breaking news
-
జగన్ పాలన ఎక్స్ట్రార్డినరీ... అంతే!
తెలుగు నేలకు తేజస్సు వచ్చింది అంటున్నారు ప్రముఖ సినీ నటుడు రఘుబాబు. ‘జగన్ ప్రభుత్వ పరిపాలన గురించి సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ట్రార్డినరీ అంతే. అంతకు మించి చెప్పడానికి మరో మాట నా దగ్గర లేదు.’ అంటూ కుండబద్దలు కొట్టేశారాయన. తాను ప్రస్తు తం రాజకీయాల్లో లేననీ ఏ పార్టీతోనూ ఎటువంటి సంబంధాలు లేవనీ. ఏ అవసరం కోసమైనా అ బద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదంటున్న ఆయన తన సొంత ఊరి లోని తన ఇంట్లో పనిచేసే పనివారి జీవితాల్లో వచ్చిన మార్పే ప్రస్తుత పాలనకు నిదర్శ నం అన్నారు. ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... అనూహ్యమైన పాలన ఇది.. నిజంగా జగన్ పరిపాలన ఈ స్థాయిలో ఉంటుందని గత ఎన్నికల ముందు నేను ఏ మాత్రం ఊహించలేదు. ఈ రకమైన అద్భుతమైన మార్పుల్ని నేను ముందుగా ఊహించలేదనేది నిజం. రాష్ట్రంలో మూలాల నుంచి మార్పును జగన్ కోరుకుంటున్నారనేది నాకు అనిపిస్తోంది. ఇప్పుడు మారుమూల ఊళ్లలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు చూస్తుంటే విదేశాల్లోని స్కూల్స్ గుర్తొస్తున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటే అవమానంగా భావించేవారు. ఆ దశ పోయి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకడం లేదని బోర్డులు పెట్టడం అంటే వాటి గొప్పతనం తెలుస్తుంది. అవి కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా మారడంతో అంతకు ముందు 20, 30శాతం కూడా విద్యార్ధులు కనిపించని పరిస్థితి నుంచి ఇప్పుడు 100శాతం ఆక్యుపెన్సీ నేను గమనించాను. మా సొంత ఊళ్లో... ఎంత మార్పో ! మాది ప్రకాశం జిల్లాలోని రావినూతల గ్రామం. తరచుగా మా ఊరుకు వెళుతుంటాం. దాంతో ఆ గ్రామంలో వచ్చిన మార్పులు ఎన్నో మాకు తెలుస్తున్నాయి. గ్రామ సచివాలయాలు కావచ్చు, వలంటీర్లు ఇళ్లకు రావడం... ప్రభుత్వ పథకాలు, ప్రతీదీ ఇంటికి తీసుకొచ్చి అందించడం గొప్పగా అనిపిస్తోంది. అక్కడ మా ఇంట్లో పనిచేసే పనివాళ్ల పిల్లలు కూడా ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని ఉపయోగించుకుని దర్జాగా రాజమండ్రిలోని ఇంజినీరింగ్ కాలేజ్లో చదువుకోగలుగుతున్నారు. ఇది మేం ఊహించని మార్పు. మేం వాళ్లు చేసే పనికి తగ్గ జీతాలు ఇచ్చినా... అడపాదడపా అదనంగా ఆర్థిక సాయం చేసినా కూడా వాళ్ల జీవితాల్ని సమూలంగా మార్చలేం. ఇప్పుడు అమలవుతున్న ప్రభుత్వ పథకాల వల్ల వాళ్ల జీవితాలు మారిపోతున్నాయి. పిల్లలు బాగా చదువుకోగలగడం వల్ల ఎన్నడూ చూడనంత ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది. ఇది మాకు చాలా ఆనందాన్ని అందిస్తోంది. ఈ పథకాలు ఇలాగే కొనసాగాలని, ఈ పాలన పేదలకు మరింత కాలం మేలు కలుగజేయాలని కోరుకుంటున్నాను. –సత్యార్థ్ -
సెంటిమెంట్.. యాక్షన్
శ్రీ కల్యాణ్, శశి జంటగా గేదెల రవిచంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మెగా పవర్’. అడబాల నాగబాబు, సాయినిర్మల, ఇల్లా అభిషేక్, సత్యమూర్తి గేదెల నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్లో జరిగాయి. హీరో కిరణ్ అబ్బవరం కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు రఘుబాబు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి పృథ్వీరాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ– ‘‘మదర్ సెంటిమెంట్తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది’’ అని అన్నారు. -
