breaking news
-
బికినీ ధరించిన మొదటి హీరోయిన్ ఎవరు..? ఆమె ఎలా మరణించారో తెలిస్తే..
బాలీవుడ్ హీరోయిన్ నళిని జయవంత్ 20వ శతాబ్దం మధ్యకాలంలో హిందీ చిత్రాలలో ఒక ఊపు ఊపేసింది. ముంబైలో పుట్టిన నళిని తనకు 15 ఏళ్ల వయసులోనే అంటే 1941లో హీరోయిన్గా బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ రోజుల్లో ఆమె నటించిన చిత్రాలలో లెక్కలేనన్ని భారీ హిట్లు కొట్టాయి. పరిశ్రమకు ఆమె చేసిన కృషి చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ , ఆమె తన తరువాతి సంవత్సరాలలో ఒంటరిగా జీవించి.. 84 సంవత్సరాల వయస్సులో 2010లో మరణించింది. ఆమె మరణం చాలా విషాధంతో కూడుకొని ఉంది. అత్యంత అందమైన హీరోయిన్గా గుర్తింపు 1950వ దశకంలో, ఫిల్మ్ఫేర్ నిర్వహించిన ఒక పోల్లో అత్యంత అందమైన మహిళగా ఆమె ఎంపికైంది. దిలీప్ కుమార్ వంటి స్టార్ హీరో కూడా తనతో పాటుగా కలిసి పనిచేసిన వారిలో గొప్ప నటి నళిని జయవంత్ అని ప్రశంసించారు. బాలీవుడ్ నివేదికల ప్రకారం, బికినీ ధరించిన మొదటి నటి నళిని జయవంత్ అని ఉంది. ఆమె ఇండియన్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, దర్శకురాలు అయిన శోభనా సమర్థ్కు మొదటి కోడలు. 1950లో విడుదలైన సంగ్రామ్ చిత్రంలో నళిని జయవంత్ స్విమ్ సూట్ ధరించారు. అప్పట్లో ఆమె బికినీ ఫోటోలు ప్రేక్షకులను షాక్ గురిచేశాయి. ఈ చిత్రంలో అశోక్ కుమార్ సరసన నళిని జతకట్టింది. ఫిల్మ్ఫేర్ నివేదికల ప్రకారం ఆవారా (1951)లో నర్గీస్ స్విమ్ సూట్ ధరించింది. ఆ తర్వాత శోభనా సమర్థ్ కుమార్తె అయిన 'నూతన్' కూడా 'డిల్లీ కా థగ్' (1958) చిత్రంలో స్విమ్సూట్ను ధరించి మెప్పించారు. ఆ ఒక్క సినిమాతో నూతన్కు కూడ భారీ అవకాశాలు వచ్చాయి. అలా నూతన్, నళిని జయవంత్ ఒకే కుటుంబం నుంచి ఇద్దరూ బాలీవుడ్నే ఏలేశారు. నూతన్ సోదరి అయిన తనూజ కూతురే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్. నళినీ మరణించిన మూడు రోజులకు.. నళినీ జయవంత్ డిసెంబర్ 22, 2010న 84 ఏళ్ల వయసులో ముంబైలోని చెంబూర్ వద్ద ఉన్న యూనియన్ పార్క్లోని తన బంగ్లాలో 60 ఏళ్లుగా జీవించి కన్నుమూశారు. ఆమె మరణించిన మూడు రోజుల తర్వాత ఆమె మరణించినట్లు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ వచ్చే వరకు కూడా నళినీ చనిపోయినట్లు ఎవరూ గమనించబడలేదు. దుర్వాసన రావడంతో గమనించిన ఒకరు సమాచారం ఇవ్వడంతో ఆమె మరణ వార్త బయటి ప్రపంచానికి తెలిసింది. 2001లో తన భర్త ప్రభు దయాళ్ మరణించిన తర్వాత నళినీ పూర్తిగా తనను తాను ఒంటరిగా ఉండేలా బంధించుకుంది. అలా తొమ్మిదేళ్ల పాటు జీవించి దారుణమైన స్థితిలో కన్నుమూసింది. ఆమెకు పిల్లలు లేరు. వృద్ధాప్యంలో బంధువులు కూడా ఆమె వద్దకు ఎవరూ రాకపోవడంతో ఒక అనాథలా తన జీవితాన్ని ముగించింది. 1941 నుంచి 1983 వరకు సుమారు 80కి పైగా చిత్రాల్లో నటించిన నళినీకి 2005లో దాదాహెబ్ ఫాల్కే అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారం దక్కింది. -
