breaking news
-
పరిటాల సునీతకు ఝలక్..!
ఎన్నికల ప్రక్రియ ఆదిలోనే పరిటాల సునీతకు ఊహించని షాక్ తగిలింది. రాప్తాడు అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ రెబల్గా ప్రొఫెసర్ రాజేష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి సునీతకు ఝలక్ ఇచ్చారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో ఏర్పాటు చేసిన ఆర్ఓ కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ రాజేష్ తన మొదటి సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. సునీతకు గట్టి దెబ్బే.. కనగానపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన ప్రొఫెసర్ రాజేష్ టీడీపీ సానుభూతిపరుడు. ఆయన తండ్రి రామన్న గతంలో పరిటాల రవికి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. కనగానపల్లి సర్పంచ్గానూ పనిచేశారు. ప్రస్తుతం రాజేష్ పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు నిర్వహించుకుంటూ ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నారు. రెండు సంవత్సరాలుగా రాప్తాడు నియోజకవర్గంలో తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ తరఫున రాప్తాడు అసెంబ్లీకి కానీ, హిందూపురం ఎంపీ స్థానం నుంచి కానీ పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ, ప్రజాదరణ ఉన్న వారిని పట్టించుకోకుండా డబ్బున్న అభ్యర్థుల వైపు చంద్రబాబు చూడడంతో రాజేష్కు భంగపాటు తప్పలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఇప్పటికే రాప్తాడులో ప్రజా బలం లేక ఇబ్బందులు పడుతున్న టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు రాజేష్ కారణంగా గట్టి దెబ్బే తగిలే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇవి చదవండి: నామినేషన్ల మొదలైనా.. తెగని టీడీపీ సీట్ల పంచాయితీ! -
పరిటాల ఫ్యామిలీకి గడ్డు కాలం
తెలుగుదేశంలో వ్యక్తులను బట్టి న్యాయ సూత్రాలు మారిపోతున్నాయి. ఒకొక్క కుటుంబానికి ఒక్కో రూల్ అన్నట్లుగా పార్టీ నడుస్తోంది. తమకు నచ్చితే ఒక విధంగా లేకుంటే ఇంకోవిధంగా రూల్స్ మార్చేసే చంద్రబాబు ఇప్పుడు పరిటాల కుటుంబాన్ని మెల్లగా డైల్యూట్ చేస్తున్నారు. ఒకనాడు అనంతపురంతోబాటు రాయలసీమలో అధికభాగాన్ని ప్రభావితం చేసిన పరిటాల కుటుంబం ఇప్పుడు ఉనికికోసం పోరాడుతోంది. గతంలో పెనుగొండ నుంచి గెలిచిన పరిటాల రవి మంత్రిగా పని చేశారు. జిల్లావ్యాప్తంగానే కాకుండా రాయలసీమ, కోస్తాలో సైతం హవా వెలగబెట్టారు. అయన మరణం తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన సునీత సైతం టీడీపీలో మంత్రిగా చేసారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం సునీతతోబాటు కుమారుడు శ్రీరామ్కు రెండు టిక్కెట్స్ అడుగుతోంది. కానీ దీనికి చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ ఇస్తామని, రెండేసి ఇవ్వలేమని, ఇది రాష్ట్రవ్యాప్త పాలసీ అని చెబుతున్నారు. కానీ లోకేష్, చంద్రబాబు, బాలయ్యబాబు మాత్రం ఒకే ఫ్యామిలీ నుంచి ఉండొచ్చా అనే ప్రశ్నలు పరిటాల క్యాంప్ నుంచి వినిపిస్తున్నాయి. ఇక లోకేష్, చంద్రబాబు మాత్రం రెండేసి చోట్ల పోటీ చేస్తారని అంటున్నారు. చంద్రబాబు కుప్పం నుంచి.. లోకేష్ మంగళగిరి నుంచి.. బాలకృష్ణ హిందూపురం నుంచి.. బాల కృష్ణ చిన్న అల్లుడు భరత్.. విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాకానీ మాకు మాత్రం రాప్తాడు, ధర్మవరం రెండు సీట్లు ఇవ్వరా అని పరిటాల కుటుంబం ఆవేదన చెందుతోంది. మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తుండగా టెక్కలి