రఘుబాబు కూతురి ఎంగేజ్మెంట్లో స్టార్ల సందడి
-
కమెడియన్ కూతురి నిశ్చితార్థంలో తారల సందడి
కమెడియన్ రఘుబాబు కూతురు నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే కదా!. ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్లోని పలువురు సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. క్రాక్ హీరో రవితేజ, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, గోపీచంద్, డైలాగ్ కింగ్ మోహన్బాబు, కమెడియన్ బ్రహ్మానందం, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, అనసూయ భరద్వాజ్, ప్రకాశ్రాజ్, ఉదయభాను, బ్రహ్మాజీ సహా పలువురు తారలు ఈ ఎంగేజ్మెంట్కు విచ్చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక రఘుబాబు సినిమాల విషయానికొస్తే... కేవలం ఎక్స్ప్రెషన్స్తోనే నవ్వించగల ఘనుడాయన. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే టాలెంట్తో తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి కమెడియన్గా పేరు తెచ్చుకున్నాడు. పాత్ర డిమాండ్ మేరకు కొన్నిసార్లు విలనిజం ఉన్న పాత్రల్లోనూ నటించి మెప్పించాడు. ఈ మధ్యే వచ్చిన జాంబీరెడ్డిలోనూ కనిపించిన రఘుబాబు ప్రస్తుతం ఏ1 ఎక్స్ప్రెస్, సన్ ఆఫ్ ఇండియా, గాలి సంపత్ సినిమాల్లో నటిస్తున్నాడు. చదవండి: నెట్టింట్లో సినీతారలు: స్టైల్గా ల్యాండైన లైగర్ అవసరమైతే వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..! -
సినీ పరిశ్రమ అభివృద్ధికి జగన్ ముందుంటారు
‘‘వేదికపై ఉన్న అలీ, రఘుబాబు మా పార్టీలో (వైఎస్సార్సీపీ) ఉన్నారు. వారందరి సూచనలతో ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి మా సీఎం జగన్మోహన్ రెడ్డిగారు సుముఖంగా ఉన్నారు’’ అని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డ్ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. రఘు కుంచె సంగీతం అందించారు. ఈ చిత్రంలోని హీరోయిన్ ఇంట్రడక్షన్ ‘నారాయణతే నమో నమో..’ లిరికల్ వీడియో సాంగ్ని హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వై.వి.సుబ్బారెడ్డి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘శ్రీనివాస్ రెడ్డి 20 ఏళ్లుగా నాకు మంచి స్నేహితుడు. వెంకటేశ్వర స్వామివారి కీర్తన పాటని నాతో ఎందుకు రిలీజ్ చేయించారో పాట చూశాక అర్థం అయింది. పాటని చక్కగా చిత్రీకరించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నా దైవం, పితృ సమానులు సుబ్బారెడ్డిగారితో నా అనుబంధం 20 ఏళ్లుగా కొనసాగుతోంది. దివంగత నేత వై.యస్. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆ కుటుంబానికి, పార్టీకి న్నెముకగా ఉండి ఎన్నో సేవలందిస్తున్నారు సుబ్బారెడ్డిగారు. యస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్) బోర్డ్ డైరెక్టర్ పదవీ బాధ్యతలు నాకు అప్పగించారు. ఆయన నాపై పెట్టిన నమ్మకానికి నిజాయతీగా పని చేస్తా’’ అన్నారు. ‘‘రామానాయుడుగారు, ‘దిల్’ రాజుగారి స్ఫూర్తితో ఇండస్ట్రీకి వచ్చాను. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఈ సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది’’ అన్నారు శ్రీనివాస్ కానూరు. సంగీత దర్శకుడు రఘు కుంచె, పాటల రచయిత శ్రీమణి, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, ఎడిటర్ తమ్మిరాజు, నటుడు రవి ప్రకాష్, కెమెరామేన్ అంజి, లైన్ ప్రొడ్యూసర్ యమ్యస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019