breaking news
-
చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ గుట్టు విప్పిన మమతా బెనర్జీ
సాక్షి, అమరావతి: ప్రశాంత్కిశోర్పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను బయటపెట్టారు. ప్రశాంత్ కిశోర్ కేవలం చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, క్షేత్ర స్థాయిలో ఎలాంటి పని చేయకున్నా.. చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్కిశోర్ తెర వెనక పనిచేస్తున్నారని.. దీనిపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. ప్రశాంత్కిశోర్కు ఇతరత్రా ఏవో సమస్యలున్నాయన్నారు. "బెంగాల్లో ప్రశాంత్ కిశోర్ టీఎంసీ కోసం పనిచేయడం లేదన్నారు" మమతా. ప్రశాంత్ కిశోర్ తక్షణ కర్తవ్యం చంద్రబాబు, మోదీనేనని తెలిపారు. డామిట్ కథ అడ్డం తిరిగింది పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనని భీషణ ప్రతిజ్ఞ చేశాడు ప్రశాంత్ కిషోర్. ఐప్యాక్ సంస్థ నుంచి తప్పుకుని.. బీహార్లో రాజకీయ అరంగేట్రం చేశాడు పీకే. తొలుత బీహార్ సీఎం నితీష్కుమార్ పంచన చేరి, జేడీ(యూ) నేతగా చలామణి అయ్యారు. ఆ తర్వాత నితీశ్తో విభేదించి.. సొంత కుంపటి పెట్టుకుని బీహార్లో పాదయాత్ర చేశారు. అయినప్పటికీ బీహార్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అంటే.. అక్కడ చెల్లని కాసుగా ముద్రపడ్డారు. ఈ క్రమంలోనే గతేడాది ఆఖర్లో తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ జోస్యాలన్నీ తప్పాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ కుండబద్ధలు కొడితే.. అక్కడ తేడా కొట్టింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే.. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. వివాదాల పీకే సర్వే సంస్థలు, రాజకీయ పార్టీలకు సలహాలతో అప్పట్లో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. ఎంత వేగంగా ఎదిగాడో.. అంతే వేగంగా నేలకు దిగివచ్చాడు. క్షేత్ర స్థాయిలో ఉన్న సంబంధాలన్ని తెగిపోవడంతో తాను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకుడు కావాలనుకున్న కల కాస్తా చెదిరిపోయింది. ఈ నేపథ్యంలో భారీగా డబ్బులకు ఆశపడి పొలిటికల్ బ్రోకర్గా మారాడన్న ఆరోపణలు ఢిల్లీలో వెల్లువెత్తాయి. కరకట్ట ఇంట్లో ప్యాకేజీ చర్చలు ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. చంద్రబాబు విసిరిన ప్యాకేజీకి పీకే పడిపోయాడని తెలుగుదేశంలో ప్రచారం ఉంది. ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్ను విజయవాడకు తీసుకువచ్చిన లోకేష్.. నేరుగా కరకట్ట ఇంట్లో మీటింగ్ పెట్టించాడు. ఆ సమావేశంలో ఏం జరిగిందో కానీ.. ఏపీలో కూటమి గెలుస్తుందంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు పీకే. తన వ్యాఖ్యలకు ఎలాంటి సాంకేతిక ఆధారాలను కానీ, లాజిక్ గానీ చూపించకుండా.. తన పాత బ్రాండ్ను వాడుకుని ప్రచారం చేసుకునే పనిలో పడ్డాడు. అయితే విశ్వసనీయత కోల్పోవడంతో పీకే మాటలు ఎవరూ పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. "నోటు" మాటలు ప్యాకేజీ ఎంత ముట్టిందో గానీ, బాకా ఊదడంలో పీకే ముందుంటున్నాడు. ఎలాంటి సర్వేలు చేయకుండా, గణాంకాల్లేకుండానే ఓ పార్టీ ఓడిపోతుందని చెప్పడం కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రోజురోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం, టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతోనే పీకేతో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ అసలు రంగును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయటపెట్టడం.. పీకే వ్యాఖ్యల డొల్లతనం బయటపడ్డట్టయింది. -
జోస్యం తెల్వని సిలుక పీకే పై విజయశాంతి ఫైర్
-
ప్యాకేజీ కి బాబు పల్లకి మోస్తున్న పీకేలు
-
బాబు గూట్లో బిహారీ బాబు
