breaking news
-
ఎదుర్కోలేమనే భయంతోనే...
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంటోంది. ఒకవైపు ఎండవేడిమి మంట పుట్టిస్తుంటే, మరోవైపు ప్రచారాల్లో భాగంగా రాజకీయ పార్టీల మాటల తూటాలు పేలుతున్నాయి. ఇది ఒక అడుగు ముందుకేసి దాడులకు తెగబడే పరిస్థితులకు చేరింది. 13వ తేదీన విజయవాడ వేదికగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత నెల 27న ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి నుండి ‘మేమంతా సిద్ధం’ పేరుతో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నాలుగు సంవత్సరాల 10 నెలల కాలంలో తాను ఏం చేశానో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ప్రచారానికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా తెలుగుదేశం, జనసేన పార్టీల నుండి అనేకమంది వైసీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే రాయి వేసి ఆయన్ని అంతమొందించే ప్రయత్నం జరిగింది. దీనిని ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముక్తకంఠంతో ఖండించారు. చంద్రబాబు కూడా ఈ దాడిని ఖండించారు. అయితే, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అడగకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన చేసిన ట్వీట్, వెంటనే ఆ పార్టీకి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. తానేమీ తక్కువ తినలేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రజా ముఖ్యమంత్రి, జనం గుండెల్లో గూడు కట్టుకున్న నేతపై దాడి జరిగితే దీనిని రాజకీయం చేయడం ఏంటని అసహ్యించు కుంటున్నారు. దాడి సమయంలో తమ ప్రియతమ నేత అభివాదం చేస్తూ పక్కకు తిరగడంతో పెను ప్రాణాపాయం నుండి రక్షించుకున్నారని చెబుతున్న ప్రజలు ఆయన ఎప్పుడూ చెప్పే ఒక్క మాటను గుర్తు చేస్తున్నారు. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలు ఉన్నంతకాలం తనకేమీ కాదన్నది ఇప్పుడు నిరూపి తమైంది. గతంలో 2019 ఎన్నికల సమయంలో విశాఖ విమానాశ్రయంలో జగన్పై కత్తితో దాడికి ప్రయత్నించిన ఘటనను ప్రజలు ఉటంకిస్తూ, ఘటన జరిగిన 24 గంటల్లో నిందితుణ్ణి పట్టుకోలేకపోయారని గుర్తుచేస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి సమయంలో అక్కడ డీజీపీ హడావిడిగా ఇదంతా కేవలం సానుభూతి కోసం అంటూ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన చెప్పిన గంటకే అమరావతిలో చంద్రబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే మాట చెప్పారు. అంటే దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడం కాదా అన్నది ఇక్కడ అందరూ అడుగుతున్న ప్రశ్న. తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు చావో రేవో అన్న చందంగా మారి ఆ కంగారులో తలో మాట మాట్లాడుతున్నారనుకుంటే, పవన్ కల్యాణ్ దాడి ఘటనను డ్రామాగా చిత్రీకరిస్తూ సినిమా తరహాలో డైలాగులు చెబుతున్నారు. ప్రజలు సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఇదంతా డ్రామాగా మీరే తేల్చేసినప్పుడు ఇక దీనిపై విచారణ ఎందుకు? చంద్రబాబు రాజకీయ నైజం గురించి కూడా విస్తృతమైన చర్చ జరుగుతోంది. 