breaking news
-
అవన్నీ అబద్ధాలు.. అసలు అగార్కర్..: రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి వస్తున్న వార్తలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ విషయం గురించి తాను ఇప్పటి వరకు మేనేజ్మెంట్తో ఎలాంటి చర్చలు జరుపలేదన్నాడు. అదే విధంగా.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో గత వారం తాను సమావేశమైనట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు. జట్టు ఎంపిక గురించి తాము అధికారిక ప్రకటన చేసినపుడు మాత్రమే అవి నిజాలని నమ్మాలని విజ్ఞప్తి చేశాడు. కాగా ఐపీఎల్-2024కు మే 26న తెరపడనుండగా.. జూన్ 1 నుంచి ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈవెంట్ మొదలైన ఐదో రోజున టీమిండియా ఐర్లాండ్తో మ్యాచ్తో తమ ప్రయాణం ఆరంభించనుంది. కెప్టెన్గా రోహిత్ శర్మనే ఇక ఈ మెగా టోర్నమెంట్లో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మనే ఉంటాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 ప్రదర్శన ఆధారంగానే వరల్డ్కప్ జట్టు ఎంపిక ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం ముంబైలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ సమావేశమై జట్టు కూర్పు గురించి జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓపెనర్గా విరాట్ కోహ్లి ఫిక్స్ అని.. బౌలింగ్ చేసే విషయంపైనే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక ఆధారపడి ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. అసలు అగార్కర్ ఇక్కడ లేనేలేడు ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా ఈ విషయాలపై స్పందించాడు. ‘‘నేను ఎవరినీ కలవలేదు. అజిత్ అగార్కర్ అక్కడెక్కడో దుబాయ్లో ఉన్నాడు. ఇక రాహుల్ ద్రవిడ్ తన పిల్లల ఆట చూసేందుకు బెంగళూరులోనే ఉండిపోయాడు. అయితే.. తన కుమారుడి కోసం బహుశా ముంబై వచ్చి ఉంటాడు. ఎర్రమట్టి పిచ్పై ఆడించేందుకు ఇక్కడికి తీసుకువచ్చాడేమో! అంతే. అంతకు మించి ఏమీ లేదు. మేము అసలు ఒకరినొకరం కలుసుకోలేదు. అవన్నీ అబద్దాలే ఈరోజుల్లో నేనో, ద్రవిడో, అగార్కరో లేదంటే బీసీసీఐ స్వయంగా స్పందిస్తేనే అవి నిజాలు. మిగతావన్నీ ఫేక్’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. క్లబ్ ప్రైరీ ఫైర్ అనే పాడ్కాస్ట్లో మైకేల్ వాన్, ఆడం గిల్క్రిస్ట్లతో మాట్లాడుతూ రోహిత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆటగాడిగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్తో బిజీగా ఉన్నాడు. చదవండి: #Rishabh Pant: పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే Rohit Sharma said - "I think today's day and age unless you hear it from either myself or Rahul Dravid himself or Ajit Agarkar himself or someone coming from BCCI talking infront of camera everything is fake". (On Kohli-Rohit opening in T20 WC 2024). pic.twitter.com/NUs6Xbs4ek — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 Rohit Himself confirmed he hasn't Met Any bcci official's last week and stated this as a fake news 😂 https://t.co/uIXDn9v8Ew pic.twitter.com/fiNe8keK0Y — Manojkumar (@Manojkumar_099) April 18, 2024 That means reports are fake, Kohli is not in the preference list of BCCI FOR T20 world cup. (Source- Mufa and Johns Paid pr of Kohli) pic.twitter.com/AwP96Uza5w — CAPTAIN (@RoForLife45) April 18, 2024 -
T20 WC 2024: రోహిత్ శర్మకు జోడీగా కోహ్లి ఫిక్స్!
