breaking news
-
నేకెడ్ గన్ రీమేక్లో...
హాలీవుడ్ హాట్ తార పమేలా ఆండర్సన్ అభిమానులకు ఓ శుభవార్త. ఈ గ్లామరస్ స్టార్ తాజాగా ‘నేకెడ్ గన్’ రీమేక్లో నటించడానికి అంగీకరించారు. ఈ మధ్యకాలంలో చేసిన చిత్రాల్లోకన్నా ఈ చిత్రంలో పమేలా పాత్ర నిడివి ఎక్కువ కావడం, హీరోయిన్ పాత్ర కావడం అనేది అభిమానులు ఆనందించే విషయమే. 1980 చివర్లలో 1990 ఆరంభంలో వచ్చిన క్రైమ్ కామెడీ ‘నేకెడ్ గన్’ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మూడో భాగం 1994లో వచ్చింది. 30 ఏళ్లకు ‘నేకెడ్ గన్’ మళ్లీ తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అకీవా షాఫర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ రీమేక్లో లీడ్ రోల్లో లియామ్ నీసన్ నటించనుండగా, అతని సరసన పమేలా ఆండర్సన్ నటించనున్నారు. గత మూడు భాగాల్లో డిటెక్టివ్ పాత్రను లెస్లీ నీల్సన్ చేయగా అతని ప్రేయసిగా ప్రిసిల్లా ప్రెస్లీ నటించారు. రీమేక్లో డిటెక్టివ్గా లియామ్ నీసన్, అతని ప్రేయసిగా పమేలా ఆండర్సన్ నటించనున్నారు. వచ్చే ఏడాది జూలై 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక పమేలా గురించి చె΄్పాలంటే... 1990లలో హాటెస్ట్ స్టార్ అంటే పమేలానే. ‘ప్లే బాయ్’ మ్యాగజీన్ మోడల్గా అప్పట్లో బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారామె. అలాగే బుల్లితెర కోసం ‘బేవాచ్’ సిరీస్ (1992–1997)లో చేసిన సీజే పార్కర్ పాత్ర కూడా హాట్ స్టార్గా పమేలాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమాల పరంగా ‘రా జస్టిస్, స్కేరీ మూవీ 3, బోరాట్, బేవాచ్’ వంటివి పమేలా క్రేజ్ కొనసాగడానికి ఉపయోగపడ్డాయి. -
మలయాళ హిట్ మూవీ తెలుగులో రీమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మలయాళ సినిమాల హవా నడుస్తోంది. మిగతా ఇండస్ట్రీల్లో సరైన మూవీ లేక నీరసంగా ఉండగా.. మలయాళంలో మాత్రం వరసపెట్టి బ్లాక్ బస్టర్స్ పడుతున్నాయి. దీంతో అందరూ ఈ చిత్రాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఓ క్రేజీ మలయాళ సినిమా తెలుగులో రీమేక్ కానుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: 'ప్రభాస్'కు గిఫ్ట్ పంపిన వేణుస్వామి సతీమణి) లాక్ డౌన్ టైంలో ఓటీటీలకు జనాలు బాగా అలవాటు పడిపోయారు. అలా అన్ని భాషా చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరించారు. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాలకు బాగా ఎడిక్ట్ అయిపోయారు. అలా 2022లో 'జయజయజయహే' చిత్రాన్ని చూసి అరె భలే ఉందే అనుకున్నారు. ఎలాంటి అంచనాలకు లేకుండా రిలీజై దాదాపు రూ.45 కోట్ల మేర కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆల్రెడీ దీని తెలుగు వెర్షన్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో రీమేక్ చేయబోతున్నారని, ఇందులో ప్రముఖ నటుడు-దర్శకుడు తరుణ్ భాస్కర్.. లీడ్ రోల్ చేయనున్నాడని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: రవితేజ మల్టీప్లెక్స్.. పూజా కార్యక్రమంలో కుమార్తె 'మోక్షద' సందడి) -
'ఉప్పెన' రీమేక్.. స్టార్ హీరోయిన్ చెల్లెలుకు ఛాన్స్
తెలుగు చిత్రం 'ఉప్పెన' పేరుకు తగ్గట్టుగానే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్. అయినా చిత్రం సంచలన విజయం సాధించింది. వర్ధమాన నటుడు వైష్ణవ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంతోనే కృతి శెట్టి ఎంట్రీ ఇచ్చింది. నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళం, బాలీవుడ్లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా రామ్ చరణ్- జాన్వీకపూర్ల కొత్త ప్రాజెక్ట్ RC16 సినిమా ఓపెనింగ్ కార్యక్రం జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బుచ్చిబాబు డైరెక్టర్గా ఉన్నారు. సినిమా ప్రారంభ కార్యక్రమంలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమా చూశానని అది తనకు బాగా నచ్చిందని చెప్పారట. అంతేకాకుండా ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయాలనే అభిప్రాయం ఉన్నట్లు పేర్కొన్నారట. ఈ క్రమంలో తన చిన్న కూతురు ఖుషి కపూర్ని ఉప్పెన సినిమా చూడమని బోనీ కపూర్ సలహా ఇచ్చారట. ఒకవేళ బాలీవుడ్లో ఉప్పెన చిత్రాన్ని రీమేక్ చేస్తే అందులో హీరోయిన్గా ఖుషి కపూర్ను సెట్ చేయాలని ఆయన ప్లాన్లో ఉన్నారట. