breaking news
-
మొదటి దశలో 102 సీట్లు... 2019లో ఎవరు గెలిచారు?
2024 లోక్సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ రేపు అంటే శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఓటర్లు ఈవీఎం యంత్రాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 19 న జరగనున్న లోక్సభ ఎన్నికల మొదటి దశ ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎన్డిఏ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖలు రాశారు. మొదటి దశ ఓటింగ్కు ముందు ప్రధాని ఎన్డీఏ అభ్యర్థులను వ్యక్తిగతంగా సంప్రదించారు. లోక్సభ మొదటి దశ పోలింగ్లో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, ఉత్తరాఖండ్లోని ఐదు, అరుణాచల్ప్రదేశ్లోని రెండు, మేఘాలయలో రెండు, అండమాన్ నికోబార్లో ఒకటి, మిజోరంలో ఒకటి, పుదుచ్చేరిలో ఒకటి, సిక్కింలోని ఒక స్థానానికి మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా లక్షద్వీప్లోని ఒక సీటు జత చేరింది. వీటితో పాటు రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో ఎనిమిది, మధ్యప్రదేశ్లో ఆరు, అసోం, మహారాష్ట్రల్లో ఐదు, బీహార్లో నాలుగు, పశ్చిమ బెంగాల్లో మూడు, మణిపూర్లో మూడు, జమ్మూకశ్మీర్, ఛత్తీస్గఢ్, త్రిపురలో ఒక సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్డీఏ 41 స్థానాలు గెలుచుకున్నాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయగా, డీఎంకే 24 స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. రేపు జరగనున్న మొదటి దశ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం, టి దేవనాథ్ తదితరులు పోటీలో ఉన్నారు. -
అచ్చోట ముచ్చెమట
లోక్సభ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. రెండు రోజుల్లో తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. కానీ ఈసారి ఎన్నికలు పరమ బోరింగ్గా సాగుతున్నాయన్న అభిప్రాయం గట్టిగా విన్పిస్తోంది. కాకపోతే తొలి, రెండో విడతల్లో పోలింగ్ జరిగే 191 లోక్సభ స్థానాల్లో 9 ‘హాట్ సీట్లు’ మాత్రం దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. రసవత్తర పోటీకి వేదికగా మారాయి. ఎందుకంటే వాటిలో కొన్ని స్థానాల్లో ఇండిపెండెంట్లు బరిలో దిగి ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మరికొన్ని చోట్ల అగ్రనేతలకు పెనుసవాలు ఎదురవుతోంది. ఇంకొన్ని చోట్ల సిట్టింగులకు గట్టి ఎదురుగాలి వీస్తోంది. ఆ సీట్లపై ఓ లుక్కేద్దాం...! – సాక్షి, నేషనల్ డెస్క్ మళ్లీ బీజేపీ పరమేనా? చురు (రాజస్తాన్, ఏప్రిల్ 19) కీలక అభ్యర్థులు: దేవేంద్ర ఝఝారియా (బీజేపీ), రాహుల్ కాస్వాన్ (కాంగ్రెస్) ఉత్తర రాజస్తాన్లోని ఈ లోక్సభ స్థానం థార్ ఎడారికి ముఖద్వారం. బీజేపీ కంచుకోట. రెండుసార్లు పారాలంపిక్స్లో స్వర్ణపతకం సాధించిన జావెలిన్ క్రీడాకారుడు ఝఝారియా పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి కాస్వాన్ బీజేపీ మాజీ కావడం విశేషం! గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున భారీ మెజారిటీతో నెగ్గారు. ఈసారి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లోకి ఫిరాయించి పోటీని ఆసక్తికరంగా మార్చేశారు. ఆయన బలమైన జాట్ నేత కావడంతో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎందుకంటే ఇక్కడి 22 లక్షల మంది ఓటర్లలో నాలుగో వంతు జాట్లే! మహిళా రెజ్లర్ల నిరసనలు, సాగు బిల్లులు తదితరాలతో జాట్లు బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాంతో, ‘నరేంద్రుని దేవేంద్రుడు’ ప్రచారమే దేవేంద్ర ఝఝారియాను గట్టెక్కిస్తుందని బీజేపీ ఆశిస్తోంది. తమిళనాట హోరాహోరీకి వేదిక కోయంబత్తూర్ (తమిళనాడు, ఏప్రిల్ 19) కీలక అభ్యర్థులు: కె.