breaking news
-
పానీ పూరీ ప్రియులకు ఇక పూనకాలే.. వైరల్ వీడియో
పానీ పూరీ అంటేనే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు. దాని గురించి ఎన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసినా, పానీ పూరీకున్న క్రేజ్ముందు అవన్నీ దిగదిడుపే. అందుకే దుకాణదారులు కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా వెరైటీ పానీపూరీ వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. బంగారం, సిల్వర్ రంగుల్లో పానీపూరీలు తెగ వైరల్అవుతున్నాయి. ఫుడ్ హ్యాండిల్ అనే ఇన్స్టా ఖాతా వివరాల ప్రకారం పూరీలపై బంగారు , వెండి రేకులను పూయడం ఇందులో చూడొచ్చు. బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారి ఈ సరికొత్త పానీపూరీలను అమ్ముతున్నాడు. గోల్డ్, సిల్వర్ పూతతో పానీపూరీలను విక్రయిస్తున్నాడు. అంతేకాదు ఆ పానీపూరీల్లో డ్రైఫ్రూట్స్, తేనె కూడా జోడిస్తున్నాడు. వీటిని బంగారు రంగు ప్లేట్లోనే పెట్టి అందిస్తుండటం మరో విశేషం. దీన్ని షారియత్ అంటారట. దేశంలోఇదే తొలి హైజీనిక్ పానీ పూరీ అట. ఇప్పటికే 20 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.కొందరు ఆ వ్యాపారి క్రియేటివిటీని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇది ‘‘ బప్పి లాహిరి పానీ పూరి అని పిలవాలి అని ఒకరు వ్యాఖ్యానించగా, దీని పేరును కూడా మార్చండి” బ్రో అని మరొక నెటిజన్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Khushbu Parmar | Manan | CTT (@cherishing_the_taste_) -
స్ట్రీట్ ఫుడ్.. ఆ ‘పాత’ మధురమే..
కుమారి ఆంటీ ఒక్కసారి మన చూపులన్నీ స్ట్రీట్ ఫుడ్ వైపు మరోసారి లాగేసింది కానీ, వీధిలో నిలబడి ఓ కప్పు చాయ్, ఓ సాయంత్రం నాలుగు ప్లేట్ల పానీపూరీ విత్ ప్యాజ్, కాసింత చాట్ .. బాగా వేయించిన ఫిష్ ఫ్రై.. గరం గరం మిర్చి బజ్జీలు, వేడివేడి ఇడ్లీలు, వావ్ అనిపించే వడాపావ్లు.. తినని సగటు జీవి ఉంటాడా..∙మన రోడ్లన్నీ ఘుమ ఘుమలాడే రెస్టారెంట్లే కదా.. మన కడుపు నింపే వారి కడుపు నింపుకొని నలభీములు తిరుగాడే ప్లేస్లే కదా.. పల్లె, పట్నం తేడా లేదు. వెజ్ నాన్ వెజ్ తేడాల్లేవు. ఎక్కడికివెళ్లినా రోడ్డు టిఫిన్ సెంటర్ల నుంచి మినీ ‘స్ట్రీట్ హోటళ్ల’ దాకా ఎన్నో .. ధరలు తక్కువ.. ఉన్నంతలో రుచీ ఎక్కువే. అయితే స్ట్రీట్ ఫుడ్కు.. రామాయణ, మహాభారతాలకు ఉన్నంత చరిత్ర ఉంది. ఆనాటి నుంచే నగరాల్లోని వీధుల్లో ‘వేయించిన గింజలు, రొట్టెలు’ వంటివి అమ్మేవారట. పాత రుచులపై మొహం మొత్తిన కొద్దీ, జనం పెరిగిన కొద్దీ.. మెల్లగా కొత్త కొత్త రుచులు పుట్టుకొచ్చాయి. స్థానిక ఆచారాలు, ఆహార అలవాట్లను బట్టి ఎక్కడికక్కడ కొత్త వెరైటీలు మొదలయ్యాయి. షాజహాన్ చాట్ ... మొఘలుల కాలం నాటికి స్ట్రీట్ ఫుడ్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందట. షాజహాన్ ఆగ్రా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చినప్పుడు.. వర్తకులు, రోజువారీ పనిచేసుకునేవారు మధ్యాహ్నం కడుపు నింపుకోవడానికి వీలుగా ‘చాట్’ స్టాల్స్ను ఏర్పాటు చేయించాడని అంటారు. అలా మొదలైన ‘చాట్’ ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. గ్రీస్ .. ఫ్రై ఫిష్.