breaking news
-
సీటు కోసం కర్చీఫ్ వేసుకోవాలేమో.. రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ సెటైర్లు
లక్నో : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై అమేథీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రాపై విమర్శలు గుప్పించారు. 15ఏళ్ల పాటు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ గాంధీ అమోథీలో ఎలాంటి అభివృద్ది చేయలేదు. అలాంటిది రాబర్ట్ వాద్రా వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అధికారంలో ఉండగా చేయంది.. తాను కేవలం ఐదేళ్లలో చేసినట్లు తెలిపారు. బస్సులో సీటు కోసం ఖర్చీఫ్ వేసుకున్నట్లు అమోథీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్మృతి ఇరానీ మాట్లాడారు. జమనాలో బస్సు ప్రయాణంలో మరొకరు కూర్చోకుండా సీట్లలో కర్చీఫ్ వేసేవాళ్లు. రాహుల్ గాంధీ కూడా తన అమోథీ ఎంపీ సీటు కోసం కర్చీఫ్ వేయాల్సి ఉంటుందేమో.. ఎందుకంటే రాబర్ట్ వాద్రా అదే సీటుపై కన్నేశారని ఎద్దేవా చేశారు. పట్టుమని నెలరోజులు లేవు అమోథీలో ఎన్నికల పోలింగ్ సమయం పట్టుమని నెలరోజుల కూడా లేదు. కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్ధిని నిలబెట్టలేదు. ఇలాంటి చోద్యం ఎప్పుడూ చూడలేదు. ఎస్. రాహుల్ గాంధీ 15 ఏళ్లలో చేయంది నేను కేవలం ఐదేళ్లలో చేశాను అని స్మృతి ఇరానీ అన్నారు. పార్టీ ఆదేశిస్తే.. నేను ఆచరిస్తా అంతకుముందు.. కేరళలోని వయనాడ్ లోక్సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాహుల్ గాంధీని పలు మీడియా ప్రతినిధులు ‘మీరు అమేథీ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అని ప్రశ్నించారు. అందుకు పార్టీ ఆదేశాలకు ప్రకారం తాను పనిచేస్తాను’ అని బదులిచ్చారు. అమోథీలో నేనూ పోటీ చేస్తా రాబర్ట్ వాద్రా సైతం ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడితే అది అమోథీని ఎంచుకుంటానని తెలిపారు. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే కావాలని కోరుకుంటారని వాద్రా అన్నారు. నా ఎంట్రీతో.. ఓటర్లు చేసిన తప్పును ఈ సందర్భంగా అమేథీలో పోటీ చేస్తే.. ప్రస్తుతం అమేథీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని ఎన్నుకుని తప్పు చేశామని భావిస్తున్న ఓటర్లు.. నేను అమోథీ నుంచి పోటీ చేస్తే వారు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. నేను పోటీ చేస్తే ఓటర్లు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వరుస రాజకీయ పరిణామాలపై స్మృతి ఇరానీ తాజాగా స్పందించారు. -
రాష్ట్రంలో రెండు కాంగ్రెస్లు
జహీరాబాద్: రాష్ట్రంలో రెండు కాంగ్రెస్ పార్టీలు నడుస్తున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఒకటి రాహూల్ గాంధీ కాంగ్రెస్ అయితే, మరొకటి రేవంత్రెడ్డి కాంగ్రెస్గా వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదని, రేవంత్ ఎజెండా వేరు, రాహుల్ ఎజెండా వేరుగా ఉందన్నారు. గుజరాత్ మోడల్ను పీఎం మోదీ ఎదుట రేవంత్ పొగిడారని, రాహుల్ మాత్రం గుజరాత్ మోడల్ డొల్ల అని విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. రేవంత్రెడ్డి బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, ఆయన రాజకీయ పునాదులు ఆర్ఎస్ఎస్తో ఉన్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఏ కాంగ్రెస్కైనా మూడో స్థానమే దిక్కు అని హరీశ్ జోస్యం చెప్పారు. కేరళ సీఎం, సీపీఎం నేత పినరయి విజయన్ను రేవంత్ బీజేపీ తొత్తు అని విమర్శించారని, సీపీఎం ఏనాడైనా బీజేపీతో కలుస్తుందా? అని హరీశ్ ప్రశ్నించారు. అబద్ధాల్లో రేవంత్, భట్టి పోటీ అబద్ధాలు ఆడటంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పోటీ పడుతున్నారని హరీశ్రావు విమర్శించారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన ఈద్మిలాప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ భృతిపై ప్రియాంక గాంధీ మాట ఇచ్చారని,, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టిందని గుర్తు చేశారు. భట్టి విక్రమార్క మాత్రం తాము నిరుద్యోగభృతి ఇస్తామని ఎక్కడా చెప్పలేదని నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడారని ఆరోపించారు. తాజాగా రైతుల రుణమాఫీపై భట్టి విక్రమార్క నాలుక మడత పెట్టారని విమర్శించారు. ఇది రాష్ట్రంలోని 70లక్షల మంది రైతులను ఘోరంగా అవమానించడమేనని విమర్శించారు. ఏపీలో బాబు మాదిరే.. ఇక్కడ కూడా ఆంధ్రలో టీడీపీ, బీజేపీ కలిశాయని, అదే విధానం మేరకు చంద్రబాబు మిత్రుడు ఇక్కడ బీజేపీతో మిలాఖత్ అయ్యారని హరీశ్రావు సీఎం రేవంత్నుద్దేశించి విమర్శించారు. బీజేపీని వ్యతిరేకిస్తూ వచి్చంది బీఆర్ఎస్సేనని గుర్తు చేశారు. మళ్లీ కాంగ్రెస్ వచ్చాకే బీజేపీ బలపడుతోందన్నారు. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తోందని హరీశ్ ఆరోపించారు. -