అన్నామలై (బీజేపీ), గణపతి పి.రాజ్కుమార్ (డీఎంకే), సింగై జి.రామచంద్రన్ (అన్నాడీఎంకే) తమిళనాట పాగా వేయాలన్న బీజేపీ వ్యూహానికి ఈ స్థానం కేంద్రబిందువుగా మారింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అన్నామలై బరిలో ఉండటమే అందుకు కారణం. దాంతో పొత్తులో భాగంగా పదేళ్లుగా వామపక్షాలకు కేటాయిస్తూ వస్తున్న ఈ స్థానంలో ఈసారి డీఎంకే పోటీ చేయడ తప్పలేదు. నగర మేయర్ రాజ్కుమార్ను పార్టీ బరిలో దింపింది. జౌళి పరిశ్రమకు కేంద్రమైన కోయంబత్తూరు మాంచెస్టర్ ఆఫ్ ద సౌత్గా పేరుబడింది. స్థానికేతర జనాభా ఎక్కువగా ఉన్న ఈ స్థానంపై బీజేపీ చాలా ఆశలే పెట్టుకుంది. తమిళనాడులో బీజేపీ నెగ్గిన తొట్టతొలి లోక్సభ స్థానాల్లో కోయంబత్తూరు ఒకటి. 1998, 1999ల్లో ఇక్కడ ఆ పార్టీ గెలిచింది! రాహుల్కు గట్టి పోటీ వయనాడ్ (కేరళ, ఏప్రిల్ 26) కీలక అభ్యర్థులు: రాహుల్గాంధీ (కాంగ్రెస్), అన్నీ రాజా (సీపీఐ), కె.సురేంద్రన్ (బీజేపీ) కొండ ప్రాంతమైన ఈ లోక్సభ సీటు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాం«దీకి సురక్షిత స్థానమని చెప్పేముందు ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. 2019లో ఏకంగా 4.3 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచిన రాహుల్ ఈసారి కేరళ బీజేపీ చీఫ్ కె.సురేంద్రన్, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు! మైనారిటీ ప్రాబల్య స్థానమైన వయనాడ్లో 32 శాతం ముస్లింలు, 13 శాతం క్రైస్తవులున్నారు. ఇండియా కూటమి భాగస్వాములు కాంగ్రెస్, సీపీఐ మధ్య ముఖాముఖి పోరు సాగుతుందని భావించినా బీజేపీ సురేంద్రన్ను బరిలో దించడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఆయనకు మద్దతుగా స్మృతీ ఇరానీ వంటి అగ్ర నేతలు ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. చతుర్ముఖ పోటీ! నగీనా (యూపీ, ఏప్రిల్ 19) కీలక అభ్యర్థులు: చంద్రశేఖర్ ఆజాద్ (ఏఎస్పీ–కేఆర్), సురేంద్రపాల్ సింగ్ (బీఎస్పీ), మనోజ్కుమార్ (ఎస్పీ), ఓం కుమార్ (బీజేపీ) ఈ లోక్సభ ఎన్నికల్లో చతుర్ముఖ పోరాటాలు జరుగుతున్న అతి తక్కువ స్థానాల్లో నగీనా ఒకటి. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) అభ్యర్థి చంద్రశేఖర్ ఆజాద్ రంగప్రవేశమే ఇందుకు కారణం. స్థానికంగా తిరుగులేని ఆదరణ భీం ఆర్మీ చీఫ్ అయిన ఈ దళిత నేత సొంతం. ఈ ఎస్సీ రిజర్వుడు స్థానంలో వారి జనాభా 20 శాతం దాకా ఉంటుంది. అయితే ముస్లింలు 43 శాతమున్నారు. వారి దన్నుకు తోడు రా్రïÙ్టయ శోషిత్ సమాజ్ అధ్యక్షుడు స్వామిప్రసాద్ మౌర్య మద్దతు కూడా ఆజాద్కు కలిసొచ్చే అంశం. 2009 నుంచి ఏ పార్టీ కూడా ఇక్కడ రెండోసారి గెలవలేదు! తీవ్ర పోటీకి వేదిక తిరువనంతపురం (కేరళ, ఏప్రిల్ 26) కీలక అభ్యర్థులు: శశి థరూర్ (కాంగ్రెస్), రాజీవ్ చంద్రశేఖర్ (బీజేపీ), పన్యన్ రవీంద్రన్ (సీపీఐ) అసలే సంప్రదాయ ప్రత్యర్థి అయిన లెఫ్ట్ ఫ్రంట్. దానికి తోడు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రాజీవ్ రూపంలో గట్టి ప్రత్యరి్థ. దాంతో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ శశి థరూర్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎంపీగా ఆయన పనితీరుపై స్థానిక జనం పెదవి విరుస్తుండటం మరింత ప్రతికూలంగా మారింది. అర్బన్ సీటు కావడంతో పాటు ఏకంగా 66 శాతం హిందూ జనాభా ఉండటం బీజేపీకి కలిసొచ్చే అవకాశముంది. రాజీవ్ గెలిస్తే కేరళలో కాషాయ పార్టీ నెగ్గిన తొలి స్థానంగా తిరువనంతపురం చరిత్ర సృష్టించనుంది. 