breaking news
-
ఓం భూం స్వాహా!
‘నా పరిశీలనకు వచ్చిన, తెలియవచ్చిన విషయాల్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చిలో కూర్చున్నాక.. కుట్రలు చేయడంలో, నమ్మిన ప్రజల్ని మోసగించడంలో సిద్ధ హస్తుడైనచంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖుల్ని పిలిచి హడావుడి చేసినప్పుడు.. బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులని అప్పుడు వారికి తెలియలేదు. ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో పేద రైతుల అసైన్డ్ భూములను బెదిరించి బినామీల రూపంలోసొంతం చేసుకుని కథ నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమ వారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక.. గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేత్తులేత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. ఈ డ్రామాలో బాబు బృందంలోనిమంత్రులు, ఎమ్మెల్యేలు...ఆయనకు ఆప్తులు అందరూ పాత్రధారులే.. ‘చేసేది నువ్వు.. చేయించేది నేను..’ రాజధాని ఫైల్స్లో చంద్రబాబు డైలాగ్ ఇదే. తెరముందు రాజధాని రూపశిల్పి.. తెరవెనుక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ కాగా.. పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు ఇలా 1,336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్తో రూ.లక్షల కోట్ల భూ దందాకు తెగించారు. అసైన్డ్ దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్లో 1,336 మంది బినామీ ‘బాబు’ల బాగోతం సాక్షి, అమరావతి : అమరావతి భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు.. ఇలా ఒకటేమిటి.. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్నీ భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా ఆయన పరమైంది. ఎస్సీ, ఎస్టీ, రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారూ చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కు ఇరువైపులా, అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5 వేల ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే. చినబాబుది పెద్ద వాటానే అమరావతి భూ కుంభకోణంలో లోకేశ్ది పెద్ద వాటానే. తన బినామీ, ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలు దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్తోపాటు ఆయన భార్య అనూరాధ గోష్పాది గ్రీన్ఫీల్డ్స్ పేరిట అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకుపైగా స్వాహా చేశారు. అవినీతి తిమింగలం లింగమనేని అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేశ్. చంద్రబాబు భూ దోపిడీలో ఇతనూ ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు. నారాయణ తంత్రం.. సుజనా, ప్రత్తిపాటి భూదందా చంద్రబాబు తరువాత అమరావతి భూ దోపిడీలో రెండో పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో లో ప్రధాన పాత్రధారు. కృష్ణా నదికి ఇటువైపు.. అటువైపు, కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్కు దగ్గరలో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములు ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్, ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3 వేల ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ది అమరావతి భూ కుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీకుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2 వేల ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూ దోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలు దోచుకున్నారు. -
శాపంగా నారాయణ గారడీలు
‘నెల్లూరును స్మార్ట్ సిటీగా మారుస్తున్నాం..నగర సుందరీకరణే నా ధ్యేయం.. భూగర్భ డ్రైనేజీతో మెరుగైన పారిశుధ్యాన్ని అందిస్తాం’అంటూ గత ప్రభుత్వ హయాంలో మంత్రిగావ్యవహరించిన నారాయణ తన ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను ఆ రోజుల్లో ఊదరగొట్టారు. ఇవన్నీ జరగకపోగా.. తనలోపభూయిష్ట విధానాలతో నెల్లూరు నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టారు. హడ్కో ద్వారా రుణాలను తీసుకొచ్చి.. పనులను చేయకుండానే నిధులను దిగమింగారు. ఈ పరిణామాలతో ఆ అప్పులపై కార్పొరేషన్ ఏటా రూ.55 కోట్ల వడ్డీని కడుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత టీడీపీ హయాంలో మంత్రిగా వ్యవహరించిన నారాయణ పాపాలు నగర వాసులను నేటికీ వెంటాడుతున్నాయి. వీటన్నింటినీ విస్మరించి తాజాగా జరగనున్న ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ ఆయన అవాస్తవాలను ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ‘నారాయణ అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే నారాయణ’ అంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. 