breaking news
-
సుజనా చౌదరి దివాలా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ, ఎన్డీఏ కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దివాళా పరిష్కారకర్త (రెజల్యూషన్ ప్రొఫెషనల్)ను నియమిస్తూ.. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆయన ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేసింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన స్లె్పండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్బీఐలో రూ. 500 కోట్లకు రుణం తీసుకుంది. దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఇచ్చారు. దీంతో సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియ ప్రారంభించి, పరిష్కారాన్ని చేపట్టాలని ఎస్బీఐ 2021లో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన ఆస్తుల మదింపు చేపట్టి, వేలం ద్వారా ఎస్బీఐ రుణాలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్పై ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్ పూరి బెంచ్ విచారణ జరిపి, తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వీవీఎస్ఎన్ రాజు వాదనలు వినిపించారు. రుణదాతకు ఏదైనా కంపెనీ, వ్యక్తులు రుణాన్ని ఎగవేసినప్పుడు దానికి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఉన్న వాళ్లు బాధ్యత వహించాలని చట్టం చెబుతోందన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పలు తీర్పుల సందర్భంగా చెప్పిందన్నారు. హామీదారుగా ఉన్న సుజనా చౌదరి తప్పకుండా బాధ్యత వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సుజనా తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడం, మధ్యంతర పరిష్కార ప్రక్రియ (ఐఆర్పీ) ఇచ్చిన నివేదికను పరిశీలించిన బెంచ్.. సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు అనుమతించింది. దీంతో బీజేపీ నేతకు షాక్ తగిలినట్లయింది. దీని ప్రకారం దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు పరిష్కారకర్తను నియమిస్తారని, ఆయన సుజనా అప్పులు, ఆస్తులను పరిశీలించి, ఆయా రుణదాతలకు ఇవ్వాల్సిన నిష్పత్తి మేరకు పరిష్కారాన్ని సూచిస్తారని సమాచారం. -
ఒకప్పుడు షేర్ ధర రూ.2,700.. ఇప్పుడు ‘జిరో’.. భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు..
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ నుంచి త్వరలో డీలిస్ట్ అవ్వబోతుంది. రిలయన్స్ క్యాపిటల్ను హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కొనుగోలు చేసిన తరుణంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఇకపై దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ క్యాపిటల్ షేర్లు ట్రేడ్ అవ్వవు. ఎందుకంటే కంపెనీ కొత్త యజమాని హిందూజా గ్రూప్ షేర్లను డీలిస్ట్ చేయాలని నిర్ణయించటమే దీనికి ప్రధాన కారణం. వాస్తవానికి 2008లో కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.2,700 కంటే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం షేర్ ధర దాదాపు 99 శాతం క్షీణించి రూ.11 వద్ద ఉంది. షేర్ల డీలిస్టింగ్ జరిగితే ఈక్విటీ షేర్ హోల్డర్ల ఇన్వెస్ట్మెంట్ సున్నా కాబోతోంది. కొత్తగా కొనుగోలు చేసిన కంపెనీ పాత కంపెనీలోని ఇన్వెస్టర్లకు ఎలాంటి వాటాలు ఇవ్వబోదని వెల్లడైంది. దీనివల్ల అనిల్ అంబానీ కంపెనీలో షేర్లు కలిగి ఉన్న వ్యక్తులకు భారీగా నష్టం జరగనుంది. ఇప్పటికే రిలయన్స్ క్యాపిటల్పై నియంత్రణ సాధించేందుకు హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ సమర్పించిన రూ.9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) గత మంగళవారం ఆమోదించింది. ఇదీ చదవండి: మరో గ్లోబల్ బ్రాండ్ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ ఇందులో రుణదాతలు 63 శాతం బకాయి నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీకి వ్యతిరేకంగా క్లెయిమ్ చేసిన మొత్తం రూ.38,526.42 కోట్లలో రూ.26,086.75 కోట్ల క్లెయిమ్లను మాత్రమే ట్రిబ్యునల్ ఆమోదించింది. -
అప్పులతో కుంగిన అనిల్ అంబానీ కంపెనీకి ఊరట..
ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్కి భారీ ఊరట లభించింది. రుణభారంతో కుంగిన రిలయన్స్ క్యాపిటల్కి సంబంధించి హిందుజా–ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ. 9,650 కోట్ల పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం కంపెనీ రుణదాతలు భారీగా 63 శాతం రుణాలను వదులుకోవాల్సి వస్తుంది. అలాగే, ప్రణాళిక అమల్లో భాగంగా ఆర్క్యాప్ షేర్లను ఇండస్ఇండ్కు బదలాయించాక, దాన్ని స్టాక్ ఎక్స్చేంజీల నుంచి తొలగిస్తారు. మొత్తం రూ. 38,526 కోట్ల రుణాల క్లెయిమ్లకు గాను ఎన్సీఎల్టీ రూ. 26,086 కోట్ల క్లెయిమ్లనే అనుమతించింది. కానీ, 2023 జూన్లో బిడ్ వేసిన ఇండస్ఇండ్ అందులో రూ. 9,661 కోట్లు (37%) కడతానని ప్రతిపాదించింది. రిలయన్స్ క్యాపిటల్ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు మార్గాన్ని అందించడంలో ఎన్సీఎల్టీ ఆమోదం కీలకమని గమనించవచ్చు. -
ఎడ్టెక్ కంపెనీకు నోటీసులు.. ఎందుకో తెలుసా..
ఫ్రాన్స్ కంపెనీ పిటీషన్ దాఖలు చేయడంతో బైజూస్ సంస్థ తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) నోటీసులు అందుకుంది. ఫ్రాన్స్కు చెందిన టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ సర్వీసెస్ పిటీషన్ వేయడంతో బైజూస్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) నోటీసులు ఇష్యూ చేసింది. బైజూస్ ఎడ్టెక్ కంపెనీ రూ.4 కోట్లు అప్పు పడిందని, దాన్ని తిరిగి చెల్లించడం లేదని ఈ పిటీషన్లో టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ పేర్కొంది. నిబంధనల ప్రకారం నోటీసులపై బైజూస్ రెండు వారాల్లో స్పందించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, టెలీపెర్ఫార్మెన్స్తోపాటు ఇతర కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలతో 2022 మధ్య వరకు బైజూస్ వ్యాపారం చేసింది. ఈ కంపెనీలు బైజూస్కు కాలింగ్ ఏజెంట్ల సేవలందించేవి. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా టెలీపెర్ఫార్మెన్స్, కోజెంట్ బైజూస్కు నిధులు నిలిపేసినట్లు తెలిసింది. ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం! వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టర్మ్లోన్-బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును గతంలో ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
కమిటీతోనైనా కథ ముగిసేనా?