టీ20 ప్రపంచకప్-2024లో విరాట్ కోహ్లిని భారత ఓపెనర్గా చూడబోతున్నామా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రన్మెషీన్ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా మెగా టోర్నీలో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఇప్పటికే రోహిత్ శర్మతో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత రోహిత్తో పాటు కోహ్లి కూడా సుదీర్ఘకాలం పాటు పొట్టి ఫార్మాట్లో టీమిండియా తరఫున బరిలోకి దిగలేదు. ఈ క్రమంలో ఇటీవల అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా విరాహిత్ ద్వయం పునరాగమనం చేశారు. అయితే, ఆ సిరీస్లో కోహ్లి తను రెగ్యులర్గా వచ్చే మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. మరోవైపు.. రోహిత్కు జోడీగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశాడు. ఇదిలా ఉంటే.. యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసే క్రమంలో ప్రపంచకప్-2024లో అసలు కోహ్లికి చోటే దక్కదంటూ గతంలో వార్తలు వచ్చాయి. అగార్కర్ ఈ మేరకు ప్రతిపాదనలు చేయగా.. రోహిత్ శర్మ వాటిని ఖండించాడని.. కోహ్లి జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఐసీసీ ఈవెంట్లో తన పాత్ర ఏమిటన్న విషయం మీద క్లారిటీ కావాలని కోహ్లి సెలక్షన్ కమిటీని అడిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతవారం ముంబైలో జరిగిన సమావేశంలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ ఇందుకు సంబంధించి కోహ్లిని ఓపెనర్గా పంపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు దైనిక్ జాగరణ్.. కథనం వెలువరించింది. కాగా రాయల్ చాలెంజర్స్ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి.. ఇప్పటి వరకు ఐపీఎల్-2024లో ఏడు మ్యాచ్లు ఆడి 361 పరుగులు చేశాడు. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. మరోవైపు.. ఇటీవల కాలంలో రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న యశస్వి జైస్వాల్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు రాజస్తాన్ తరఫున ఏడు మ్యాచ్లు ఆడి 121 రన్స్ మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తాజా సీజన్ ముగిసిన తర్వాత జూన్ 1 నుంచి వరల్డ్కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: రోహిత్తో ద్రవిడ్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్!
#T20WorldCup2024: హార్దిక్ పాండ్యా.. క్రీడా వర్గాల్లో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ గురించే చర్చ నడుస్తోంది. ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన పాండ్యా సొంత జట్టు అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. నిజానికి.. 2022లో గుజరాత్ టైటాన్స్ సారథిగా పగ్గాలు చేపట్టి అరంగేట్రంలోనే ఆ జట్టును చాంపియన్గా నిలిపిన ఘనత పాండ్యా సొంతం. గతేడాది కూడా అద్బుత కెప్టెన్సీతో టైటాన్స్ను ఫైనల్కు తీసుకువచ్చాడు. కలిసిరాని కాలం కానీ ఎప్పుడైతే సొంత గూటికి చేరుకుని ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా సారథిగా నియమితుడు కావడాన్ని ఇప్పటికీ ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే విధంగా.. పాండ్యా సైతం మైదానంలో తన ప్రణాళికలను అమలు చేయడంలో సఫలం కాలేకపోతున్నాడు. ఫలితంగా ముంబై ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. దీంతో పాండ్యా కెప్టెన్సీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటగాడిగానూ విఫలం ఇక ఆటగాడిగానూ హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లో కలిపి 131 పరుగులు చేసిన ఈ పేస్ ఆల్రౌండర్.. కేవలం 3 వికెట్లు తీశాడు. ఫలితంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో పాండ్యాకు అసలు స్థానం ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ తాజా కథనం వీటికి బలాన్ని చేకూరుస్తోంది. వరల్డ్కప్ జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గత వారం సమావేశమైనట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ జట్టులో పాండ్యాకు నో ప్లేస్! ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు స్థానం ఇవ్వాలా? వద్దా? విషయంపై దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అసలు పాండ్యా పూర్తి ఫిట్గా ఉన్నాడా? లేడా? ఆల్రౌండర్గా పూర్తి స్థాయిలో సేవలు అందించగలడా లేడా అన్న అంశం మీద కూడా టీమిండియా మేనేజ్మెంట్ సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి పాండ్యా హిట్టింగ్కు తోడు అదనపు సీమర్గా జట్టుకు ఉపయోగపడటం వల్లే అతడికి జట్టులో ప్రత్యేక స్థానం దక్కింది. కానీ ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ దృష్ట్యా పాండ్యా ఎంపికపై ఇప్పుడే మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరికొన్నాళ్లు వేచి చూసిన తర్వాతే అతడిని మెగా టోర్నీకి సెలక్ట్ చేసే విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యామ్నాయం అతడే! ఐపీఎల్-2024లో పాండ్యా రెగ్యులర్గా బౌలింగ్ చేస్తేనే అతడికి చోటిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అందులో గనుక పాండ్యా విఫలమైతే అతడికి ప్రత్యామ్నాయంగా సీఎస్కే స్టార్ శివం దూబే వైపు సెలక్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది. Most sixes since IPL 2022 - 🔹 66 Shivam Dube 🔹 66 Nicholas Pooran Dube : 34 sixes vs Spinners, 32 sixes vs Pacers - He is not just a spin smasher 💥#TATAIPL #IPL2024 #MIvCSK #MIvsCSK #CSKvsMI #CSKvMIpic.twitter.com/5cQlVDyTMr — TCTV Cricket (@tctv1offl) April 15, 2024 మిడిల్ ఓవర్లలో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఎంత ప్రమాదకర బ్యాటరో ఇప్పటికే నిరూపితమైంది. అయితే, ఈసీజన్లో అతడు ఇంత వరకు బౌలింగ్ చేయలేదు. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా హిట్టింగ్కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా పేస్ ఆల్రౌండర్గా బరిలోకి దిగే ఆటగాడు ఎవరన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా వన్డే వరల్డ్కప్-2023 మధ్యలోనే గాయం కారణంగా హార్దిక్ జట్టు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. చదవండి: #Shivam Dube: పేసర్లనూ చితక్కొడుతున్నాడు.. ఈ హిట్టర్కు చోటిచ్చేస్తారా? Kavya Maran: వారెవ్వా.. సూపర్ హిట్టింగ్! సంభ్రమాశ్చర్యంలో కావ్యా మారన్ -
అంతా అతడే చేశాడు.. వాళ్ల కోసం రోహిత్, ద్రవిడ్లను ఒప్పించి..
విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు జట్టుతో లేకున్నా.. యువ జట్టుతోనే ఇంగ్లండ్పై టెస్టు సిరీస్ గెలిచాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వీరిద్దరి గైర్హాజరీ.. మధ్యలో ఓ మ్యాచ్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి, బ్యాటర్గా కేఎస్ భరత్ వైఫల్యం.. ఫలితంగా ఏకంగా ఐదుగురు క్రికెటర్ల అరంగేట్రం. రెండో టెస్టుతో రజత్ పాటిదార్, మూడో టెస్టుతో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టుతో ఆకాశ్ దీప్, ఐదో టెస్టుతో దేవ్దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో రజత్ తప్ప అందరూ తమను తామను నిరూపించుకున్నారు. అయితే, ధ్రువ్ జురెల్, పడిక్కల్ల అరంగేట్రం గురించి తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరిని తుదిజట్టులో ఆడించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్లను ఒప్పించేందుకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం 15 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడిన జురెల్ను కేఎస్ భరత్ స్థానంలో వికెట్ కీపర్గా ఎంపిక చేయడం, ఛతేశ్వర్ పుజారాను పూర్తిగా పక్కనపెట్టి పడిక్కల్ను ఆడించడంలో