breaking news
-
కాపీ కొట్టిన మేనిఫెస్టోనే అంతా చెబుతోంది!
తెలుగు దేశం పార్టీ కోసం పనిచేస్తున్న ‘కన్సల్టెన్సీ’ హెడ్ రాబిన్ శర్మ ‘‘ఎన్నికల్లో టీడీపీ గెలుపు దుర్లభమనీ, తాము చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదనీ, చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత లేక పోవడమే అసలు సమస్య’’ అనడం రేపు ‘పోలింగ్ బూత్’లో తటస్థ ఓటరుపై గట్టి ప్రభావం చూపి స్తుంది. ఎందుకంటే, ఇది మరొక ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటున్న మాట కాదు. మన కోసం మనం ‘ఫీజు’ కట్టి పెట్టుకున్న ‘సర్వీస్ ప్రొవైడర్’ వ్యక్తం చేసిన నిస్సహాయత. ఇది ఎటువంటిది అంటే, మన ‘ఫ్యామిలీ డాక్టర్’– ‘‘మీ జబ్బును నేను తగ్గించ లేకపోతున్నాను’’ అని పెదవి విరవడం వంటిది. వాళ్ళు అటువంటి ముగింపుకు రావడానికి కారణం, ఆరు నెలల క్రితం ‘మేనిఫెస్టో’లో నుంచి ‘బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ’ పేరుతో ‘సూపర్ సిక్స్’ పథకాలు ‘ట్రయిల్’ కోసం విడుదల చేశారు. ఆ తర్వాత దానికి విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజల నుండి స్పందన లేదు. ఈ ‘టీం’ ఇటువంటి అభిప్రాయానికి రావడానికి ఇదే ప్రధాన కారణం అయింది. ఈ దశలో ‘రిస్క్ మేనేజ్మెంట్’ కోసం ప్రశాంత్ కిషోర్ తెరపైకి వచ్చి, తన ప్రకటనకు ముందూ వెనుకా ఎటువంటి వివరణ లేకుండా, ‘ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవదు’ అని ఏకవాక్య ప్రకటన చేసి మళ్ళీ ఎక్కడా కనిపించకుండా నిష్క్రమించారు. ఈ ప్రకటన మనం నమ్మడం కోసం ముందుగా – ‘ఈ ఎన్నికల్లో నేను టీడీపీ కోసం పనిచేయడం లేదు’ అని ప్రకటించాక, ‘వైఎస్సార్సీపీ గెలవదు’ అన్నారు. ఇది జరిగాక కావొచ్చు, చివరి ప్రయత్నంగా ప్రశాంత్ కిషోర్– ‘వదలొద్దు మరో ప్రయత్నం చేయండి’ అని రాబిన్ శర్మ బృందానికి సూచించారు. ఇప్పుడు టీడీపీ పూర్తి స్థాయిలో ‘మేనిఫెస్టో’ వెల్లడించిన తర్వాత కూడా అన్ని ‘సర్వే’ నివేదికలు జగన్కు అనుకూలంగా ఉన్నాయి. సరిగ్గా ఈ కాలంలోనే, చంద్రబాబు తన ప్రసంగాల్లో ‘బ్యాలెన్స్’ కోల్పోవడం మొదలయింది. సభకు వచ్చినవాళ్లను ‘మీ ఊళ్లో గంజాయి దొరుకుతోందా’ అని గుచ్చి గుచ్చి అడుగుతూ తనకు అనుకూలమైన సమా ధానం పొందేందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిని సాధారణంగా శత్రు వుగా చూడరు. జగన్ విషయంలో బాబు ఆ హద్దు ఎప్పుడో దాటారు. ఎప్పుడైనా ఎన్నికల ‘నోటిఫికేషన్’ అంటే చంద్ర బాబుకు ఆయన పార్టీ అభ్యర్థులకు అది ‘టెండర్ నోటీస్’ వంటిది. అందుకే ఎన్నికల సమయానికి ఆర్థిక నేరస్థులూ, ‘ఎన్నారై’లూ అ పార్టీలో అభ్య ర్థులుగా ఉంటారు. వీరి వద్ద నుంచి నిధులను సమీకరించి ముందుగా వాటిని తన నేలమాళిగలో దాచి, అప్పుడు తన పార్టీ ‘మేనిఫెస్టో’ అంటూ బాబు ప్రజల ముందు ‘టెండర్’ దాఖలు చేస్తారు. గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఐదేళ్ళ సంపాదనముందుగా దాచిన దానికి అదనం. ప్రతి ఎన్నికలో బాబుది ఇదే ‘ఫార్ములా’. అందుకే, ప్రతిపక్ష నాయ కుడిగా బాబు ఎలాగోలా నెట్టుకుంటూ తన పార్టీ ఉనికిని ఎన్నికల వరకు దొర్లించి, చివరిలో ఎవరో కొందరి మద్దతు తీసుకుని; మళ్ళీ తన టోపీని ఎన్నికల ‘ఎరీనా’లోకి విసురుతారు. గెలిస్తే, ‘డబల్ బెనిఫిట్’; ఓడిపోతే, ‘సింగిల్ బెనిఫిట్’. బాబుకు ఎన్నికలు అంటే, ఇంత ‘సింపుల్’.