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. గ్రీస్ సామ్రాజ్యంలో పది వేల ఏళ్ల కిందే ‘స్ట్రీట్ ఫుడ్’ అమ్మకాలు మొదలయ్యాయట. ప్రధాన రహదారుల పక్కన ్రౖఫై చేసిన చేప ముక్కలను అమ్మేవారట. తర్వాత ఇది రోమ్కు విస్తరించిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే నాడు ‘స్ట్రీట్ ఫుడ్’ ధనవంతులకేనని, వారు ఇళ్లలో వండుకోకుండా తెప్పించుకుని తినేవారని అంటున్నారు. తర్వాత నగరాలు విస్తరించి, జనాభా పెరిగే కొద్దీ.. ‘స్టాల్స్’ పెరిగిపోయి పేదల ఫుడ్గా మారింది. ఈజిప్ట్ బ్రెడ్.. ► క్రీస్తుపూర్వం 1200వ సంవత్సరం సమయంలోనే ఈజిప్ట్లోని సిర్సా నగర వీధుల్లో గోధుమ రొట్టెలను అమ్మినట్టు పురాతత్వ తవ్వకాల్లో గుర్తించారు. స్టూడెంట్స్కు నంబర్ వన్ స్ట్రీట్ ఫుడ్ ఏనాడో భారత సంస్కృతిలో, చరిత్రలో ఓ భాగమైపోయింది. మెల్లగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకూ విస్తరించింది. కాలేజీ స్టూడెంట్లు, ఉద్యోగులు, రోజువారీ పనిచేసుకునేవారు, ఏదో ఓ పనిపై బయటికి వెళ్లేవారు.. ఇలా అందరికీ ‘స్ట్రీట్ స్టాల్స్’తోనే కడుపు నిండేది. ఇలాంటి వారు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటారో.. అలాంటి ప్రాంతాలన్నీ స్ట్రీట్ ఫుడ్కు అడ్డాలే. ► ఇటీవల వారణాసిలో నిర్వహించిన అధ్యయనంలోనూ ఈ విషయం స్పష్టమైంది. 25–45 ఏళ్ల మధ్య వయసువారిలో 42 శాతం, 14–21 ఏళ్ల మధ్య వయసువారిలో 61 శాతం మంది ఉద్యోగులు, విద్యార్థులు మధ్యాహ్నం పూట ‘స్ట్రీట్ ఫుడ్’తోనే బండి లాగించేస్తామని చెప్పడం గమనార్హం. ► రాజస్థాన్ లోని ఉదయ్పూర్లో ఉన్న మహారాణా ప్రతాప్ వ్యవసాయ, సాంకేతిక వర్సిటీ విద్యార్థుల ‘స్ట్రీట్ ఫుడ్’ అలవాటుపై ఇటీవల ఓ సర్వే జరిగింది. రుచిగా, ధర తక్కువగా ఉండ టం, త్వరగా తినేయగలగడం, స్నేహితులతో కలసి సరదాగా వెళ్లి తినడం వల్ల ‘స్ట్రీట్ ఫుడ్’కు ప్రాధాన్యత ఇస్తామని 88.3 శాతం మంది యువకులు, 90 శాతం మంది యువతులు వెల్లడించారు. ఫుడ్ పెట్టే... స్ట్రీట్ స్ట్రీట్ఫుడ్ విక్రయించేవారు.. అందరి కడుపు నింపుతూ, తామూ పొట్టపోసుకుంటున్నారు. మన దేశంలో స్ట్రీట్ ఫుడ్తో ఉపాధి పొందుతున్నవారు కోటి మంది వరకు ఉంటారని అంచనా. ఇందులో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లోనే 60 లక్షల మంది దాకా ఉన్నారు. ఈ నగరాల్లో రోజూ ఓ పూట బయటే తిని బతుకు వెళ్లదీస్తున్నవారూ లక్షల మంది ఉన్నారు. ► ఇలా అమ్మేవాళ్లు, తినేవాళ్లు కలసి దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ ఓ చెయ్యి వేస్తున్నారు. దేశంలో స్ట్రీట్ఫుడ్ రోజువారీ వ్యాపారం విలువ రూ.8 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంటే ఏడాదికి రూ.30 లక్షల కోట్లపైమాటే. ► దేశంలో ప్రాంతాన్ని బట్టి 2 శాతం నుంచి 10 శాతం మంది జనాభా స్ట్రీట్ ఫుడ్, దానిపై ఆధారపడిన పనులతోనే ఉపాధి పొందుతున్నారు. సాటి లేని వెరైటీ.. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలనే తేడా లేదు.. సమోసాలు, మిర్చీలు, బజ్జీలు, పానీపూరీ, చాట్, ఇడ్లీ, దోశ వంటివాటితోపాటు కబాబ్లు, ఫ్రైడ్ రైస్లు, బిర్యానీల దాకా ‘స్ట్రీట్ స్టాల్స్’లో దొరకని వెరైటీలంటూ లేవు. జిలేబీ వంటి స్వీట్లనూ అలా రోడ్డుపక్కన నిలబడి లాగించేయొచ్చు. స్ట్రీట్ ఫుడ్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. ఏ నగరానికి ఆ నగరమే ప్రత్యేకం. