breaking news
Ad - Sakshi_Home_Sticky
-
టీ20 వరల్డ్కప్లో ఓపెనర్లుగా రోహిత్, జైశ్వాల్.. గిల్కు నో ఛాన్స్?
ఐపీఎల్ 2024 సీజన్ ప్రస్తుతం క్రికెట్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. ఈ క్యాష్ లీగ్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే మరో మహాసంగ్రామానికి తెరలేవనుంది. జూన్1 నుంచి అమెరికా, వెస్టిండీస్ల వేదికగా టీ20 వరల్డ్ కప్-2024 షురూ కానుంది. అయితే ఈ టోర్నీ ఆరంభానికి నెల రోజుల పైగా సమయం ఉన్నప్పటికి.. ఐసీసీ నిబంధనల ప్రకారం మే 1లోపు ఆయా జట్లు తమ వివరాలను సమర్పించాల్సిందే. ఈ క్రమంలో ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్లను ఖారారు చేసే పనిలో పడ్డాయి. బీసీసీఐ కూడా తమ జట్టును ఏప్రిల్ 28న ప్రకటించే అవకాశముంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి వరల్డ్కప్లో భామయ్యే జట్టును వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీ20 వరల్డ్కప్లో భాగమయ్యే భారత టాప్-3 ఆటగాళ్లను ఎంచుకున్నాడు. భారత ఇన్నింగ్స్ను కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ను కలిసి ప్రారంభించాలని పఠాన్ అభిప్రాయపడ్డాడు. జైశ్వాల్ ముంబై ఇండియన్స్పై అద్బుతమైన సెంచరీతో చెలరేగాడని, కాబట్టి అతడు కచ్చితంగా ఓపెనర్గా రావాలని పఠాన్ అన్నాడు. అదే విధంగా ఫస్ట్ డౌన్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పఠాన్ ఎంపిక చేశాడు. వరల్డ్కప్ జట్టులో కోహ్లి కచ్చితంగా ఉంటాడని ఇర్ఫాన్ థీమా వ్యక్తం చేశాడు. స్ట్రైక్ రేట్ పరంగా క్రిస్ గేల్ కంటే కోహ్లినే మెరుగ్గా ఉన్నాడని, టీ20 వరల్డ్కప్ వంటి మెగా ఈవెంట్లో స్ట్రైక్ రేట్ పెద్ద సమస్య కాదని పఠాన్ ఎక్స్లో రాసుకొచ్చాడు. Now that World Cup is nearing. My top 3 for team India. 1) Rohit Sharma (in form as well as captain) 2) Yashasvi Jaiswal (been saying that he should be there even before his 100 purely cos he was performing well for team India before the ipl) 3) Virat Kohli. (Shouldn’t be… — Irfan Pathan (@IrfanPathan) April 23, 2024 -
తెలివిగా వ్యవహరిస్తున్న హార్దిక్.. పాపం శివం దూబే! నిజంగా నష్టమేనా?
‘‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన నాకెందుకో అంతగా నచ్చలేదు. ప్రేక్షకులకు వినోదం అందించడమే లక్ష్యంగా చూస్తే ఇది బాగానే ఉంటుంది. కానీ.. క్రికెటింగ్ కోణంలో చూస్తే.. సరికాదనే అనిపిస్తోంది. ఇక్కడ 12 మందితో కాదు 11 మందితోనే ఆడాలి.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల వాషింగ్టన్ సుందర్, శివం దూబే వంటి ఆల్రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. టీమిండియాకు ఇదైతే శుభసూచకం కాదు’’- రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఓపెనర్. ‘‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు నేను అనుకూలం కాదు. ఈ నిబంధన వల్ల జట్లు నిఖార్సైన బ్యాటర్లు లేదంటే బౌలర్ల సేవలనే ఉపయోగించుకుంటాయి. ఆల్రౌండర్లను ఎవరు పట్టించుకుంటారు? ఇలాంటి నిబంధనలు రూపొందించే వాళ్లు కేవలం బ్యాటింగ్ ఒక్కటే మ్యాచ్ దిశానిర్దేశాన్ని మారుస్తుందని అనుకుంటారేమో(నవ్వులు).. ఈ రూల్ వల్ల బౌలర్లకు తిప్పలు తప్పవు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జట్టులో అదనపు సభ్యుడు చేరతాడు. ఒకవేళ ఒక జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా ఉంటే వాళ్లు బ్యాటర్ను.. బౌలింగ్ వీక్గా ఉంటే బౌలర్ను తెచ్చుకుంటారు. అందుకే బ్యాటర్ వచ్చీ రాగానే హిట్టింగ్ మొదలుపెడతాడు. గత రెండేళ్లుగా గమనిస్తూనే ఉన్నా.. ఎనిమిదో