breaking news
-
Ram Navami 2024: వెండితెర సీతమ్మగా కనిపించిన తారలు వీళ్లే (ఫొటోలు)
-
సీతమ్మకు త్రీడీ చీర
సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటాడు. మూడు రంగుల్లో త్రీడీ చీరను చేనేత మగ్గంపై నేశాడు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి సీతమ్మకు బహూకరించేందుకు మూడు రంగుల చీరను అద్భుతంగా రూపొందించాడు. ఆయనే సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్కుమార్. ఆయన 18 రోజులపాటు చేనేత మగ్గంపై శ్రమించి బంగారు, వెండి, రెడ్ బ్లడ్ రంగుల్లో చీరను నేశారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు, 600 గ్రాముల బరువుతో అద్భుతమైన త్రీడీ చీరను రూపొందించారు. ఈ చీరను తిప్పుతుంటే.. రంగులు మారుతూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంగా విజయ్కుమార్ ఆదివారం మాట్లాడుతూ.. శ్రీరామ నవమికి భద్రాచలం సీతారాములకు ఈ చీరను బహూకరించనున్నట్లు తెలిపారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్కుమార్ నేసి అభినందనలు అందుకున్నారు. -
సీతమ్మ పెద్ద మనసమ్మ.. రూ.3 కోట్ల విలువైన..
సాక్షి, ఉండ్రాజవరం: సీఎం వైఎస్ జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు బాసటగా ఓ మహిళ భూరి విరాళం అందించింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్నులో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ పీహెచ్సీ నిర్మాణానికి దివంగత బూరుగుపల్లి సుబ్బారావు భార్య సీతమ్మ తన వంతుగా రూ.3 కోట్లకుపైగా విలువైన ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు. చదవండి: (వైఎస్సార్ జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుంది) ఈ నెల 21న సీఎం జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు నాడు ఆమె తన భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయమై గురువారం ఆమె మాట్లాడుతూ తన భర్త సుబ్బారావు జ్ఞాపకార్థం ఆస్పత్రి నిర్మాణానికి సహకారం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు జెడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కరరామయ్య, సొసైటీ అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణబ్రహ్మానందం, వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు శిరిగిన శివరాధాకృష్ణ, కరుటూరి శివరామకృష్ణ, గూడపాటి చెంచయ్య, శిరిగిన నర్సింహమూర్తి, ముళ్ళపూడి కేశవరావు, ఎం.కృష్ణారావు, ఎం.సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. -
శరమ... ఒక మెరుపు
శరమ రాక్షస స్త్రీ. విభీషణుడి భార్య. శరూషుడు అనే గంధర్వుడి కుమార్తె. రామాయణంలో కొద్దిసేపు కనపడుతుంది. కానీ ఒక పెద్ద మెరుపు. విభీషణుడు ఎప్పుడూ ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురూ చతుర్ముఖ బ్రహ్మని ఉద్దేశించి తపస్సు చేసారు. బ్రహ్మ ప్రత్యక్షమవగానే ఒక్కొక్కడు ఒక్కొక్క వరం కోరాడు. ‘‘మనసు ఎప్పుడూ ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి ఉండుగాక!’’ అని విభీషణుడు కోరగా బ్రహ్మ తథాస్తన్నాడు. అందుకే తప్పు చేస్తున్నావని చెప్పినా వినని రావణుడు రాజ్యబహిష్కారం విధిస్తే, విభీషణుడు ధర్మాత్ముడయిన రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళిపోయాడు. అప్పుడు విభీషణుడి భార్య ఏం చేయాలి .. ఆమె కూడా ఆయన వెంటే వెళ్ళిపోవాలి. కానీ ఆమె వెళ్ళలేదు. భర్తమీద ప్రేమ లేక కాదు, భర్తతో కలిసి వెళ్ళాలని తెలియక కాదు. తన భర్తకు దూరమైన మరొక స్త్రీ దుర్మార్గుడైన రాక్షసుడు రావణుడివల్ల కష్టాలు పడుతుంటే, ఊరడించడానికి మనిషి లేకపోతే అది మహా పాపం–అని భర్తతో వెళ్లిపోవడం కన్నా, ఇక్కడే ఉండిపోతానని ప్రాణాలకు తెగించి ఉండిపోయింది. యుద్ధం ప్రారంభమవుతుందనగా రావణుడు సీతమ్మ దగ్గరకు వెళ్లాడు...‘‘సీతా! నిన్న రాత్రి రామ లక్ష్మణులు పలువురు వానరులతో కలిసి వచ్చి సముద్రపు ఒడ్డున విడిది చేసారు. నా సేనాధిపతి ప్రహస్తుడు సైన్యంతో వెళ్ళి నిద్రపోతున్న రాముని శిరస్సును కోసేశాడు. మిగిలిన వానరులందరూ పారిపోయారు. లక్ష్మణుడు కూడా పారిపోయాడు. రాముడి శిరస్సును నా సైన్యం తీసుకొచ్చింది... ఇదిగో చూడు’’ అని ఒక రాక్షసుడిని పిలిచి తల అక్కడ పెట్టు అన్నాడు. ఇంద్రజాల మహిమ ఎంత గొప్పగా ఉందంటే సీతమ్మ కూడా దిగ్భ్రమ చెందింది. ‘‘చూసావా ధనుస్సు. ఈ కోదండం పట్టుకునే కదా నన్ను సంహరిస్తాడన్నావు... ఈ రాముణ్ణి నమ్ముకునే కదా నా పాన్పు చేరలేదు. రాముడి తల తెగిపోయింది. ఇప్పుడు నిన్ను రక్షించే వారెవరు’’ అన్నాడు. సీతమ్మ గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఆ సమయంలో తన కష్టం చెప్పుకోవడానికి ఒక్కళ్ళు కూడా లేరక్కడ. అంత శోకంలో ఎవరికయినా మనసు పనిచేస్తుందా... తను కనబడితే చంపేస్తాడని తెలిసినా సరే, నిర్భయంగా శరమ ఆకాశంలో నిలబడింది. రావణుడు చూడలేదు. ఈలోగా ఎవరో వచ్చి రమ్మంటే రావణుడు అటు వెళ్ళాడు. ఆమెను చేరిన శరమ ‘‘అమ్మా సీతమ్మా ! బెంగపెట్టుకోకు. అదంతా రావణుడి మాయ... నేనిప్పుడు ఆకాశగమనం చేసి రామచంద్రమూర్తిని చూసి వచ్చాను. అయినా రాముడికి విశ్వామిత్రుడి వరం ఉంది కదా. ఆయనకు శ్రమ ఉండదు, జ్వరముండదు. నిద్రపోతున్న ఆయనను ఎవరూ సంహరించలేరు... అటువంటిది ఈ ధూర్తు్తడు ప్రహస్తుడు చంపగలడా... నన్ను నమ్ము... రాముడు పరమ సంతోషంగా ఉన్నాడు’’ అంది. అయినా ఊరడిల్లని సీతమ్మ రావణుడు ఏం చేస్తున్నాడో చూసి రమ్మంది. వెళ్ళి వచ్చిన శరమ ‘‘అమ్మా ఇప్పుడు విను. అవిగో నగారాలు మోగుతున్నాయి...అవిగో భేరీల శబ్దాలు.. యుద్ధసంరంభం జరుగుతున్నది. నిజంగా రావణుడు చెప్పినదే నిజమయితే రాముడు నిహతుడు అయిన తరువాత ఇంకా యుద్ధం ఏముంటుంది? అమ్మా నన్ను నమ్ము. ఉపశాంతికోసం నీ భర్త విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యక్ష దైవమయిన సూర్యుణ్ణి ఉపాసించు’’ అంటూ ఎలా చేయాలో ఉపదేశించింది. అంతటి త్యాగమూర్తులు ఈ దేశ స్త్రీలు. ఇవి కాల్పనిక కథలు కావు. ఇతిహాసాలు. పరమ సత్యాలు. -
ఆశ్రిత వత్సలుడు
పరదారాపహరణం చాలా పాపమని, సాక్షాత్తూ ఆదిశక్తి వంటి సీతమ్మను తెచ్చి బంధించడం లంకకు చేటని, రావణునికి అత్యంత ప్రమాదకరమని, మర్యాదగా సీతమ్మని రామునికి అప్పగించి, క్షమాపణలు వేడుకోమని ఎంతో హితబోధ చేశాడు విభీషణుడు తన అన్న అయిన రావణునికి. పోగాలం దాపురించిన రావణుడు ఆ మాటలను చెవికెక్కించుకోకపోగా తీవ్రంగా అవమానించడంతో విభీషణుడు దుష్టుడైన అన్నను వదిలి ధర్మస్వరూపుడైన రాముని శరణు వేడాలన్న ఉద్దేశ్యంతో ఎప్పుడూ తననే అనుసరించే నలుగురు అనుచరులతోపాటు లంకను వదిలి సముద్రాన్ని దాటి అవతలి తీరంలో వానర సేనతో ఉన్న శ్రీ రామచంద్రుడి దగ్గరకు వచ్చి ఆకాశంలోనే నిలచి రాముడిని శరణు