breaking news
-
Kitchen Tips: ఈ చిన్న చిన్న పదార్థాలతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి!
కిచెన్లో.. వంటచేసేటప్పుడు చిన్న చిన్న వస్తువులతో విసిగిపొతూంటాం. కొన్నిరకాల తిను బండారాలను కాపాడలేక, మరికొన్ని వస్తువులను ఎక్కువకాలం నిల్వచేయలేక ఇబ్బంది పడుతూంటాం. అలాగే కొన్ని పదార్థాలనుంచి వెలువడే చెడు వాసనతో కూడా తలనొప్పిగా భావస్తాం. మరి వీటినుంచి బయటపడాలంటే ఈ కిచెన్టిప్స్ ఓసారి ట్రై చేయండి.. కుల్చానుకాల్చేటప్పుడు.. పాన్ మీద కుల్చాను వేసి చుట్టుపక్కల కొద్దిగా నీళ్లు చల్లి మూతపెట్టాలి. ఒక వైపు కాలాక మరో వైపు తిప్పి చుట్టుపక్కల కొద్దిగా నీళ్లు చల్లి మూతపెడితే కుల్చా చక్కగా కాలుతుంది. చివరగా నూనె లేదా నెయ్యి చల్లుకుని సర్వ్ చేసుకుంటే కుల్చా చక్కగా కాలి రుచిగా వస్తుంది. ఉల్లిపాయ తరిగాక.. ఉల్లిపాయను ముక్కలుగా తరిగాక చేతులు ఉల్లివాసన వస్తుంటాయి. ఇలాంటప్పుడు బంగాళ దుంప ముక్కతో చేతులను ఐదు నిమిషాలు రుద్ది, తరువాత నీటితో కడిగితే ఉల్లివాసన వదులుతుంది. ఇవి చదవండి: సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా! -
'మనకు మరో జన్మంటూ ఉంటుందా..???' ఆత్మహత్య సరికాదు! ఓ క్షణం ఆలోచించు!!
నిర్మల్: పుట్టిన ప్రతి మనిషికి జీవితంలో ఎదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. సమస్య ఎంత పెద్దదైనప్పటికీ దానికి పరిష్కారం ఉంటుంది. అయితే ఆ సమస్యను స్వీకరించే తీరు, దాన్ని పరిష్కరించుకునే విధానమే కీలకం. తమకు ఎదురైన సమస్యను తెలుసుకుని దానిని అధిగమించే మార్గాలను వెతుకుంటే సమస్య కన్న పరిష్కార మార్గాలే ఎక్కువగా కన్పిస్తాయి. తమకున్న సమస్యనే పెద్దదిగా భావించి విచక్షణ కొల్పోయి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎదురైన సమస్యతో బాధపడకుండా మన అనుకునేవారికి చెప్పుకుంటే సగం పరిష్కారం అప్పుడే లభిస్తోంది. పిల్లల భవిష్యత్తు ఏమిటని ఆలోచన చేయకుండా ఆత్మహత్యకు పాల్పడి పిల్లలను వీధి పాలు చేస్తున్నారు. పిల్లలు తెలిసి, తెలియని వయస్సులోనే ఆత్మహత్యకు ఒడిగట్టి తల్లిదండ్రులకు తీరని దుఖాన్ని మిగుల్చుతున్నారు. ► ‘భీంపూర్ మండలంలోని అందర్బంద్ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే అనురాగ్ (13) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువుకోవాల్సిన వయస్సులో బడి మానేసి ఇంటి వద్ద ఉండడంతో బుద్దిగా బడికి వెళ్లి చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించారనే కారణంతో తన నూరేళ్ల జీవితానికి ముగింపు పలికి తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చాడు.’ ► ‘ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న తాంసి మండలం పాలోది గ్రామానికి చెందిన అడెపు శృతి(17) మొహర్రం సెలవులకు ఇంటికి వచ్చింది. తనతో చనువుగా ఉంటున్న గ్రామంలోని యువకుడి ఇంటికి వెళ్లిన విషయం తండ్రికి తెలిసి తనను మందలిస్తాడనే భయంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంది.' ► ‘జైనథ్ మండలం మేడిగూడ గ్రామానికి చెందిన డౌరే రవీందర్ అనే కౌలు రైతు తనకున్న మూడెకరాలతో పాటు మరో 14ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి పంట సాగుచేశాడు. వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడం, పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కన్పించకపోవడంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడం ఆయన భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డునపడ్డారు. భార్య స్వప్న కూలీ పనిచేస్తు పిల్లలను పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.' ► 'బోథ్ మండలం ధన్నూర్ గ్రామానికి చెందిన పాముల సంతోష్ ఆటో నడుపు తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆ టోను ఫైనాన్స్పై తీసుకున్నాడు. గీరాకి ఆశించనంతగా రాకపోవడం, కుటుంబ పోషణ భారమవుతుందనే కారణంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు ఆధారాన్ని కొల్పోయి దిక్కులేని వారిగా నానా అవస్థల నడుమ కాలం వెల్ల దీయాల్సి వస్తోంది.' బతికే మార్గం చూడాలి.. చేతినిండా పనిదొరక్క, ఉపాధి అవకాశాలు లేక కుటుంబ భారాన్ని మోయలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. పంటలు