breaking news
-
ఈసారి టైటిల్ సన్రైజర్స్దే!.. రిక్కీ పాంటింగ్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024లో చాంపియన్గా నిలవడానికి గల అర్హత ఇదేనంటూ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడైన బ్యాటింగ్తో ముందుకు సాగే జట్టే టైటిల్ సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా క్యాష్ రిచ్ తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు 31 మ్యాచ్లు జరుగగా.. తొమ్మిదికి పైగా మ్యాచ్లలో.. ఒక ఇన్నింగ్స్లో 200.. అంతకంటే పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఇక ఈ సీజన్లో కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ రోజుల వ్యవధిలోనే తమ రికార్డు తామే బద్దలు కొట్టింది. దుమ్మురేపుతున్న సన్రైజర్స్ తొలుత ముంబై ఇండియన్స్పై 277 పరుగులు సాధించిన ఎస్ఆర్హెచ్.. ఆ తర్వాత ఆర్సీబీపై 287 పరుగులు స్కోరు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅 Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 తగ్గేదేలే అంటున్న కేకేఆర్ మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ సైతం ఢిల్లీ క్యాపిటల్స్పై 272 పరుగులతో సత్తా చాటింది. ఇక తాజాగా మంగళవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్ వరుసగా 224, 223 పరుగులు స్కోరు చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పటికే రెండుసార్లు భారీ స్కోరు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డులు సాధించింది. కేకేఆర్ కూడా మా జట్టు మీద 272 రన్స్ స్కోరు చేసింది. సన్రైజర్స్ సూపర్ ఫామ్ నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగానే బ్యాటింగ్ జట్లకు ఈ మేరకు ప్రయోజనం చేకూరుతున్నట్లు అనిపిస్తోంది. ఆర్సీబీతో మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఎంతగా ప్రభావం చూపాడో చూశాం. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేగానీ ఆ మాదిరి షాట్లు ఆడలేరు. బ్యాటింగ్ ఆర్డర్లో డెప్త్ ఉన్న కారణంగా కూడా అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగాడు. ఐపీఎల్ వంటి మేజర్ టోర్నీల్లో లేదా బిగ్ బాష్ లీగ్లో.. ఇలా ఎక్కడ చూసినా సరే లక్ష్యాన్ని కాపాడుకోగలిగి జట్లే విజయం సాధించాయి. అయితే.. ఈసారి ఐపీఎల్ మాత్రం భిన్నంగా సాగుతోంది. ఆ జట్టుదే టైటిల్ బౌలర్లను చితక్కొడుతూ భారీ స్కోర్లు సాధించిన జట్లే టైటిల్ దిశగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. డిఫెన్సివ్ బౌలింగ్పై ఆధారపడే జట్ల కంటే దూకుడుగా బ్యాటింగ్ చేసే జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’ అని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అలా అయితే ఈసారి సన్రైజర్స్దే టైటిల్! ఇక పాంటింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే సీజన్ ఆరంభం(కేకేఆర్తో మ్యాచ్లో 204) నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సన్రైజర్స్కే టైటిల్ విన్నర్గా నిలిచే ఛాన్స్ ఉందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాంటింగ్ మార్గదర్శనంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం రెండే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక పంత్ సేన తమ తదుపరి మ్యాచ్లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్ను అహ్మదాబాద్లో ఢీకొట్టనుంది. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి!
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ అన్నాడు. మెగా టోర్నీ ఆడే అర్హత పంత్కు ఉందని.. తన దృష్టిలో అతడే టీమిండియాకు మొదటి వికెట్ కీపర్ ఆప్షన్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటి కచ్చితంగా వరల్డ్కప్ ఆడే జట్టులో పంత్ చోటు దక్కించుకుంటాడని రిక్కీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా 2022, డిసెంబరులో కారు ప్రమాదానికి గురై.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్ కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సుదీర్ఘకాలం పాటు పునరావాసం పొందిన పంత్.. క్రమక్రమంగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్ ఆడి 194 పరుగులు చేసిన పంత్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే.. కెప్టెన్గా మాత్రం పంత్ విఫలమవుతూనే ఉన్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ ఇప్పటిదాకా ఆరు మ్యాచ్లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇదిలా ఉంటే.. మే 27న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు వికెట్ కీపర్ ఎంపిక గురించి రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్కే చోటివ్వాలి! ‘‘వరల్డ్కప్ జట్టులో రిషభ్ పంత్కు చోటు ఇవ్వాలా? అంటే కచ్చితంగా ఇవ్వాలనే చెబుతా. ఐపీఎల్ ముగిసేలోపు అతడు అందుకు అర్హత సాధిస్తాడు. గత ఆరు సీజన్లలో పంత్ మెరుగ్గా ఆడాడు. టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదని తెలుసు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నారు. చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే.. నేను గనుక జట్టును ఎంపిక చేయాల్సి వస్తే రిషభ్ పంత్కే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. నన్నెపుడు ఈ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం ఇస్తాను’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్కప్-2024 టీమిండియా వికెట్ కీపర్ల రేసులో ప్రస్తుతం సంజూ శాంసన్ ముందుకు దూసుకుపోతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 264 పరుగులు సాధించాడు. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కనికరం లేకుండా ఆడారు.. మా ఆటతీరును చూసి సిగ్గేసింది: రికీ పాంటింగ్
ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 106 పరుగుల తేడాతో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఢిల్లీ విఫలమైంది. తొలుత కేకేఆర్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశారు. కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 272 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో డీసీ 166 పరుగులకే ఆలౌటైంది. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. తమ జట్టు ఆట తీరును తనకు చాలా బాధ కల్గించందని పాంటింగ్ అన్నాడు. "ఈ మ్యాచ్లో మా జట్టు తొలి అర్ధభాగం ఆటను చూశాక సిగ్గేసింది. బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. చెత్త బౌలింగ్తో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 20 ఓవర్లు వేయడానికి ఏకంగా రెండు గంటలు సమయం పట్టింది. నిర్ణీత సమయానికి మేము 2 ఓవర్లు వెనుకబడ్డాము. దీంతో సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్లతోనే చివరి రెండు ఓవర్లు బౌలింగ్ చేశాం. ఈ మ్యాచ్లో చాలా విషయాలు ఆమోదయోగ్యం కానివిగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా మేము చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. కేకేఆర్ బ్యాటర్లు కనీసం కనికరం లేకుండా ఆడారు. పవర్ప్లేను వారు బాగా ఉపయోగించుకున్నారు. పవర్ ప్లేలోనే 88 పరుగులు రాబట్టారు. ఆట ఆరంభంలోనే మ్యాచ్పై పట్టు కోల్పోతే తిరిగి రావడం చాలా కష్టం. మా బౌలర్లు కమ్బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికి వారు మాత్రం మాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో మేము ఓడిపోయినప్పటికీ పంత్ తన ఫామ్ను కొనసాగించడం మా జట్టుకు సానుకూలాంశమని" పాంటింగ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. -
జో రూట్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్గా
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్గా రూట్ రికార్డులకెక్కాడు. ధర్మశాల వేదికగా భారత్తో జరిగిన ఐదో టెస్టులో 84 పరుగులు చేసిన రూట్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఇప్పటివరకు భారత్పై టెస్టుల్లో 21 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ భారత్పై 20 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్తో పాంటింగ్ ఆల్టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి పాలైంది. భారత బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. చదవండి: IND vs ENG: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు. -
IPL 2024: పంత్ రీఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాంటింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ తమ కెప్టెన్ రిషబ్ పంత్ పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపీఎల్ సీజన్కు (2024) పంత్ పూర్తిగా అందుబాటులో ఉండాలని కోరుకుంటూనే.. అతని రీఎంట్రీపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని బాంబు పేల్చాడు. రీఎంట్రీపై పంత్ను అడిగితే మాత్రం అన్ని మ్యాచ్లకు సై అంటాడని, వికెట్కీపింగ్ విషయంలోనూ తగ్గేదేలేదని అంటాడని, నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగుతానని ధీమాగా చెబుతాడని అన్నాడు. పంత్ ప్రస్తుత పరిస్థితి చూస్తే వచ్చే సీజన్లో అతను ఆడగలడని తెలుస్తుంది కాని అతను పూర్తి మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడా.. కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపట్టగలడా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉందని తెలిపాడు. పంత్ రీఎంట్రీకి సంబంధించి ఎలాంటి విషయమైనా తమకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని అన్నాడు. కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ రీఎంట్రీపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడని తెలిపాడు. ఒకవేళ పంత్ కెప్టెన్సీ చేపట్టలేని పక్షంలో డేవిడ్ వార్నర్ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడని కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుత జట్టు విషయంలో సంతృప్తి వ్యక్తం చేశాడు. హ్యారీ బ్రూక్ తమలో చేరడం కలిసొస్తుందని అభిప్రాయపడ్డాడు. అతన్ని ఫినిషర్ పాత్రలో వాడుకుంటామని తెలిపాడు. వార్నర్, మిచెల్ మార్ష్ టాపార్డర్లో ఉంటారని కన్ఫర్మ్ చేశాడు. అక్షర్, కుల్దీప్లతో స్పిన్ విభాగం పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. నోర్జే, జై రిచర్డ్సన్ అందుబాటులోకి వస్తే తమకు తిరుగే ఉండదని తెలిపాడు. మేజర్ లీగ్ క్రికెట్లో వాషింగ్టన్ ఫ్రీడం కోచ్గా ఎంపికైన సందర్భంగా మాట్లాడుతూ పాంటింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, 2022 చివరి రోజుల్లో ఢిల్లీ కెప్టెన్ పంత్ కారు ప్రమాదానికి గురై ఏడాదికి పైగా క్రికెట్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. పంత్ ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. అయితే అతను వికెట్కీపింగ్ చేయగలడా లేదా అనే విషయం అనుమానాస్పదంగా ఉంది. మేజర్ యాక్సిడెంట్ కావడంతో పంత్ రెండు కాళ్లలకు తీవ్రగాయాలయ్యాయి. అతని కాళ్లలో రాడ్స్ వేసి సర్జరీ చేశారు. ఈ నేపథ్యంలో పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ మార్చి చివరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019