breaking news
-
‘లోక్సభ’లో ఓడినా... ప్రధానులైన నేతలు వీరే!
దేశంలోని ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే పలు విచిత్ర ఉదంతాలు మనకు కనిపిస్తాయి. వీటిలోని కొన్నింటిని విన్నప్పుడు మనకు ఒక పట్టాన నమ్మాలని అనిపించదు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. అయితే నాటి ఎన్నికల్లో దిగ్గజనేతలైన చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్పేయి, నరసింహారావు ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఈ ముగ్గురు సీనియర్ నేతలు తదుపరి 12 ఏళ్ల వ్యవధిలో వేర్వేరు సమయాల్లో దేశానికి ప్రధానులుగా మారడం విచిత్రం. చంద్రశేఖర్ జనతా పార్టీ నుంచి నాడు ఎన్నికల బరిలోకి దిగిన చంద్రశేఖర్ తన సంప్రదాయ స్థానమైన బల్లియా(యూపీ) నుంచి పోటీకి దిగినా ఆయనకు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్కు చెందిన జగన్నాథ్ చౌదరి 53,940 ఓట్ల తేడాతో సునాయాసంగా చంద్రశేఖర్ను ఓడించారు. ఆ తర్వాత 1990లో చంద్రశేఖర్ దేశ ప్రధాని అయ్యారు. పీవీ నరసింహారావు కాంగ్రెస్ సీనియర్ నేత, నాటి హోంమంత్రి పీవీ నరసింహారావు కూడా ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 1984లొ దక్షిణాదిలో బీజేపీ తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. నాడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీ జంగారెడ్డి 54,198 ఓట్ల తేడాతో నరసింహారావుపై విజయం సాధించారు. దక్షిణ భారతదేశం నుంచి ఎంపీగా ఎన్నికైన తొలి బీజేపీ నేత సీ జంగా రెడ్డి. 1991లో నరసింహారావు దేశానికి ప్రధాని అయ్యారు. వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి 1984 ఎన్నికల్లో గ్వాలియర్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు సింధియా చేతిలో వాజ్పేయి ఓటమి పాలయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి 1996లో దేశానికి ప్రధాని అయ్యారు. -
'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!
సమ్మర్ అనంగానే గుర్తొచ్చొది తియ్యని మామిడి పండ్లు. వాటిని చూస్తేనే నోరూరిపోతుంది. అంత రుచికరమైన ఈ మ్యాంగో ఫ్రూట్లో ఎన్నో వైవిధ్యమైన రకాలు చూశాం. కానీ ఏకంగా దేశ ప్రధాని మోదీపేరు మీదగా కొత్త రకం దేశీ పండును తీసుకొచ్చాడు ఓ రైతు. ఏకంగా హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ ఇతి ప్రత్యేకు రుచిని కలిగి ఉన్న మామిడి పండు అని సర్టిఫై చేసింది. ఇంతకీ ఈ పండు ప్రత్యేకత ఏంటీ..? ఎవరు ఈ కొత్తరకం మామిడిని తీసుకొచ్చారు అంటే..! మామిడి పండు జ్యూస్ అయిన పండు పలంగా అయినా భలే రుచిగా ఉంటాయి. ఇంతవరకు అల్ఫోన్సో, దాషేరి, కేసర్, తోతాపురి, లాంగ్రా, బంగినపల్లి వంటి ఎన్నో రకాల మామిడి పండ్ల రుచులు చూశాం. ఇవన్నీ వేటికవే మంచి సువాసనతో కూడిన రుచిని కలిగి ఉంటాయి. వీటితో ప్రజలు స్మూతీస్, మిల్క్షేక్లు, జామ్లు, ఊరగాయలు, ఐస్క్రీమ్లు,డెజర్ట్లు వంటివి ఎన్నో తయారు చేస్తారు. దీన్ని 'పండ్ల రాజు' అని కూడా పిలుస్తారు. అలాంటి ఈ మామిడి పండంటే తనకెంతో ఇష్టం అని ప్రధాని మోదీ పలు సార్లు వేదికలపై చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు ఆయన పేరు మీదగా కొత్త రకం మామిడి పండ్లను సాగు చేశారు. 