సాక్షి, హైదరాబాద్: నష్టాలతో మూత పడిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) ఆస్తులను విక్రయించి బ్యాంకులు, ఇతర సంస్థలకు బకాయి లు చెల్లించాల్సిందిగా సుమారు నాలుగున్నర ఏళ్ల క్రితం నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తీర్పుని చ్చింది. నిజాం షుగర్స్ పునరుద్ధర ణ మార్గాలు మూసుకుపోవడంతో ఆస్తుల విక్ర యం (లిక్విడేషన్) మినహా మరో మార్గం లేదని గతంలోనే స్పష్టం చేసింది. ఎన్సీఎల్టీ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసినా ఏళ్ల తరబడి నిజాం దక్కన్ షుగర్స్ భవితవ్యం కొలిక్కిరావడం లేదు. ఈ నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎన్డీఎస్ఎల్ను తిరిగి తెరిపిస్తామంటూ ‘పునరుద్ధరణ కమిటీ’ని ప్రకటించింది. ఈ కమిటీలో మరో మంత్రి దామోదర రాజనర్సింహ సహ చైర్మన్గా, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు పి.సుదర్శన్రెడ్డి, రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్తో పాటు ఆర్థిక, పరిశ్రమ లు, వ్యవసాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. ఎన్డీఎస్ఎల్ను తిరిగి తెరవడం లక్ష్యంగా ఏర్పాటైన నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలనే ప్రభుత్వ ఆదేశాలు ఎంత మేర ఫలిస్తాయనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు హయాంలో ప్రైవేటు పరం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1937లో ఏర్పాటైన నిజాం చక్కెర కర్మాగారం (ఎన్ఎస్ఎల్) 1990వ దశకం నాటికి నష్టాల బాట పట్టింది. నష్టాల నుంచి నిజాం షుగర్స్ను గట్టెక్కిస్తామనే నెపంతో 2002లో నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 51 శాతం వాటాను డెల్టా పేపర్ మిల్లుకు విక్రయించింది. దీంతో దశాబ్దాల తరబడి ఎన్ఎస్ఎల్గా పేరొందిన నిజాం షుగర్స్ ఎన్డీఎస్ఎల్గా పేరు మార్చుకుంది. ప్రైవేటు సంస్థకు 51 శాతం వాటా అప్పగించడంపై అప్పట్లో పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో ఎన్డీఎస్ఎల్ను మూసివేస్తున్నట్లు 2015 డిసెంబర్లో యాజమాన్యం ప్రకటించింది. పరిశ్రమ ఆస్తులను విక్రయించి అప్పులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఎన్డీఎస్ఎల్ను నడిపేందుకు 2015 ఏప్రిల్లో కార్యదర్శుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. డెల్టా పేపర్ మిల్లుకు చెందిన 51 శాతాన్ని టేకోవర్ చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా జీఓఎంఎస్ 28ను కూడా జారీ చేసింది. ట్రిబ్యునల్ను ఆశ్రయించిన ఎన్డీఎస్ఎల్ అప్పులు పెరిగినందున దివాలా పరిశ్రమగా గుర్తించాలని ఎన్డీఎస్ఎల్ 2017లో నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. అప్పులు తీర్చేందుకు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిసొల్యూషన్ ప్రాసెస్ ప్రారంభించాలని కోరడంతో రుణదాతలతో సంప్రదింపులు జరిపేందుకు ఎన్సీఎల్టీ లిక్విడేటర్ను కూడా నియమించింది. 2017 అక్టోబర్ నుంచి 2018 సెపె్టంబర్ వర కు 11 పర్యాయాలు రుణదాతలతో సంప్రదింపులు జరిపినా పునరుద్ధరణ అంశం కొలిక్కి రాలే దు. పరిశ్రమ కొనుగోలుకు ముందుకు వ చ్చిన కొన్ని సంస్థలు ఎన్డీఎస్ఎల్ ఆస్తులు, అప్పులు పరిశీలించి వెనకడుగు వేశాయి. నాలుగున్నరేళ్ల క్రితం సంస్థకు రూ.360 కోట్ల అప్పులు ఉండగా, ఆస్తుల విలువ కూడా అంతే ఉన్నట్లు తేలింది. సంస్థ పునరుద్ధరణ, అమ్మకం ప్రయత్నాలు కొలి క్కి రాకపోవడంతో ఎన్సీఎల్టీ లిక్విడేషన్కు అనుమతిచ్చింది. ఎన్సీఎల్టీ తీర్పుపై 2019లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, నేటికీ ఆ కేసులో పురోగతి లేదు. ఎన్డీఎస్ఎల్పై ఇప్పటికే హౌజ్కమిటీ, కార్యదర్శుల కమిటీ వంటివి ఏర్పాటైనా సంస్థ మనుగడపై స్పష్టత ఇవ్వ లేకపోయాయి. ఈ నేపథ్యంలో నిజాం దక్కన్ షుగర్స్ను పునరుద్ధరిస్తామంటూ తాజాగా కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని గడువు నిర్దేశించింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019