breaking news
-
సీతమ్మకు బంగారు చీర..
-
రైతు బంధు కోసం పెట్టిన రూ. 7 వేల కోట్లు ఏమయ్యాయి: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షంలో ఉన్న తమ నేత కేసీఆర్.. ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగితే.. సీఎం రేవంత్ ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం దున్నపోతుతో సమానమని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన నాలుగు నెలల్లోనే వ్యవసాయం సంక్షోభం వస్తుందని ఊహించలేదని.. ఇలాంటి దుస్థితికి కారణం సీఎం రేవంత్ రెడ్డి సర్కారే అని మండిపడ్డారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతుదీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. పాలిచ్చే బర్రెను పంపించి దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు రైతుబంధు కోసం రూ. 7 వేల కోట్లు సిద్ధంగా పెట్టామని అయితే రైతుబంధు ఇవ్వొద్దంటూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆపిందని గుర్తు చేశారు. రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసీకి రేవంత్ లేఖ రాయాలి రైతులకు 500 బోనస్ ఇవ్వమని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉందని సీఎం, మంత్రులు చెబుతున్నారని.. పాలన తన చేతుల్లో లేదని సీఎం రేవంత్ అనడం సిగ్గు చేటని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పంటలకు బోనస్ ఇస్తామని ఈసీకి రేవంత్ లేఖ రాయాలని అన్నారు. ఇందుకు తాము కూడా మద్దతిస్తామన్నారు. చదవండి: నేడు కాంగ్రెస్ జనజాతర సభ.. తుక్కుగూడ నుంచే సమర శంఖం కాంగ్రెస్ తెచ్చిన కరువు కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే మార్గం. అందుకే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలు నిర్మించాం. భారీ మోటార్లు పెట్టి గోదావరి నీళ్లు ఎత్తిపోశాం. ఇవాళ కూడా గోదావరిలో 2 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయ్. ఎర్రటి ఎండల్లో కూడా చెరువులు మత్తళ్లు దూకినాయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువని అన్నారు. కేసీఆర్ వస్తున్నారని నీళ్లు వదిలారు ‘300 పిల్లర్లు ఉన్న బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగాయి. కేసీఆర్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. యూట్యూబ్లో వచ్చే తప్పుడు వార్తలు చూసి ఆగం కావొద్దు. కేసీఆర్ వస్తున్నారని అన్నారం, సుందిళ్ల నీళ్లు వదిలారు. హరీశ్రావు హెచ్చరిస్తే కూడవెళ్లి వాగుకు నీళ్లు ఇచ్చారు. ఇన్నాళ్లు నీళ్లు ఉన్నా కూడా ఇవ్వలేదని అర్థమైంది కదా.. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. రైతుబంధు రూ. 15 వేలు ఇస్తామని మోసం చేసింది. రూ. వరికి క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తామని ఇవ్వడం లేదు. ఎర్రటి ఎండల్లో కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్లి భరోసా ఇచ్చారు. రైతుల హక్కుల తరుపున కొట్లడుదాం. రేపటి నుంచి కండువా వేసుకొని రైతులకు వచ్చే బోనస్పై కాంగ్రెస్ పార్టీని నిలదీద్దాం. మిషన్ భగీరథ అప్పగించినా నీళ్లిచ్చే తెలివి కాంగ్రెస్కు లేదు. వండిన అన్నం వడ్డించే తెలివి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజలకు వివరించాలి.’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
దద్దమ్మలు రాజ్యమేలుతున్నారు: కేసీఆర్
సాక్షి, సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్లో 4 సజీవ జలధారలను సృష్టించామని కేసీఆర్ తెలిసారు. తాము గోదావరి నదిని నిండుగా ప్రవహించేలా చేస్తే.. నాలుగు నెలల్లో జలధారాలు ఎండిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం అనేక అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యమే కారణం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా.. సిరిసిల్ల తెలంగాణా భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయిందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువా.. కాంగ్రెస్ తెచ్చిన కరువా.. మంత్రులు తెచ్చిన కరువా అని ప్రశ్నించారు. వర్షపాతం లేదని మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్న కేసీఆర్.. నీటిని వాడే విధానం తెలియని ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని విమర్శించారు. పంటలు ఎండటానికి కరెంట్ కోతలు కూడా కారణమని దుయ్యబటారు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం క్వాలిటీ కరెంట్, రైతుబంధు ఇవ్వకుండా ప్రభుత్వం కాలం గడిపేస్తుందని మండిపడ్డారు కేసీఆర్. ‘వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని చెప్పాను. చనిపోయిన 209 మంది రైతుల జాబితాను 4 గంటల్లోనే ప్రభుత్వానికి పంపించాను. లిస్ట్ ఇస్తే సాయం చేస్తామన్న సీఎం.. ఉలుకు, పలుకు లేకుండా పోయాడు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలి. పరిహారం ఇవ్వకుంటే వాళ్లందరి ఉసురు తగులుతుంది. ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టం. తప్పించుకులేరు. వీపు విమానం మోత మోగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ సంక్షోభం వచ్చింది ఇప్పటికీ రైతుబంధు పూర్తిగా ఇవ్వలేదు. బ్యాంకర్లతో ఎందుకు సమావేశాలు నిర్వహించలేదు. పంటలకు బోనస్ ఇస్తామన్నారు. జొన్నపంట కొనడం లేదనే ప్రచారం జరుగుతోంది. రుణమాఫీపై తెలంగాణలో పెద్ద సంక్షోభం వచ్చేలా ఉంది. ఈ ప్రభుత్వంలో వ్యవసాయం సంక్షోమం వచ్చింది. ఈ సంక్షోభానికి జబాబుదారీ ఎవరూ?. దళితబంధు 12 లక్షలు ఇస్తామన్నారు.. ఏమైంది? మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే రోజులు దాపురించాయని నేతన్నలు చెబుతున్నారు. నేతన్నలను ఆదుకోవాలని అప్పట్లో మొర పెట్టుకున్నా. 14 ఏళ్ల కిందట చేనేత కార్మికుల బతుకు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాంటి పరిస్థితే తెచ్చారు. నాలుగు నెలల్లోనే విధ్యుత్ కొరత దళితబంధు కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇంట్లో ఇద్దరికి రూ. 4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. 30 లక్షల కుటుంబాలకు నెలకు రూ. 6 వేల బాకీ ఉన్నారు. డిసెంబర్లో చేస్తామన్న రుణమాఫీ ఏమైంది? కళ్యాణలక్ష్మికి తులం బంగార కలిపి ఇస్తామన్నారు.. ఏమైంది? ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వలేదు. గతంలో కంటే ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంది. 9 ఏళ్లు వచ్చిన నిరంతర కరెంట్ ఇప్పుడెందుకు రావడం లేదు. ఈ నాలుగు నెలల కాలంలో విద్యుత్ కొరత ఎందుకొచ్చింది. ఇది మనుషులు సృఫ్టించిన కృత్రిమ కరువు. మేం కేసులు పెట్టి జైల్లో వేయలేమా? కాళేశ్వరం ఎంత త్వరగా పూర్తైతే అంత మంచిదని భావించాం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఉన్నవాళ్లకు తోక కూడా తేలీదు. అన్ని బరాజ్ల మీద దాదాపు 200పైగా గగేట్లు ఉంటాయి. మేడిగడ్డ బరాజ్లో గోదవారి పోంగే మూడు నెలలు గేట్లు ఎత్తి ఉంటాయి. కొట్టుకుపోయిన మిడ్మానేరు కట్ట కట్టింది కోమటిరెడ్డి కంపెనీ కాదా?. మేం అనుకుంటే అప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టేవాళ్లం కాదా?. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే కన్నెపల్లి వద్ద ఎత్తిపోతలు. మేడిగడ్డ కుంగిందని కేసీర్ను బద్నాం చేయాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నదులు, బ్యారేజ్లు దగ్గర ఇసుక కుంగడం సహజం. పిల్లర్ల కింద ఇసుక కదిలి రెండు పిల్లర్లు కుంగినయ్. మీకు చేతకాకుండే 50 వేల మంది రైతులను తీసుకుపోతం. తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ నుంచి నీళ్లు తెస్తాం. కాళేశ్వరం పని అయిపోయిందన్నోళ్లు మొన్న నీళ్లు ఎలా పంపింగ్ చేశారు. ప్రజల గొంతులు ఎందుకు ఎండబెడుతున్నారు. ఇప్పటి వరకు ఊరుకున్నాం ఇకపై ఊరుకోం. రాష్ట్రం రణరంగం అయినా సరే’ అని కేసీఆర్ మండిపడ్డారు. -
కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట.. రైతులకు పరామర్శ
Live Updates.. ► కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట ►కరీంనగర్ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ ►జిల్లాలోని మొగ్దుంపూర్లో ఎండిపోయిన పంటను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులను పరామర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ► రోడ్డు మార్గంలో కరీంనగర్కు బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్ ►లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ►ఈ సందర్బంగా సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. హైదరాబాద్ నుండి రోడ్డుమార్గంలో ప్రత్యేక బస్సులో రానున్న కేసీఆర్ ముందుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. ► మధ్యాహ్నం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో పంటలను పరిశీలిస్తారు. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్హౌజ్కు తిరుగుపయనమవుతారు. కాగా, ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