అందుకే గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను తప్పు పట్టిన బాబు, ఎన్నికల ముందు ‘సూపర్ సిక్స్’ అంటూ అరువు తెచ్చుకున్న అంశాలతో ‘కిచిడీ’ మేనిఫెస్టో’ ప్రకటించారు. అందులోని అంశాలు: టీడీపీ అధికారంలోకి వస్తే ‘మహా శక్తి’ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు ‘స్త్రీనిధి‘ కింద నెలకు 1500 రూపాయలు, ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే.. వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున, ‘దీపం‘ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల సరఫరా చేయడం, స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. జగన్ సంక్షేమ పథకాలను తప్పు పట్టి, మళ్ళీ వాటినే పేర్లు మార్చి అమలుచేస్తాననే ఈ ‘యూ టర్న్’ ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు మనం మూడు చోట్ల వెతకాలి. మొదటిది అమరావతి. బాబును నమ్మి అక్కడ భూములు కొన్న ‘ఎన్నారై’లకు ఈ ఎన్నికల్లో బాబు గెలుపు అవసరం. అది వారికి జీవన్మరణ సమస్య. అందుకే వాళ్ళు స్వయంగా నెల ముందుగా ఇండియా వచ్చి టీడీపీ కోసం ఇక్కడ ప్రచారం చేసే పనిలో ఉన్నారు. రెండవది – ‘మార్గదర్శి’ రామోజీరావు భవిష్యత్తు. మూడవది – పై రెండింటి కంటే సంక్లిష్టమైన కొడుకు లోకేష్ చుట్టూ అల్లుకుని ఉన్న కుటుంబ చట్రంలో నుంచి బాబు క్షేమంగా బయటపడటం. బయట నుంచి దీన్ని చూస్తున్న మనకే వీటికి పరిష్కారం ఉందని అనిపించడం లేదు. ఇంకా మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో వాటి సంగతి ఏమిటో... మరో నెల రోజులు కాలం తర్వాత తెలుస్తుంది. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు మొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
కూటమి చిలుక 'పీకే'
సాక్షి, అమరావతి: తాను ఏ రాజకీయ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదంటూ ప్రశాంత్ కిశోర్ (పీకే) వల్లె వేస్తున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదని స్పష్టమైంది. ఏపీలో టీడీపీ–బీజేపీ కూటమికి పీకే ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నట్లు పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈమేరకు బుధవారం టీవీ 9 బంగ్లా చానెల్కు మమతా బెనర్జీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘పీకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అనుకూలంగా పీకే జోస్యం చెబుతున్నారు’ అని వెల్లడించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను బట్టి పీకే చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకనే టీడీపీ గెలిచే అవకాశం ఉందంటూ చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా జోస్యం చెబుతున్నట్లు తేలిపోయింది. బాబు అరెస్టు తరువాత.. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టు అనంతరం భయపడి ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో నారా లోకేష్ పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈక్రమంలో చంద్రబాబు బెయిల్పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్కు అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లో లోకేష్ తీసుకొచ్చారు. ఉండవల్లిలోని తమ అక్రమ నివాసంలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పారు. బిహార్లో కలసి రాకపోవడంతో.. బెంగాల్ ఎన్నికల తర్వాత 2021లో ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనంటూ పీకే ప్రతినబూని ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీ‹Ùకుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. ఆపై నితీశ్తో విభేదించి సొంత పార్టీ స్థాపించి పాదయాత్ర చేసినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. దీంతో రాజకీయంగా బిహార్లో తన పప్పులు ఉడకవని గ్రహించిన పీకే డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పేందుకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుంటూ టీడీపీకి అవసరమైనప్పుడల్లా ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఆ జోస్యాలన్నీ తప్పే.. అటు బిహార్లో రాజకీయంగా