breaking news
-
అలర్ట్.. రెండు రోజుల్లో ముగియనున్న గడువు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైన పనులకు అదే చివరి తేదీగా ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి చాలా సంస్థల నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. మార్చి 31తో గడువు ముగియనున్న కొన్నింటి వివరాలు ఈ కింది కథనంలో తెలుసుకుందాం. పెట్టుబడిదారులు దీర్ఘకాలిక లాభాలకోసం మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తూంటారు. అధికారిక ధ్రువీకరణలతో కేవైసీ నిబంధనలను పూర్తి చేయని వారు మార్చి 31లోపు రీకేవైసీని పూర్తి చేయాలి. బ్యాంకుల్లోనూ ఆధార్, పాన్ కార్డులాంటివి లేకపోతే గడువులోపు కేవైసీని అప్డేట్ చేయాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తున్న అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి మార్చి 31తో ముగియనుంది. దీని వ్యవధి 400 రోజులు. వడ్డీ రేటు 7.10 శాతం. సీనియర్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో టార్గెట్ రీచ్ అవ్వడానికి కొన్ని బ్యాంకులు హోంలోన్లపై మార్చి 31 వరకు రాయితీలు ఇస్తున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్డేటెడ్ రిటర్నులు దాఖలు చేయడానికి గడువు ముగుస్తుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వారు ఈ పనిని పూర్తి చేయాలి. 2021-22, 2022-23, 2023-24 మదింపు సంవత్సరాలకు సంబంధించి వీటిని దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను విభాగం అనుమతినిచ్చింది. ఇదీ చదవండి: అంబానీ-అదానీ దోస్త్ మేరా దోస్త్..! -
మారనున్న నిబంధనలు!, పాన్ కార్డు అమలులో కేంద్రం మరో కీలక నిర్ణయం?
వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లు, వ్యాపారాలకు అనుమతుల కోసం జాతీయ స్థాయిలో సింగిల్ విండో (nsws) విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వ్యాపారాల అనుమతుల విషయంలో ఈ ఎన్ఎస్డ్ల్యూఎస్ విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. దేశంలో బిజినెస్ ప్రారంభించాలనుకునేవారు కొన్ని సార్లు కేంద్ర, రాష్ట్ర శాఖల నుంచి వేర్వేరు ఆమోదాలు, అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ,జీఎస్టీఎన్,టీఐఎన్,టీఏఎన్, పాన్ వంటి 13 విభిన్న ఐడీల్ని ఉపయోగించాల్సి ఉంది. అయితే పైన పేర్కొన్న ఐడీ కార్డలను ఉపయోగించి అప్రూవల్ పొందాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ తరుణంలో ఆ సమస్యను అధిగమించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక్క పాన్ కార్డుతో అనుమతులు ఇచ్చేలా నేషనల్ సింగిల్ విండో సిస్టం పద్దతిని అమలు చేస్తే ఎలా ఉంటుందో’నని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ విషయంపై తమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే రెవెన్యూ శాఖను సంప్రదించిందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ‘మేము ఇప్పటికే ఉన్న డేటాబేస్లలో పాన్ నెంబర్ను ఎంట్రీ పాయింట్గా ఉపయోగించుకునే దిశగా ముందుకు సాగుతున్నాము. కాబట్టి పాన్తో, కంపెనీకి సంబంధించిన ప్రాథమిక డేటా, దాని డైరెక్టర్లు, చిరునామాలు, సాధారణ డేటా ఇప్పటికే పాన్ డేటాబేస్లో అందుబాటులో ఉన్నాయి’ అని గోయల్ అన్నారు. ప్రస్తుతం పాన్ కార్డును వినియోగించి వ్యాపారా అనుమతులు ఇచ్చేలా సింగిల్ విండో పాలసీని కొన్ని రాష్ట్రాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నాం. ఫలితాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. చదవండి👉 మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? మారిన ఏటీఎం విత్డ్రా నిబంధనలు -
మీకు తెలియకుండా.. మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా!