బాబు గ్రాఫ్ దిగజారింది.. పెయిడ్ క్యాంపెయినర్లు దిగిపోయారు పెన్షన్ల ఇష్యూతో పాతాళానికి పడిపోయిన బాబు గ్రాఫ్ వెంటనే రంగంలోకి పెయిడ్ క్యాంపెయినర్ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ పచ్చగూటి చిలుకగా మారిపోయాడా ? పేమెంట్ కు తగ్గట్టుగా పెర్ఫామెన్స్ చూపిస్తున్నాడా ? బాబు గ్రాఫ్ ఉన్నదే అంతంతమాత్రం. అది కూడా అమాంతం పడిపోయింది. అవ్వాతాతలు ఉసురు పోసుకుంటేం.. గ్రాఫ్ పడిపోక.. పరుగులు పెడుతుంందా ఏంటి ? అందుకే కరకట్ట కన్నింగ్ బాబు మరో కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. తన గూటిలోని చిలుకను బయటకు వదిలాడు. జోతిష్యం చెప్పమన్నాడు. అర్థమైందిగా.. పచ్చగూటిలో ఆ చిలుక ఎవరో..! పేరు ప్రశాంత్ కిషోర్. బిహార్ లో జన్ సురాజ్ పార్టీ పెట్టి.. బిజినెస్ లేక ప్యాకేజీలకు అలవాటు పడి భారతదేశంమొత్తం తిరుగుతున్నాడు. బాబుగారి పెయిడ్ క్యాంపెయినర్ల లిస్టులో చేరిపోయాడు. ఇదిగో.. అవ్వాతాతల అగచాట్లు, వారి శాపనార్థాలు, వారి మరణాలు.. చంద్రబాబును ఆయన గ్రాఫ్ ను పాతాళంలోకి తొక్కేశాయి. వెంటనే రంగంలోకి దూకేశాడు ప్రశాంత్ కిషోర్. జగన్ గెలవరు.. సంక్షేమాలు గెలిపించవు అంటూ పాత స్ర్కిప్ట్ ను కొత్తగా మళ్లీ చదివి వినిపించాడు. పచ్చ మీడియా తాటికాయంత అక్షరాలతో ఆ వార్తను ప్రచురించింది. డైవర్ట్ పాలిటిక్స్ అమ్మా డైవర్ట్ పాలిటిక్స్. ఇందులో చంద్రబాబును మించినోళ్లు ఎవ్వరూ లేరు. అయినా ఒక టీమ్ లేదు.. సర్వేలు చేయడం లేదు.. ఒక స్ట్రాటజిస్ట్ కాడు.. ఒక రాజకీయ నాయకుడు కాదు.. అలాగని విశ్లేషకుడు కాదు.. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ఏంటో.. అందుతున్న సంక్షేమం ఎంతో.. అతనికి పూర్తిగా అవగాహన లేదు. అయినా జగన్ సర్కార్ పై విషం చిమ్ముతున్న మిస్టర్ బిహారీ బాబు నువ్వు బాబు గూటిలో బీహారీ బాబులా మారిపోయావని రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. అందుకే నిన్ను ఓ పది ప్రశ్నలు అడుగుతున్నారు.. వాటికి తెలిస్తే తెలుగులో సమాధానం చెప్పు.. లేదా బీహారీలో చెప్పు.. ట్రాన్స్ లేట్ చేసుకుని మేమే అర్థం చేసుకుంటాం...! 1. తన గ్రాఫ్ దిగజారుతున్న ప్రతిసారి బాబు పెయిడ్ ఆర్టిస్టులను దింపుతాడు.. అందులో భాగమే నువ్వు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 2. అవ్వాతాతల మరణంతో పాతాళానికి పడ్డ బాబు గ్రాఫ్ ను జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 3. 2023 డిసెంబర్ 23న బాబును కలిసినప్పటి నుంచి నువ్వు టీడీపీ గూటి చిలకగా మారిపోయావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 4. 2024 మార్చి 3న హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో బాబు నిన్ను రహస్యంగా కలిశాడు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 5. అదే రోజు ఓ నేషనల్ మీడియాలో బాబు స్క్రిప్ట్ ప్రకారమే జగన్ సర్కార్ పై విషం చిమ్మావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 6. 2024 ఏప్రిల్ 3న పీటీఐలో బాబు సూచనలతో జగన్ సర్కార్ టార్గెట్ గా మరోసారి విషం కక్కాక్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 7. వాలంటీర్ వ్యవస్థ హాట్ టాపిక్ గా మారడంతో దాన్ని డైవర్ట్ చేయడానికే బాబు నిన్ను మరోసారి దింపాడు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 8. ఏపీలో అభివృద్ధి లేదు అనడానికి నీ దగ్గర డేటా లేదు.. నువ్వెప్పుడూ ఏపీలో పర్యటించలేదు.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 9. నీకంటూ టీమ్ లేదు.. గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందో తెలియదు.. అయినా స్ట్రాటజిస్ట్ లా మాట్లాడుతావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే 10. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని.. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి బొక్కబోర్లా పడ్డావ్.. అవునా కాదా.. మిస్టర్ పీకే.. ఈ క్వశ్చన్ నీకే బిగ్ క్వశ్చన్ సాక్షి టీవీలో రాత్రి 7 గంటలకు.. -
ప్రశాంత్ కిషోర్ ను ఏకిపారేసిన మంత్రి బొత్స
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019