కాలేజీ రోజుల్లోనూ నాన్న కొట్టేవాడు, అమ్మకు చెప్తే..: నళిని కూతురు
నళిని.. ఇప్పుడంటే సీరియల్స్ చేస్తోంది కానీ ఒకప్పుడు సినిమాల్లో ఎక్కువగా కనిపించేది. విలనిజం పండించడంలో ఈమె దిట్ట. సినిమాల్లో, సీరియల్స్లో అవతలివారిని ముప్పతిప్పలు పెట్టే ఈమె నిజ జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. 1987లో దర్శకనటుడు, రచయిత రామరంజన్ను పెళ్లాడింది. వీరికి అరుణ, అరుణ్ అని ఇద్దరు కవలలు జన్మించారు. రానురానూ సంసారంలో గొడవలు రావడంతో నళిని- రామరాజన్ 2000వ సంవత్సరంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు.. గుక్కపెట్టి ఏడ్చిన నళిని కోర్టులో విడాకులు మంజూరు చేయగానే నళిని గుక్కపెట్టి ఏడ్చేయగా రామరాజు అతడిని ఓదార్చాడు. అది చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారట. అలా విడిపోయినప్పటికీ ఒకరిపై మరొకరు ఆప్యాయత కురిపించుకున్నారు. తాజాగా తమ పేరెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది వారి కూతురు అరుణ. ఆమె మాట్లాడుతూ.. 'విడాకుల తర్వాత కూడా అమ్మానాన్న ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అందుకు ఓ ఉదాహరణ చెప్తా.. 2010లో నాన్నకు యాక్సిడెంట్ అయింది. నా సోదరుడు ఫోన్ చేసి చెప్తే ప్రాంక్ కాల్ అనుకున్నాను. కానీ ఉదయానికల్లా అది బ్రేకింగ్ న్యూస్లో వచ్చింది. ఎప్పుడూ నాన్న గురించి అడిగేది! అది చూసి అమ్మ ఎంతో ఏడ్చింది. తనకు ఏయే అలర్జీలు ఉన్నాయి, ఏంటనేది అమ్మకే తెలుసు. అప్పట్లో అమ్మ సీరియల్స్తో చాలా బిజీగా ఉండేది. ప్రతిరోజు మేము ఆస్పత్రికి వెళ్లి రావడం, నాన్న కోలుకుంటున్న ఫోటోలను అమ్మకు చూపించడం.. ఇదే జరిగేది. నాన్న తింటున్నాడా? లేదా? అని అడిగి తెలుసుకునేది. వారి మధ్య అంత ఆప్యాయత ఉంది. అమ్మ కొట్టినప్పుడు నాన్న పట్టించుకునేవాడు కాదు. అలాగే నాన్న కొట్టినప్పుడు అమ్మ కూడా చూసీచూడనట్లుగానే వ్యవహరించేది. ఇద్దరూ కొట్టేవారు కొట్టేంతవరకు వచ్చిందంటే కచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని ఇద్దరూ బలంగా నమ్మేవారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా నాన్న కొట్టాడు. ఎవరో బంధువులు వచ్చినప్పుడు లేచి పలకరించలేదని దండించాడు. అమ్మానాన్న విడాకులు తీసుకున్న తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ విషయం ఇంటికి వెళ్లి మా అమ్మకు చెప్తే నువ్వేదో తప్పు చేసుంటావు. అందుకే కొట్టాడని లైట్ తీసుకుంది. అలా ఇద్దరూ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కానీ ఒంటరి తల్లిగా తను ఎన్నో సమస్యలు ఎదుర్కొంది' అని చెప్పుకొచ్చింది అరుణ. చదవండి: అక్కడ హను-మాన్ సినిమా ప్రదర్శించడం లేదట! డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన.. -
పదేళ్ల తర్వాత వెలుగులోకి.. ఎవరీ నళిని.. అసలు ఆమె కథేంటి?
