breaking news
-
నటుడికి ప్లాస్టిక్ సర్జరీ? ఏడేళ్ల క్రితమే..
సెలబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని ఫిల్మీదునియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. హీరోయిన్లకే కాదు హీరోలకు కూడా ఈ రూమర్స్ తప్పవు. బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు కూడా తన దవడకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని ఈ మధ్య పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సదరు నటుడు స్పందిస్తూ.. తను ఎటువంటి సర్జరీ చేయించుకోలేదని ఊహాగానాలకు ముగింపు పలికాడు. మేకప్ లేకపోవడం వల్ల.. గతంలో తన వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు చిన్పై ఫిల్లర్స్ మాత్రమే వేయించుకున్నానన్నాడు. ఇంకా మాట్లాడుతూ.. 'ఆ ఫోటో అస్సలు బాలేదు. మేకప్ లేనందువల్ల మీకలా అనిపించిందంతే! నాక్కూడా ఆ లుక్ కాస్త వింతగానే అనిపించింది. దాన్ని కెమెరాల్లో బంధించి వైరల్ చేసేశారు. కాకపోతే ఎనిమిదేళ్ల క్రితం నా పర్సనల్ డాక్టర్ చెప్పినదాని ప్రకారం.. మరింత కాన్ఫిడెంట్గా కనిపించేందుకు ఫిల్లర్ ట్రై చేశాను. మేము కెమెరాముందు అందంగా కనిపించాలి. ప్లాస్టిక్ సర్జరీ చాలా కాస్ట్లీ కాబట్టి ఇది తప్పేం కాదు. మన ఆత్మస్థైరాన్ని మరింత పెంపొందిస్తుందనేవాటికి ఎందుకు నో చెప్పడం? నేను ఏదైనా ఓపెన్గా చెప్పేస్తుంటాను. ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా ఖరీదైన వైద్యం.. ఎంతో టైం పడుతుంది కూడా! నేను దాని జోలికి వెళ్లలేదు' అని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం రాజ్కుమార్ రావు అంధుడు శ్రీకాంత్ బొల్ల బయోపిక్లో నటిస్తున్నాడు. ఈ మూవీ మే 10న విడుదల కానుంది. చదవండి: 'ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా..' అక్కర్లేదంటూ సందీప్ కౌంటర్ -
ఫిలింఫేర్ అవార్డుల వేడుక.. ఆలియా సినిమాకు ఏకంగా 10 అవార్డులు!
ఫిలింఫేర్ అవార్డుల్లో గంగూబాయి కథియావాడి సత్తా చాటింది. ఏకంగా 10 విభాగాల్లో అవార్డులు ఎగరేసుకుపోయింది. ఆ తర్వాత బదాయి దో సినిమా ఆరు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకున్న కేసరియా పాట రెండు అవార్డులు సాధించింది. ఉత్తమ నటిగా ఆలియా భట్, ఉత్తమ నటుడిగా రాజ్ కుమార్ రావు నిలిచారు. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఒక్క అవార్డు కూడా రాకపోవడం గమనార్హం. ముంబైలో గురువారం రాత్రి జరిగిన 68వ ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, మనీశ్ పాల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ వేడుకకు ఆలియా భట్, పూజా హెగ్డే, దియా మీర్జా, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, జాన్వీ కపూర్, కాజోల్.. తదితరులు సెలబ్రిటీలు హాజరయ్యారు. అవార్డులు అందుకుంది వీరే.. ► ఉత్తమ చిత్రం - గంగూబాయి కథియావాడి ► ఉత్తమ దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ చిత్రం(క్రిటిక్స్) - బదాయ్ దో (హర్షవర్ధన్ కులకర్ణి) ► ఉత్తమ నటి - ఆలియా భట్ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ నటి (క్రిటిక్స్) - టబు (భూల్ భులాయా 2), భూమి పెడ్నేకర్ (బదాయి దో) ► ఉత్తమ నటుడు - రాజ్ కుమార్ రావు (బదాయి దో) ► ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - సంజయ్ మిశ్రా (వధ్) ► ఉత్తమ సహాయ నటుడు - అనిల్ కపూర్ (జుగ్ జుగ్ జియో) ► ఉత్తమ సహాయ నటి -షీబా చద్దా (బదాయి దో) ► ఉత్తమ గీత రచయిత - అమితాబ్ భట్టాచార్య (బ్రహ్మాస్త్ర 1లోని కేసరియా పాట) ► ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర 1) ► ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర 1లోని కేసరియా పాట) ► ఉత్తమ నేపథ్య గాయని - కవిత సేత్ (జుగ్జుగ్ జియోలోని రంగిసారి.. పాట) ► ఉత్తమ కథ - అక్షత్ గిల్డయల్, సుమన్ అధికారి (బదాయి దో) ► ఉత్తమ స్క్రీన్ప్లే - అక్షత్ గిల్డయల్, సుమన్ అధికారి, హర్షవర్ధన్ కులకర్ణి (బదాయి దో) ► ఉత్తమ సంభాషణలు - ప్రకాశ్ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ బ్యాగ్రౌండ్ స్కోర్ - సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ సినిమాటోగ్రఫీ - సుదీప్ చటర్జీ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సుబ్రత