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పోహా, జిలేబీ కాంబినేషన్ ఊరిస్తే.. ముంబైలో వడాపావ్ నోరూరిస్తుంటుంది. యూపీలో ఆలూ టిక్కీ ఆకర్షిస్తే.. కోల్కతా నగర వీధుల్లో చేపల ఫ్రై, కబాబ్ రోల్స్ రారమ్మని పిలుస్తుంటాయి. ► ఒక అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోకెల్లా ఇండియాలో ఫుడ్ వెరైటీలు ఎక్కువ. పదో, ఇరవయ్యో కాదు.. స్ట్రీట్ఫుడ్లోనే వందల రకాలు ఉన్నాయి మరి. స్ట్రీట్ ఫుడ్ పండుగే.. ‘నోయిడా ఉత్సవ్’.. ఇక్కడ అన్ని స్ట్రీట్ ఫుడ్లు దొరకబడును! ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఏటా ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు జరిగే ‘నోయిడా ఉత్సవ్’ స్ట్రీట్ఫుడ్కు వెరీ స్పెషల్. ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండార్స్ ఆఫ్ ఇండియా (నస్వీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవంలో.. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన విభిన్నమైన స్ట్రీట్ ఫుడ్లన్నీ అందుబాటులో ఉంటాయి. ఆహా.. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా..! -
పానీ పూరీ అమ్మడానికి థార్.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
భారతీయ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన థార్ కారుకి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరికిని ఆకర్శించిన ఈ ఆఫ్ రోడర్ కారుని ఒక యువతి పానీ పూరీ అమ్మడానికి ఉపయోగించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం. వీడియోలో గమనించినట్లయితే.. ఒక పానీపూరీ విక్రయించే యువతి తన పానీపూరీ బండిని లాగడానికి మహీంద్రా థార్ ఉపయోగిస్తున్నట్లు చూడవచ్చు. ఈ వీడియోకు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు. వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా రియాక్ట్ అవుతూ.. ప్రజలు ఎదగటానికి మా కార్లు సహాయపడాలని కోరుకుంటున్నట్లు, ఆ వీడియో తనకు ఎంతగానో నచ్చినట్లు ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి ఆ యువతిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదీ చదవండి: క్షణాల్లో రోడ్డు వేసేస్తుంది.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా పానీపూరి బండిని గతంలో స్కూటర్తో, తర్వాత బుల్లెట్ బైక్తో, ఇప్పుడు మహీంద్రా థార్తో లాగుతుంది. ఈమె పేరు తాప్సీ ఉపాధ్యాయ్. పనీ పూరి బండిని లక్షల ఖరీదైన కారుతో లాగడం చూసి చాలామంది అవాక్కవుతున్నారు, మరికొందరు మెచ్చుకుంటున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఈ మహీంద్రా థార్ కారుని పానీపూరీ అమ్మి కొనుగోలు చేసింది. What are off-road vehicles meant to do? Help people go places they haven’t been able to before.. Help people explore the impossible.. And in particular we want OUR cars to help people Rise & live their dreams.. Now you know why I love this video…. pic.twitter.com/s96PU543jT — anand mahindra (@anandmahindra) January 23, 2024 -
ఉద్యోగమా? పానీ పూరీ అమ్ముకోవడమా? ఏది బెటర్: వైరల్ వీడియో