చెల్లక.. ఇటు ఇం‘ధనం’ లేక కొట్టుమిట్టాడిన పీకే తనకు ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యాలు చెప్పేందుకు అలవాటు పడ్డారు. గతేడాది చివరిలో తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని పీకే చెబితే చివరకు అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ గెలుస్తుందని పీకే ఢంకా భజాయిస్తే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరపున వకాల్తా తీసుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు సేవలో ‘పీకే’ ఏపీ రాజకీయాల్లో తలమునకలు బెంగాల్ సీఎం మమత వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం లేదన్నారు. ఐప్యాక్ సంస్థకు చెందిన ప్రతీక్ జైన్, ఆయన బృందం తమకు వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తలమునకలై ఉన్నట్లు చెప్పారు. ఆయన టీడీపీ, బీజేపీల కోసం పనిచేస్తున్నారన్నారు. తాజాగా బెంగాల్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మమతా ఈ విషయాలను వెల్లడించారు. పీకే బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టే ఎన్డీఏ కూటమి మళ్లీ విజయం సాధిస్తుందంటూ పదే పదే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ వెలుపల ఆయన ప్రభావం, ప్రమేయం పెద్దగా లేదన్నారు. -
వ్యూహకర్తలు హ్యాండ్సప్.. జారిన జాకీలు!
సాక్షి, అమరావతి: ఎన్ని ఎత్తుగడలు వేసినా.. ఎంత హైప్ ఇచ్చినా.. జాకీల నుంచి పొక్లెయిన్ల దాకా అన్నీ వాడి చూసినా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గ్రాఫ్ ఏమాత్రం పెరగడం లేదని పార్టీ వ్యూహకర్తలు తేల్చేశారు! తాము చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదని, ఎన్నికల్లో టీడీపీ గెలుపు దుర్లభమని పార్టీ ప్రధాన వ్యూహకర్త రాబిన్ శర్మ చేతులెత్తేశారు. టీడీపీ ముఖ్య నేతల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబుకు ఏమాత్రం విశ్వసనీయత లేకపోవడమే అసలు సమస్య అని రాబిన్ బృందం తేల్చింది. ప్రజలు ఆయన చెప్పే మాటలను నమ్మడం లేదని, అందువల్లే ఆరు నెలల ముందే విడుదల చేసిన శాంపిల్ మేనిఫెస్టో నిష్ఫలంగా మారిందనే అంచనాకు వచ్చారు. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో సూపర్ సిక్స్ పథకాల గురించి ఎంత ఊదరగొట్టినా, ఇంటింటికీ తిరిగి రిజిస్ట్రేషన్ల కోసం వేడుకున్నా జనం పట్టించుకోలేదని వారి సర్వేల్లో తేలింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం, మాట నిలబెట్టుకోకపోవడం వల్లే చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇస్తున్న హామీలు నమ్మదగ్గవి కావనే అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నట్లు గుర్తించారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన అన్ని పనులను సీఎం అయ్యాక చేయడం, 99 శాతం హామీలను అమలు చేయడంతో ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత బలంగా నాటుకుందని నిర్థారించుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎంత గొప్ప పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నమ్మబలికినా జనం నమ్మే అవకాశాలు లేవనే అంచనాకు వచ్చారు. పొత్తు బెడిసికొట్టింది.. ఓట్ల బదిలీ అసాధ్యం బీజేపీ, జనసేనతో టీడీపీ కుదుర్చుకున్న అవకాశవాద పొత్తు బెడిసికొట్టినట్లు రాబిన్ శర్మ సర్వేలు తేల్చినట్లు సమాచారం. రాజకీయ అవసరాల కోసం కుదుర్చుకున్న అసహజ పొత్తుగా ప్రజలు దీన్ని గుర్తించినట్లు గ్రహించారు. పొత్తులతో సీట్ల సర్దుబాటు కూడా ఆశాజనకంగా లేదని వెల్లడైంది. దీంతో ఏ రకంగా చూసినా టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదలాయింపు సాధ్యం కాదని తేలింది. నియోజకవర్గాల స్థాయిలో మూడు పార్టీలు కలవలేదని, జనసేన ఓట్లు టీడీపీకి