breaking news
Ad - Sakshi_Home_Sticky
-
ఐశ్వర్య రాజేష్ సినిమాలో ఇండియన్ స్టార్ క్రికెటర్
నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్కుమార్, నటి ఐశ్యర్య రాజేశ్ జంటగా నటించిన చిత్రం డియర్. నటి రోహిణి, ఇళవరసు, తలైవాసల్ విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నట్మగ్ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిఫేక్ రామిశెట్టి, జీ.పృధ్వీరాజ్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చే సుకుని, ఈ నెల 11వ తేదీన తెరపైకి రానుంది. టీమిండియా స్టార్ ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలిసారిగా ఈ సినిమాలో భాగమయ్యారు. క్రికెట్లో స్పిన్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న అశ్విన్.. ఇప్పుడు వెండితెరపై కూడా కనిపించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. తమిళంలో వస్తున్న 'డియర్' సినిమాలో అతిథి పాత్రలో అశ్విన్ నటించారట. ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా విడుదలైంది. కానీ సినిమాలో ఆయన లుక్ రివీల్ చేయలేదు. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నట్లు క్రికెటర్ అశ్విన్ స్వయంగా తన ఎక్స్ పేజీలో వెల్లడించారు. అశ్విన్తో హీరోయిన్ ఐశ్వర్యకు ఇదే తొలి చిత్రం. ఈ చిత్రాన్ని ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11న విడుదల కానున్న డియర్ సినిమా ట్రైలర్ను తాజాగా మేకర్స్ విడుదల చేయగా దానిని అశ్విన్ కూడా తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. అశ్విన్ వాయిస్తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'డియర్' చిత్రంలో దీపిక, అర్జున్ పాత్రలలో ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ నటించారు. కొత్తగా పెళ్లయిన జంట మధ్య జరిగే సమస్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమా గురించి జీవీ.ప్రకాశ్కుమార్ మాట్లాడుతూ నటి ఐశ్వర్యరాజేశ్ ఒకసారి విమానంలో కలిసినప్పుడు ఒక మంచి కథ ఉంది చే స్తారా? అని అడిగారన్నారు. ఆ చిత్రంలో ఈమె నటిస్తున్నారంటే తన పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదని భావించానన్నారు. అయినప్పుటికీ అందులో తను నటించకూడదనే భావనతోనే దర్శకుడిని కథ చెప్పమని అడిగానన్నారు. ఆ తరువాత దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ తనను కలిసి కథ చెప్పడంతో చాలా ఇంట్రస్ట్గా ఉందని పించిందన్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం ఎంతగానో ఆకట్టుకోవడంతో తాను నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. Excited to unveil the #DeAr trailer!🎉 Happy to have played a small part in it 😁. Check it out and let me know what you think ❤️ ▶️ https://t.co/bqvULPCmRi#DeArTrailer #DeArFromApril11 @NutmegProd @tvaroon #AbhishekRamisetty #PruthvirajGK @mynameisraahul #RomeoPictures… pic.twitter.com/tB1S6KXYUI — Ashwin 🇮🇳 (@ashwinravi99) April 5, 2024 -
పిచ్చకొట్టుడు కొట్టిన అశ్విన్.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి మరీ..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్లో చెలరేగిపోయాడు. ఆర్డర్లో ముందుకు వచ్చి మరీ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 19 బంతుల్లో 3 భారీ సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. అశ్విన్ ఈ మూడు సిక్సర్లు బాదింది సాదాసీదా బౌలర్ల బౌలింగ్లో అనుకుంటే పొరబడ్డట్టే. తొలుత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు దిమ్మతిరిగిపోయేలా చేసిన అశ్విన్.. ఆ తర్వాత ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జేకు మతి పోగొట్టాడు. కుల్దీప్ బౌలింగ్లో ఓ సిక్సర్తో సరిపెట్టుకున్న అశ్విన్.. నోర్జే బౌలింగ్లో ఏకంగా రెండు భారీ సిక్సర్లు బాదాడు. SIX-HITTER ASHWIN IN T20..!!! 