కార్పొరేట్, లేదా టెకీ ఉద్యోగం అంటేనే అంతులేని పని ఒత్తిడి. పగలూ రాత్రీ తేడాలేని పనివేళలు,నిబంధనలతో పనిలేకుండా గంటలకొద్దీ అలా పని చేయాల్సిందే. ఇలాంటి సవాలక్ష సవాళ్లు ఉద్యోగం అంటేనే నిస్తేజం. జీవితం గడవాలి కాబట్టి ఎలాగోలా తట్టుకుని నెట్టుకొస్తున్నా ఇటీవలి కాలంలో లేఆఫ్స్ భూతం ఉద్యోగులను మరింత వేధిస్తోంది. ఆర్థికమాంద్యం, ఖర్చుల తగ్గింపు పేరుతో అనేక కార్పొరేట్ కంపెనీలు, ఐటీ దిగ్గజాలు వేలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరలవుతోంది. యూట్యూబ్లో పోస్ట్ చేసిన మూడు రోజుల్లోనే 20.3 లక్షలకు పైగా వ్యూస్ను సొంతం చేసుకోవడం విశేషం. పారిశ్రామికవేత్త హర్షగెయెంకాను ఈ వీడియోను ఆకర్షించింది. ఆయన కూడా ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కార్పొరేట్ ఉద్యోగం కంటే..పానీ పూరీ విక్రయించుకునే వ్యక్తి జీవితం మేలు అన్నట్టుగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు ఇదొక విషాదకర పరిస్థితి అని అంటే, మధ్య తరగతి వాళ్లతో పోలిస్తే దిగువ మధ్యతరగతి ప్రజలు ధనవంతులు. ఎందుకుంటే వారు ఖర్చు తక్కువ పొదుపు ఎక్కువ చేస్తారని మరొకరు కామెంట్ చేశారు. మరో యూజర్ ఏమన్నారంటే పానీ పూరి వ్యాపారి ఎక్కువ సంపాదించినా కూడా కార్పొరేట్ ఉద్యోగికి గౌరవం లభిస్తుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. అలాగే కార్పొరేట్ ఉద్యోగులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణంలో పనతోపాటు ఉద్యోగ భద్రత కూడా ఎక్కువే. టైంకి జీతం రావడం, ఆరోగ్య బీమా, పదవీ విరమణ ప్రణాళికల్లాంటివి ఉంటాయి. (యూట్యూబ్ కింగ్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్లోకొచ్చేశాడు!) కార్పొరేట్ ఉద్యోగులు ఉద్యోగపరంగా మరింతపైకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది గొప్ప వ్యక్తులు, ఇతర నిపుణులతో కలిసి పనిచేయడం లేదా ప్రసిద్ధ కంపెనీలో పని చేయడం అనేది వారికి వ్యక్తిగతంగా తృప్తినిస్తుంది. అయితే కార్పొరేట్ ఉద్యోగిగా ఉండాలా లేక పానీ పూరి వ్యాపారిలా ఉండాలి అనే నిర్ణయం వైయుక్తికమైంది. ఏది మంచి, ఏది చెడు అనేది వారి వారి ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. Why would you be a corporate employee! pic.twitter.com/NY23wLeem8 — Harsh Goenka (@hvgoenka) October 19, 2023 -
పానీపూరీలు అమ్మే యశస్వి జైశ్వాల్ అంటూ! అసలు నిజం ఇదే తెలుసా?
యశస్వీ జైశ్వాల్.. ప్రస్తుతం భారత క్రికెట్లో ఒక యువ సంచలనం. అంతర్జాతీయ క్రికెట్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు ఈ ముంబై బ్యాటర్. వెస్టిండీస్తో జరిగిన మొదటి టెస్టుతో డెబ్యూ చేసిన జైశ్వాల్.. తన తొలి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 382 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, ఒక సిక్సర్తో 171 పరుగులు చేశాడు. సంచలన ఇన్నింగ్స్ ఆడిన జైశ్వాల్పై ఇప్పటికీ ప్రశంసల వర్షం కురుస్తోంది. కొంతమంది దిగ్గజ క్రికెటర్లు జైశ్వాల్ను ట్రినిడాడ్ యువరాజు, విండీస్ లెజెండ్ బ్రియాన్ లారాతో పోలుస్తున్నారు. ఇక జైశ్వాల్ ఈ స్ధాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉందనే సంగతి తెలిసిందే. అయితే యశస్వీ క్రికెట్ ఫీల్డ్లో అదరగొట్టిన ప్రతీసారి.. అతడి పానీ పురీ స్టోరీ బయటకు