వచ్చే అవకాశాలు చాలా స్వల్పమేనని అంచనా వేశారు. పొత్తు కుదిరాక పవన్ కళ్యాణ్ బలహీనంగా మారడంతో ఆయనకున్న కొద్దిపాటి ఓటు బ్యాంకుకు గండి పడుతున్నట్లు నిర్థారించుకున్నారు. ఇక బీజేపీకి ఉన్న ఓట్లే తక్కువ కావడంతోపాటు అవి టీడీపీకి బదిలీ అవడం కష్టమేనని తేల్చారు. బీజేపీతో కలవడం వల్ల టీడీపీకి ఉన్న స్వల్ప మైనారిటీల ఓట్లు కూడా దూరమైనట్లు గుర్తించారు. జనసేన, బీజేపీకి కేటాయించిన 31 సీట్లలో ఆ పార్టీలు గెలిచే సీట్లు అరడజను కూడా లేవని వారి సర్వేలో నిర్థారణ అయినట్లు సమాచారం. అమ్ముకుంటే గెలిచేది ఎలా? అనేక సీట్లను తాము సూచించిన వారికి కాకుండా బయట వ్యక్తులకు కేటాయించడాన్ని రాబిన్ శర్మ తీవ్రంగా తప్పబట్టినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు, పలు సమీకరణాలు, రకరకాల పొందికల ఆధారంగా తాము ప్రతిపాదించిన వారికి సీట్లు ఇవ్వకపోవడం ప్రధాన తప్పిదంగా ఆయన ప్రస్తావిస్తున్నారు. సర్వేలను పట్టించుకోకుండా, పార్టీ కోసం పని చేసిన వారిని వదిలేసి బయట వ్యక్తులకు సీట్లు ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. డబ్బు మూటలతో అప్పటికప్పుడు దిగిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు సీట్లు అమ్ముకుంటే ఇక గెలవడం ఎలా సాధ్యమని ఆయన నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ సీటును పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ప్రభాకర చౌదరికి కాకుండా పెద్దగా తెలియని దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్కి కేటాయించడంపై రగడ జరిగిన విషయం తెలిసిందే. ఇలా బయట వ్యక్తులకు సీట్లు ఇచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాలు 30 వరకూ ఉన్నట్లు రాబిన్ శర్మ చెబుతున్నారు. స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా 8 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏలూరు ఎంపీ స్థానాన్ని రాయలసీమకు చెందిన వ్యక్తికి ఇవ్వడం లాంటి అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. తాము చేసిన సర్వేలు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు విరుద్ధంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ నిర్ణయాలు తీసుకున్నారని, దీంతో తమ బృందాలు మూడేళ్లుగా పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరులా వృథా అయిందని రాబిన్ బృందం వాపోతున్నట్లు సమాచారం. దిద్దుకోలేని తప్పులు.. గెలవడం దుర్లభం తమ వ్యూహాలకు అనుగుణంగా పార్టీ నడుచుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల దిద్దుకోలేని తప్పులు జరిగాయని రాబిన్ శర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీతో కలిసి పని చేయడంలో అర్థం లేదని ఆయన తేల్చి చెప్పడంతో చంద్రబాబు బుజ్జగించి కొద్దిరోజులు ఆపినట్లు తెలిసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తీసుకున్న నిర్ణయాలపైనా రాబిన్ బృందం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన చంద్రబాబు తన పలుకుబడి ఉపయోగించి రాబిన్ శర్మ గురువైన ప్రశాంత్ కిశోర్ను పిలిచి మధ్యవర్తిత్వం చేయాలని కోరారు. దీంతో పీకే జోక్యం చేసుకుని సర్దుబాటు చేయడంతో ప్రస్తుతం అయిష్టంగానే రాబిన్ శర్మ బృందం టీడీపీ కోసం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో పీకే సైతం సంక్షేమ పథకాలు, విశ్వసనీయత విషయాల్లో సీఎం జగన్తో చంద్రబాబు పోటీ పడలేరని చెప్పినట్లు తెలిసింది. వ్యూహకర్తలు ఇచ్చిన ఈ షాకులతో చంద్రబాబు అయోమయంలో మునిగిపోయారు. రాబిన్ శర్మ చెప్పినట్లు అభ్యర్థులను మార్చలేక, కొనసాగించలేక సతమతమవుతున్నారు. అభ్యర్థులను మార్చాలంటే లోకేష్ వారి వద్ద నుంచి రూ.కోట్లలో వసూలు చేసిన డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలి. అందుకు చినబాబు ససేమిరా అనడంతో చంద్రబాబు కక్కలేక మింగలేక మిన్నకుండిపోయారు. -