నుంచి అయన బాబాయ్ అచ్చెన్నాయుడు బరిలో ఉన్నారు. మరి వాళ్ళు మాత్రం ఒకే కుటుంబం కాదా అని పరిటాల కుటుంబం అడుగుతోంది. రాప్తాడు నుంచి పరిటాల రవి సతీమణి సునీత.. కుమారుడు శ్రీరామ్ ఆశిస్తున్నారు కానీ రాప్తాడు వరకూ ఒకే చేసిన చంద్రబాబు ధర్మవరం టిక్కెట్ మాత్రం ఇచ్చేదిలేదని అంటూ అక్కడ వరదాపురం సూరి వైపు మొగ్గు చూపుతున్నారు. యువతకు 40 సీట్లు ఇస్తానని మహానాడులో భారీగా హామీ అయితే ఇచ్చారు కానీ అమల్లోకి వచ్చేసరికి మాత్రం ఆ మాటలను గాలికి వదిలేస్తున్నారు. ఇదిలా ఉండగా ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య యేళ్ళనాటి వైరం ఉంది. దీంతోబాటు పయ్యావుల కేశవ్, ప్రభాకర్ చౌదరి కూడా పరిటాలను ధర్మవరం రానివ్వడం లేదు. వాళ్ళు అవకాశం వస్తే పరిటాల కుటుంబాన్ని ఓడించడానికి చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా జిల్లాలో మూలమూలనా వ్యతిరేకత మూటగట్టుకుని శత్రువులను పెంచుకుంటూ వెళ్లిన పరిటాల కుటుంబాన్ని ఆదరించేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో రాప్తాడుతో సరిపెట్టేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. - సిమ్మాదిరప్పన్న -
లోకేశ్ తీరుతో టీడీపీలో కొత్త ట్విస్ట్.. తెరపైకి పరిటాల ఫ్యామిలీ పాలిటిక్స్!
నారా లోకేశం పాదయాత్ర తెలుగుదేశం పార్టీలో గందరగోళం రేపుతోంది. ఇప్పటివరకు తాను పర్యటించిన చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు లోకేశం. చాక్లెట్ల మాదిరి టిక్కెట్లు పంచిపెట్టడాన్ని కొందరు ఆశావహులు తప్పుపడుతున్నారట. చంద్రబాబు ఆదేశాలతో ప్రకటిస్తున్నారా? లేక సొంతంగా ఇచ్చేస్తున్నారా అని సందేహపడుతున్నారని టాక్. నారా లోకేశం కామెడీపై ఓ లుక్కేద్దాం.. తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధానకార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ పాదయాత్ర ఆ పార్టీ నాయకుల్లోనే టెన్షన్ క్రియేట్ చేస్తోంది. చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చేసినట్లుగా.. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. తనకు కావాల్సినవారి పేర్లు ప్రకటిస్తూ.. వారిని ఆశీర్వదించాలని కేడర్ను కోరుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు లోకేశ్ తీరుతో గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం అభ్యర్థిగా పరిటాల శ్రీరాం పేరును నారా లోకేష్ ఖరారు చేశారు. శ్రీరాం చేతిని పట్టుకుని పైకెత్తి మరీ ఆశీర్వదించాలంటూ కోరారు. 2014లో ధర్మవరం ఎమ్మెల్యేగా గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే వరదాపురం సూరి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ధర్మవరం సీటు పరిటాల శ్రీరామ్కు.. ఇక, మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ధర్మవరం టిక్కెట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు వరదాపురం సూరి. త్వరలోనే వరదాపురం సూరి టీడీపీలో తిరిగి ప్రవేశించబోతున్నారని.. ఆయనకు ధర్మవరం టిక్కెట్ కూడా ఖరారు అయిందని టీడీపీ వర్గాల్లోనే కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇంతలో పాదయాత్రలో భాగంగా ధర్మవరం వచ్చిన నారా లోకేష్ ఏకంగా మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాంను అభ్యర్థిగా ప్రకటించేశారు. గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసిన శ్రీరాం.. వైఎస్ఆర్సీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఘెరంగా ఓటమి చెందారు. వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఖాళీ అయిన ధర్మవరంలోకి అడుగుపెట్టారు పరిటాల శ్రీరాం. తన తల్లి పరిటాల సునీతకు తిరిగి రాప్తాడు అప్పగించి ధర్మవరం టీడీపీ ఇంఛార్జిగా శ్రీరాం కొనసాగుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాప్తాడు నుంచి పరిటాల సునీత, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరాం పోటీ చేస్తున్నట్లు నారా లోకేష్ స్పష్టం చేశారు. లోకేశ్ ప్రకటనతో టీడీపీలో చర్చ.. లోకేశ్ ప్రకటన తర్వాత ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి రెండు టిక్కెట్లు ఎలా ఇస్తారంటూ తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే మాకు అలాగే ఇవ్వాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం నుంచి డిమాండ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ నుంచి, దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కేవలం తాడిపత్రికే పరిమితం కావాలని జేసీ కుటుంబానికి చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ఖరారు కావటంతో తమ గళం వినిపించేందుకు జేసీ ఫ్యామిలీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వటం పట్ల అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత పెంచుతూ పోతుంటే.. చంద్రబాబునాయుడు మాత్రం సొంత సామాజిక వర్గానికి మాత్రమే పట్టం కట్టడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో, మొత్తం మీద చంద్రబాబు తనయుడు లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి లాభం కలిగించకపోగా.. పార్టీ నాయకుల్లోనే విభేదాలు పెంచుతోంది. అసలు లోకేశ్ ప్రకటిస్తున్న టిక్కెట్లు నిజమేనా.. లేక ఉత్తిత్తి టిక్కెట్లా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
అనంతలో పరిటాల వర్గీయుల దౌర్జన్యం.. పోలీసులకు గాయాలు!
సాక్షి, అనంతపురం: అనంతపురంలో పరిటాల సునీత వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై, ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్పై కూడా టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, అంతకుముందు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమని తోపుదుర్తి వర్గీయులు సవాల్ విసిరారు. ఈ క్రమంలో క్లాక్ టవర్ వద్దకు వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులపై పరిటాల వర్గీయలు రాళ్లు విసిరారు. ఈ సమయంలో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసరడంతో పోలీసు కానిస్టేబుల్ సహా ఇద్దరికీ గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. -
దళిత మహిళపై చెయ్యెత్తిన పరిటాల సునీత
సాక్షి, అనంతపురం(రాప్తాడు): టీడీపీ నాయకురాలు, మాజీమంత్రి పరిటాల సునీత దళిత మహిళపై దౌర్జన్యం చేశారు. ‘ఏయ్..’ అంటూ చెయ్యెత్తి కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో సోమవారం పరిటాల సునీత పర్యటించారు. ఈ సందర్భంగా దళిత మహిళ, ఆశా కార్యకర్త అయిన ఆదిలక్ష్మిని కొట్టేందుకు ఆమె యత్నించారు. పరిటాల సునీత అనుచరుడైన రైటర్ కదిరప్ప భూముల విషయంలో తమను మోసం చేశాడంటూ కదిరప్ప సొంత అన్న నారాయణ కోడలైన ఆదిలక్ష్మి నిలదీసింది. దీన్ని జీర్ణించుకోలేని పరిటాల సునీత తన వెంట ఉండే వ్యక్తి గురించి అలా మాట్లాడతావా అంటూ ఆదిలక్ష్మికి వేలు చూపుతూ బెదిరించడమే కాక.. ‘ఏయ్’ అంటూ గద్దించారు. ఆదిలక్ష్మి కూడా ఏమాత్రమూ తగ్గకుండా అంతే స్థాయిలో ఘాటుగా బదులిచ్చింది. ఇలాంటి మోసగాళ్లను పక్కన పెట్టుకుని తిరిగితే నీ పార్టీ నాశనం అయిపోతుందంటూ మండిపడింది. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019