చక్రవర్తి, అమిత్ రాయ్ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - షీతల్ ఇక్బాల్ శర్మ (గంగూబాయి కథియావాడి) ► ఉత్తమ సౌండ్ డిజైన్ - బిశ్వదీప్ దీపక్ చటర్జీ (బ్రహ్మాస్త్ర 1) ► ఉత్తమ ఎడిటింగ్ - నీనద్ కలంకార్ (ఎన్ యాక్షన్ హీరో) ► ఉత్తమ యాక్షన్ - పర్వేజ్ షైఖ్ (విక్రమ్ వేద) ► ఉత్తమ వీఎఫ్ఎక్స్ - డీఎన్ఈజీ, రెడిఫైన్ (బ్రహ్మాస్త్ర 1) ► ఉత్తమ కొరియోగ్రఫీ - కృతి మహేశ్ (డోలిడా- గంగూబాయ్ కథియావాడి) ► ఉత్తమ డెబ్యూ దర్శకుడు - జస్పల్ సింగ్ సంధు, రాజీవ్ బర్న్వల్ (వధ్) ► ఉత్తమ డెబ్యూ హీరో - అంకుశ్ గదం (ఝండ్) ► ఉత్తమ డెబ్యూ హీరోయిన్ - ఆండ్రియా కెవిచుసా (అనేక్) ► జీవిత సాఫల్య పురస్కారం - ప్రేమ్ చోప్రా ► ఆర్డీ బర్మన్ అవార్డ్ - జాన్వీ శ్రీమంకర్ (డోలిడా- గంగూబాయి కథియావాడి) చదవండి: రఫ్ఫాడిస్తున్న మెగాస్టార్ -
చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో
Rajkummar Rao Says He Bought A Jacket From Chor Bazaar: సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగిన వారు అనేక మంది ఉన్నారు. అలా బాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో రాజ్ కుమార్ రావు ఒకరు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన రాజ్ కుమార్ కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'హిట్: ది ఫస్ట్ కేస్'. జులై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి విజయంతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఆర్థిక విషయాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు రాజ్ కుమార్ రావు. 'పదో తరగతి పూర్తయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో మా కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందిపడేది. కానీ, అదిరిపోయే డ్రెస్తో పార్టీకి వెళ్లాలని ఉండేది. అంతేకాకుండా ఆ పార్టీలో నా ఫ్రెండ్స్తో కలిసి నేను డ్యాన్స్ కూడా చేయాలి. అందుకే అప్పుడు నేను దిల్లీలోని చోర్ బజార్కు వెళ్లి రూ. 100 పెట్టి జాకెట్ కొనుక్కున్నా. అలాగే రూ. 15తో మెడలో చైన్ కొని పార్టీకి వెసుకుని వెళ్లా' అని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు ఈ హీరో. చదవండి: అలియా భట్కు కవలలు ? రణ్బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో వైరల్.. మరణాన్ని ముందే ఊహించిన నటుడు !.. చివరి పోస్ట్ వైరల్ అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ -
'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు..
Upcoming Movies Of Bollywood Actors And Actresses Playing In Blind Role: చాలెంజింగ్ రోల్స్ ఒప్పుకోవాలంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలి. ‘గెలుచుకుంటామనే నమ్మకం ఉంది’ అంటున్నారు కొందరు తారలు. ‘మైండ్లో ఫిక్సయితే.. బ్లైండ్గా చేస్తాం’ అంటూ అంధులుగా నటించడానికి రెడీ అయ్యారు. నటనతో తమ సత్తా చూపిస్తామంటున్నారు. ఈ స్టార్స్ చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేయండి. బిజినెస్ డీలింగ్స్తో బిజీ కానున్నారు బాలీవుడ్ హీరో రాజ్కుమార్ రావ్. ఆయన అన్ని విషయాలనూ శ్రద్ధగా వింటారు.. కానీ చూడరు. ఎందుకంటే.. బ్లైండ్. చూపు లేకపోయినా సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్మేన్. ఆంధ్ర ప్రదేశ్లోని మచిలీపట్నంలో పుట్టిన బొల్లా శ్రీకాంత్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో శ్రీకాంత్గా రాజ్కుమార్ రావ్ నటించనున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్లో చేరిన తొలి అంధుడిగా శ్రీకాంత్ బొల్లా రికార్డు సృష్టించిన విషయం చాలామందికి తెలుసు. అలాగే ఎంతో మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు శ్రీకాంత్. ఈ సక్సెస్ఫుల్ మేన్ జీవితంతో దర్శకురాలు తుషార్ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి టీ సిరీస్ భూషణ్ కుమార్ ఓ నిర్మాత. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఓ సీరియల్ కిల్లర్ను పట్టుకోవడానికి ఓ లేడీ పోలీసాఫీసర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే..n ఈ పోలీసాఫీసర్ బ్లైండ్. మరి.. ఆ సీరియల్ కిల్లర్ను ఈ బ్లైండ్ పోలీసాఫీసర్ ఎలా పట్టుకున్నారు? ఆమెకు హెల్ప్ చేసింది ఎవరు? అనే అంశాలు ఆసక్తికరం. పోలీసాఫీసర్గా సోనమ్కపూర్ నటించిన చిత్రం ‘బ్లైండ్’. షోమ్ మఖీజా ఈ చిత్రానికి దర్శకుడు. 