breaking news
-
లోక్సభ పోలింగ్ : తమిళనాడులో ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)
-
రజినీకాంత్ కూతురిగా ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్
సూపర్స్టార్ రజినీకాంత్ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలు శృతిహాసన్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వేట్టైయాన్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా దీని తరువాత తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి 'కళుగు' అనే టైటిల్ను నిర్ణయించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ నెల 22వ తేదీన చిత్ర టైటిల్ను, టీజర్ను విడుదల చేయనున్నట్లు ఇటీవల దర్శకుడు లోకేష్ కనకరాజ్ చెప్పారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందన్నారు. కాగా తాజాగా ఇందులో రజినీకాంత్ కూతురిగా శృతిహాసన్ నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. కోలీవుడ్లో సినీ దిగ్గజాలైన కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించి 25 ఏళ్లు అవుతోంది. అలాంటిది ఇప్పుడు కమల్ హాసన్ కూతురు రజినీకాంత్ తాజా చిత్రంలో ఆయనకు కూతురుగా నటించనున్నడం విశేషమే. మరో విషయం ఏమిటంటే శృతిహాసన్ తమిళంలో నటించి చాలా కాలం అవుతోంది. లాభం చిత్రం తరువాత ఈమె ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. కాగా సుమారు మూడేళ్ల తరువాత ఈ బ్యూటీకి కోలీవుడ్లో నటించే అవకాశం వచ్చిందన్న మాట. అయితే ఇటీవల ఈమె తన తండ్రి కమల్ హాసన్ రాసి, రూపొందించిన ఇనిమేల్ అనే పాట ఆల్బమ్లో దర్శకుడు లోకేష్ కనకరాజ్తో కలిసి నటించిన విషయం తెలిసిందే. కాగా శృతిహాసన్, రజినీకాంత్ 171 చిత్రంలో నటించే విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఆ స్టార్ హీరో సలహా.. బ్లాక్బస్టర్ హిట్.. నా కోరిక ఏంటంటే?
నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో మెగాస్టార్గా రాణిస్తున్నాడు చిరంజీవి. ఇప్పటికీ ఆయనను తెలుగు చలనచిత్రసీమకు బాస్గా చెప్పుకుంటూ ఉంటారు. వయసు పైబడుతున్నా మాస్ సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా అతడు సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ 2024 కార్యక్రమంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. '1983లో ఖైదీ సినిమా నాకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది. అలాగే బాలచందర్గారితో రుద్రవీణ సినిమా చేశాను. ఈ చిత్రానికి నాలుగైదు జాతీయ అవార్డులు వచ్చాయి. కానీ ఈ చిత్రానికిగానూ నిర్మాతకు ఒక్కరూపాయి లాభం రాలేదు. దానికోసం ఎదురుచూస్తున్నా అలాంటి పరిస్థితులను నేను కోరుకోను. నిర్మాతలను కాపాడాలనుకుంటాను. ఎస్పీ బాలు.. 'ఎప్పుడూ యాక్షన్ సినిమాలు చేస్తావేంటి? దంగల్ లాంటి చిత్రాలు చేయొచ్చు కదా' అని అడిగేవారు. అలాంటివి చేయడమంటే నాకూ ఇష్టమే.. కానీ నిర్మాతలు నష్టపోతారు. అందుకే కమర్షియల్ సినిమాలే ఎంచుకుంటున్నానని సమాధానమిచ్చాను. ఇప్పుడు నేను మంచి కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నాను. ఎలాంటి అంచనాలు లేవు. నాకు నచ్చితే కచ్చితంగా చేస్తాను. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ నా సినిమాలు చూస్తూ పెరిగారు. కాబట్టి నేను ఏ మూవీలో, ఏ స్టైల్లో నటిస్తే జనాలకు నచ్చుతుందో వారికి బాగా తెలుసు. వాళ్లిప్పుడు లేరు వాళ్లు మాత్రమే నన్ను కరెక్ట్గా చూపించగలరు. కొంతకాలం క్రితం రజనీకాంత్ ఓ మాట చెప్పాడు. మనం పని చేయాలనుకున్న లెజెండరీ డైరెక్టర్స్ ఇప్పుడు లేరు. ఇప్పుడంతా కొత్త దర్శకులే.. మన అభిమానులే డైరెక్టర్స్ అయితే వారిపై ఆధారపడటం మంచిది. మనల్ని ఎలా ప్రజెంట్ చేయాలన్న విషయం వారికే బాగా తెలుసు అని చెప్పాడు. ఇదే నిజం. నా అభిమాని బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తే బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇకపోతే జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్లో రామ్చరణ్, జాన్వీకపూర్ నటిస్తే చూడాలనుంది' అని చిరంజీవి తెలిపాడు. చదవండి: అవసరం ఉందేమో.. దొంగకు సాయం చేయండన్న నటుడు.. నెట్టింట ట్రోలింగ్ -
'జైలర్' ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. అదిరిపోయే టైటిల్తో సీక్వెల్
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్'. అప్పటి వరకు హిట్ సినిమాలు లేని రజనీకాంత్కు జైలర్తో మంచి విజయాన్ని అందుకున్నారు. గతేడాది అగష్టులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. నిర్మాతకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ వార్త వైరల్ అవుతుంది. జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ పనులను డైరెక్టర్ ప్రారంభించారట. 'హుకుమ్' పేరుతో పార్ట్ 2 పనులను ఆయన మొదలుపెట్టేశారట. ఈ జూన్లో ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ఆయన స్టార్ట్ చేయబోతున్నారని టాక్ ఉంది. #Jailer2, #Hukum హ్యాష్ట్యాగ్లతో సోషల్మీడియాలో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. దీంతో జైలర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రజనీకాంత్ ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్కు ఏప్రిల్ 22న టైటిల్ ఖరారు కానుంది. సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వేట్టయాన్' చిత్రాన్ని కూడా రజనీ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. జైలర్లో కన్నడ నటుడు శివ రాజ్కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మిర్నా మేనన్, యోగిబాబు కీలక పాత్రలలో మెప్పించారు. టైగర్ ముత్తువేల్ పాండియన్గా రజనీ హీరోయిజానికి ఫ్యాన్స్ ఫిదా అయితే.. వర్మన్గా వినాయకన్ విలనిజానికి కూడా అదే రేంజ్లో విజిల్స్ పడ్డాయి. జైలర్ సినిమా అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. HUKUM... TIGER KA #HUKUM 🔥😎 Morattu excited for the re-entry of the character & combo 💥#Jailer2 #Vettaiyan #Thalaivar171 #ThalaivarNirandharam pic.twitter.com/VTdJI7leXq https://t.co/gBS4XMgze8 — Shreyas Srinivasan (@ShreyasS_) April 12, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019