breaking news
Ad - Sakshi_Home_Sticky
-
బీసీలకు కూటమి వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘బీసీలు మా పార్టీకి బ్యాక్ బోన్’ అంటూ వెనుకబడిన తరగతుల వారికి దశాబ్దాలుగా చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తూనే ఉన్నారు. బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇందుకు విజయనగరం లోక్సభ నియోజకవర్గమే ప్రత్యక్ష నిదర్శనం. తమకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో కొప్పుల వెలమలు కూటమిపై కత్తులు నూరుతున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని ప్రెస్మీట్లు పెట్టిమరీ హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో బీసీ సామాజిక వర్గాలదే అగ్రభాగం. వాటిలో తూర్పుకాపు, కొప్పుల వెలమ సామాజికవర్గాలు అత్యంత ప్రధానమైనవి. కానీ చంద్రబాబు అత్యంత స్పల్ప సంఖ్యలో ఉన్న పెత్తందారులకే పెత్తనం ఇస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు నాలుగూ రిజర్వ్డ్ నియోజకవర్గాలే అయినప్పటికీ అక్కడ బీసీ సామాజిక వర్గాలు నిర్ణాయక శక్తిగా ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ రాజాం అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా ఆరు ఎచ్చెర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గాలే అధిక శాతం ఉన్నారు. తూర్పుకాపులు రాజాం, ఎచ్చెర్ల, చీపురుపల్లి, నెల్లిమర్లలో, కొప్పుల వెలమలు బొబ్బిలి, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నారు. తమ పార్టీకి బీసీలే వెన్నెముక అంటూ వారిని అవసరానికి ఉపయోగించుకోవడం.. ఎన్నికలు వచ్చేసరికి పెత్తందారులకే పెద్దపీట వేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. ‘కాపు’లకు ‘కమ్మ’ని దెబ్బ... టీడీపీ సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు ఈ సారి కూడా ఎచ్చెర్ల నుంచే సీటు ఆశించారు. స్థానిక టీడీపీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు కూడా టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. వారిద్దరూ తూర్పు కాపు సామాజికవర్గానికి చెందినవారే. కానీ చాపకింద నీరులా కమ్మ సామాజికవర్గానికి చెందిన నడికుదుటి ఈశ్వరరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చలువతో ఎచ్చెర్ల సీటు ఎగురేసుకుపోయారు. ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం వారు పట్టుమని వెయ్యి మంది లేకపోవడం విశేషం. కిమిడి కళావెంకటరావును చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి పంపించారు. అక్కడ పదేళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్న ఆయన సొంత సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున రాజకీయ భవిష్యత్తును నాశనం చేయించారు. సామాజిక న్యాయం హుష్కాకి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తున్న విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలో టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం కనిపించలేదు. కొప్పుల వెలమ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ను పట్టుమని వెయ్యి మంది జనాభా కూడా లేని వెలమ (ఓసీ) సామాజికవర్గానికి చెందిన బేబీనాయనకు చంద్రబాబు ఇచ్చారు. గజపతినగరం టికెట్ కొప్పుల వెలమకు చెందిన మాజీ ఎమ్మెల్యే తెంటు లకు‡్ష్మనాయుడుకి ఇస్తామని అక్కడా మొండిచేయిచూపారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తూర్పుకాపు నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను అక్కడి నుంచి తప్పించేందుకు చీపురుపల్లి టికెట్ ఇస్తామని ఒకసారి, గజపతినగరం సీటు కేటాయిస్తామని మరోసారి చెబుతూ ఆశలపల్లకిలో ఊరేగించారు. తీరా టికెట్ల కేటాయింపు వచ్చేసరికి ఆమెకు ఝలక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీచేయబోనని అశోక్ గజపతిరాజు చేతులెత్తేసిన నేపథ్యంతో తనకు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో టికెట్ వస్తుందని మీసాల గీత ఆశించారు. అయితే గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన అశోక్ కుమార్తె ఆదితికే చంద్రబాబు మళ్లీ టికెట్ ఇచ్చారు. నెల్లిమర్లలో జనసేనతో పొత్తు ధర్మం పేరుతో బ్రాహ్మణ (ఓసీ) సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి టికెట్ ఇచ్చి అక్కడ తూర్పుకాపులను దెబ్బకొట్టారు. -
సాటి లేని సామాజిక న్యాయం