పీకే మాటలకు విలువే లేదు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రశాంత్కిషోర్ (పీకే) మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, బతుకు దెరువు కోసం సర్వే సంస్థ పేరుతో రోజుకో మాట మాట్లాడుతాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. గాం«దీభవన్లో మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల పీకే సర్వేల పేరిట చెపుతున్న జోస్యాలను కొట్టిపారేశారు. పీకే మాటలకు విలువ లేదని తేల్చి చెప్పారు. దేశంలో గెలిచేది బీజేపీ అని ఓసారి, ఇంకోసారి కాంగ్రెస్ అని అంటాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని చెప్పాడని, కానీ కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. పీకే సర్వేలకు, మాటలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పారీ్టకి 12 నుంచి 14 ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ పాలనకు వంద మార్కులు రేవంత్ పాలనకు వంద మార్కులు వేస్తున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటే బాగుంటుందనే రేవంత్రెడ్డి కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో కింగ్, కింగ్ మేకర్ రాహుల్ గాంధీనే అని స్పష్టం చేశారు. కరువు కాంగ్రెస్తో వచి్చందని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు వర్షాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలుసుకునే తెలివి లేదా అని విమర్శించారు. కేసీఆర్ ఇంకా ఓటమి ఫ్ర్రస్టేషన్లోనే ఉన్నారన్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డికి ఏ విషయంపైనా కనీస అవగాహన ఉండదని విమర్శించారు. బీజేపీ బౌండరీలో మంద కృష్ణ రాజకీయాలు బీజేపీ బౌండరీలో ఉండి మంద కృష్ణ మాదిగ రాజకీయాలు మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. న్యూట్రల్గా ఉంటే ఆయన ఏం అడిగినా సమాధానం చెప్పేవాళ్లమన్నారు. బీజేపీ తెలంగాణలో మాదిగను రాజ్యసభ సభ్యుడిని చేయమని గానీ కేంద్ర మంత్రిని చేయాలని గానీ మంద కృష్ణ అడిగారా అని ప్రశ్నించారు. బంగారు లక్ష్మణ్ని నవ్వులపాలు చేసినప్పుడు మంద కృష్ణ కనీసం స్పందించలేదని గుర్తు చేశారు.పార్టీ ఫిరాయింపులపై తాను మాట్లాడలేనని, ఎందుకంటే తానే పార్టీలు మారి వచ్చానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. -
మళ్లీ పలికిన బాబు చిలక
వరదలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డి పోచ దొరికినా ఆశగా దాన్ని పట్టుకుంటాడు. అలాగే ప్రజా వ్యతిరేక వరదలో కొట్టుకుపోతున్న చంద్రబాబు.. ప్రశాంత్ కిషోర్ అనే గడ్డిపోచ పట్టుకుని ఎన్నికల్లో గట్టెక్కేయాలని తెగ ఆరాట పడుతున్నారు. అయితే ఈ గడ్డిపోచ పరిస్థితి ఇప్పటికే తెగిన గాలిపటంలా మారిందని దేశ వ్యాప్తంగా అందరికీ తెలుసు. మాకక్కర్లేదని రెండు జాతీయ పార్టీలు విసిరికొడితే ఉనికి కోసం పాట్లు పడుతున్న ఇతగాడు చంద్రబాబు గూటికి చేరారు. అలాగని ఆ విషయాన్ని ధైర్యంగా బయటకు చెప్పే ధైర్యం లేదు. రాజకీయాలకు పనికి రాక, ఒంటరిగా ఏమీ చేయలేక.. బాబు ఇచ్చింది పుచ్చుకుని ఆయన చెప్పిన మాటలను వల్లె వేస్తున్నారు. సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన–బీజేపీతో జట్టు కట్టినా.. కాంగ్రెస్తో కలిసి కుట్రలు చేస్తున్నా వైఎస్సార్సీపీ ప్రభంజనంలో కొట్టుకుపోవడం ఖాయమని.. గత ఎన్నికల కంటే ఘోర పరాజయం తప్పదని గ్రహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. గత ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్తో ఎప్పటికప్పుడు టీడీపీ గెలుస్తుందంటూ చిలక జోస్యం చెప్పించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే రీతిలో ప్రశాంత్ కిశోర్(పీకే)తో టీడీపీకి అనుకూలంగా జోస్యం చెప్పిస్తున్నారు. నెల క్రితం వల్లె వేసిన మాటలనే ఆదివారం పీటీఐ ప్రతినిధుల భేటీలో మరోమారు చెప్పించారు. అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో విస్తృత యంత్రాంగం ఉన్న టైమ్స్నౌ–ఈటీజీ, జీన్యూస్ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన డజనుకుపైగా సర్వేల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధిస్తుందని స్పష్టమైంది. కానీ.. ఏ యంత్రాంగం లేని ప్రశాంత్ కిశోర్ – ప్యాకేజీ కోసం చంద్రబాబు చెప్పే మాటలనే జోస్యంగా వెల్లడిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాక లగడపాటిలానే ప్రశాంత్ కిశోర్ కూడా మాయం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ జోస్యాలన్నీ తప్పే పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనని భీషణ ప్రతిజ్ఞ్ఞ చేసి.. ఐప్యాక్ నుంచి తప్పుకుని.. బీహార్లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బీహార్ సీఎం నితీష్కుమార్ పంచన చేరి, జేడీ(యూ) నేతగా చలామణి అయ్యారు. ఆ తర్వాత నితీశ్తో విభేదించి.. సొంత కుంపటి పెట్టుకుని బీహార్లో పాదయాత్ర చేశారు. అయినప్పటికీ బీహార్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అంటే.. అక్కడ చెల్లని కాసుగా ముద్రపడ్డారు. ఇదే సమయంలో ఇక్కడ స్కిల్ స్కామ్లో చంద్రబాబును అరెస్టు చేయడంతో భయపడి ఢిల్లీలో తలదాచుకున్న లోకేశ్.. రాజకీయంగా బీహార్లో గిట్టుబాటుకాని ప్రశాంత్ కిశోర్ను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని కోరారు. ఆ క్రమంలోనే చంద్రబాబు బెయిల్పై విడుదలయ్యాక.. ప్రశాంత్ కిశోర్ను సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లో లోకేశ్ విజయవాడకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉండవల్లిలోని తమ అక్రమ నివాసంలో చంద్రబాబు ఎదుట కూర్చొబెట్టారు. అప్పుడు మాత్రం తాను ఏ పార్టీకి వ్యూహకర్తగా పని చేయనని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఈ క్రమంలోనే గతేడాది ఆఖర్లో తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ జోస్యాలన్నీ తప్పాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ కుండబద్ధలు కొడితే.. అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే.. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. డబ్బుల కోసమే ఆ మాటలు.. ఐప్యాక్ నుంచి తప్పుకున్న ప్రశాంత్ కిశోర్.. డబ్బుల కోసమే చంద్రబాబు చెప్పిన మాటలను తన జోస్యంగా వల్లె వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎలాంటి యంత్రాంగం, వ్యవస్థ లేని ప్రశాంత్ కిశోర్.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులను ఎలా అంచనా వేయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో రాష్ట్రాన్ని సీఎం జగన్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారు. అందుకే సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకూ పెరుగుతోంది. ఇది సిద్ధం సభల్లో.. బస్సు యాత్రలో ప్రస్ఫుటితమవుతోంది. చెప్పిన మాటపై నిలబడని చంద్రబాబు మోసం చేస్తాడనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ప్రజాగళం పేరుతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నిర్వహించిన సభకు.. చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేయడమే అందుకు నిదర్శనం. కూటమికి ఘోర పరాజయం తప్పదన్నది కళ్ల ముందే కన్పిస్తుండటంతో ఉనికి చాటుకోవడానికి ప్రశాంత్ కిశోర్తో పదే పదే తన మాటలను జోస్యంగా చంద్రబాబు చెప్పిస్తున్నారనే భావన ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019