మీకు తెలియకుండా లేకుండా.. మీ పేరు మీదు ఇంకెవరైనా పర్సనల్ లోన్, కన్జ్యూమర్ లోన్ తీసుకుంటున్నారా? ఎస్. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా.. అక్షరాల ఇది నిజం. ఇటీవల కాలంలో అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా పాన్ కార్డ్ల సాయంతో వారి పేరు మీద వేరే వాళ్లు బ్యాంకులు లేదంటే ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇలా సీక్రెట్గా తీసుకునే లోన్ల కారణంగా నేరస్తుల రుణాల్ని బాధితులు చెల్లించడమో,లేని పక్షంలో కోర్ట్ను ఆశ్రయించడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటి వల్ల ఆర్ధిక ఇబ్బందులతో పాటు డబ్బులు కట్టకుండా ఎగ్గొడుతున్నారనే అపవాదు మోయాల్సి ఉంటుంది. రహస్యంగా లోన్ మరి ఎలాంటి సందర్భాల్లో మీకు తెలియకుండా మీ పేరుమీద రహస్యంగా లోన్లను తీసుకోవచ్చంటే? బహిరంగంగా లేదంటే,సీక్రెట్గా బ్యాంక్ల నుంచి, ఆర్ధిక సంస్థల నుంచి ఈజీగా లోన్లు తీసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.ఎలా అంటే? ఉదాహరణకు మనం తీసుకునే లోన్లకు పాన్ నెంబర్ లింకై ఉంటుంది. ఆ పాన్ నెంబర్తోనే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా లోన్లను పొందవచ్చు. నేరస్తులు చట్టబద్దంగానే అస్సలు మీతో సంబంధం లేకుండా బ్యాంక్ నుంచి వారికి కావాల్సిన రుణాల్ని పొందే అవకాశం ఉంటుంది. అలాంటి లోన్లకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి అలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలంటే. క్రెడిట్ స్కోర్ చెక్ చేయండి బ్యాంక్ల నుంచి లోన్ తీసుకుంటే తప్పని సరిగా సంబంధిత డాక్యుమెంట్లకు పాన్ నెంబర్ను జత చేస్తారు. మీ పాన్ నెంబర్ సాయంతో సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే..మీరు ఎప్పుడు? ఎక్కడ? లోన్ తీసుకున్నారు. ఎంత చెల్లించారు. ఇంకా ఎంత చెల్లించాలి అనే విషయాలన్నీ బయటకొస్తాయి. మీరు కాకుండా ఇంకెవరైనా మీ పేరు మీద లోన్ తీసుకుంటే అలాంటి మోసాల్ని ఈజీగా గుర్తించొచ్చు. అదే జరిగితే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. జరిగిన మోసంపై ఫిర్యాదు చేయాలంటే! ఇటీవల ఓ బాధితుడు (పేరు చెప్పేందుకు ఇష్టపడలేదు) తనకు తెలియకుండా తనపేరు మీద లోన్ తీసుకున్నట్లు గుర్తించాడు. ఆ సమయంలో తన క్రెడిట్ స్కోర్ 776 నుంచి 830కి పెరిగింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంక్ లోన్కు పాన్ నెంబర్ను డీయాక్టీవ్ చేసినట్లు తెలిపాడు. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. తనకు జరిగిన మోసంపై బ్యాంకు అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులు మిమ్మల్ని నమ్మవ్! కొన్ని సందర్భాల్లో బ్యాంకులు మీ ఫిర్యాదును నమ్మే సాహసం చేయవు. అలాంటప్పుడు బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. అక్కడ న్యాయం జరగలేదంటే కోర్ట్లు లేదా స్థానిక సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేయోచ్చు. క్రెడిట్ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లాలి. వాళ్లు చెక్ చేసి మీ సిబిల్ స్కోర్ తగ్గింపు,పెంచే విషయంలో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, సిబిల్ స్కోర్ల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. చదవండి👉 ధరలు పెరిగితే ధనవంతులకే నష్టం - కేంద్ర ఆర్థిక శాఖ -
కెవిన్ పీటర్సన్ లా మీరు మీ పాన్ కార్డ్ ను పోగొట్టుకున్నారా? తిరిగి పొందండిలా!!