ఎన్నికల బాండ్లు: రాహుల్గాంధీకి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
గాంధీనగర్: లోక్సభ ఎన్నికల వేళ ఎన్నికల బాండ్లపై నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుజరాత్లోని గాంధీనగర్ నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల బాండ్లపై మాట్లాడారు. ఎన్నికల బాండ్ల స్కీమ్ను ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్టార్షన్(అక్రమ వసూళ్లు) స్కీమ్గా అభివర్ణించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి షా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల బాండ్ల స్కీమ్ అతిపెద్ద ఎక్స్టార్షన్ స్కీమ్ అయితే కాంగ్రెస్కూడా ఈ స్కీమ్ కింద అక్రమ వసూళ్లకు పాల్పడిందని షా ఆరోపించారు. తాము కూడా ఈ స్కీమ్ కింద వసూళ్లు చేశామని రాహుల్ ప్రజలకు చెప్పాలి. ఎంపీల సంఖ్య ప్రకారం చూస్తే ప్రతిపక్షాలే అత్యధికంగా ఎన్నికల బాండ్ల స్కీమ్లో లాభపడ్డాయన్నారు. ప్రతిపక్షాలకు తమను విమర్శించడానికి ఏమీ లేదని, ఇందుకే ప్రజలను కావాలని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. కాగా, ఎన్నికల బాండ్ల స్కీమ్ కింద బీజేపీ అక్రమ వసూళ్లకు పాల్పడిందని, ప్రధాని మోదీ అవినీతి ఛాంపియన్ అని ఇటీవల రాహుల్గాంధీ విమర్శించారు. ఇదీ చదవండి.. నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో జీరో పోలింగ్ -
‘రాజవంశ పాలనే నమ్ముతున్నారు’.. రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగిన నడ్డా
కాంగ్రెస్ అగ్రనేత,కేరళ వయనాడ్ లోక్సభ అభ్యర్ధి రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ ఇంకా రాజవంశ పాలనను విశ్వసిస్తున్నారని విమర్శించారు. వయనాడ్ బీజేపీ లోక్సభ అభ్యర్ధి కే సురేంద్రన్కు మద్దతుగా జేపీ నడ్డా కేరళ సుల్తాన్ బేతరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్షోలో నడ్డా రాహుల్ గాంధీ ఇంకా రాజవంశ పాలను నమ్ముతున్నారని ఆరోపించారు. భారతదేశ ప్రజస్వామ్య పాలన ప్రమాదకరమని ఆయన భావిస్తున్నారని తెలిపారు. విభజించు పాలించు, ఓటు బ్యాంకు రాజకీయాల్ని ఆచరిస్తున్నారని ఆరోపించారు . నిషేధిత ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)అనుసంధానమైన రాజకీయ పార్టీ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంపై మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎస్డీపీఐ కాంగ్రెస్కు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎంకు మద్దతు ఇస్తోందని, ఈ రెండు పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం) రెండూ సైద్ధాంతికంగా దివాళా తీశాయని పేర్కొన్నారు. -
‘మా విశ్వాసంపై దాడి’.. రాహుల్, అఖిలేష్పై ప్రధాని మోదీ విమర్శలు
లక్నో: ప్రతిపక్ష కూటమిలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. మోదీ ఉత్తర ప్రదేశ్లోని అమ్రోహా నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో శుక్రవారం పాల్గొని మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ‘ప్రతి పక్షాలు మా(బీజేపీ) విశ్వాసంపై దాడి చేసి.. బంధు ప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయలు చేస్తున్నాయి. మరోసారి ఉత్తరప్రదేశ్లో ఇద్దరు యువరాజులు కొత్త సినిమా తీస్తున్నారు. అయితే ఇప్పటికే వారు తీసిన సినిమాను తిరస్కరించారు. బంధు ప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయలు ముసుగులోనే ప్రతీసారి ప్రతీపక్షాలు ఉత్తరప్రదేశ్ ప్రజలను ఓట్ల అడుగుతారు. ..ప్రతిపక్ష నాయకులకు మా విశ్వాసంపై దాడి చేస్తున్నారు. కానీ వాటికి మాపై దాడి చేసే అవకాశమే లేదు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి భారత్ మాతాకి జై అనడానికి కూడా ఇబ్బంది పడతాడు. అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానాన్ని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు తిరస్కరించాయి. ప్రతి రోజు ప్రతిపక్ష పార్టీలు రాముడిని, సనాతన ధర్మాన్ని దూషిస్తాయి. సమాజ్వాదీ పార్టీ నేతలు రాముడి భక్తులను కపటంతో కూడిన వ్యక్తులని బహిరంగా వ్యాఖ్యానిస్తారు’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019