నంబర్ వరకు బ్యాటర్లు ఉంటారు కాబట్టి స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తారు’’- అక్షర్ పటేల్, టీమిండియా స్పిన్ ఆల్రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్. మొన్న రోహిత్ శర్మ.. ఇప్పుడు అక్షర్ పటేల్ ఇలా చాలా మంది ఐపీఎల్లోని ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఆల్రౌండర్లకు నష్టం చేకూరుస్తుందనే వాదనలు వినిపిస్తున్నారు. ఏమిటీ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన? ఐపీఎల్-2023కి ముందు నిర్వాహకులు ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. బ్యాటింగ్ లేదంటే బౌలింగ్ చేయడానికి జట్టులోకి వచ్చే సబ్స్టిట్యూట్ ప్లేయర్. ఈ నిబంధన ప్రకారం ఇండియన్ ప్లేయర్ను ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటుంది. టాస్ సమయంలో కెప్టెన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్లుగా నలుగురి పేర్లను నామినేట్ చేయాలి. అందులో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోవచ్చు? ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు లేదంటే ఓవర్ పూర్తైన తర్వాత.. లేదంటే వికెట్ పడిన అనంతరం.. లేదా బ్యాటర్ రిటైర్ అయినపుడు కెప్టెన్ తమ ఇంపాక్ట్ ప్లేయర్ను బరిలోకి దించవచ్చు. ఒక బౌలింగ్ చేస్తున్న జట్టు ఓవర్ మధ్యలోనే(వికెట్ పడ్డా/బ్యాటర్ రిటైర్ అయినా) ఇంపాక్ట్ ప్లేయర్ను తీసుకువస్తే ఆ వ్యక్తిని మిగిలిన ఓవర్ పూర్తయ్యేదాకా బౌలింగ్ చేసేందుకు అనుమతించరు. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత.. ఎవరి స్థానంలో అయితే ఇంపాక్ట్ ప్లేయర్ వస్తారో.. సదరు ఆటగాడు మిగిలిన మ్యాచ్కు దూరమవుతాడు. కనీసం సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా ఉండే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ విదేశీ ప్లేయర్ని తీసుకుంటే? నిబంధనల ప్రకారం తుదిజట్టులో నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు. కాబట్టి అప్పటికే జట్టులో నలుగురూ ఉన్నారంటే కచ్చితంగా ఇండియన్ ప్లేయర్నే ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకోవాలి. అయితే, టాస్ సమయంలోనే నలుగురు సబ్ట్యూట్లలో ఒకరిగా విదేశీ ప్లేయర్ను నామినేట్ చేయాలి. జట్టులో ఎంతమంది? ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా జట్టులో 11 మంది కంటే ఎక్కువయ్యే అవకాశం లేదు. బ్యాటర్ స్థానంలో బ్యాటర్.. బౌలర్ స్థానంలో బౌలర్నే ఎక్కువగా సబ్ట్యూట్గా ఉపయోగించుకుంటారు. ఒకవేళ బౌలింగ్ టీమ్ గనుక ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ను తీసుకువస్తే.. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయవచ్చు. లేదంటే పవర్ ప్లే లేదా డెత్ ఓవర్ల స్పెషలిస్టు సేవలను వారి ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. శివం దూబేకు నో ఛాన్స్! ముందే సర్దుకున్న హార్దిక్ అయితే, ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వలన ఆల్రౌండర్లు నష్టపోతున్నారనేది చర్చ. రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ చెప్పినట్లు బ్యాటింగ్ టీమ్ స్పెషలిస్టు బ్యాటర్ను.. బౌలింగ్ టీమ్ స్పెషలిస్టు బౌలర్ను తెచ్చుకుంటుంది. ఒకవేళ ఆల్రౌండర్లకు ఛాన్స్ ఇచ్చినా వాళ్లు ఏదో ఒక సేవకే పరిమితం అవుతారు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేస్ ఆల్రౌండర్ శివం దూబేను ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకుంటోంది. అతడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తుండగా.. బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. టీ20 వరల్డ్కప్-2024 టోర్నీకి ముందు ఇలా జరగడం ఒక విధంగా అతడికి నష్టం చేకూరుస్తోంది. ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం హార్దిక్ పాండ్యాతో పోటీ పడుతున్న దూబే.. బౌలింగ్ చేయనట్లయితే సెలక్టర్లు అతడి వైపు మొగ్గు చూపరు. మరోవైపు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఉన్న పాండ్యా ప్రమాదాన్ని ముందుగా పసిగట్టాడేమో మళ్లీ బౌలింగ్ మొదలుపెట్టి తన ఆల్రౌండ్ నైపుణ్యాలను మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలా చూసుకుంటే కష్టమే ఆల్రౌండర్లకు జరుగుతున్న నష్టం గురించి ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇక అంతర్జాతీయ మ్యాచ్లలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదు కాబట్టి తుదిజట్టు కూర్పు కాస్త కష్టంగానే మారుతుంది. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి ఫామ్(బ్యాటింగ్/బౌలింగ్) కోల్పోయిన ఆల్రౌండర్కు జాతీయ జట్టు తరఫున ముఖ్యంగా వరల్డ్కప్ వంటి మెగా టోర్నీ సమీపిస్తున్న తరుణంలో టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమే! -
రోహిత్తో కలిసి అతడే ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్-2024 కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే, అదే సమయంలో యశస్వి జైస్వాల్ కూడా రేసులో ఉన్నాడనే విషయం కూడా మర్చిపోద్దని దాదా పేర్కొన్నాడు. కాగా వరల్డ్కప్ జట్టు ఎంపికకు ఐపీఎల్-2024 ప్రదర్శన కీలకం కానుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2022 తర్వాత సుదీర్ఘకాలం టీ20 జట్టుకు దూరమైన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ఇటీవల స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మెగా టోర్నీలో వీరిద్దరు ఓపెనర్లుగా దిగనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో కోహ్లి ఎనిమిది మ్యాచ్లలో కలిపి 379 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఓ సెంచరీ(113 నాటౌట్) కూడా ఉంది. మరోవైపు.. రోహిత్ శర్మ కూడా శతకంతో చెలరేగాడు. ఎనిమిది మ్యాచ్లలో కలిపి 303 పరుగులతో ప్రస్తుతం టాప్-5లో ఉన్నాడు. వీరిద్దరు ఇలా ఫామ్లో ఉండటం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇక రాజస్తాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభంలో తడబడ్డా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో అజేయ సెంచరీ(104)తో దుమ్ములేపి రేసులోకి దూసుకువచ్చాడు. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు. 40 బంతుల్లోనే సెంచరీ చేయగల సత్తా విరాట్ కోహ్లికి ఉంది. వెళ్లి హిట్టింగ్ ఆడటమే పనిగా పెట్టుకోవాలి. 5-6 ఓవర్ల తర్వాత ఫలితం అదే కనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం వరల్డ్కప్లో రోహిత్- విరాట్ కలిసి ఓపెనింగ్ చేయాలి. సెలక్టర్ల మనసులో ఏముందో మనం అంచనా వేయలేం. కానీ నేను మాత్రం ఇది బాగుంటుందనే అనుకుంటున్నా. అలా అని యశస్వి జైస్వాల్ పేరును సెలక్టర్లు మర్చిపోతారని భావించడం లేదు. అతడొక ప్రత్యేకమైన ఆటగాడు. నిలకడైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ఏదేమైనా యువ, అనుభవజ్ఞులైన జట్టుతో టీమిండియా వరల్డ్కప్ బరిలోకి దిగాలి’’ అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కాగా మే 26న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది. చదవండి: T20 Captain: ‘రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే.. ఎనీ డౌట్?’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హార్దిక్ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా ఆఖరికి!