1987 ప్రాంతంలో పేదల పక్షపాతి, నిస్వార్థ రాజకీయ నేత వంగవీటి మోహన రంగాను అకారణంగా పొట్టన పెట్టుకున్న ఘటనను ఇప్పుడు ప్రజలు ఉటంకిస్తుండటం నిజంగా ప్రజల్లోని రాజకీయ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. అంతేకాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బషీర్బాగ్ కాల్పుల ఘటన, అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన ఘటన, గోదావరి పుష్కరాల్లో ప్రచార ఆర్భాటం కోసం 26 మందిని పొట్టనపెట్టుకున్న సంఘటన, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై, ఆయన కుటుంబంపై పరుష పదజాలం వాడుతూ కొట్టుకుంటూ ఇంటి నుండి బయటకు తీసుకొచ్చిన వైనం, గుంటూరులో చీరలు పంపిణీ చేస్తామని పిలిచి తొక్కిసలాటలో అమాయక మహిళల ప్రాణాలను బలిగొన్న అంశాలను చర్చించటం చూస్తుంటే, ఒక నేతపై ప్రజల్లో ఉండే అభిప్రాయానికి దీన్ని సూచికగా చెప్పుకోవచ్చు. ఇదంతా చూస్తుంటే కేవలం జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందనే ఆయనంటే గిట్టనివారి కడుపు మంటకు కారణంగా కనిపిస్తోంది. రాజధాని ప్రాంతంలో కూడా విశేష ఆదరణ లభించడం ఈ కడుపు మంటను రెట్టింపు చేసింది. అందుకే జనాల గుండెల్లో గూడు కట్టుకున్న జగన్ను అంతమొందించేందుకు కుట్రకు తెరలేపినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షులు -
అనుకుందొకటీ... అయ్యిందొకటీ!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వారా రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో అధికారంలో ఉన్న సంక్షేమ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలన్న బాబు, పవన్ల వ్యూహానికి స్వయంగా మోదీనే చెక్ పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మంచిని ఆయన గుర్తించబట్టే ఆయన పేరును గానీ, ఆయన ప్రభుత్వాన్ని గానీ ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ప్రధాని మోదీ ప్రసంగం జరిగిన తీరును నిశితంగా పరి శీలన చేస్తే గతంలో చంద్రబాబు ఆయన పట్ల చేసిన వ్యాఖ్యలను మనసులో పెట్టుకుని ఆచితూచి ప్రసంగించినట్లు కనిపించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ‘విశ్వ గురు’ అంటూ ప్రశంసించి ఆకాశానికి ఎత్తినా ఫలితం దక్కలేదు. సరిగ్గా ఐదేళ్లు వెనక్కు పోతే... ‘నరేంద్ర మోదీ కరుడుగట్టిన ఉగ్రవాది, ఈ దేశంలో ఉండే అర్హత లేదు’ అన్న చంద్రబాబు ఇప్పుడు మోదీ ‘దేశానికి దిక్సూచి’, ‘విశ్వ గురు’ అంటూ ఆకాశాని కెత్తడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ మీ హక్కుల కొరకు, రాష్ట్ర వికాసం కొరకు చాలా కాలం నుండి కృషి చేస్తున్నారు అన్నారే తప్ప... బాబు పాలన దక్షత గురించి గానీ, బాబు రాష్ట్రానికి చేసిన మంచి గురించి గానీ ఒక్కమాట అంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. చంద్రబాబు ప్రసంగం మొత్తం మోదీని ప్రశంసించడానికి మాట్లాడితే మోదీ మాత్రం తన ప్రభుత్వం చేసిన గొప్పల గురించి చెప్పుకునేందుకు మాత్రమే పరిమితమయ్యారు. అలాగే ఆయన కాంగ్రెస్,‘ఇండియా’ కూటములను మాత్రమే విమర్శించారు. కాంగ్రెస్ పీవీనీ, ఎన్టీ ఆర్నూ విస్మరించింది అని ఏపీలో లేని కాంగ్రెస్ గురించి మాట్లాడటం ప్రజలను ఆలోచింప చేస్తోంది. 2019లో చంద్రబాబు నాయుడు మీద చేసిన ఆరోపణలు గుర్తు చేసుకుంటే... ‘పోలవరం కో ఏటీఎం కరే’ అన్నారు. కానీ చంద్రబాబును 2019లో విమర్శించినంత గానీ, 2014లో జగన్ను విమర్శించినంతగా కానీ ఈసారి జగన్ మోహన్ రెడ్డిని మోదీ విమర్శించలేదు. దీంతో తెలుగుదేశం, జన సేనలతో ఆయన ఎలాంటి బంధం కోరుకుంటు న్నారో అర్థమవుతోంది. ‘చెల్లికి కూడా అన్యాయం చేసిన వాడు జగన్’ అని చంద్రబాబు అంటే మోదీ మాత్రం ‘జగన్, షర్మిల ఒక్కటే’ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిలకు పోకుండా జాగ్రత్త పడాలి అన్నారు. ఒక