వస్తోంది. గతంలో యశస్వీ తన క్రికెట్ శిక్షణ కోసం పానీ పూరీలను విక్రయించేవాడని పలుసార్లు మనం వింటూ వస్తున్నాం. ఈ వార్తలను యశస్వి జైస్వాల్ చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్ తోసిపూచ్చాడు. జైస్వాల్ తన జీవనోపాధి కోసం ఎప్పుడూ పానీపూరీలు అమ్మలేదని అతడు చెప్పుకొచ్చాడు. జైస్వాల్ పానీపూరి స్టోరీపై జ్వాలా సింగ్ పూర్తి క్లారిటీ ఇచ్చాడు. అసలు నిజం ఇదే.. "మొదట్లో యశస్వీని ఇంటర్వ్యూ చేయమని చాలా మీడియా సంస్ధలను అడిగాను. కానీ ఎవరూ కూడా తన ఇంటర్వ్యూ చేయడానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో నాకు చాల బాధ అనిపించింది. కానీ ఒక రోజు సడన్గా కొన్ని ప్రముఖ మీడియా సంస్ధలు నాకు తెలియకుండా జైశ్వాల్ను ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నించాయి. ఆ సమయంలో నేను ఇంగ్లండ్లో ఉన్నాను. వారు జైశ్వాల్ను సంప్రదించగానే అతడు నాకు ఫోన్ చేశాడు. కొంతమంది జర్నలిస్టులు తనను ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారని నాతో చెప్పాడు. అందుకు నేను కూడా సరే అని అన్నాను. ఇంటర్వ్యూలో జైశ్విల్ను కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడిగారు. అప్పుడు జైశ్వాల్ తన అమాయకత్వంతో పానీపూరీ సంఘటనను ప్రస్తావించాడు. అయితే జర్నలిస్టులు వారు స్టోరిలకు వెయిటేజీ ఇవ్వడం కోసం పానీపూరీ అంశాన్ని తమ హెడ్లైన్స్గా ఉపయోగించుకున్నారు. ఆ హెడ్లైన్స్ చూసి నేను షాక్ అయ్యా. ఎందుకంటే నేను అతడిని నా కొడుకులా పెంచి అన్ని సౌకర్యాలు కల్పించాను. జైశ్వాల్ అద్భుతంగా ఆడిన ప్రతిసారీ, పానీపూరీ స్టాల్లో ఒక వ్యక్తితో కలిసి ఉన్న ఫోటో బయటకు వస్తోంది. మీడియా సంస్థలు జైశ్వాల్ పక్కన ఉన్న వ్యక్తి తన తండ్రి అని ప్రచురిస్తాయి. అతడు జైశ్వాల్ తండ్రి కాదు. అది అనుకోకుండా దిగిన ఫోటో. జైశ్వాల్ తండ్రి ఎప్పుడూ జీవనోపాధి కోసం పానీపూరీలు అమ్మలేదు. జైశ్వాల్ కూడా ఎప్పుడూ పానీపూరీలు అమ్మలేదు. ఈ విషయాన్ని చాలా సార్లు తెలియజేశాం. 2013లో జైశ్వాల్ నాతో క్రికెట్ శిక్షణ ప్రారంభించాడు. జైశ్వాల్ ముంబైకి వచ్చిన మొదటిలో ఓ టెంట్లో నివసించేవాడు. ఆ సమయంలో కరెంటు,సరైన ఆహారం వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. వర్షాకాలంలో వారు వేసుకున్న టెంట్ నీటితో నిండిపోయేది. జైశ్వాల్ తన చిన్నతనంలో ఓ దుఖణాంలో పనిచేసేవాడు. అతని తల్లిదండ్రులు అతనికి ప్రతి నెల రూ. 1000 రపాయలు పంపేవారు. అయితే ఎప్పుడైతే అతడు నాతో క్రికెట్ శిక్షణను ప్రారంభించాడో అతడి కష్టాలు కొంతవరకు తీరాయి. గత 10 సంవత్సరాలుగా యశస్వినిని చూస్తున్నానని, U-19 ప్రపంచ కప్ 2020కి ముందు పానీపూరీ అమ్మినట్లుగా కథనాలు రాశారు. ఈ రకమైన స్టోరీలు అతనికి సహాయం చేసిన వ్యక్తులను కించపరుస్తాయి. అతడు ఈ స్ధాయికి చేరుకోవడానికి నేను నా వంతు కృషి చేశాను. నా జీవితంలో విలువైన 9 ఏండ్ల కాలన్ని యశస్వీకి ఇచ్చాను. అయితే చివరగా జైశ్వాల్ను ఈ స్ధాయిలో చూడడం చాలా సంతోషంగా ఉంది అని తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్వాలా సింగ్ పేర్కొన్నాడు. చదవండి: IND vs WI: టీమిండియాతో టీ20 సిరీస్.. వెస్టిండీస్కు గుడ్ న్యూస్! విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019