🔥pic.twitter.com/80j0Dm6uLz — Johns. (@CricCrazyJohns) March 28, 2024 తరుచూ బంతితో మ్యాజిక్ చేసే అశ్విన్.. కొత్తగా బ్యాట్కు పని చెప్పడంతో అతని అభిమానులు తెగ సంబుర పడిపోతున్నారు. యాష్లోని ఈ కోణాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కాగా, అశ్విన్కు టెస్ట్ క్రికెట్లో బ్యాటర్గా మంచి ట్రాక్ రికార్డే ఉంది. సుదీర్ఘ ఫార్మాట్లో అతను ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. అయితే యాష్ శతక్కొట్టుడు టెస్ట్ క్రికెట్కు మాత్రమే పరిమితమైంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతను రాణించడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో అశ్విన్ శైలికి భిన్నంగా విజృంభించడంతో అభిమానులు కొత్తగా ఫీలవుతున్నారు. అశ్విన్ చితక్కొట్టుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే, అశ్విన్తో పాటు రియాన్ పరాగ్ (45 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో డీసీపై రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 173 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. రాజస్థాన్ బౌలర్లు బర్గర్ (3-0-29-2), చహల్ (3-0-19-2), ఆవేశ్ ఖాన్ (4-0-29-1) రాణించారు. -
IPL 2024: రాజస్తాన్ రాయల్స్కు ఊహించని షాక్!
ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు రాజస్తాన్ రాయల్స్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బౌలర్, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా లీగ్ నుంచి తప్పుకొంటున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాల దృష్ట్యా పదిహేడో ఎడిషన్కు దూరం కానున్నట్లు తెలిసింది. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ మేనేజర్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది. కాగా ఐపీఎల్-2023 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ రూ. 1.50 కోట్లు ఖర్చు చేసి ఆడం జంపాను కొనుగోలు చేసింది. గతేడాది అతడు రాజస్తాన్ తరఫున ఆరు మ్యాచ్లు ఆడి ఎనిమిది వికెట్లు తీశాడు. ఈ క్రమంలో 2024 వేలానికి ముందు జంపాను రిటైన్ చేసుకుంది రాజస్తాన్. అయితే, అనూహ్యంగా తాజా సీజన్ ఆరంభానికి ముందు జంపా జట్టు నుంచి తప్పుకోవడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. ఇప్పటికే టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ కూడా ఈ ఎడిషన్కు అందుబాటులో ఉండటం లేదు. గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. ఇక 31 ఏళ్ల ఆడం జంపా గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఐపీఎల్లో 20 మ్యాచ్లు ఆడి 29 వికెట్లు కూల్చాడు. కాగా ఇప్పటికే జేసన్ రాయ్, గస్ అట్కిన్సన్, హ్యారీ బ్రూక్ తదితర విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్-2024 బరి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ఇక మార్చి 22న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో తాజా ఎడిషన్ మొదలుకానుంది. ఈ క్రమంలో సంజూ శాంసన్ సేన(రాజస్తాన్ రాయల్స్) మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఇక జంపా తప్పుకోగా.. టీమిండియా దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు అందుబాటులో ఉండటం రాయల్స్కు సానుకూలాంశం. చదవండి: #MSDhoni: స్వర్ణ యుగం ముగిసింది.. గుండె ముక్కలైంది!.. ఆ ఊహే కష్టంగా ఉంది.. Just a legend doing his thing in Pink. 🔥 pic.twitter.com/rpQ2KCDTmV — Rajasthan Royals (@rajasthanroyals) March 20, 2024 -
SRH: రెండుసార్లు చాంపియన్గా నిలబెడితే ఇలా చేస్తారా? షాకయ్యా