తాజాగా వైఎస్సార్సీపీ ప్రకటించిన లోక్సభ స్థానాల్లో 11 బీసీలకు కేటాయించారు; అలాగే 59 ఎమ్మెల్యే స్థానాలను కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 100 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇంతటి ప్రాతినిధ్యం వారికి లభించలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధికారంలో, బడ్జెటులో, సంపదలో, గౌరవంలో, విద్యా, ఉద్యోగాలలో జనాభా కంటే ఎక్కువ వాటా యిచ్చి సామాజిక న్యాయం కల్పించిన చరిత్ర పురుషుడు జగన్. అంతేగాకుండా, వివిధ విద్యా పథకాల ద్వారా ప్రజలను విద్యావంతులను చేస్తూ, వారు శాశ్వతంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నారు. ఇది జగన్కు జనం పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని చాటుతుంది. ఆంధ్రప్రదేశ్లో గత 71 సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకోలేదు. ఆ కులాల అభివృద్ధిలో జగన్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు చరిత్రను తిరగరాశారు. వైసీపీ రెండేళ్ల క్రితమే రాజ్యసభలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వే షన్లు కల్పించాలని బీసీ బిల్లు పెట్టి, దీనికి 14 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్లో పడింది. విశేషం ఏమిటంటే, గత 75 సంవత్సరాల భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంటులో ఈ బిల్లు పెట్టలేదు. చివరకు బీసీ పార్టీలుగా చలామణి అవుతున్న డీఎంకే, అన్నా డీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్వాదీ, అప్నా దళ్, జనతాదళ్ కూడా ఈ బిల్లు పెట్ట లేదు. చారిత్రక ఘట్టం ఇటీవల 18 ఎమ్మెల్సీ పదవులు ఇస్తే, అందులో 11 సీట్లు బీసీలకు కేటాయిస్తే దేశంలోని బీసీలందరూ ఆశ్చర్య పోయారు. గత ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70 శాతం)... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని జగన్ ఆవిష్కరించారు. అందులో బీసీ, మెనారిటీలకు 11 పదవులు ఇచ్చారు. ఐదుగురికి డిప్యుటీ సీఎం పద వులు ఇస్తే... నాలుగు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చారు. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం ఇదే ప్రథమం. నామినేటెడ్ పోస్టులలో 50 శాతం స్థానాలను వెనుకబడిన వర్గాలకు కల్పిస్తూ, అలాగే కాంట్రాక్టు పను లలో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యమంత్రులకు సవాల్ విసిరారు. 56 బీసీ కులాల కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 డైరెక్టర్లలో మొత్తం 100 శాతం పోస్టులు బీసీలకు కేటాయించారు. 193 కార్పొరేషన్లలో బీసీలకు 109 కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగింది. నామినే టెడ్ పదవులలో 50 శాతానికి చట్టం చేయడమే కాదు; అమలులో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి ఈ వర్గాలలో అచంచల విశ్వాసం చూరగొన్నారు. దీని మూలంగా ఈ కులాలలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగాయి. తరతరాలుగా పేరుకుపోయిన భావదాస్యం పోయి, నాయకత్వ లక్షణాలు పెరిగాయి. వేష భాషలు, నడవడి, సంస్కృతి మూలంగా సమగ్రంగా మారి ఆధునీకరణ చెందుతారు. రాజ్యసభలో మొత్తం 9 మంది వైసీపీ సభ్యులుంటే... అందులో నలుగురు బీసీలు, ఒకరు ఎస్సీ. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా చొరవ తీసుకున్నారు. మండలి చైర్మన్గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజుకూ, మండలి డిప్యుటీ చైర్పర్సన్గా మైనారిటీ మహిళ జకియా ఖానంకు అవకాశం కల్పించారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి సుప్రీంకోర్టు తగ్గిస్తే, పార్టీ పరంగా అదనంగా 20 శాతం కలిపి, మొత్తం 44 శాతం స్థానాలకు పైగా బీసీలకు ఇచ్చి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు జగన్. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్లను వైసీపీ గెలవగా, అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో, వైసీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిస్తే, అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు కేటాయించారు(67 శాతం). 13 మున్సిపల్ కార్పొరేషన్లలో, 92 శాతం మేయర్ పదవులు ఈ వర్గాల వారికే ఇచ్చారు. 