breaking news
Ad - Sakshi_Home_Sticky
-
T20: రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్గా సంజూ శాంసన్!
‘రోహిత్ శర్మ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే.. అంతెందుకు టీ20 వరల్డ్కప్-2024లోనూ జట్టును అతడే ముందుకు నడిపిస్తాడు’’.. చాన్నాళ్లుగా విశ్లేషకుల మాట. అయితే, వన్డే వరల్డ్కప్-2023 తర్వాత సీన్ కాస్తా మారింది. గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన ఈ పేస్ ఆల్రౌండర్.. ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్కు వచ్చి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ ముంబై పగ్గాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ మాత్రం ఈసారి పొట్టి ప్రపంచకప్లో రోహిత్ శర్మనే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని ప్రకటించింది. ఇక ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలైన తర్వాత సీన్ పూర్తిగా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వైఫల్యాల కారణంగా ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట కేవలం మూడు మాత్రమే గెలిచింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో సోమవారం నాటి మ్యాచ్తో ఐదో పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం తన జట్టును విజయపథంలో ముందుకు నడిపిస్తున్నాడు. సంజూ శాంసన్ (PC: IPL) ఇప్పటి దాకా రాయల్స్ ఎనిమిది మ్యాచ్లు ఆడి ఏడు విజయాలతో ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్గానూ సంజూ అదరగొడుతున్నాడు. ఎనిమిది మ్యాచ్లలో కలిపి అతడు 314 పరుగులు సాధించాడు. ముంబైతో మ్యాచ్లో సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 104)తో కలిసి సంజూ(28 బంతుల్లో 38) ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఫామ్ తాత్కాలికం.. క్లాష్ శాశ్వతం అని యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ మరోసారి నిరూపించింది. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ గురించి ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత జట్టులో నేరుగా అడుగుపెట్టే అర్హత అతడికి ఉంది. అంతేకాదు రోహిత్ శర్మ తర్వాత టీమిండియా తదుపరి కెప్టెన్గా సంజూ శాంసన్ ఎదుగుతాడనడంలో మీకేమైనా అనుమానాలున్నాయా?’’ అంటూ కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ కావాలని ఆకాంక్షించాడు. అసలు జట్టులో చోటు దక్కుతుంతా అన్న సందేహాల నడుమ ఊహించని విధంగా కెప్టెన్ కావాంటూ అంటూ కామెంట్ చేశడు. కాగా వరల్డ్కప్-2024 నేపథ్యంలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొన్న తరుణంలో భజ్జీ ఇలా సంజూకు ఓటు వేశాడు. మరి మీ ఓటు ఎవరికి?! Yashasvi Jaiswal’s knock is a proof of class is permanent . Form is temporary @ybj_19 and there shouldn’t be any debate about Keepar batsman . @IamSanjuSamson should walks in to the Indian team for T20 worldcup and also groomed as a next T20 captain for india after rohit . koi… — Harbhajan Turbanator (@harbhajan_singh) April 22, 2024 THAT 💯 moment! ☺️ Jaipur is treated with a Jaiswal special! 💗 Scorecard ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @ybj_19 pic.twitter.com/i0OvhZKtGI — IndianPremierLeague (@IPL) April 22, 2024 -
IPL 2024 MI Vs RR: బుమ్రా ఉండగా నువ్వు తొలి ఓవర్ వేయడమేంటి హార్దిక్..!
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ మరోసారి సొంత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాజస్థాన్తో మ్యాచ్లో హార్దిక్ చెత్త నిర్ణయాలే ముంబై కొంపముంచాయని వాపోతున్నారు. నామమాత్రపు స్కోర్ను కాపాడుకునే క్రమంలో ప్రపంచ అత్యుత్తమ బౌలర్ అయిన బుమ్రాను కాదని తాను బౌలింగ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుమ్రా కాకపోతే కొయెట్జీ, తుషార కనిపించలేదా అని నిలదీస్తున్నారు. ఏదో వరల్డ్ నంబర్ వన్ బౌలర్లా తొలి ఓవర్ వేయడమేంటని ధ్వజమెత్తుతున్నారు. బౌలర్లను మార్చే విషయంలో గల్లీ కెప్టెన్ల కంటే అధ్వానంగా ఉన్నావని ఫైరవుతున్నారు. హార్దిక్ బ్యాటింగ్ చెప్పనశక్యమైన ఛండాలంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా తేలిపోతూ ఆల్రౌండర్నని ఎలా చెప్పుకుంటావని దుర్భాషలాడుతున్నారు. ఈ సీజన్లో ముంబై యాజమాన్యం స్వయంకృతాపరాధమే (హార్దిక్ను కెప్టెన్గా నియమించడం) ఐదు సార్లు ఛాంపియన్ అయిన తమ ఫేవరెట్ జట్టు కొంపముంచుతుందని వాపోతున్నారు. హార్దిక్ను వెంటనే కెప్టెన్సీ నుంచి తీసిపారేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రాయల్స్తో నిన్నటి మ్యాచ్లో హార్దిక్ బ్యాటింగ్లో 10 పరుగులు (10 బంతుల్లో ఓ ఫోర్) చేసి, బౌలింగ్లో 2 ఓవర్లు వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు. 183 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో హార్దిక్ తొలి ఓవర్ వేసి బట్లర్చే బాదించుకున్నాడు. ఆతర్వాత 13వ ఓవర్లో శాంసన్, యశస్వి ధాటికి 10 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా ఈ సీజన్లో హార్దిక్ చెత్త నిర్ణయాలు, చెత్త వ్యక్తిగత ప్రదర్శన కారణంగా ముంబై ఇండియన్స్ ఐదో ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుతానికి ఆ జట్టు 8 మ్యాచ్లు ఆడి 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (65), నేహల్ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. సందీప్ శర్మ (4-0-18-5), ట్రెంట్ బౌల్ట్ (4-0-32-2) ముంబైని దెబ్బకొట్టారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. 18.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) రాయల్స్ను గెలిపించాడు. బట్లర్ (35), సంజూ శాంసన్ (38 నాటౌట్) రాణించారు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ (బట్లర్) పియూశ్ చావ్లాకు దక్కింది. -
IPL 2024: ముంబై ఇండియన్స్ అంటే చాలు యశస్వికి పూనకం వస్తుంది..!