9.95 శాతం వడ్డీకి అప్పు నగరపాలక సంస్థలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా కోసం రూ.1136 కోట్ల రుణానికి హడ్కోను ఆశ్రయించారు. ఇందులో తాగునీటి సరఫరా కోసం రూ.556 కోట్లు, భూగర్భ డ్రైనేజీకి రూ.580 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే హడ్కో రూ.830 కోట్లను 9.95 శాతం వడ్డీకి 2016లో మంజూరు చేసింది. అయితే నామమాత్రపు పనులతో 2018 వరకు కాలం వెళ్లదీశారు. గత ఎన్నికలకు ముందు హడావుడిగా.. గత ఎన్నికలకు కొన్ని నెలల ముందు రెండు ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలకు టెండర్లను ఖరారు చేశారు. అప్పటికే నగరంలో ఒకట్రెండు వీధుల్లో మినహా మిగిలిన అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి. భూగర్భ డ్రైనేజీ పేరుతో రోడ్లను తవ్వి.. అసంపూర్తిగా పనులు చేసి వదిలేశారు. ధ్వంసమైన రోడ్లపై నడిచేందుకు సైతం వీల్లేని పరిస్థితి ఏర్పడింది. భూగర్భ డ్రైనేజీ పైప్లైన్లను అన్ని వీధుల్లో వేస్తేనే గానీ సిమెంట్ రోడ్ల నిర్మాణానికి వీలుంటుంది. ఈ తరుణంలో గుంతలమయమైన రోడ్లతో ప్రజలు నరకాన్ని చవిచూశారు. డివిజన్ ఇన్చార్జీలకు సబ్ కాంట్రాక్ట్లు..! సిమెంట్ రోడ్ల పనులను తమకే కేటాయించాలంటూ నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల టీడీపీ ఇన్చార్జీలు నారాయణపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సదరు కన్స్ట్రక్షన్ కంపెనీలతో మాట్లాడి నిర్మాణాల పనులు వారికి అప్పగించారు. ఈ తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనగా, నాణ్యత ప్రమాణాలను పాటించకుండా ఎత్తుపల్లాలుగా.. అత్యంత నాసిరకంగా రోడ్లను నిర్మించారు. కొన్ని వీధుల్లోని రోడ్లు వారానికే కుంగిపోయాయంటే నాణ్యత ఎలా ఉంతో అర్థం చేసుకోవచ్చు. గుంతలమయంగా.. వర్షమొస్తే చెరువులను తలపిస్తూ.. పైప్లైన్ల లీకేజీలు.. ఇలా రోడ్లు దుర్భరంగా మారాయి. చిన్నపాటి లీకేజీని సైతం సరిదిద్దేందుకు రోడ్లను ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఉండేది. అసంపూర్తిగా ఉన్నా.. బిల్లుల మంజూరు హడావుడిగా చేసిన పనులకు బిల్లులను మాత్రం పూర్తిగా తీసుకున్నారు. పనులు అసంపూర్తిగా ఉన్నాయని.. బిల్లులను మంజూరు చేయలేమని ఇంజినీరింగ్ అధికారులు చెప్పినా, నారాయణ మౌఖిక ఆదేశాలతో వీటికి ఇవ్వక తప్పలేదు. కొన్ని బిల్లులను అధికారులు క్లియర్ చేయకపోవడంతో ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. స్వచ్ఛ నీరు.. కాలువల పాలు నగర వాసులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో పైపులను ఇళ్ల వద్ద ఏర్పాటు చేసి ఓపెన్గా వదిలేశారు. ఈ పైపుల ద్వారా ప్రతి ఇంటికీ కుళాయిని ఏర్పాటు చేసి.. వినియోగాన్ని లెక్క కట్టేందుకు మీటర్లను బిగిస్తామని చెప్పారు. అయితే ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆ ఓపెన్ పైపుల ద్వారా విడుదలయ్యే నీరు కాలువల పాలైంది. మరికొన్ని చోట్ల పైపులు చోరీకి గురయ్యాయి. నగరంలో అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజీ, స్వచ్ఛమైన తాగునీటి పనులను పూర్తి చేయాలంటే మరో రూ.240 కోట్లు అవసరమవుతాయని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. వడ్డీ భారం ఇలా.. హడ్కో నుంచి తెచ్చిన రుణానికి 9.95 శాతం వడ్డీని ఏటా చెల్లించాలి. అసలు కింద రూ.80 కోట్లు.. వడ్డీగా రూ.55 కోట్లు.. ఇలా ఏడాదికి రూ.135 కోట్లను నగరపాలక సంస్థ చెల్లించాల్సి వస్తోంది. ఆరేళ్లుగా రూ.810 కోట్లను కార్పొరేషన్ చెల్లించింది. ఈ లెక్కన ఇంకా దాదాపు రూ.400 కోట్లను అసలు, వడ్డీ కింద జమ చేయాల్సి ఉంది. ఇలా నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి నారాయణ లాగారు. -
కోటంరెడ్డి, నారాయణ పై విజయ్ సాయి రెడ్డి ఫైర్
-
నారాయణ నకిలీ పనులు
-
నారాయణ పై విజయసాయిరెడ్డి ఫైర్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019