breaking news
Ad - Sakshi_Home_Sticky
-
చంద్రబాబుపై ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్
-
టీడీపీ దౌర్జన్యాలను అడ్డుకుంటాం
కమలాపురం : వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను, దుర్మార్గాలను అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. కమలాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను నిరసిస్తూ శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కమలాపురం నియోజకవర్గంలో నీచ సంస్కృతి కొనసాగుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎవరికైనా ఓటు వేసుకోవచ్చని, బెదిరింపులకు పాల్పడటం సరికాదన్నారు. టీడీపీ నాయకుల దుర్మార్గాలను, దౌర్జన్యాలను ప్రజలు ఆదరించరని, ఇలాంటి చర్యలు ఎక్కువ కాలం మనుగడ సాధించవన్నారు. బాధితులకు అండగా తాము ఉంటామని, కార్యకర్తలు ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు. టీడీపీ అధినాయకుడు కోడికత్తితో జగన్ మోహన్రెడ్డితో హతమార్చడానికి ప్రయత్నించాడన్నారు. తాము రౌడీయిజాన్నిఎంకరేజ్ చేయమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రాగానే ఫ్యాక్షనిజాన్ని పారదోలేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్ జగన్ సీఎం కాగానే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ప్రతి ఏకరాకు సాగు నీరు అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి రాష్ట్రంలో చింతమనేని ప్రభాకరే కాకుండా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఆగడాలు రోజు రోజుకు మితి మీరుతున్నాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంంద్రనాథ్ రెడ్డి అన్నారు. బెదిరిస్తే ఓట్లు పడవని, ఆ కాలాలు పోయాయని, ఇప్పటికి మూడు సార్లు ఓడిపోయావు, ఇంకెన్ని సార్లు ఓడి పోతావని టీడీపీ నాయకుడిని ప్రశ్నించారు. వీరందరికి చంద్రబాబు ఆదర్శం అని, ఇది ప్రజాస్వామ్యమా? రాజరిక పాలన అని అన్నారు. మూడు నెలల్లో టీడీపీ నాయకులందరికి శంకరగిరి మాన్యాలే గతి అని ఎద్దేవా చేశారు. నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, అపుడు అధికారులపై ఎలాంటి ఒత్తిడి ఉండదన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది ఉండదని, తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామన్నారు. కార్యకర్తలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకు వస్తే అండగా ఉంటానని హామి ఇచ్చారు. బెదిరింపులకు భయపడేది లేదు ఎన్నికల సీజన్లో ఒడిదుడుకులు సహజమే. అయితే టీడీపీ నాయకులు చేసే బెదిరింపులకు భయపడేది లేదని నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి తెలిపారు. 30ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నామన్నారు. దేనికైనా తాము అండగా ఉంటామని, కేవలం 3 మాసాలు ఆగాలని, పదేళ్ల నుంచి పడుతున్న కష్టాలను మరిచి పోయేలా చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసిన టీడీపీ నాయకుల దౌర్జన్యాలు మితిమీరుతున్నాయన్నారు. జిల్లా రైతు కన్వీనర్ సంబటూరు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కమలాపురం మండలంలోని అనేక మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయన్నారు. చివరకు మోటార్లు, స్టాటర్టు సైతం ధ్వంసం చేసారని గుర్తు చేశారు. కడప నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకోవాలని టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు నిత్యా నందరెడ్డి మాట్లాడుతూ ఫ్యాక్షన్కు కాలం చెల్లిందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి కిశోర్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. అనంతరం తహసీల్దార్ రవి శంకర్ రెడ్డి, ఎర్రగుంట్ల సీఐ కొండారెడ్డి లకు వినతి పత్రాలు అందించారు. మరోసారి దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండలాల కన్వీనర్లు, ఉత్తమారెడ్డి, రఘనాథరెడ్డి, జీఎన్ భాస్కర్రెడ్డి, బాలమల్లారెడ్డి, మాచునూరు చంద్రారెడ్డి, ఆరు మండలాల కార్యకర్తలు, నాయకులు, మహిళా నాయకురాళ్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
సమైక్య ద్రోహుల చొక్కా పట్టుకోండి
మడకశిర, న్యూస్లైన్ : సమైక్యాంధ్ర ద్రోహులను చొక్కా పట్టుకుని నిలదీయండని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎన్నికల పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా మడకశిరలోని వైఎస్సార్ సర్కిల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కన్వీనర్ శంకరనారాయణ అధ్యక్షతన జరిగిన ‘సమైక్య శంఖారావం’ సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సమైక్యాంధ్ర ద్రోహులుగా మిగిలాయన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేమని గుర్తించిన ఈ రెండు పార్టీలు కుమ్మక్కై కుట్ర పన్నడం రాష్ట్ర విభజనకు దారితీసిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని కల్లబొల్లి మాటలు చెప్పిన సీఎం కిరణ్కుమార్రెడ్డి చివరకు చేతులెత్తేసి సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేశారన్నారు. వైఎస్సార్సీపీ కోరిన విధంగా అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి వుంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీకి సీమాంధ్రలో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేయడానికే సోనియాగాంధీ ఓట్లు, సీట్ల రాజకీయం చేసి తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టిందని విమర్శించారు. రాష్ట్రాన్ని చీల్చేందుకు కుట్ర పన్నిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి చంద్రబాబు వత్తాసు పలికి సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ప్రగల్బాలు పలికిన విజయవాడ ఎంపీ లడగపాటి రాజగోపాల్ కూడా చివరకు చేత్తులెత్తేశారని ఆరోపించారు. సమైక్యాంధ్ర ద్రోహులైన కాంగ్రెస్, టీడీపీ నాయకులను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనేనని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే రాష్ర్టంలో సువర్ణయుగం తిరిగి ప్రారంభమవుతుందన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి దూరదృష్టి గల నాయకుడని, అందుకే ఆయన హయాంలో సువర్ణయుగం సాగిందన్నారు. చంద్రబాబు హయాంలో వరుస కరువులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త ఎల్ఎం మోహన్రెడ్డి మాట్లాడుతూ మడకశిరలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం తథ్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలు వైఎస్సార్ రుణాన్ని తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రానికి కట్టుబడి మంత్రి రఘువీరారెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు.
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019