రకంగా షర్మిలను, కాంగ్రెస్ను గుర్తుకు తెచ్చి మోదీ కాంగ్రెస్కూ, షర్మిలకూ క్యాంపెయిన్ చేసి నట్లు ఉంది. తెలంగాణకు చెందిన పీవీ నరసింహా రావుకు భారతరత్న ఇచ్చామన్న మోదీ... ఎన్టీఆర్కు ఎందుకు ఇవ్వలేదో చెప్పలేదు. మోదీ ఇచ్చిన విద్యా సంస్థల గురించి ఏకరవు పెట్టిన చంద్రబాబు... ఆయన ఇవ్వని పెట్రో కెమి కల్ కారిడార్, కడప స్టీల్ ప్లాంట్, ప్రత్యేక రాష్ట్ర హోదా, వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ వంటి వాటి ప్రస్తావనే చేయలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవే టీకరించమన్న మాటే ప్రధాని మోదీ నోటి నుండి రాలేదు. ఆంధ్రప్రదేశ్ వికాసం కొరకు ఎన్డీయేకు ఓటేయమన్నారు. అమరావతి గురించి ప్రస్తావనే లేదు. పవన్ ప్రస్తావించారు. దీనికి ప్రధాని సమాధానం లేదు. బీజేపీ వ్యూహాత్మకంగా టీడీపీ శిబిరంలోకి వెళ్లి కొన్ని సీట్లు తీసుకుని ఏపీలో తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసినట్లు అర్థమౌతోంది.అంతెందుకు కనీసం తెలుగుదేశం అన్న పదాన్ని ఉచ్ఛరించడానికి కూడా మోదీ ఇష్టపడ లేదు. చంద్రబాబు గతంలో మోదీ గురించి, ఆయన భార్య గురించి అన్న మాటలు అన్నీ అయనకు గుర్తున్నట్లు కనిపించింది. ఇక మోదీ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ చాలా చాలా కవితాత్మకంగా చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటకీ మోదీ మాత్రం కనీసం స్పందించలేదు. పవన్, చంద్రబాబులకు మోదీ ప్రసంగం ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వలేకపోయింది. రాజకీయంగా బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్కు ప్రధాని ప్రసంగం పరాకాష్టగా నిలిచింది. కేవలం తన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చెబుతూ ‘ఇండియా’ కూటమి అనైక్యత, కేరళలో రాజకీయ అనిశ్చితి గురించి ప్రస్తావించారే తప్ప ఏపీ సమస్య లేమీ ఎత్తలేదు. అన్నింటికంటే కీలకమైనది...చంద్రబాబు, పవన్ కోరుకునేది ఏదీ కూడా ప్రధాని ప్రస్తావించలేదు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలి... ఓటు వేయండి అంటూ పదే పదే చెప్పారు. 25కు 25 ఎంపీలు గెలవాలి అన్నారు. తన విమర్శలు తానే దిగమింగి చంద్రబాబు మోదీని పొగిడినప్పటికీ మోదీ మాత్రం స్పందించలేదు. రాజకీయంగా చూస్తే తెలుగుదేశం పార్టీకీ, పవన్కూ ఈ ప్రసంగం చెంపపెట్టు లాంటిదే! డా‘‘ పి. గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మొబైల్: 98481 05455 -
'టీడీపీ కార్యకర్తలకు తక్కువ ధరకే టెండర్లు'
విజయవాడ: రాష్ట్రంలో టీడీపీ నేతలు అధికార దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత పి. గౌతంరెడ్డి ఆరోపించారు. మంగళవారం విజయవాడలో గౌతంరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ కార్యకర్తలకు తక్కువ ధరలకే టెండర్లు అప్పగిస్తున్నారని విమర్శించారు. విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అద్దె ధర రోజుకు రూ. 60 వేలుగా ఉందని ఆయన గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్త గరిమెళ్ల నానికి రూ. 15 వేలకే కట్టబెట్టడంలో ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ మంత్రి దేవినేని ఉమా, స్థానిక ఎమ్మెల్యే బోండా కుమ్మకై గరిమెళ్ల నానికి తక్కువ ధరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ను తక్కువ అద్దెకు ఇచ్చారని గౌతంరెడ్డి అన్నారు.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019