'మ్యాంగో మ్యాన్'గా పిలిచే పద్మశ్రీ హాజీ కలిముల్లా కోల్కతాలోని 'హుస్న్ ఎ ఆరా' అనే మామిడి రకాన్ని, దేశీ దషేరి మామిడి రకంతో క్రాస్ సాగు చేసి ఓ కొత్త వేరియంట్ మామిడిని రూపొందించారు. దీనికి 'నమో' అని పేరు పెట్టారు. అదే విధంగా భాగల్పూర్కు చెందిన ఆశోక్ చౌదరి మోదీ 1,2,3 అనే మూడు రకాల మామిడి పండ్లను సాగు చేయడం జరిగింది. ఇంత వరకు భాగానే ఉంది. వారందరికంటే లక్నోలోని మలిహాబాద్కు చెందిన ఉపేంద్ర సింగ్ ప్రధాని మోదీ పేరుతో పండించిన కొత్త రకం మామిడి పండే బెస్ట్ మామిడి అని పేరు దక్కించుకుంది. ఉపేంద్ర రెండు దేశీ మామిడి రకాలను క్రాస్ కల్టివేట్ చేసి ప్రధాని పేరు మీద 'మోదీ' అనే పండుని పండించారు. ఆయన ఎందుకిలా 'మోదీ మామిడి' అనే పేరు పెట్టారంటే..ఆయన రాజకీయాల్లో చాల సందర్భాల్లో సాహోసోపేతమైన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యచకితులని చేసి అశేష ఆదరాభిమానాలు పొందారన్న ఉద్దేశ్యంతో మోదీ మామిడి పండు అనే పేరు పెట్టడం జరిగిందని చెప్పారు. ఉపేంద్ర సింగ్ అక్కడితో ఆగకుండా ఆ పేరు మీద పూర్తి హక్కులను కూడా సంపాదించుకున్నారు. అతడు సాగు చేసిన ఈ కొత్త రకం మోదీ మామిడి మిగతా వాటికంటే మంచి నాణ్యతో కూడిన పల్పు ఉండి, మంచి రుచిని కలిగి ఉందని పేర్కొంటూ మోదీ అనే పేరుపై ఉపేంద్రకి ప్రత్యేక హక్కును మంజూరు చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఈ పండు త్వరలో వాణిజ్య మార్కెట్లోకి రానుంది. దీని రుచి ఇప్పటికే ఉన్న రకాల కంటే చాలా రుచికరమైనది, గుజ్జు కూడా ఎక్కువగా ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పైగా పరిమాణం కూడా పెద్దది. ఓ వ్యక్తి కడుపు నింపడానికి ఈ కొత్తరకం మామిడి పండు ఒకటి తింటే సరిపోతుందని చెబుతున్నారు. ఇది ఐదు నుంచి ఆరు రోజుల వరు పాడవ్వదని, చౌసా, దుషేరి, లాంగ్రా వంటి రకాల మామిడి పండ్ల కంటే పెద్దదిగా ఉండి టేస్టీగా ఉంటుందని సెంట్రల్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ కూడా ధృవీకరించింది. అంతేకాదండోయ్ ఈ మోదీ మామిడి పండు భారీ ధరతో కూడిన ట్యాగ్తో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ ఏడాది జులై నుంచి ఆగస్టు మధ్య జరిగే వార్షిక మామిడి పండ్ల వెరైటీల ప్రదర్శనలో కూడా ఈ కొత్తరకం మామిడి పండును ఉంచనున్నారు. (చదవండి: కాలేజ్కి కూడా వెళ్లలేదు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లు..!) -
1966 to 1977: ఇందిరమ్మ శకం
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మూడో లోక్సభ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ కాలంలోనే దేశం ఇద్దరు ప్రధానులను కోల్పోయింది. రెండు యుద్ధాలనూ చవిచూసింది. నెహ్రూ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొలి రెండు విడతలతో పోలిస్తే ఎన్నికల నిర్వహణ కాలం మరింత తగ్గి రెండు నెలల్లోనే క్రతువు ముగిసింది. పదేళ్ల పాటు తండ్రి చాటు బిడ్డగా, నెహ్రూ సహాయకురాలిగా పనిచేసిన ఇందిరాగాంధీ 1959లో కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఆమె నాయకత్వంలోనే పార్టీ 1962 ఎన్నికలకు వెళ్లింది. అనూహ్య పరిణామాలతో 1966లో ఇందిర ప్రధాని అయ్యారు. ద్విసభ్య నియోజకవర్గాలు రద్దయ్యాయి. సి.రాజగోపాలాచారి సారథ్యంలో కొత్త జాతీయ పార్టీ తెరపైకి వచి్చంది. ఇలా ఎన్నో అనూహ్య పరిణామాలు, విశేషాలకు 1962–67 మూడో లోక్సభ కాలం వేదికగా నిలిచింది. ఇందిరాగమనం... పదేళ్ల పాలన తర్వాత కూడా దేశంలో బలమైన ప్రతిపక్షమంటూ వేళ్లూనుకోలేదు. ప్రజల మనసుల్లో నెహ్రూ స్థానం చెక్కు చెదరలేదు. 1962 మూడో లోక్సభ ఎన్నికల్లో 28 పార్టీలు పోటీ చేశాయి. కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ 60 శాతానికి పైగా సీట్లు కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. 