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ కెవిన్ పీటర్సన్ ప్రస్తుతం స్టార్ స్పోర్ట్ బ్రాడ్ కాస్టర్ లో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల భారత్లో జరిగిన ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన పాన్ కార్డ్ పోగొట్టుకున్నాడు.పాన్ కార్డ్ పోవడంతో కంగారు పడిన కెవిన్ భారత ఐటీ శాఖ అధికారులు తనకు సహాయం చేయాలని ఆయన కోరారు. కెవిన్ విజ్ఞప్తికి ఐటీ శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు అదే సమస్య మనకే ఎదురైతే? ఒకవేళ పాన్ కార్డ్ పోగొట్టుకుంటే ఎలా తిరిగిపొందాలి? ఎలాంటి ప్రాసెస్ చేయాలో తెలుసుకుందాం. ►పాన్ కార్డ్ పోగొట్టుకుంటే డూప్లికేట్ పాన్ కోసం అప్లయ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా మీరు https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html ►ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీకు ‘Changes or correction in existing PAN data/ Reprint of PAN card’. అనే ఆప్షన్ కనిపిస్తుంది. ►మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత అందులో మన వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేసి సమ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ►అనంతరం మీకు రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడిపై టోకెన్ నంబర్ ఐడికి టోకెన్ నెంబర్ వస్తుంది. ►తర్వాత కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ►అందులో వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ►ఇప్పుడు మీరు వ్యక్తిగత వివరాల డాక్యుమెంట్స్ ఫిజికల్ కాపీలను పాన్ కార్డ్ సేవల యూనిట్ ఎన్ ఎస్డీఎల్ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. లేదా ఈకేవైసీ కోసం ఇ-సైన్ ఇన్ అవ్వాలి. ► అందులోదొంగతనం జరిగితే, ఎఫ్ఐఆర్ను జత చేయండి. ►ఇప్పుడు తదుపరి మెనులో కార్డును స్వీకరించే మోడ్ను ఎంచుకోండి. మీరు ‘ఫిజికల్ పాన్ కార్డ్ కావాలా?’ కింద ‘అవును’ ఎంచుకుంటే, కార్డ్ మీ రిజిస్టర్డ్ అడ్రస్కి పంపబడుతుంది. లేదంటే, రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడికి ఈ పాన్ కార్డ్ను సంబంధిత శాఖ అధికారులు పంపిస్తారు. ►'సంప్రదింపు వివరాలు, పత్రం వివరాలు వంటి మిగిలిన వివరాలను పూర్తి చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. ►చెల్లింపు పేజీలో అవసరమైన చెల్లింపును చెల్లించి రసీదును పొందండి ►ఇప్పుడు, మీరు మీకు పంపిన 15-అంకెల రసీదు సంఖ్యను ఉపయోగించి మీ కార్డ్ స్థితిని తనిఖీ చేయవచ్చు. ►దరఖాస్తు చేసిన 14 రోజుల్లోగా కార్డ్ పంపబడుతుంది. -
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్!
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్. మార్చి 31లోపు ఎస్బీఐ ఖాతా దారులు ఆధార్ కార్డ్తో పాన్ కార్డ్ లింక్ చేయాలని ఎస్బీఐ తెలిపింది. గడువు తేదీ లోగా జత చేయకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని సూచించింది. అందుకే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్- పాన్ లింక్ను జతచేయాలని విజ్ఞప్తి చేసింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. ఎస్బీఐ ఓ ట్వీట్లో అసౌకర్యం లేకుండా బ్యాంకింగ్ సేవల్ని కొనసాగించేలా మా కస్టమర్లు వారి ఆధార్ కార్డ్కు పాన్కార్డ్ను జత చేయాలని సూచిస్తున్నాము.నిర్ధిష్ట గడువు లోగా లింక్ చేయకపోతే ఎస్బీఐ ట్రాన్సాక్షన్లపై ప్రభావం చూపుతుందని ఎస్బీఐ అధికారంగా తెలిపినట్లు కథనాలు పేర్కొన్నాయి. కాగా కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆధార్కు పాన్ లింక్ చేసే గడువు తేదీని ఎస్బీఐ సెప్టెంబర్ 30 2021 నుండి 31 మార్చి 2022 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019