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు ముంబై ఇండియన్స్ అంటే చాలు పూనకం వస్తుంది. యశస్వి ఏ జట్టుపై అయినా ఆడతాడో లేదో తెలీదు కానీ ముంబై ప్రత్యర్దిగా ఉంటే మాత్రం రెచ్చిపోతాడు. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్లో యశస్వి మరోసారి చెలరేగిపోయాడు. విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. రెండేళ్లలో యశస్వికి ముంబైపై ఇది రెండో సెంచరీ. యశస్వి తన కెరీర్లో చేసిన రెండు సెంచరీలు ముంబైపై చేసినవే కావడం విశేషం. గత సీజన్లో ముంబైపై వారి సొంత మైదానమైన వాంఖడేలో శతక్కొట్టిన (124) యశస్వి.. తాజాగా తమ హోం గ్రౌండ్ జైపూర్లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో అజేయ సెంచరీతో ఇరగదీశాడు. యశస్వితో పాటు సందీప్ శర్మ (4-0-18-5) చెలరేగడంతో నిన్నటి మ్యాచ్లో రాయల్స్ ముంబైపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తాజా శతకంతో యశస్వి ఐపీఎల్లో 23 ఏళ్లలోపు రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తిలక్ వర్మ (65), నేహల్ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. రాయల్స్ బౌలర్లలో సందీప్తో పాటు బౌల్ట్ (4-0-32-2) కూడా రాణించాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. 18.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి మెరుపు సెంచరీతో రాయల్స్ను గెలిపించాడు. బట్లర్ (35), సంజూ శాంసన్ (38 నాటౌట్) రాణించారు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ (బట్లర్) పియూశ్ చావ్లాకు దక్కింది. -
IPL 2024 RR vs MI: ఐదేసి అదరగొట్టిన అమ్ముడుపోని ఆటగాడు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో నిన్న (ఏప్రిల్ 22) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. వేలంలో అమ్ముడుపోని సందీప్ శర్మ ఈ మ్యాచ్లో రాజస్థాన్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వేరే ఆటగాడికి రీ ప్లేస్మెంట్గా రాయల్స్లోకి వచ్చిన సందీప్ శర్మ ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, తన తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో సందీప్ వేసిన స్పెల్ విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ వికెట్ తీసిన సందీప్.. నాలుగో ఓవర్లో అతి భయంకరుడైన సూర్యకుమార్ వికెట్ను పడగొట్టాడు. ఆ తర్వాత 15వ ఓవర్లో బంతినందుకున్న సందీప్.. ఆ ఓవర్లో వికెట్ లేకుండా 11 పరుగులు సమర్పించుకున్నాడు. - Unsold in the auction. - Came as a replacement in 2023. - Became the end over specialist.- Injured in the start of IPL 2024. - Came back into the team & got his first five wicket haul. Sandeep Sharma is a hero. 🫡pic.twitter.com/JeMHj5vLH9— Johns. (@CricCrazyJohns) April 22, 2024 ఆఖరి ఓవర్లో మరోసారి బంతినందుకు సందీప్ ఈసారి తన అద్భుతమైన స్లో బాల్స్ టెక్నిక్ను ఉపయోగించి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన సందీప్ 18 పరుగులు సమర్పించుకుని 5 వికెట్లు పడగొట్టాడు. సందీప్కు ఐపీఎల్ కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన. మొత్తంగా ఈ మ్యాచ్లో సందీప్ తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో రాయల్స్కు భారీ విజయాన్ని అందించాడు. సందీప్ దెబ్బకు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. 179 పరుగులు మాత్రమే చేసింది. తిలక్ వర్మ (65), నేహల్ వధేరా (49) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరు ఆడకపోయుంటే ముంబై పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. రాయల్స్ బౌలర్లలో సందీప్తో పాటు బౌల్ట్ (4-0-32-2) కూడా రాణించాడు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. 18.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 104 నాటౌట్) మెరుపు సెంచరీతో రాయల్స్ను గెలిపించాడు. బట్లర్ (35), సంజూ శాంసన్ (38 నాటౌట్) రాణించారు. రాయల్స్ కోల్పోయిన ఏకైక వికెట్ (బట్లర్) పియూశ్ చావ్లాకు దక్కింది. -
ముంబై మరో విజయం సాధించేనా?
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019