1957 కంటే కేవలం 10 సీట్లు, ఒక శాతం ఓట్లు తగ్గాయి. సీపీఐకి 29, రాజాజీ స్థాపించిన స్వతంత్ర పార్టీకి 18 స్థానాలు దక్కాయి. ప్రజా సోషలిస్ట్ పార్టీ 12, భారతీయ జనసంఘ్ 14 స్థానాలను గెలుచుకున్నాయి. 361 స్థానాలతో కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టి నెహ్రూ మూడోసారి ప్రధాని అయ్యారు. ముందుచూపుతో కుమార్తె ఇందిరను అప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. కానీ ఇందిర తీరు పార్టీలో అన్ని వర్గాలకూ నచ్చలేదు. ఆమె నాయకత్వ పటిమపై అనుమానాలూ రేకేత్తాయి. పలువురు సీనియర్లు బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. పార్టీలో ఇందిర అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి. నెహ్రూ ఉన్నంత కాలం సజావుగానే సాగినా 1964 మే 27న గుండెపోటుతో నెహ్రూ హఠాన్మరణం అనూహ్య మార్పులకు దారి తీసింది. గుల్జారీలాల్ నందా తాత్కాలికంగా 13 రోజులు ప్రధానిగా వ్యవహరించాక 1964 జూన్ 9న లాల్బహదూర్ శాస్త్రి గద్దెనెక్కారు. ఆయన దురదృష్టవశాత్తూ 1966 జనవరి 11న ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్లో ఆకస్మిక మరణానికి గురయ్యారు. మరోసారి నందా 13 రోజులు తాత్కాలిక ప్రధానిగా ఉన్నాక ఇందిర రంగప్రవేశం చేశారు. 1966 జనవరి 24న దేశ తొలి, ఏకైక మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికామె యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1959లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇందిర రాజకీయ కెరీర్ మొదలైంది. అదే ఏడాది నెహ్రూతో విభేదించి సి.రాజగోపాలాచారి స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశారు. తమిళనాట కొత్తగా ఏర్పడ్డ ద్రవిడ మున్నేట్ర కజగం 1962 లోక్సభ ఎన్నికల్లో (డీఎంకే) 2 శాతం ఓట్లతో ఏడు సీట్లు గెలిచింది. చైనా, పాక్తో యుద్ధాలు నెహ్రూ మూడోసారి అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే చైనా దురాక్రమణను ఎదుర్కోవాల్సి వచి్చంది. టిబెట్ బౌద్ధ గురువు దలైలామాకు 1959లో భారత్ ఆశ్రయం కలి్పంచడం దీనికి నేపథ్యమంటారు. చైనా దళాలు లద్దాఖ్లో భారత భూభాగాన్ని ఆక్రమించడం 1962 అక్టోబర్ 20న ఘర్షణ మొదలైంది. నవంబర్ 20న చైనా కాల్పుల విరమణ ప్రకటించింది. 5,000 మంది సైనికులు అసువులు బాయడమో, అదృశ్యమవడమో జరిగింది. శాస్త్రి హయాంలో పాక్ మనతో కయ్యానికి కాలు దువి్వంది. భారత్లో అశాంతిని రాజేయడానికి ఉగ్రవాదులను దేశంలోకి చొప్పించే ప్రయత్నం యుద్ధానికి దారితీసింది. 1965 ఆగస్ట్ 5 నుంచి సెపె్టంబర్ 23 దాకా సాగిన ఈ యుద్ధంలోనూ 4,000 మంది దాకా సైనికులు అమరులయ్యారు. 1966 జనవరి 10న పాక్తో తాషె్కంట్ ఒప్పందం కుదిరింది. కానీ ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అక్కడే శాస్త్రి కన్నుమూసిన తీరు మిస్టరీగానే మిగిలింది. గుండెపోటని వార్తలొచి్చనా అసలు కారణం ఇప్పటికీ వెలుగు చూడలేదు. సిరా చుక్కకు నాంది ఓటేశాక వేలిపై సిరా చుక్క పెట్టే విధానాన్ని 1962 ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. తయారీ కంపెనీ మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఎన్నో దేశాలకు ఇంకును ఎగుమతి చేసేది. మూడో లోక్సభ కాలంలో ముఖ్య పరిణామాలు ► దేశవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్, పారిశ్రామికాభివృద్ధి తదితర రంగాలపై నెహ్రూ దృష్టి ► దేశంలో పలు ప్రాంతాల్లో స్టీల్ ఫ్యాక్టరీల తదితర చర్యల ద్వారా పారిశ్రామికీకరణకు మరింత ఊతం ► నెహ్రూ ఆకస్మిక మృతి, లాల్బహదూర్ శాస్త్రి మిస్టరీ మరణం ► భాషా ప్రాతిపదికన 1960లో మహారాష్ట్ర, గుజరాత్గా విడిపోయిన బొంబాయి రాష్ట్రం ► ఆహార కొరతకు విరుగుడుగా హరిత విప్లవం మూడో లోక్సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 494) పార్టీ సీట్లు కాంగ్రెస్ 361 సీపీఐ 29 స్వతంత్ర పార్టీ 18 ప్రజా సోషలిస్ట్ పార్టీ 12 భారతీయ జన సంఘ్ 14 ఇతరులు 40 స్వతంత్రులు 20 – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ మరోమారు ప్రధాని కావాలంటూ ప్రార్థనలు!