2005లో ఇక్కడ గెలిచిన సీపీఐ అగ్ర నేత రవీంద్రన్ ఈసారి ఎవరి ఓట్లను ఏ మేరకు చీలుస్తారన్న దాన్ని బట్టి విజేత ఎవరో తేలవచ్చంటున్నారు. పప్పూ ప్రతీకార పోటీ! పూర్ణియా (బిహార్, ఏప్రిల్ 26) కీలక అభ్యర్థులు: పప్పూ యాదవ్ (స్వతంత్ర), బీమా భారతి (ఆర్జేడీ), సంతోష్ కుమార్ కుషా్వహా (జేడీ–యూ) సీమాంచల్లోని ఈ సాదాసీదా లోక్సభ స్థానం కాస్తా రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ రంగప్రవేశంతో సంకుల సమరానికి పోటీకి వేదికగా మారి దేశమంతటినీ ఆకర్షిస్తోంది. 1990ల్లో పూర్ణియా ఎంపీగా ఉన్న ఆయన 20 ఏళ్ల అనంతరం ఎన్నికల బరిలో దిగుతున్నారు! ఆర్జేడీ, కాంగ్రెస్రెండూ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ సిట్టింగ్ ఎంపీ కుషా్వహాతో పాటు ఆర్జేడీ అభ్యర్థి బీమా భారతికి చెమటలు పట్టిస్తున్నారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పప్పూ కంటతడి పెట్టిన తీరు కూడా ఓటర్లను బాగా కదిలించింది. గొగొయ్ వర్సెస్ గొగొయ్ జోర్హాట్ (అసోం, ఏప్రిల్ 19) కీలక అభ్యర్థులు: గౌరవ్ గొగొయ్ (కాంగ్రెస్), తపన్కుమార్ గొగొయ్ (బీజేపీ) ఈ స్థానం కాంగ్రెస్ కంచుకోట. ఒకప్పుడు మాజీ సీఎం తరుణ్ గొగొయ్ ప్రాతినిధ్యం వహించారు. 2019లో మాత్రం బీజేపీ అభ్యర్థి తపన్కుమార్ గొగొయ్ గెలుపొందారు. ఈసారి రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజం గౌరవ్ గొగొయ్ బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. తరుణ్ తనయునిగా కూడా ఆయనకు ప్రజల్లో చాలా ఆదరణ ఉంది. దాంతో ఈ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అహోం ప్రతిష్ట ప్రధానాంశంగా ప్రచారం చేస్తోంది. 2019లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన సుశాంత బోర్గోహెయిన్ చేరిక బీజేపీకి కలిసొచ్చే అంశం. యువ నేత జోరు బార్మేర్–జైసల్మేర్ (రాజస్తాన్, ఏప్రిల్ 26), కీలక అభ్యర్థులు: కైలాశ్ చౌదరి (బీజేపీ), ఉమేదా రాం బెనీవాల్ (కాంగ్రెస్), రవీంద్రసింగ్ భాటీ (స్వతంత్ర) సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరితో పాటు బెనీవాల్కు కూడా స్వతంత్ర అభ్యర్థి రవీంద్రసింగ్ భాటీ చుక్కలు చూపిస్తున్నారు. ఆయన సభలకు జనం భారీగా విరగబడుతున్నారు. ఇటీవలి రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బార్మేర్ లోక్సభ పరిధిలోని షెవో స్థానం నుంచి మంచి మెజారిటీతో నెగ్గారాయన. అప్పుడూ ఇండిపెండెంట్గానే పోటీ చేశారు. చౌదరి పనితీరుపై స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉండటంతో భాటీ ఈసారి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. దాంతో, ‘నా కారణంగా ప్రధాని మోదీని శిక్షించకండి’ అంటూ ఓటర్లను చౌదరి వేడుకోవాల్సి వస్తోంది! 19 శాతమున్న జాట్లు, 12 శాతముండే రాజ్పుత్లు ఇక్కడ నిర్ణాయకం కానున్నారు. కమలం వికసించేనా! త్రిసూర్ (కేరళ, ఏప్రిల్ 26) కీలక అభ్యర్థులు: సురేశ్ గోపీ (బీజేపీ), కె.మురళీధరన్ (కాంగ్రెస్), వి.ఎస్.సునీల్కుమార్ (సీపీఐ) 1952 నుంచీ ఒకసారి లెఫ్ట్, మరోసారి కాంగ్రెస్ నెగ్గుతూ వస్తున్న ఈ స్థానంపై బీజేపీ గట్టిగా దృష్టి పెట్టింది. ‘ఆపరేషన్ త్రిసూర్’లో భాగంగా ఈ ఆలయ నగరిని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు చుట్టేశారు. మలయాళ సినీ స్టార్ సరేశ్ గోపీని బరిలో దించారు. ప్రత్యర్థులిద్దరూ బలమైన నేతలు కావడంతో త్రిముఖ పోరు నెలకొంది. -