అగార్కర్దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు హిందుస్తాన్ టైమ్స్ వెల్లడించింది. ‘‘జట్టు యాజమాన్యం జురెల్పై పూర్తి విశ్వాసంతో లేనపుడు అగార్కర్ ఒక్కడే అతడి పేరును బలపరిచాడు. నిజానికి రెడ్ బాల్ క్రికెట్లో తగినంత అనుభవం లేని కుర్రాణ్ణి.. అదీ ఇంగ్లండ్ వంటి జట్టుతో కీలక సిరీస్లో అరంగేట్రం చేయించడం అంటే సాహసంతో కూడుకున్న నిర్ణయం. అయితే, అగార్కర్ మాత్రం అతడిపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఇక జట్టులో సీనియర్ల గైర్హాజరీలో ఛతేశ్వర్ పుజారాను తిరిగి తీసుకువద్దామా అనే చర్చ కూడా నడిచింది. రంజీ ట్రోఫీలో పరుగులు చేస్తున్న పుజారాకు పిలుపునివ్వాలని భావించినపుడు.. అగార్కర్ మాత్రం పడిక్కల్ వైపే మొగ్గు చూపాడు. రంజీ ట్రోఫీ టోర్నీలో అద్బుత శతకం(150)తో సత్తా చాటిన పడిక్కల్ వంటి మంచి హైట్ ఉన్న ఆటగాడు.. అంతగా అనుభవం లేని ఇంగ్లండ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడని విశ్వసించాడు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా నాలుగో టెస్టులో టీమిండియా విజయానికి ధ్రువ్ జురెల్ ఇన్నింగ్సే ప్రధాన కారణమన్న విషయం తెలిసిందే. అదే విధంగా.. నామమాత్రపు ఐదో టెస్టులో పడిక్కల్ అద్భుత అర్ధ శతకం(65)తో చెలరేగాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. స్పందించిన రోహిత్ -
Ranji- శార్దూల్ ఏమన్నాడో విన్నాను: ద్రవిడ్
దేశవాళీ క్రికెట్లో మ్యాచ్ల మధ్య ఎక్కువ విరామం ఉండాలన్న టీమిండియా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ వ్యాఖ్యలపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. శార్దూల్ మాదిరే మెజారిటీ ఆటగాళ్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే తప్పక పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు రంజీల్లో కచ్చితంగా ఆడాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై తరుఫు బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ సెమీ ఫైనల్లో అదరగొట్టాడు. అలా అయితే కష్టమే కదా తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్లో సంచలన సెంచరీ(109)తో జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘కేవలం మూడు రోజుల గ్యాప్లో వరుసగా 10 మ్యాచ్లు ఆడటం అంటే దేశవాళీ క్రికెటర్లకు చాలా కష్టం. ముఖ్యంగా ఫాస్ట్బౌలర్లు ఎక్కువగా గాయాలబారిన పడే అవకాశం ఉంటుంది. గతంలో రెగ్యులర్ మ్యాచ్లకు మూడు రోజులు, నాకౌట్ మ్యాచ్లకు ఐదు రోజుల విరామం ఉండేది. కానీ.. ఇప్పుడు అన్నింటికి కేవలం మూడు రోజుల వ్యవధే ఉంటోంది’’ అని పేర్కొన్నాడు. శరీరాలను పణంగా పెడుతోంది వాళ్లే ఈ నేపథ్యంలో... ఇంగ్లండ్పై టీమిండియా 4-1 సిరీస్ విజయం తర్వాత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ కామెంట్లు చేసింది శార్దూల్ అనుకుంటా.. అతడే కాదు చాలా మంది క్రికెటర్లు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఇండియాలో లాంటి పెద్ద దేశంలో ప్రయణాలు, విరామం లేని షెడ్యూళ్లు అంటే కష్టమే. ఆటగాళ్ల ఇబ్బందుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. విరామం లేని ఆట కోసం వారి శరీరాల(ఆరోగ్యాన్ని)ను పణంగా పెడుతోంది వాళ్లే. కాబట్టి.. ఇలాంటి అంశాల్ని లేవనెత్తుతూ వారు గళం వినిపించినపుడు తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పలు మార్పులు చేర్పులు ఉండేలా షెడ్యూళ్లను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి’’ అని రాహుల్ ద్రవిడ్ శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లకు అండగా నిలిచాడు. ఆధునిక యుగంలో అవసరం లేదనుకున్న కొన్ని టోర్నీల నిర్వహణ గురించి.. ఆటగాళ్లు, కోచ్ల నుంచి అభిప్రాయాలు సేకరించి పునరాలోచన చేస్తే బాగుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. చదవండి: షూ కొనుక్కోవడానికీ డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019