వేడాడు. అప్పుడు విభీషణుని చూసిన సుగ్రీవుడు ఆ వచ్చిన వారు రాక్షసులనీ, వారిని వెంటనే ఎదుర్కోవలసిందనీ తన సేనలను ఆజ్ఞాపించాడు. సుగ్రీవుడి ఆనతిని అందుకున్న వానర సేన తనను చుట్టుముట్టబోగా, వారిని చూసి విభీషణుడు తాను లంకాధిపతి రావణుని సోదరుడిననీ, అన్నను వదిలి ధర్మమూర్తి అయిన రాముని శరణు కోరి వచ్చాననీ, తాను మిత్రుడినే తప్ప శత్రువుని కాననీ చెప్పాడు. ఆ మాటలు విని సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, మైందుడు తదితరులు అతనిని ఎంతమాత్రమూ నమ్మవద్దని, అతడికి ఆశ్రయం ఇవ్వడం ప్రమాదకరమనీ రామునికి చెప్పారు. హనుమంతుడు కూడా ఇంచుమించు అవే మాటలు చెప్పాడు. అప్పుడు రాముడు వారితో– ‘‘వానర వీరులారా! విభీషణుని గురించి మీరంతా చెప్పినవి విన్నాను. మీరు చెప్పిన మాటలు యదార్థమే కావచ్చునేమో కానీ, నాకొక వ్రతం ఉంది. అదేమంటే, నాకు శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా నా దగ్గరకు వచ్చి ‘శరణు’ కోరితే, వారిలో ఎటువంటి దోషాలున్నా, వారు ఎంతటి చెడ్డవారయినా సరే, నేను వారికి అభయమిచ్చి తీరుతాను. సుగుణాలు ఉన్నవానిని రక్షించడం కంటే దోషాలున్న వారిని రక్షించడంలోనే మంచితనం బయటపడుతుంది. మరొకటి, ఇక్కడున్న ధర్మసూక్ష్మమేమిటంటే, దుష్టుడైన రావణునికి ధర్మం తెలిసిన విభీషణుడు తమ్ముడు కాకూడదన్న నియమమేమీ లేదు కదా... అదేవిధంగా మన శత్రువుల వద్ద నుంచి వచ్చినంత మాత్రాన అతడు కూడా మనకు శత్రువు కానవసరం లేదు! మనకు మిత్రుడు కావచ్చు కదా! లోకంలో దాయాదులెవరూ మిత్రుల్లా కలిసి మెలిసి ఉండరు. వారిలో వారికి మనస్పర్ధలుంటాయి. అందుకే జ్ఞాతులు సాధారణంగా విడిపోతుంటారు. ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉంటారు. అలాగే సీత కారణంగా రావణుడికి, విభీషణుడికి భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి. అందుకే రావణుడు తమ్ముడిని తరిమి వేసి ఉంటాడు. మనం వచ్చిన కార్యం... అధర్మపరుడైన రావణుని ఎదిరించి, నా సీతను తీసుకు రావడం. కాబట్టి విభీషణుడికి, మనకు శత్రుత్వం ఎలా ఉంటుంది? ఒకవేళ మీరందరూ అనుమానించినట్లుగా విభీషణుడు దుష్టుడైనా కానీ మనకు వచ్చిన భయమేమీ లేదు. అతడు నాకు గానీ, మీలో ఎవరికైనా కానీ ఎటువంటి అపకారమూ చేయలేడు. నేను తలచుకుంటే ఈ భూమి మీద ఉన్న రాక్షసులను, దానవులను, యక్షులను ఒంటిచేత్తో ఎదుర్కోగలను. అలాంటిది ఈ ఐదుగురు రాక్షసులు ఎంత? శరణన్న విభీషణుడికి అభయమిస్తున్నాను. అతనిని ఇప్పుడే లంకకు రాజుగా ప్రకటిస్తున్నాను’’ అన్నాడు. రాముడికి ఉన్న ధర్మనిరతి, సంయమనం, ఆలోచన శక్తి, కుశాగ్రబుద్ధి, కొండంత ఆత్మవిశ్వాసాన్ని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాజైనవాడు ఎటువంటి విపత్కర పరిస్థితులలో ఉన్నప్పటికీ కేవలం అనుచరులు చెప్పిన మాటలను అసలు వినకుండా ఉండకూడదనీ, అదేవిధంగా ఆ మాటలను మాత్రమే విని, వాటిని బట్టి నిర్ణయం తీసుకోరాదనీ, తాను నిర్ణయించుకున్న విషయాన్ని ఎటువంటి తొట్రుపాటూ మరెంతటి మిడిసిపాటూ లేకుండా చక్కగా వివరించి చెప్పడం, చక్కగా ఆలోచించడం, సత్వర నిర్ణయాలు తీసుకోగలగడం, ఆ తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయడం ఎంతో మంచి చేస్తుందనీ మనం అర్థం చేసుకోవాలన్నదే ఇందులోని నీతి. – డి.వి.ఆర్. భాస్కర్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019