తెలంగాణ కాంగ్రెస్ లో తేలని టికెట్ల పంచాయతీ
-
నాడు కాంగ్రెస్ ఖాతాలో 414.. నేడు బీజేపీ అధిగమించేనా?
దేశంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు సొంతంగా కనీస ఓట్లను కూడా పొందలేని స్థితికి చేరిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 1991 నుంచి పార్టీ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. 1991 తర్వాత 2009 లోక్సభ ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ 200 సీట్ల సంఖ్యను తాకగలిగింది. మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 1951-52లో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 364 సీట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీకి మొత్తం 44.99 శాతం ఓట్లు వచ్చాయి. 1962లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్ల శాతంతో పాటు సీట్లు కూడా తగ్గాయి. ఓట్లు 44.71 శాతం ఉండగా, సీట్లు 361కి తగ్గాయి. 1967లో పార్టీ ప్రజాదరణ మరింత క్షీణించింది. ఓట్లు 40.78 శాతానికి, సీట్లు 283కి తగ్గాయి. అయితే 1971లో పార్టీకి వైభవం తిరిగివచ్చింది. ఓట్లు 43.68 శాతానికి, సీట్లు 352కి పెరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని 28 సీట్లు, బీహార్లో 39 సీట్లు, మహారాష్ట్రలో 42 సీట్లు, ఉత్తరప్రదేశ్లోని 73 సీట్లు వచ్చాయి. 1977లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. లోక్సభ పదవీకాలం నవంబర్తో ముగియాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఆ ఏడాది ఎన్నికలు ప్రకటించారు. ఎమర్జెన్సీతో ఆగ్రహించిన ప్రజానీకం ఏకమై కాంగ్రెస్ను కేవలం 154 సీట్లకు పరిమిత చేశారు. ఓట్ల శాతం కూడా 34 శాతానికి తగ్గింది. మరోవైపు జనతా పార్టీ 295 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే జనతా పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయింది. 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 42.69 శాతం ఓట్లతో 353 సీట్లు వచ్చాయి. 1984లో కూడా పార్టీ ఈ సంఖ్యను దాటేసింది. నాడు ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సొంత సెక్యూరిటీ గార్డులే హత్య చేశారు. దీంతో దేశంలో కాంగ్రెస్పై సానుభూతి వెల్లువెత్తింది. 1984 నాటి రికార్డును పార్టీ ఇప్పటి వరకు దాటలేదు. నాడు సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ ఓట్లు 48 శాతానికి పెరిగాయి. సీట్లు కూడా రికార్డు స్థాయిలో 414కు పెరిగాయి. గత పదేళ్లలో అటు బీజేపీగానీ, ఇటు కాంగ్రెస్గానీ ఈ రికార్డును దాటలేదు. కాగా లోక్సభలో మెజారిటీ కోసం 272 సీట్లు అవసరం. 1984 తర్వాత కాంగ్రెస్కు ఒక్కసారి కూడా ఒంటరిగా మెజారిటీ రాలేదని గణాంకాలు చెబుతున్నాయి. 1989లో 39.53 శాతం ఓట్లు, 197 సీట్లు వచ్చాయి. 1991లో పార్టీ 36.40 శాతం ఓట్లు, 244 సీట్లు సాధించగలిగింది. ఆ సమయంలో బీజేపీకి తొలిసారిగా 120 సీట్లు రాగా, 20 శాతానికి పైగా ఓట్లు ఆ పార్టీకి దక్కాయి. 2004 ఎన్నికల వరకు కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతూనే వచ్చింది. 1996లో కాంగ్రెస్కు 140 సీట్లు, బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. 1998లో ఆ పార్టీ 141 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 184 సీట్లు గెలుచుకుంది. 1999లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు కాంగ్రెస్కు 114 సీట్లు దక్కాయి. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. -
ఈశాన్యం ఎవరి వశం!