ఫోన్ ట్యాపింగ్ హెడ్క్వార్టర్ ఎక్కడ అంటే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మ లుపు తిరుగుతోంది. ఇది హైదరాబాద్లోని ఎస్ఐ బీ కార్యాలయం కేంద్రంగా సాగగా సిరిసిల్ల, వరంగల్లో ఎస్ఐబీ పోలీసులు కొందరు వార్ రూంలు ఏర్పాటు చేసి, ట్యాపింగ్కు పాల్పడ్డారు. వరంగల్లో ఓ నాయకుడు చెప్పిన నంబర్లు ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వస్తుండగా అదే తరహాలో సిరిసిల్ల లోనూ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సిరిసిల్ల కు చెందిన ఓ కీలక నేత కూడా కొన్ని నంబర్లు ఇచ్చి, స్థానిక వార్ రూం ద్వారా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిర్ధారించారు. పంజగుట్ట పోలీసుల విచారణలో ఆ నాయకుడు ఎవ రు? ట్యాప్ చేయమని ఎవరెవరి నంబర్లు ఇచ్చా డు? వార్ రూం ఎక్కడ నుంచి నిర్వహించారు? అందులో ఎవరెవరు పని చేశారు? తదితర అంశాలపై విచారణ అధికారులు వివరాలు సేకరించినట్లు స మాచారం. ట్యాప్ అయిన జాబితాలోని మెజారిటీ వ్యక్తులు కాంగ్రెస్ సీనియర్లు, అందులోనూ సీఎం రేవంత్రెడ్డికి సన్నిహితులు కావడం గమనార్హం. వార్ రూం ఎంతకాలం నడిచిందో? గత డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలతో అప్రమత్తమైన అప్పటి సిరిసిల్ల డీఎస్పీ ప్రణీత్రావు సీసీ కెమెరాలు ఆపేసి, వార్ రూంలోని దాదాపు 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన విషయం విధితమే. దీనిపై మార్చి 10న పంజగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదవడం, 12న డీఎస్పీని సిరిసిల్లలో అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రణీత్రావు, ఆయన బృందం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంగానే వార్ రూం ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అది ఎంతకాలం నడిచింది? ఎవరెవరి కాల్స్ రికార్డ్ చేశారు? అన్న విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. వార్ రూం నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్ల ద్వారా వివరాలు సేకరించినట్లు తెలిసింది. వీరు ట్యాప్ చేసిన కాల్స్లో ముఖ్యమైన వాటిని కాపీ చేసి, ప్రణీత్రావుకు ఇచ్చేవారని సమాచారం. ప్రణీత్రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల్లో సిరిసిల్ల కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని సమాచారం. సిరిసిల్లకే పరిమితం కాలేదా? వార్ రూంలో పనిచేసిన సభ్యులు కేవలం సిరిసిల్ల కు మాత్రమే పరిమితం కాలేదని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నా రు. ముఖ్యంగా పెద్దపల్లిలో ముగ్గురు కీలక ప్రతిపక్ష నేతల అనుచరులకు చెందిన కోట్లాది రూపాయలను అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులు ఉమ్మడి జిల్లాతోపాటు, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పట్టుకున్నారు. కరీంనగర్, జగిత్యాల ప్రతిపక్ష నేతలు డబ్బులు ఖర్చు చేయకుండా వారి కున్న ఆర్థిక మూలాలను ముందే గుర్తించి, కట్టడి చేశారన్న దిశగానూ దర్యాప్తు సాగుతోంది. సూట్కేసు పరిమాణంలో ఉండే ట్యాపింగ్ పరికరాలను ఓ వ్యాన్లో పెట్టుకొని, టార్గెట్ చేసిన నాయకుడి ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉంటే చాలు.. ఆయన కాల్స్ మాత్రమే కాదు, ఇంట్లోవారు, ఆ చుట్టుపక్కల వారి కాల్స్ కూడా వినే వీలుంటుంది. 2022లోనే అనుమానించిన ఎంపీ సంజయ్ 2022 మే 25వ తేదీన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్లోని ఓ ప్రధాన మీడియా సంస్థ విలేకరితో హిందూ ఏక్తా యాత్రపై చర్చించారు. ఆ ఫోన్ కట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఎంపీ నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన అనుచరులు సదరు విలేకరే పోలీసులకు సమాచారం ఇచ్చాడంటూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతోపాటు మరిన్ని సంఘటనలు గుర్తు చేసుకున్న ఎంపీ సంజయ్ తనతోపాటు తన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అనుమానించారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019