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ స్కూల్లో ఖుషి కపూర్ విద్యాభ్యాసం పూర్తిచేసింది. లండన్ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ కూడా తీసుకుంది. బాలీవుడ్లో సరైన ఎంట్రీ కోసం ఆమె ఎదురుచూస్తుంది. ఉప్పెన సినిమా అయితే ఆమెకు కరెక్ట్గా సెట్ అవుతుందని బోనీకపూర్ ప్లాన్లో ఉన్నారట. మరీ ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే బోనీ కపూర్నే క్లారిటీ ఇవ్వాలి. (అక్క జాన్వీ కపూర్తో ఖుషి కపూర్) మరోవైపు ఉప్పెన సినిమాను కోలీవుడ్లో కూడా రీమేక్ చేయాలనే ప్లాన్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తుందట. విజయ్ వారసుడు సంజయ్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ తమిళ్లో ఉప్పెన రీమేక్ అయితే అందులో కృతి శెట్టినే హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువ అని చెప్పవచ్చు. ఇప్పటికే పలు సినిమాలతో కోలీవుడ్లో కృతి శెట్టి బిజీగా ఉంది. ఉప్పెన రీమేక్ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇండస్ట్రీలో రూమర్స్ భారీగానే కొనసాగుతున్నాయి. -
సూపర్ హిట్ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. -
మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ మధ్యే మోకాలికి చిన్నపాటి సర్జరీ చేయించుకున్న ఆయన.. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని, కొత్త ప్రాజెక్ట్స్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ మధ్యే 'భోళా శంకర్' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన చిరు.. కెరీర్లోనే ఘోరమైన డిజాస్టర్ని అందుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీ వల్ల మెగాస్టార్ చిరు.. తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని కంప్లీట్ యాక్టర్ అనొచ్చు. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ఆయన సినిమాలు చేస్తున్నారు. హిట్, బ్లాక్బస్టర్ సినిమాలతో పాటే ఫ్లాప్స్ని కూడా చూశారు. అయితే అప్పట్లో అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి జనాలకు పెద్దగా తెలిసేది కాదు. కానీ 'ఆచార్య', 'భోళా శంకర్' చిత్రాలు మాత్రం ఫ్లాప్ కావడంతో పాటు విపరీతమైన ట్రోలింగ్కి గురయ్యాయి. (ఇదీ చదవండి: డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్న విజయ్ కొడుకు.. సినిమా కన్ఫర్మ్) రీఎంట్రీలో తప్పటడుగులు వేస్తున్న చిరు.. 'ఖైదీ నం.150', 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' రీమేక్స్లో నటించారు. కానీ వాటి ఫలితం ఏంటనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా రీమేక్స్ దెబ్బకొడుతున్నా సరే.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బ్రో డాడీ' రీమేక్ చేయబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే ఇప్పటివరకు లేదు. అయితే 'భోళా శంకర్' రిజల్ట్ చిరుని ఆలోచనలో పడేసిందట. దీంతో ఇకపై రీమేక్స్ చేయకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఓ నిర్మాత.. మలయాళ చిత్ర రీమేక్స్ రైట్స్ పట్టుకుని మెగాస్టార్కి దగ్గరకి వెళ్తే.. సున్నితంగా నో చెప్పేశారట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీన్నిబట్టి చూస్తుంటే కాస్త లేట్ అయినా సరే చిరు.. స్ట్రెయిట్ సినిమాలే చేస్తారనమాట. (ఇదీ చదవండి: కేఏ పాల్ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019