సెవెన్ సిస్టర్స్గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు తక్కువగానే ఉన్నప్పటికీ, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఏడు రాష్ట్రాలతో పాటు సిక్కింను సోదర రాష్ట్రంగా వ్యవహరింటారు. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాలతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. కొన్నేళ్లుగా జాతీయ పార్టీలు వాటికి తీవ్రంగా పోటీ ఇస్తున్నాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలతో ఈశాన్యంలో పాగా వేసింది. అయితే ఇటీవలి మణిపూర్ మారణకాండ నేపథ్యంలో సమీకరణాలు మారుతున్నాయి... నోట్: ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్సభ సీట్లున్న అసోంపై విడిగా కథనం అందిస్తాం మణిపూర్.. కాంగ్రెస్కు షాక్ మణిపూర్లో అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాల్లోనూ పట్టు నిలుపుకుంటూ వస్తున్న కాంగ్రెస్కు 2019లో తొలిసారి షాక్ తగిలింది. ఇక్కడి రెండు సీట్లలో ఓటమి పాలైంది. ఒకటి బీజేపీ, మరోటి ప్రాంతీయ పార్టీ నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు గెలుచుకున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. 60 సీట్లకు గాను బీజేపీ 32 స్థానాలు కైవసం చేసుకుని సొంతంగా మెజారిటీ దక్కించుకుంది. ప్రాంతీయ పార్టీలైన ఎన్పీఎఫ్, ఎన్పీపీ, లోక్ జనశక్తి పార్టీలతో కలిసి బీరేన్ సింగ్ సీఎంగా ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. గతేడాది కుకీ, మెయితీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు దేశమంతటా ప్రకంపనలు సృష్టించాయి. అత్యాచారాలు, సజీవ దహనాలతో మణిపూర్ అట్టుడికింది. ఇప్పటికీ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రభుత్వం అల్లర్ల బీజీపీ నివారణలో విఫలమైందని, మోదీ కనీసం ఒక్కసారైనా పర్యటించలేదంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మేఘాలయ... బీజేపీకి అందని ద్రాక్ష ఇక్కడా ప్రాంతీయ పార్టీల హవాయే సాగుతోంది. కాంగ్రెస్ పోటీ ఇస్తున్నా బీజేపీ పెద్దగా సోదిలో లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్పీపీ చెరో సీటు గెలవగా బీజేపీ ఖాతా తెరవలేదు. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగేలా కన్పిస్తోంది. ఇక మిజోరంలో ఏకైక లోక్సభ స్థానం ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ మధ్య చేతులు మారుతోంది. 2019లో ఎంఎన్ఎఫ్ గెలిచింది. నాగాలాండ్లో ఏకైక లోక్సభ సీటును 2004, 2014ల్లో నాగాలాండ్ పీపుల్స్ పార్టీ గెలుచుకుంది. 2019లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గెలిచింది. ఈసారి ఎన్సీపీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. సర్వేలు ఏమంటున్నాయి... అరుణాచల్, త్రిపురల్లోని 4 సీట్లూ బీజేపీవేనని, మణిపూర్లో బీజేపీ, కాంగ్రెస్ చెరోటి, మిజోరంలో జెడ్పీఎం, నాగాలాండ్లో ఎన్డీపీపీ, సిక్కింలో ఎస్కేఎం, మేఘాలయలో ఎన్పీపీకి 2 సీట్లు దక్కుతాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే బీజేపీ ఈశాన్యంలో తన 5 సీట్లను నిలబెట్టుకోనుంది. కాంగ్రెస్ ఒక స్థానాన్ని చేజార్చుకోనుంది. రెండు