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠ రేపింది. చివరి ఓవర్ వరకు ఇరు జట్ల మధ్య ఊగిసలాడిన విజయం ఆఖరికి ముంబై వైపు మొగ్గు చూపింది. ఫలితంగా హార్దిక్ సేన ఈ సీజన్లో ఎట్టకేలకు మూడో విజయం అందుకుంది. అయితే, గురువారం నాటి ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన నెట్టింట వైరల్గా మారింది. కాగా చంఢీగడ్లోని ముల్లన్పూర్ వేదికగా సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముంబైని బ్యాటింగ్కు ఆహ్వానించింది. సూర్యకుమార్ యాదవ్ అర్ధ శతకం(78) సాధించగా.. రోహిత్ శర్మ (36), తిలక్ వర్మ(18 బతుల్లో 34-నాటౌట్) రాణించడంతో ముంబై మెరుగైన స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే చతికిలపడ్డ పంజాబ్ కింగ్స్ 14/4 స్కోరుతో తేలికగా మ్యాచ్ను ముంబైకి అర్పించేసుకుంటుంది అనిపించింది. కానీ పంజాబ్ హీరోలు శశాంక్ సింగ్(25 బంతుల్లో 41), అశుతోశ్ శర్మ(61) అంత తేలికగా తలవంచలేదు. ముంబైకి చెమటలు పట్టిస్తూ ఓ దశలో మ్యాచ్ను పంజాబ్ వైపు తిప్పేశారు. టెయిలెండర్ హర్ప్రీత్ బ్రార్(21) పట్టుదలగా పోరాడాడు. అయితే, హర్షల్ పటేల్(1 నాటౌట్)తో పాటు కగిసో రబడ క్రీజులో ఉన్న తరుణంలో ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయ సమీకరణం 12 పరుగులుగా మారింది. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేసర్ ఆకాశ్ మధ్వాల్ చేతికి బంతినిచ్చాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో.. తీవ్ర ఒత్తిడి నడుమ ఆకాశ్ మధ్వాల్ ఫీల్డ్ సెట్ చేసే సమయంలో మాజీ సారథి రోహిత్ శర్మ వద్దకు వెళ్లి సలహాలు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా పట్టించుకోని ఆకాశ్ మధ్వాల్.. రోహిత్తో చాలా సేపు చర్చించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ‘మాస్టర్ మైండ్’ రోహిత్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆకాశ్ మధ్వాల్ను ఆది నుంచి ఎంకరేజ్ చేసింది రోహిత్ శర్మనే అంటూ గుర్తుచేస్తున్నారు. My guy, Madhwal was trying his best not to look at Hardik 😭😭😭 pic.twitter.com/DlWlHj2BV7 — ab (rohit's version) (@ydisskolaveridi) April 18, 2024 ఇక మధ్వాల్ బౌలింగ్లో ఫీల్డ్ సెట్ చేసే విషయంలో అలాగే జస్ప్రీత్ బుమ్రా సైతం తన వంతు సాయం అందించాడు. ఇక పంజాబ్ ఇన్నింగ్స్లో ఆఖరి ఓవర్ వేసిన మధ్వాల్ బౌలింగ్లో తొలి బంతి వైడ్గా వెళ్లగా.. రెండో బంతికి రబడ రనౌట్ కావడం(మహ్మద్ నబీ/ఇషాన్ కిషన్)తో పంజాబ్ కథ ముగిసిపోయింది. ముంబై తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. During last over Akash Madhwal ignored hardik and listening to Ro and setting the Field 😂😂#RohitSharma #RohitSharma #MumbaiIndians #MumbaiIndians #MumbaiMeriJaan #IPLonJioCinema #IPL2024 #IPL #IPLOnStar #IPL2024live #IPLFanWeekOnStar #IPLUpdates #MIvsPBKS #MIvsPBKS #IPLUpdates pic.twitter.com/gcfwrduSSV — Rohit Sharma ( Pranta Mondal ) (@PrantaMondal110) April 18, 2024 An absolute rollercoaster of a game in Mullanpur comes to an end! 🎢 And it's the Mumbai Indians who emerge victorious in a nerve-wracking contest 🔥👏 Scorecard ▶️ https://t.co/m7TQkWe8xz#TATAIPL | #PBKSvMI pic.twitter.com/sLKVcBm9oy — IndianPremierLeague (@IPL) April 18, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
PBKS Vs MI Highlights Photos: అశుతోష్ మెరుపులు వృథా ..9 పరుగులతో ముంబై గెలుపు (ఫొటోలు)
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019