సరిగ్గా పండక, గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడం ద్వారా వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆత్మహత్యలను అరికట్టేలా చర్యలు చేపట్టాలి. – సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం.. ఆత్మహత్యలు చేసుకోకుండా ఎస్సైలు తమ పరిధిలో రెగ్యులర్గా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి ఆత్మహత్యలు చేసుకోకుండా వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆత్మహత్యలనేవి సమస్యకు ఏ మాత్రం పరిష్కారం కావు. సమస్యలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా విచక్షణతో ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. – డి.ఉదయ్కుమార్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలు.. మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి. డిప్రెన్సన్లో ఉన్న వ్యక్తి నడవడిలో మార్పు వస్తుంది. గమనించి వైద్యుల వద్ద చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తే వారిని ఆత్మహత్యలకు పాల్పడకుండా కాపాడవచ్చు. మానసిక సంఘర్షణకు గురై, సహనం లేనటువంటి వారు క్షణికావేశాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ చేస్తే వారు ప్రాణాలు తీసుకోకుండా చూడవచ్చు. – డాక్టర్ ఓంప్రకాశ్, రిమ్స్ మానసిక వైద్య నిపుణులు ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఐటీ పోర్టల్ సమస్యల పరిష్కారంలో పురోగమనం
న్యూఢిల్లీ: కొత్త ఐటీఆర్ పోర్టల్లో పలు సాంకేతిక సమస్యలు క్రమంగా పరిష్కారమవుతున్నాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. 2020–21 ఏడాదికి సంబంధించి ఇప్పటిదాకా 1.19 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్లు వివరించింది. సెపె్టంబర్ 7 వరకూ 8.83 కోట్ల మంది విశిష్ట ట్యాక్స్పేయర్లు పోర్టల్లో లాగిన్ అయ్యారని, సెప్టెంబర్లో రోజువారీ సగటు లాగిన్ల సంఖ్య 15.55 లక్షలుగా ఉంటోందని పేర్కొంది. కొత్త ఐటీ పోర్టల్ జూన్ 7న అందుబాటులోకి వచి్చనప్పట్నుంచి సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్న సంగతి తెలిసిందే. -
కోర్టు పక్షులు
పక్కనున్న కేసుల చిట్టా చూస్తే చాలు.. అధికార యంత్రాంగం విధి నిర్వహణలో ఎక్కువ సమయం వీటి విచారణలకే కేటాయించాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వేల సంఖ్యలో పెండింగులో ఉంటున్న కేసులు.. అధికారులను.. ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగాన్ని కోర్టు పక్షులుగా మార్చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్ నెలలో కనీసం రెండుమూడు రోజులు ఏదో ఒక కేసులో కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది. జేసీ, ఆర్డీవో స్థాయి అధికారులదీ అదే పరిస్థితి. భూసేకరణ వంటి విభాగాల అధికారులైతే వారంలో మూడు నాలుగు రోజులు కోర్టు కేసుల్లోనే మునిగిపోవాల్సి వస్తోంది. ఫలితంగా రెవెన్యూ శాఖలో రోజువారీ వ్యవహారాలు పెండింగులో పడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖ జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదవుతుంటే.. వాటి పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కూడా కేసులను పెండింగులో పడేస్తూ.. కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో మరెక్కడా లేనన్ని కోర్టు కేసులు ఒక్క విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. దాదాపు ఈ కేసులన్నీ భూ సేకరణ, భూ వివాదాలకు సంబంధించినవే. సుప్రీంకోర్టు మొదలుకొని హైకోర్టు, జిల్లా కోర్టు.. ఇతర కింది కోర్టుల్లోనూ వేల సంఖ్యలో కేసులు విచారణలో ఉన్నాయి. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే విశాఖ కలెక్టర్ నెలలో కనీసం ఒకటి రెండు రోజులు వీటి విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ, హైదరాబాద్లకు వెళ్లాల్సి వస్తోంది. ఆయనే కాదు..