breaking news
Ad - Sakshi_Home_Sticky
-
శివసేన తొలి జాబితా - లోక్సభ అభ్యర్థులు వీరే..
ముంబై: దేశంలో ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాలను విడతలవారీగా విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఏక్నాథ్ షిండే' నేతృత్వంలోని శివసేన తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఎనిమిది మందిని మాత్రమే ప్రకటించింది. ఇందులో ఇటీవల కాంగ్రెస్ నుంచి శివసేనలో చేరిన 'రాజు పర్వే'ను రామ్టెక్ బరిలో దింపారు. ముంబై సౌత్ సెంట్రల్ నుంచి రాహుల్ షెవాలే, కొల్హాపూర్ నుంచి సంజయ్ మాండ్లిక్, షిర్డీ నుంచి సదాశివ్ లోఖండే, బుల్దానా నుంచి ప్రతాపరావు జాదవ్, హింగోలి నుంచి హేమంత్ పాటిల్, మావాల్ నుంచి శ్రీరంగ్ బర్నే, హత్కనంగలే నుంచి ధైర్యషీల్ మానే పోటీ చేయనున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. లోక్సభ ఎన్నికల ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి వసేన పార్టీ తరఫున గోవిందా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఏక్నాథ్ షిండే నాయకత్వం.. పార్టీలో చేరడానికి తనను ప్రేరేపించిందని, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని గోవిందా అన్నారు. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో ఐదు దశల్లో జరగనున్నాయి. శివసేన ఎన్డీఏలో భాగం. लोकसभा निवडणूक २०२४ साठी #शिवसेना पक्षाच्या अधिकृत उमेदवारांची पहिली यादी....#Maharashtra #Shivsena #Mahayuti #LoksabhaElections2024 #EknathShinde@Shivsenaofc pic.twitter.com/LntehqRlmI — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) March 28, 2024 -
'భారత మాతాకీ జై అంటే సమస్యలు పరిష్కారం కావు: శివసేన
ముంబై: 'భారతమాతాకీ జై' అని నినాదాలు చేసే బదులు రాష్ట్రంలోని నీటి సమస్యకు పరిష్కారంను సూచించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఎన్డీఏ మిత్రపక్షమైన శివసేన సూచించింది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై సత్వరచర్యలు తీసుకోకుంటే శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 'భారతమాతాకీ జై' అని నినదిస్తూ తన సీటును కాపాడుకోలేరని శివసేన అధికార పత్రిక 'సామ్నా'లో ఘాటుగా విమర్శించింది. గత ప్రభుత్వాలు నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని, భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీటి కోసమేనని తెలిపింది. యువతలో అసహనం పెరిగి మావోయిజం వైపు ఆకర్షితులవుతున్నారని ఇలాంటి పరిసితుల్లో 'భారత మాతాకీ జై' అనే నినాదాలు చేస్తే లాభం లేదని నిర్మొహమాటంగా పేర్కొంది. ఔరంగాబాద్ లాంటి ప్రాంతాల్లో 40 రోజులకొకసారి కూడా తాగునీరు రావడంలేదని, పుణే, థానె, నాగపూర్, ముంబైల్లో పరిస్థితి దారుణంగా ఉందని రాష్ట్రం స్మశానాన్ని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. పరిశ్రమలు మూతపడుతున్నాయని, దేశభక్తి పేరుతో ప్రజల దాహం తీర్చలేమంటే సహించేదిలేదని హెచ్చరించింది.
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019