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 60 శాతం వీరికే కేటాయించారు. గ్రామ – వార్డు సచివాలయాల్లో ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపు 1.30 లక్షలు. వీటిలో 83 శాతం ఈ వర్గాలవారే. ఈ 57 నెలల్లోనే మరో 2.70 లక్షల వలంటీర్ ఉద్యోగాలు, మిగిలిన ఉద్యోగాలు కలుపుకొని 6.03 లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. ఇందులోనూ 75 శాతం వాటా ఈ వర్గాలదే. దీర్ఘ దృష్టి విద్య ద్వారానే బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయనీ, వారికి గౌరవం పెరుగుతుందనీ దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తు న్నారు జగన్. అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. అమ్మఒడి పథకం కింద ఒకటి నుంచి పదవ తరగతి వరకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. దీని వలన ప్రతి ఒక్కరు చదువుకుంటు న్నారు. కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం 20 వేల రూపాయల స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ తదితర ఉన్నత చదువులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులను ఇచ్చేటట్లు జీవోలు జారీ చేశారు. పాలకులు ఓట్లు వస్తాయనే ఆశతో జనాకర్షక పథకాలు పెడతారు. దీర్ఘకాలంలో సమాజ శ్రేయస్సు ఎలా సాధ్యమవుతుందని ఆలోచించరు. కానీ జగన్ వివిద విద్యా పథకాల ద్వారా ప్రజలను విద్యావంతులను చేస్తూ, వారు శాశ్వతంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ముందు చూపుతో, విజన్తో ఈ పథకాలను ప్రవేశపెట్టడం చారిత్రాత్మకం. ఇది జగన్కు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని చాటుతుంది. ఉన్నత విద్య వలన జ్ఞాన సమాజం ఏర్పడుతుంది. సమాజంలో ప్రతి పౌరుడు సభ్యతతో, సంస్కారంతో, ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తాడు. దీని మూలంగా వైద్యం, ఆరోగ్యంపై పెట్టే బడ్జెట్ తగ్గుతుంది. శాంతిభద్రతలు కూడా చక్కగా ఉండటంతో పోలీసు శాఖపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి, ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ఒక తరపు పెట్టుబడి ఇంజినీరింగ్, ఇతర పీజీ కోర్సులు, మెడిసిన్ చదివేవారు విదేశా లకు వెళ్లి, ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఆఫ్రికా, యూరోపియన్, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం లేదా ఉపాధి పొందుతున్నారు. దీని మూలంగా దేశానికి, రాష్ట్రానికి విదేశ మారక ద్రవ్యం లభిస్తుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిస్తుంది. చదువు ద్వారా పొందిన జ్ఞానంతో ఆధునిక వ్యవసాయం చేస్తే అధిక ఉత్పత్తి సాధించడానికి వీలు కలుగుతుంది. దీనిమూలంగా ఆ యా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. సమాజ కోణంలో చూస్తే, ఒకసారి ఒక కుటుంబం ఉన్నత చదువులు చదివితే, సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి. ఆ కుటుంబం ప్రభుత్వ రాయి తీల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదు. ఆదాయం పెరగడం మూలంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా సబ్సిడీ బియ్యం, వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. పదేళ్లలో 40 శాతం, మరో పదేళ్లలో మరో 50 శాతం, మొత్తంగా 20 ఏళ్లలో 90 శాతం మంది సబ్సిడీ పథకాలు వద్దనే స్థాయికి చేరిపోతారు. వీటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న బడ్జెట్లో 90 శాతం తగ్గిపోతుంది. ఒక తరంపై ఖర్చుపెడితే రెండవ తరానికి ఈ విద్యా పథకం స్కీముల అవసరం ఉండదు. పేదరికం ఉండదు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. ఆర్. కృష్ణయ్య వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ); జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ‘ 90000 09164 -
జగన్ను చూసి నేర్చుకోండి
ముషీరాబాద్ (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సామాజిక న్యాయం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సామాజిక న్యాయం విషయంలో అక్కడి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. వైఎస్ జగన్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లలో 50 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు కేటాయించి ఔరా అనిపించుకున్నారని ప్రశంసించారు. 2019తో పోలిస్తే అత్యధికంగా బీసీలకు 48, ఎస్సీలకు 29, ఎస్టీలకు ఏడు, మహిళలకు 19 టికెట్లు కేటాయించారని కొనియాడారు. రెండు రోజుల క్రితం రేవంత్రెడ్డి 37 కార్పొరేషన్ల చైర్మన్లను ప్రకటిస్తే 17 అగ్రకులాలకు ఇచ్చారని, 50 శాతం ఉన్న బీసీలకు కేవలం 13, 12 శాతం ఉన్న ఎస్టీలకు మూడు, 20 శాతం ఉన్న ఎస్సీలకు కేవలం ఒకే ఒక్క చైర్మన్ పదవిని ఇచ్చారని తెలిపారు. దీన్ని బట్టే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కేవలం మాటలకు మాత్రమే పరిమితం అని అర్ధమవుతోందన్నారు. ఉద్యమకారులను వాడుకుని వదిలేశారని మాజీ సీఎం కేసీఆర్ను విమర్శించిన రేవంత్రెడ్డి, 37 చైర్మన్ పోస్టులలో ఒక్కటి కూడా ఓయూ ఉద్యమకారులకు ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు. -
సామాజిక న్యాయమే లక్ష్యంగా దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ
-
అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత జగన్కే ఉంది!