జేసీ, ఆర్డీవోలు, తహసీల్దార్లు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత నాలుగేళ్లలోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అలసత్వమే కారణం జిల్లాలో నమోదవుతున్న వాటిలో రెవెన్యూ, ఇనాం, వక్ఫ్, దేవాదాయ భూముల ఆక్రమణల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. అధికారుల అలసత్వం వీటి పరిష్కారంలో జాప్యాని కి.. ఎక్కువ రోజులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి దారితీస్తోంది. సకాలంలో కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో కింది కోర్టుల్లో పరిష్కరించుకోదగిన కేసుల్లో సైతం పై కోర్టుల ను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని కేసుల్లో అధికారుల వ్యవహరిస్తున్న తీరు ప్రత్యర్థులకు వరంగా మారుతోంది. దసపల్లా హిల్స్తో పాటు కొన్ని కీలకమైన భూ వివాదాల్లో ప్రైవేటు పార్టీలకు అనుకూలం గా తీర్పులొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సివిల్ వివాదాలకు సంబంధించి.. సుప్రీంకోర్టులో నాలుగు, హైకోర్టులో 963, లోయర్, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో 302, అప్పీల్స్ మరో ఐదు కలిసి మొత్తం 1274 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఉన్న నాలుగు కేసుల్లో కూడా కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంది. హైకోర్టు లో ఉన్న 963 కేసులకు సంబంధిం చి 312 కేసుల్లో కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంది. సివిల్ వివాదాలకు సంబంధించి జిల్లా, కింద కోర్టుల్లో 302 రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉంటే.. వాటిలో 67 కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంది. ఐదు కేసుల్లో మాత్రమే అప్పీల్కు వెళ్లగా వాటన్నింటికీ కౌంటర్స్ ఫైల్ చేయాల్సి ఉంది. ఆన్లైన్ లీగల్ కేసెస్ మానిటరింగ్ సిస్టమ్(ఓఎల్సీఎంఎస్)కింద హైకోర్టులో 1585 కేసులు, కింద కోర్టుల్లో 96 కేసులు ఫైల్ కాగా.. ఇప్పటి వరకు హైకోర్టులో 656 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. రెవెన్యూ కోర్టుల్లో 560 కేసులు ఫైల్ కాగా.. 245 పరిష్కారమయ్యాయి. మరో 315 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇనాం కేసులు ఆర్డీవో కోర్టుల్లో 42, సీసీఎల్ఏ కోర్టులో 11 పెండింగ్లో ఉన్నాయి. గత 4 ఏళ్లలోనే అధికం కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు రాష్ట్రంలో మరెక్కడా లేనంతగా విశాఖ జిల్లాలోనే ఎక్కువ కేసులు పెండింగ్లో ఉండగా.. వీటిలో అధిక శాతం కేసులు గత నాలుగేళ్లలో దాఖలైనవే కావడం గమనార్హం. భూసేకరణ వివాదాల కేసులు చాలా తక్కువగా ఉండగా.. ఎక్కువ శాతం ప్రభుత్వ, ప్రైవేటు భూ వివాదాలే. ఆక్రమణదారులకు కొమ్ముకాయడం..భూ కబ్జాలను ప్రోత్సహించడం వల్లే అధికారులను పార్టీలుగా చేస్తూ బాధితులు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి ఈ కేసులు కోర్టుల్లో నలుగుతుండడంతో దానికి బాధ్యులైన వారు ఎక్కడున్నా సరే కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోంది. కోర్టుల చుట్టూ తిరిగే విభాగాల్లో మొదటి స్థానంలో రెవెన్యూ యంత్రాంగం ఉండగా..ఆ తర్వాత దేవాదాయ ధర్మదాయ శాఖ, అటవీ తదితర శాఖల అధికారులుంటున్నారు. ఈ ప్రభావం పాలనపై పడుతోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
స్మార్ట్ ఫోన్ ఉంటేనే ‘నివేదన’
మల్దకల్ : నివేదన, స్పందన యాప్లకు అందరు స్మార్ట్ఫోన్ తప్పనిసరిగా ఉపయోగించాలని ఎంపీడీఓ గోవిందరావు వివిధ శాఖల అధికారులకు సూచించారు. బుధవారం మండల పరిషత్ సమావేశ హాల్లో అంగన్వాడీ, పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్శాఖ, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులకు నివేదన, స్పందన యాప్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలెక్టర్ రజత్కుమార్షైనీ ఇటీవలే ప్రారంభించిన నివేదన, స్పందన యాప్లను అందరు తమ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ప్రజలు పంపిన ఫిర్యాదులకు సమాధానాలు వారం రోజుల్లో పంపించాల్సి ఉంటుందని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. స్మార్ట్ఫోన్లు లేవనే సాకుతో ఫిర్యాదులకు స్పందించని అధికారులపై కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు. సూపరింటెండెంట్ రాజారమేష్, జూనియర్ అసిస్టెంట్ సూర్యప్రకాష్రెడ్డి, వివిధ శాఖల అధికారులు మల్లేశ్వర్రావు, శ్రీలత, జ్యోతి, మాణిక్యరాజ్, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019