసొసియేట్ ఎడిటర్, మలయాళ మనోరమా) ►గౌరవ కార్యదర్శి - మోహిత్ జైన్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బెన్నెట్ కోలెమన్) ►ట్రెజరర్ - విక్రమ్ సకుజా(గ్రూప్ సీఈవో, మాడిసన్ కమ్యూనికేషన్స్) ABCలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రతినిధులు ►శ్రీనివాసన్ స్వామి, ఛైర్మన్ ►విక్రమ్ సకుజా, ట్రెజరర్ ►ప్రశాంత్ కుమార్, సభ్యులు ►వైశాలి వర్మ, సభ్యులు పబ్లిషర్స్ ప్రతినిధులుగా ►రియాద్ మాథ్యూ, డిప్యూటీ ఛైర్మన్ ►ప్రతాప్ జి.పవార్, సకల్ పేపర్స్ ►శైలేష్ గుప్తా, జాగరన్ ప్రకాషణ్ ►ప్రవీణ్ సోమేశ్వర్, HT మీడియా ►మోహిత్ జైన్, బెన్నెట్ కోలెమన్ ►ధృబ ముఖర్జీ, ABP ►కరణ్ దర్దా, లోక్మత్ ►గిరీష్ అగర్వాల్, DB ఎన్నికయ్యారు కరుణేష్ బజాజ్, ITC, అనిరుద్ధ హల్దార్, శశాంక్ శ్రీవాస్తవ, మారుతీ సుజుకి కార్పోరేట్ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. -
‘పుడమి సాక్షిగా’ క్యాంపెయిన్కు ప్రతిష్టాత్మక ఏఎఫ్ఏఏ అవార్డు
సాక్షి, హైదరాబాద్: పుడమి సంరక్షణ కోసం సాక్షి మీడియా గ్రూప్ చేస్తోన్న ‘పుడమి సాక్షిగా’క్యాంపెయిన్కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ ఆఫ్ ఏషియా (ఏఐఏ) ఆధ్వర్యంలోని ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఏఎఫ్ఏఏ).. పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ‘కార్పొరేట్ సోషల్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్’సిల్వర్ అవార్డుతో సత్కరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఏఎఫ్ఏఏ చైర్మన్ శ్రీనివాసన్ స్వామి, ఏఐఏ ప్రెసిడెంట్ అవినాష్ పాండే, ఆలివ్ క్రౌన్ చైర్మన్ జనక్ సర్థా ఈ అవార్డును అందజేశారు. పుడమి‘సాక్షి’గా లక్ష్యాలివే.. ప్రతీ ఏటా జనవరి 26న మెగా టాకథాన్గా వస్తోన్న పుడమి సాక్షిగా కార్యక్రమం 2020–21లో ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పర్యావరణాన్ని కాపాడడం, కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛమైన పుడమిని భవిష్యత్ తరాలకు అందించడం.. పుడమి సాక్షిగా లక్ష్యాలు. ప్రాణకోటికి జీవనాధారమైన ధరిత్రి ప్రమాదంలో పడడానికి మనుషులే ప్రధాన కారణం. ఈ భూమి మళ్లీ పునర్వవైభవం దక్కించుకోవాలంటే.. ప్రతి ఒక్కరూ చేయాల్సిన కృషిని పుడమి సాక్షిగా గుర్తు చేస్తోంది. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో పుడమి కార్యక్రమాలు చేపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు ఇందులో ప్రజలను భాగస్వామ్యులను చేస్తోంది. దీంతోపాటు గణతంత్ర దినోత్సవం రోజున సాక్షి టీవీలో దాదాపు 10 గంటలపాటు మెగా టాకథాన్ రూపంలో ప్రసారం చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న పెద్దలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ సమాజానికి స్పూర్తి కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్త సమాచారం, స్టోరీలు, వీడియోలు https://www.pudamisakshiga.com/ వెబ్ సైట్లో చూడవచ్చు. -
నేను చనిపోయేలోపు మోహన్లాల్ బండారం బయటపెడతా: నటుడు
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్పై సంచలన వ్యాఖ్యలు చేశాడు సీనియర్ నటుడు శ్రీనివాసన్. దివంగత నటుడు ప్రేమ్ నజీర్ డైరెక్ట్ చేయాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాను మోహన్లాల్ తిరస్కరించాడని, కానీ మీడియా ముందు మాత్రం మాట మార్చాడని ఆరోపణలు గుప్పించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీనివాసన్ మాట్లాడుతూ.. 'ప్రేమ్ నజీర్కు మోహన్లాల్తో ఓ సినిమా తీయాలని ఎంతో కోరికగా ఉండేది. కడతనందన్ అంబాడీ సినిమా సెట్లో ప్రేమ్ నాకు ఈ విషయం చెప్పాడు. మరింకే, మోహన్లాల్కు సూటయ్యేలా మంచి కథ రాసుకోమని సూచించాను. దీంతో ఓ కథ సిద్ధం చేసుకుని మోహన్లాల్కు వినిపిస్తే అతడు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. తర్వాత నేను ఓసారి నడరాజన్ అనే మధ్యవర్తి ద్వారా కథ వినిపిస్తే ఏకంగా అతడిని తిట్టాడు కూడా! అదే కథ 'సందేశం'గా రిలీజైంది. నిజానికి ఈ సినిమా కోసం ప్రేమ్.. మోహన్లాల్కు ముందుగానే అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అప్పుడు ఆయన ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికే ప్రేమ్ కన్నుమూశాడు. అతడు చనిపోయినప్పుడు మాత్రం మోహన్లాల్.. ప్రేమ్ సినిమాలో నటించాలనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది అని కపట మాటలు మాట్లాడాడు. నేను చచ్చేలోపు కచ్చితంగా అతడి నిజస్వరూపాన్ని మొత్తం బయటపెడతా' అని పేర్కొన్నాడు. శ్రీనివాసన్ వ్యాఖ్యలపై ప్రేమ్ నజీర్ తనయుడు షానవాజ్ స్పందిస్తూ.. 'నాన్నగారు మోహన్లాల్తో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే! మోహన్లాల్ ఎప్పుడూ ప్రియదర్శన్ను వెంటేసుకుని స్క్రిప్ట్ డిస్కషన్స్కు వస్తుండేవారు. మరి ఆ కథ ఎందుకు పట్టాలెక్కలేదనేది ఎవరికీ తెలియదు. కానీ ఓ విషయం మాత్రం చెప్పగలను.. శ్రీనివాసన్ చెప్పాడంటే కచ్చితంగా అందులో నిజం ఉండే ఉంటుంది. ఆయన మాటలను నమ్మకుండా ఉండలేం' అని చెప్పుకొచ్చాడు. నటుడు ప్రేమ్ నజీర్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019