2011లో వచ్చిన సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘బ్లైండ్’కు రీమేక్ ఇది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్గా ఉన్నారు. ఆమె డెలివరీ తర్వాత హిందీ ‘బ్లైండ్’ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కళ్లు కనబడకపోతే సాధారణ జీవితాన్ని ఎలా మేనేజ్ చేయవచ్చో తెలుసుకున్నారు తాప్సీ. హఠాత్తుగా తాప్సీ ఇలా ఎందుకు చేశారంటే.. ‘బ్లర్’ సినిమా కోసమే. 2010లో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ ‘జూలియాస్ ఐస్’ చిత్రం హిందీలో ‘బ్లర్’గా రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలోనే తాప్సీ అంధురాలి పాత్ర చేస్తున్నారు. ఈ కథ నచ్చి తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... క్రమంగా చూపు మందగించే ఓ గృహిణి పాత్రలో తాప్సీ కనిపిస్తారు. సరిగ్గా చూపు కనిపించాలని ఓ సర్జరీ కూడా చేయించుకోవాలనుకుంటారు. కానీ ఇంతలో ఊహించని పరిణామాలు. ఆమె సోదరి హత్యకు గురవుతుంది. అయితే అప్పటికే ఆమె తన పూర్తి కంటి చూపును కోల్పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ‘బ్లర్’ చిత్రం. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు అంధురాలిగా ఓ సమూహాన్నే లీడ్ చేయనున్నారు హీరోయిన్ హీనాఖాన్. హీనాతో ఉన్న సమూహంలోని అందరూ కూడా బ్లైండే. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ అనే నవల ఆధారంగా ఆమె చేస్తున్న సినిమా కథాంశం ఇది. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ టైటిల్తోనే తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. ఈ ఇండో ఇంగ్లిష్ సినిమాకు రహత్ కజ్మీ దర్శకుడు. రాజ్కుమార్, సోనమ్, తాప్సీ, హీనా.. ఈ నలుగురూ సవాల్లాంటి పాత్రలతో బాక్సాఫీస్పై గురి పెట్టారు. ఈ సినిమాల వైపు ప్రేక్షకులు చల్లని చూపు చూస్తే ఈ స్టార్స్ కళ్లనుంచి ఆనందభాష్పాలు రావడం ఖాయం. -
జిమ్ ఫొటో షేర్ చేసిన హీరో.. భార్య రియాక్షన్ ఏంటో తెలుసా ?
Rajkummar Rao Shared His Back Wife Patralekhaa Impressed: బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు ఇటీవల 'బదాయి దో' చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. హర్షవర్ధన్ కులకర్ణి దర్శకత్వంలో భూమి పెడ్నేకర్తో తొసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు రాజ్ కుమార్. ఈ మూవీ జాతియ అవార్డు గెలుచుకున్న కామెడీ డ్రామా చిత్రం 'బదాయి హో'కి సీక్వెల్గా వచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ రావు సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. రాజ్ కుమార్ రావుకు ఇన్స్టాగ్రామ్లో 6.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, సినిమా అప్డేట్ వంటి విషయాలతో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా తను జిమ్ చేస్తున్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశాడు రాజ్ కుమార్. చదవండి: బాలీవుడ్ కొత్త జంట ఎంగేజ్మెంట్.. డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ ఈ పోస్ట్ చూసిన రాజ్ కుమార్ రావు అభిమానులు అమెజింగ్, అద్భుతం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ పోస్ట్ రాజ్ కుమార్ రావు సతీమణి, నటి పత్రలేఖ దృష్టిని ఆకర్షించింది. ఈ జిమ్ ఫొటోకు తను స్పందిస్తూ 'హాయ్' అని రాస్తూ రెండు ఫైర్ ఎమోజీస్ను రిప్లైగా ఇచ్చింది. ఈ ఫొటోలో రెసిస్టాన్స్ బ్యాండ్తో రాజ్ కుమార్ చేస్తున్న వర్క్ అవుట్కు అతని బ్యాక్ కర్వ్ తిరిగి ఉండటం మనం చూడొచ్చు. కాగా బదాయి దో చిత్రంలో రాజ్ కుమార్ రావు బాడీ బిల్డర్గా మారాలనే పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటించాడు. అలాగే తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫొటోలను కొల్లేజ్ రూపంలో పోస్ట్ చేశాడు రాజ్ కుమార్. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) చదవండి: రాజ్ కుమార్ రావు, పత్రలేఖ వివాహం.. వెడ్డింగ్ కార్డ్ వైరల్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019