SRH- IPL 2024: సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్పు నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐడెన్ మార్క్రమ్నే సారథిగా కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇందుకు గల కారణాన్ని కూడా అశూ వెల్లడించాడు. గత మూడు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీ పడుతోంది సన్రైజర్స్. డేవిడ్ వార్నర్ తర్వాత ఎంత మంది కెప్టెన్లను మార్చినా జట్టు తలరాతను మాత్రం మార్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 వేలంలో వ్యూహాత్మకంగా పావులు కదిపింది. రూ. 20. 50 కోట్ల భారీ ధరకు ఆస్ట్రేలియా కెప్టెన్, వన్డే వరల్డ్కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్ను కొనుగోలు చేసింది. గత ఎడిషన్లో రైజర్స్ జట్టును ముందుకు నడిపించిన ఐడెన్ మార్క్రమ్ స్థానంలో సారథిగా నియమించింది. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్.. సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణయం సరైంది కాదేమోనని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ అరంగేట్ర, తాజా సీజన్లో సన్రైజర్స్ ఈస్ట్రర్న్కేప్ను చాంపియన్గా నిలబెట్టిన మార్క్రమ్పై వేటు వేయకుండా ఉండాల్సిందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ వరుసగా రెండు టైటిళ్లు గెలిచింది. అత్యద్బుతమైన జట్టుతో ట్రోఫీలు అందుకుంది. కానీ ఇక్కడ మార్క్రమ్ను కాదని వాళ్లు ప్యాట్ కమిన్స్ను కెప్టెన్ చేశారు. నిజంగా ఇది షాకింగ్గా అనిపించింది. మార్క్రమ్నే సారథిగా కొనసాగిస్తారని ఊహించాను. సౌతాఫ్రికాలో సన్రైజర్స్ కెప్టెన్గా అత్యద్బుత ప్రదర్శన కనబరిచాడు. కానీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. కమిన్స్ను కెప్టెన్గా ప్రకటించినందు వల్ల తుదిజట్టు కూర్పులో రైజర్స్ కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ట్రవిస్ హెడ్ను బ్యాకప్గా ఉపయోగించుకున్నా.. మార్క్రమ్, హెన్రిచ్క్లాసెన్, వనిందు హసరంగలను ప్రధాన ప్లేయర్లుగా ఆడించాల్సి ఉంటుంది. ఒకవేళ హసరంగ లేకుంటే కొన్ని వేదికల్లో ఫజల్హక్ ఫారూకీ లేదంటే మార్కోజాన్సెన్లను ఆడించే అవకాశం ఉంది. ఏదేమైనా విదేశీ ప్లేయర్లను ఆడించే విషయంలో రైజర్స్కు ఇబ్బందులు తప్పవు’’ అని రాజస్తాన్ రాయల్స్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. కాగా మార్చి 23న కేకేఆర్తో సన్రైజర్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: పేరు మార్చుకున్న ఆర్సీబీ... కన్నడలో మాట్లాడిన కోహ్లి.. వీడియో -
గుంటూరు కారం సాంగ్.. అంత భయంకరంగా ఉందన్న టీమిండియా స్టార్ క్రికెటర్!
కొత్త ఏడాదిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన భామ శ్రీలీల. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్కు అభిమానులకు అయితే ఏకంగా పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్లో శ్రీలీల స్టెప్పులకు ఫిదా కానీ వారు ఉండరేమో. అంతలా తన డ్యాన్స్తో అదరగొట్టింది ఈ కన్నడ భామ. అయితే తాజాగా గుంటూరు కారం సాంగ్పై టీమిండియా క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా శ్రీలీల, మహేశ్బాబు డ్యాన్స్కు తాను ఫిదా అయ్యానని వెల్లడించారు. ఓ అభిమానితో మాట్లాడుతూ గుంటూరు కారం సాంగ్ను ప్రస్తావించారు. మహేశ్ బాబు మూవీ గుంటూరు కారం సాంగ్లో శ్రీలీల, మహేశ్ బాబు డ్యాన్స్ భయంకరంగా ఉందని అన్నారు. ఇప్పటికీ ఆ సాంగ్ చూడకపోతే యూట్యూబ్కు వెళ్లి గుంటూరు కారం శ్రీలీల డ్యాన్స్ టైప్ చూడమని అశ్విన్ సలహా కూడా ఇచ్చాడు. మహేశ్ బాబు ఎక్స్ట్రార్డినరీ డ్యాన్సర్ అని.. అతనితో పాటు శ్రీలీల అదరగొట్టిందని అశ్విన్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సాంగ్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీమ్కు ఊపు తీసుకొస్తుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Cricketer @ashwinravi99 about #GunturKaaram 🔥@urstrulyMahesh @sreeleela14 pic.twitter.com/8mV2JNreU2 — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2024
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019