breaking news
-
శ్రేయస్ అయ్యర్కు దెబ్బ మీద దెబ్బ! మరో షాక్..
ఓటమి బాధలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు మరో షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతడికి భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ మంగళవారం రాజస్తాన్ రాయల్స్తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడినా రాజస్తాన్ రాయల్స్ జోస్ బట్లర్ వీరోచిత సెంచరీ కారణంగా ఓటమిని మూటగట్టుకుంది. రెండు వికెట్ల తేడాతో ఓడిపోయి పరాజయం పాలైంది. నిజానికి.. కేకేఆర్ రాజస్తాన్ను నిలువరిస్తుందనే అంతా అనుకున్నారు. కొంప ముంచి స్లో ఓవర్ రేటు కానీ స్లో ఓవర్ రేటు కేకేఆర్ కొంపముంచింది. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఆఖరి ఓవర్లో 30 యార్డ్ సర్కిల్ ఆవల కేవలం నలుగురు ఫీల్డర్లనే ఉంచాల్సి వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకున్న బట్లర్ మొదటి బంతికే సిక్సర్ బాదాడు. ఓటమితో పాటు మరో షాక్ కూడా అనంతరం మూడు బంతుల్లో విజయ సమీకరణం ఐదు పరుగులు కాగా.. చివరి బంతికి సింగిల్ తీసి రాజస్తాన్ విజయలాంఛనం పూర్తి చేశాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే స్లో ఓవర్ రేటు కారణంగా కేకేఆర్ మ్యాచ్ ఓడిపోగా.. నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందున కోల్కతా సారథి శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఇది మొదటి తప్పు కాబట్టి ఈ మేర ఫైన్తో సరిపెట్టినట్లు తెలిపింది. కాగా ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: ఈసారి టైటిల్ సన్రైజర్స్దే!.. రిక్కీ పాంటింగ్ కామెంట్స్ వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. అందుకే వరుణ్ చేతికి బంతి!
రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మ్యాచ్ ఆద్యంతం తమను భావోద్వేగాల డోలికలో ఊగిసలాడేలా చేసిందని.. కానీ తమకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. ఏదేమైనా ఈ ఓటమిని అంగీకరించక తప్పదన్న శ్రేయస్.. టోర్నీ మధ్యలో ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఒక రకంగా మంచిదైందని పేర్కొన్నాడు. లోపాలు సరిచేసుకుని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగే వీలుంటుందన్నాడు. ఇక ఈ మ్యాచ్లో అద్బుతంగా రాణించిన సునిల్ నరైన్ గురించి ప్రస్తావిస్తూ.. కేకేఆర్కు దొరికిన అత్యంత విలువైన ఆస్తి నరైన్ అని ప్రశంసించాడు. అదే విధంగా ఆఖరి ఓవర్లో బంతిని కావాలనే వరుణ్ చక్రవర్తికి ఇచ్చానన్న శ్రేయస్ అయ్యర్.. ఫలితం రాబట్టలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. On Display: 𝗘𝗳𝗳𝗼𝗿𝘁𝗹𝗲𝘀𝘀 𝗛𝗶𝘁𝘁𝗶𝗻𝗴 😍 Sunil Narine smacking it with perfection👌👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvRR | @KKRiders pic.twitter.com/yXC3F5r1SY — IndianPremierLeague (@IPL) April 16, 2024 అందుకే వరుణ్ చేతికి బంతి జోస్ బట్లర్ను నిలువరించేందుకు తాము అనుసరించి వ్యూహాలు ఫలించలేదని పేర్కొన్నాడు. కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్లో ఓడిపోవడం బాధగా ఉందని శ్రేయస్ అయ్యర్ అసంతృప్తిని వెళ్లగక్కాడు. అయితే ఓటమినే తలచుకుంటూ కూర్చోలేమని.. తదుపరి మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతామని శ్రేయస్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా సొంతమైదానంలో కేకేఆర్కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్లో రాజస్తాన్ రాయల్స్తో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో కోల్కతా రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఈ సీజన్లో కేకేఆర్కు ఇది రెండో ఓటమి. An Impactful Innings 😍 🔝 class effort from a 🔝 player ft. Jos Buttler Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z — IndianPremierLeague (@IPL) April 16, 2024 నరైన్ సుడిగాలి ఇన్నింగ్స్ వృథా ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ ఆల్రౌండర్ సునిల్ నరైన్ 56 బంతుల్లో 13 ఫోర్లు, ఆరు సిక్స్ల సాయంతో 109 పరుగులు సాధించాడు. అదే విధంగా.. రెండు వికెట్లు కూడా పడగొట్టాడు ఈ స్పిన్ ఆల్రౌండర్. అయితే, రాయల్స్ స్టార్ జోస్ బట్లర్ అజేయ శతకం కారణంగా నరైన్సుడిగాలి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. వాళ్లిద్దరి వల్లే ఓటమి 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 128 పరుగులకే పరిమితమైన వేళ బట్లర, రోవ్మన్ పావెల్తో కలిసి దూకుడుగా ఆడాడు. పావెల్ మెరుపు ఇన్నింగ్స్(13 బంతుల్లో 26)తో ఆకట్టుకోగా.. సెంచరీ వీరుడు బట్లర్(60 బంతుల్లో 107) ఆఖరి ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఆఖరి బంతికి సింగిల్ తీసి రాజస్తాన్ను గెలుపుతీరాలకు చేర్చాడు. అలా నమ్మశక్యంకాని రీతిలో కేకేఆర్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ పైవిధంగా స్పందించాడు. బట్లర్, రోవ్మన్ పావెల్ అద్భుతంగా ఆడారని వారిద్దరికి క్రెడిట్ ఇచ్చాడు. చదవండి: ఐపీఎల్ చరిత్రలో తొలి జట్టుగా రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ అమ్మాయి కోసం చాలా ఎదురుచూశాను.. శ్రేయస్ అయ్యర్
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హిట్మ్యాన్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. కపిల్ శర్మ ప్రశ్నలు అడుగుండగా.. వీరిద్దరు తమదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వులు పూయించారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ అమ్మాయి మెసేజ్ కోసం ఎదురుచూశాను.. స్టేడియంలో మహిళా అభిమానులపై కెమెరామెన్ల ఫోకస్ అనే అంశంపై చర్చ జరుగుతుండగా శ్రేయస్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. నా తొలి ఐపీఎల్ సీజన్లో ఓ అందమైన అమ్మాయిని చూశాను. స్టాండ్స్లో కూర్చుకున్న ఆ అమ్మాయివైపు చేయి ఊపుతూ హలో చెప్పాను. ఆ సమయంలో ఫేస్బుక్ చాలా పాపులర్గా ఉండేది. అందులో ఆ అమ్మాయి రిప్లై ఇస్తుందేమో అని చాలా ఎదురుచూశానని శ్రేయస్ తన తొలి క్రష్ గురించి చెప్పుకొచ్చాడు. శ్రేయస్ ఈ విషయం గురించి చెప్పగానే షోకు హాజరైన వారంతా ఓకొడుతూ సౌండ్లు చేశారు. ఇదే షోలో శ్రేయస్ మరిన్ని విషయాలు కూడా పంచుకున్నాడు. తన ఆరాధ్య క్రికెటర్ రోహిత్ శర్మ అని, అతను టీమిండియా కెప్టెన్ అయినందుకు ఈ మాట చెప్పడం లేదని అన్నాడు. సహచరులతో రోహిత్ చాలా నాటు స్టయిల్లో మాట్లాడతాడని శ్రేయస్ చెప్పగా.. రోహిత్ కూడా శ్రేయస్పై ఇదే కంప్లైంట్ చేశాడు. ఇదిలా ఉంటే రోహిత్, శ్రేయస్ ప్రస్తుతం ఐపీఎల్ 2024తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్ల్లో ఒకే ఒక విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండగా.. శ్రేయస్ నాయకత్వంలోని కేకేఆర్ 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. -
ఆ ఇద్దరితో రూమ్ అస్సలు షేర్ చేసుకోను: రోహిత్ శర్మ
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కపిల్.. హిట్మ్యాన్, శ్రేయస్లను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. వీటికి రోహిత్, శ్రేయస్ తమదైన శైలిలో బదులిచ్చారు. ఈ సందర్భంగా రోహిత్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ ఇద్దరు పరమ గలీజ్గాళ్లు.. షో సందర్భంగా కపిల్ హిట్మ్యాన్తో సంభాషిస్తూ ఓ ఆసక్తికర ప్రశ్నను అడిగాడు. రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఎవరితో కలసి షేర్ చేసుకుంటారని రోహిత్ను అడిగాడు. ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది కేటాయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే శిఖర్ ధవన్, రిషబ్ పంత్లతో మాత్రం అస్సలు ఉండనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆ ఇద్దరు గదిని చాలా మురికిగా ఉంచుతారు. ప్రాక్టీస్ నుంచి వచ్చాక బట్టలను మంచంపైనే పడేస్తారు. వారి గది తలపుపై ఎప్పుడూ డు నాట్ డిస్టర్బ్ (DOD) అనే బోర్డు దర్శనమిస్తుంది. ఈ ఇద్దరు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పడుకుంటారు. ఉదయమే రూమ్ క్లీనింగ్కు వచ్చే వాళ్లు DOD బోర్డును చూసి వెనక్కు వెళ్లిపోతారు. మూడు నాలుగు రోజుల వరకు వాళ్ల రూమ్ చండాలంగా ఉంటుంది. ఈ కారణంగా వీళ్లతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. నేను కూడా వారితో ఉండాలని అస్సలు అనుకోనంటూ హిట్మ్యాన్ బదులిచ్చాడు. ఇదే సందర్భంగా రోహిత్ మరిన్ని విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఓటమి అనంతరం అభిమానుల కోపానికి గురవుతానని భయపడ్డానని తెలిపాడు. కానీ ప్రజలు తమను బాగా ఆడామని ప్రశంసించడంతో ఊపిరి పీల్చుకున్నామని అన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ (మధ్యాహ్నం 3:30).. లక్నో-గుజరాత్ (రాత్రి 7:30) తలపడుతున్నాయి. -
IPL 2024 : విశాఖలో నేడు ఢిల్లీ vs కోల్కతా (ఫొటోలు)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
Multiple cat checj
Check international block
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019