సాక్షి, అమరావతి: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకుని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 56 నెలలుగా ఆవిష్కరించిన సామాజిక మహా విప్లవంతో రాష్ట్రమంతటా సాధికారత ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు సింహభాగం అవకాశాలతో దూసుకెళుతుండటం ఇందుకు నిదర్శనం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే సామాజిక న్యాయమంటే నినాదం కాదు.. అనుసరించాల్సిన విధానమని జగన్ స్పష్టం చేశారు. తొలి మంత్రివర్గం ఏర్పాటులోనే దీన్ని రుజువు చేశారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రతి అడుగులో ఆచరిస్తూ సామాజిక న్యాయం చేయడంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. రాజ్యాధికారంలో వాటా.. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తొలి మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటైన క్యాబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించారు. రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురికి (80 శాతం) ఆయా వర్గాల నుంచే అవకాశం కల్పించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్కు అవకాశం కల్పించగా శాసన మండలి ఛైర్మన్గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజుకు అవకాశమిచ్చారు. మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశమిచ్చారు. 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయంలో ముఖ్యమంత్రి జగన్ మరో అడుగు ముందుకేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో బీసీ వర్గానికి చెందిన ఒక్కరిని కూడా రాజ్యసభకు పంపించలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ కాగా అందులో నలుగురు బీసీలను (50 శాతం) సీఎం జగన్ రాజ్యసభకు పంపారు. శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉండగా వీరిలో 29 మంది (68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీకి 48 ఎమ్మెల్సీ స్థానాలు దక్కితే చంద్రబాబు కేవలం 18 పదవులు (37 శాతం) మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చారు. ఆర్థిక తోడ్పాటు.. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత ఇవ్వడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆర్థిక సాధికారత సాధించేలా సీఎం జగన్ బాటలు వేశారు. నాలుగున్నరేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా నగదు బదిలీ(డీబీటీ) రూపంలో రూ.2.46 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. ఇక ఇతర పథకాల ద్వారా (నాన్ డీబీటీ) రూ.1.67 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా పేదలకు రూ.4.13 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ నిధులను సద్వినియోగం చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆర్థిక సాధికారత సాధించాయి. పేద బిడ్డలకు పెద్ద చదువులు.. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా అభివృద్ధి చేసిన సీఎం జగన్ పేద పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టారు. విప్లవాత్మక సంస్కరణలతో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు విద్యా సాధికారత సాధించేందుకు మార్గం సుగమం చేశారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి రాష్ట్రంలో ఇప్పటిదాకా 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయగా అందులో గత 56 నెలల్లో భర్తీ చేసినవే 2.07 లక్షల ఉద్యోగాలున్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే 80 శాతం ఉద్యోగాలు దక్కాయి. దీన్ని పరిశీలిస్తే ఆయా వర్గాలు విద్యా సాధికారత సా«ధించినట్లు స్పష్టమవుతోంది. మహిళా సాధికారతలో అగ్రగామి.. వైఎస్సార్ ఆసరా, చేయూత లాంటి పథకాల ద్వారా సీఎం జగన్ మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందించారు. రాష్ట్రంలో 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75,670 కోట్ల విలువైన ఇంటి స్థలాలను ఇవ్వడమే కాకుండా పక్కా ఇళ్లను సైతం నిర్మించి ఇస్తూ వారి సొంతింటి కలను సాకారం చేశారు. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. హోంమంత్రిగా ఎస్సీ మహిళకు, మండలి డిప్యూటీ ఛైర్పర్సన్గా మైనార్టీ మహిళకు అవకాశం కల్పించారు. నామినేటెడ్ పదవులు, పనులు 50% మహిళలకే ఇవ్వాలని దేశ చరిత్రలో తొలిసారిగా చట్టం చేసి మరీ మహిళలకు న్యాయం చేశారు. మహిళా సాధికారతలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. స్థానిక సంస్థల్లో సంచలనం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే దీనిపై చంద్రబాబు హైకోర్టులో టీడీపీ నేతలతో కేసులు వేయించారు. దాంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లు తగ్గించినప్పటికీ పార్టీ పరంగా తాము 34 శాతం కంటే ఎక్కువే ఇస్తానని సీఎం జగన్ ప్రకటించారు. ఆ మేరకు స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అత్యధికంగా పదవులిచ్చారు. రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరగ్గా 637 చోట్ల వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. మండల పరిషత్ అధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67 శాతం ఇచ్చారు. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో ఏకంగా 9 పదవులు (69 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఇచ్చారు. రాష్ట్రంలో 14 మున్సిపల్ కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. 14 మేయర్ పదవుల్లో 12 పదవులను (86 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరగ్గా 84 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు (69%) ఇచ్చారు. చారిత్రక చట్టం.. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక చట్టం చేసి మరీ ఆయా వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ పదవులు ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఆ వర్గాలకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేయడం దేశంలో ఇదే తొలిసారి. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమించగా అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 79 పదవులు(58 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే 280 పదవులు(58 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చారు. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి ఆయా వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులు ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 అంటే సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019