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అదే సమయంలో శ్రీరాముడు కొలువైన అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి దేశానికి ప్రధానమంత్రి కావాలని భగవంతుణ్ణి వేడుకుంటూ యాగాలు, ప్రార్థనలు ప్రారంభించారు. బాబ్రీ మసీదు కేసు న్యాయవాది ఇక్బాల్ అన్సారీ ఖురాన్ పఠించి, ప్రధాని మోదీ మూడవసారి ప్రధాని కావాలని వేడుకున్నారు. అలాగే జగద్గురు పరమహంస ఆచార్య.. మోదీ కోసం ప్రార్థనలు చేశారు. అయోధ్య మతపరమైన నగరమని, ఇక్కడి ప్రజల ప్రార్థనలు దేవతలు తప్పకుండా వింటారని, ఇక్కడ ఏ పూజ చేసినా, ప్రార్థించినా దైవం స్వీకరిస్తాడని ఇక్బాల్ అన్సారీ పేర్కొన్నారు. అయోధ్యలోని తపస్వి కంటోన్మెంట్కు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్లలో ప్రధాని మోదీ పాలన దేశానికి, ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. అందుకే దేశ ప్రజలంతా మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలన్నారు. -
PM Narendra Modi: అవినీతిపరులు ఒక్కటవుతున్నారు
జమూయి/కూచ్బెహార్: అవినీతి కేసుల్లో ఇరుక్కున్నవారంతా మోదీపై యుద్ధం పేరిట ఒక్కటవుతున్నారని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆ కూటమిలో ఉన్న భాగస్వాములంతా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నవారేనని గుర్తుచేశారు. అవినీతిపరులను జైలుకు పంపించాలా? వద్దా? అని ప్రశ్నించారు. తాను అవినీతి నిర్మూలన గురించి మాట్లాడుతుండగా, ప్రతిపక్షాలు మాత్రం మోదీని ఓడించాలని ప్రజలకు పిలుపునిస్తున్నాయని తప్పుపట్టారు. గురువారం బిహార్లోని జమూయి జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మన దేశానికి ముప్పుగా మారిన సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి దాడులు చేస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. చిన్నదేశాల నుంచి ముష్కరులు వచి్చపడుతున్నా చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించారని మండిపడ్డారు. దీనివల్ల భారత్కు బలహీన దేశమన్న చెడ్డపేరు వచి్చందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియాను సులువుగా టార్గెట్ చేయొచ్చన్న అభిప్రాయం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం వల్ల ప్రపంచం దృష్టిలో భారత్ పేద దేశంగా ముద్రపడిందని అన్నారు. యూపీఏ ప్రభుత్వ పాలనలో 26/11 ముంబై ఉగ్రవాద దాడుల కేసులో అమెరికా జోక్యాన్ని అనుమతించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. సీఏఏపై విపక్షాల తప్పుడు ప్రచారం పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. భరతమాతపై విశ్వాసం ఉన్నవారికి భారత పౌరసత్వం కల్పిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. ఆయన పశి్చమ బెంగాల్లోని కూచ్బెహార్లో ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతిపరులను కాపాడేందుకు ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని విమర్శించారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019