విడతల్లో పోలింగ్ అసోం మినహా ఈశాన్య రాష్ట్రాల్లో 11 లోక్సభ స్థానాలున్నాయి. అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపురలో రెండేసి, మిజోరం, నాగాలాండ్, సిక్కింలో ఒక్కో సీటు ఉన్నాయి. అరుణాచల్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర వెస్ట్, ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గాల్లో తొలి విడత (ఏప్రిల్ 19) ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర ఈస్ట్, ఔటర్ మణిపూర్లో రెండో దశలో (ఏప్రిల్ 26) పోలింగ్ నిర్వహించనున్నారు. త్రిపుర.. కమ్యూనిస్టుల కోట బద్దలు ఈ కమ్యూనిస్టుల కంచుకోటలో ఎట్టకేలకు కాషాయ జెండా ఎగరింది. 1998 నుంచి 2018 దాకా రాష్ట్రాన్ని సీపీఎం నేత మాణిక్ సర్కార్ ఏలారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లలో 36 స్థానాలు దక్కించుకుని బిప్లవ్ కుమార్ దేవ్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ రెండు సీట్లలోనూ బీజేపీ చేతిలో సీపీఎం ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపుతున్నా లోక్సభ పోరులో మాత్రం పూర్తిగా వెనకబడింది. అరుణాచల్లో బీజేపీ పాగా కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ రాష్ట్రంలో ఎట్టకేలకు కమలనాథులు పాగా వేశారు. ఇక్కడ లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 2004 నుంచి 2014 దాకా రాష్ట్రంలో కాంగ్రెసే అధికారాన్ని చేజక్కించుకుంది. లోక్సభ ఎన్నికల్లో మాత్రం రెండు సీట్లనూ 2004లో బీజేపీ, 2009లో కాంగ్రెస్ నెగ్గాయి. 2014లో చెరో సీటు దక్కించుకున్నాయి. 2019 మాత్రం మోదీ సునామీ ఈశాన్యాన్ని కూడా ముంచెత్తింది. దాంతో అరుణాచల్ పూర్తిగా బీజేపీ ఖాతాలో చేరింది. రెండు లోక్సభ సీట్లతో పాటు అసెంబ్లీలోనూ ఎన్డీఏ పాగా వేసి కాంగ్రెస్ (యూపీఏ) సుదీర్ఘ పాలనకు తెరదించింది. 60 సీట్ల అరుణాచల్ అసెంబ్లీలో ఎన్డీఏ భాగస్వాములు బీజేపీ 41 సీట్లు, జేడీయూ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ 5 గెలుచుకున్నాయి. పెమా ఖండూ సీఎంగా తొలిసారి పూర్తి మెజారిటీతో బీజేపీ సర్కారు కొలువుదీరింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోలింగ్కు ముందే ఖాతా తెరిచింది. సీఎం పెమా ఖండూతో సహా 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019లో కూడా ఖండూతో పాటు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. ఈసారి మొత్తం 60 సీట్లలోనూ బీజేపీ బరిలో ఉంది. సిక్కింలో లోకల్ హవా ఈ బుల్లి రాష్ట్రంలో కూడా లోక్సభతో పాటు అసెంబ్లీకీ ఎన్నికలు జరుతున్నాయి. ఇక్కడ లోకల్ పార్టీలదే పూర్తి హవా. దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సీఎం పదవిలో కొనసాగిన రికార్డు దక్కించుకున్న (1994 నుంచి 2019 వరకు, 5 సార్లు) పవన్ కుమార్ చామ్లింగ్కు గత ఎన్నికల్లో షాక్ తగిలింది. ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) చేతిలో చామ్లింగ్ పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఓటమి చవిచూసింది. లోక్సభ సీటు కూడా ఎస్కేఎం వశమైంది. దాంతో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019