సాక్షి, యాదాద్రి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఉద్యమకారులపై లాఠీ ఝుళిపించలేక తన ఉద్యోగానికి రాజీనామా చేసిన మాజీ డీఎస్పీ దోమకొండ నళిని చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని ఆమె కలిశారు. భువనగిరికి చెందిన నళిని తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2009లో తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ఆ పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నళిని అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమెకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు పెట్టా రు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని త్యాగం చేసిన నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ఇటీవల జరిగిన పోలీసు శాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరే దైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని చెప్పారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నళిని కలిశారు. కుటుంబ నేపథ్యం ఇదీ.. భువనగిరికి చెందిన దోమకొండ సత్యనారాయణ, సత్యవతి దంపతుల కూతురు నళినికి డిగ్రీ మొదటి చదువుతున్న సమయంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన నరేందర్తో వివాహం జరిగింది. సంతానం అయిన తరువాత కూడా నళిని చదువు కొనసాగించారు. ఫార్మసీలో డిప్లొమా పూర్తి చేసి కాకతీయ యూనివర్సిటీ నుంచి బీఎడ్ కూడా చేశారు. గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షలు రాశారు. గ్రూప్ –2కు ఎంపిక కావడంతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరారు. 2007లో గ్రూప్–1 రావడంతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అదే ఏడాది జూన్ 1న డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీ శిక్షణ పూర్తయ్యాక హసన్పర్తి, హన్మకొండలో ప్రొబేషనరీ డీఎస్పీగా పనిచేశారు. మొదటి పోస్టింగ్ కరీంనగర్లో ఇచ్చినప్పటికీ, తర్వాత ఆర్డర్ను అప్పటి ప్రభుత్వం మార్చి మెదక్ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది. 2009 డిసెంబర్9న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంపై అప్పట్లో జరిగిన అణచివేత, ఉద్యమకారులపై దాడులకు వ్యతిరేకంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. డీఎస్పీ స్థాయి అధికారి ఉద్యోగానికి రాజీనామా చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. అదే రోజు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైనట్లుగా అప్పటి కేంద్రం ప్రకటించింది. ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటికీ, అప్పట్లో ప్రభుత్వం దాన్ని ఆమోదించ లేదు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ నళిని 2009 డిసెంబర్ 24న 19 పేజీల లేఖను సోనియాగాంధీకి రాశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లుగా కేంద్రం ప్రకటనతో అప్పట్లో కొందరు ఉద్యమకారులు తిరిగి ఆమెను విధుల్లో చేరాలని ఒత్తిడి తేవడంతో రాజీనామా వెనక్కి తీసుకుంటూ లెటర్ ఇచ్చారు. ప్రభుత్వం కూడా తిరిగి విధుల్లోకి తీసుకుంది. రెండోసారి రాజీనామా.. ఎన్నికల్లో పోటీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం కావడంతో నళిని 2011 నవంబరు 1న మరోసారి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహించారు. ఢిల్లీలో దీక్ష చేస్తానని ప్రకటించడంతో ప్రభుత్వం నళిని రాజీనామా ఆమోదించకుండా, డిసెంబరు 4న విధులనుంచి తొలగించింది. 2011 డిసెంబరు 9న తెలంగాణ ఇవ్వాలని, ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్షకు దిగడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. తెలంగాణవాదుల వినతి మేరకు దీక్ష విరమించారు. ఆ తర్వాత తెలంగాణ నళిని క్రాంతిసేన ఏర్పాటు చేశారు. 2012లో పరకాల ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం అదే ఏడాది నవంబరు 1న బీజేపీలో చేరినప్పటికీ ఆమె రాజకీయాల్లో చురుకుగా లేరు. -
నా మనోవ్యధను అర్థం చేసుకున్నారు: మాజీ డీఎస్పీ నళిని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో.. తన డీఎస్పీ పదవికి దూరమై వార్తల్లోకి ఎక్కారు నళిని. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆమె పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యమకారులకు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందని.. ఆమె కోరుకుంటే అదే ఉద్యోగం కుదరకుంటే వేరే ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి సీఎస్ను ఆదేశించారు కూడా. ఈ తరుణంలో.. శనివారం ఆమె రేవంత్రెడ్డిని కలిశారు. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనను ఆమె ఇదివరకే తిరస్కరించారు. తనకు ఉద్యోగంలో ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేవలం మర్యాదపూర్వక భేటీ జరిగిందంతే. గత సమీక్షలో తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అధికారులు సమాచారం అందించగా ఆమె సీఎం రేవంత్ను ఇవాళ కలిశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డిని కలువడం సంతోషంగా ఉంది. ఉద్యోగం ఇప్పుడు నాకు అవసరం లేదు. డబ్బు, భౌతిక ప్రపంచం నుండి బయట పడ్డాను. ఇప్పుడు నాది ఆధ్యాత్మిక మార్గం. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను.. సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వేదం , యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నా. సనాతన ధర్మం ప్రచారం చేస్తా. గతంలో నేను, సహఉద్యోగులు డిపార్ట్ మెంట్లో ఎదుర్కొన్న సమస్య పై సీఎంకు రిపోర్ట్ ఇచ్చాను. నాలాగా ఎవరు భాద పడవద్దన్నదే నా అభిప్రాయం. అప్పుడే నాకు బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయింది. అందుకే ఆధ్యాత్మిక బాట ఎంచుకున్నా. నా విషయంలో జరిగిన అన్ని పరిణామాలు సీఎం దృష్టికి తీసుకెళ్లా. ఇప్పుడు నా మనసుకు నచ్చినట్లు సేవ చేస్తున్నా. ఇన్నాళ్ల నా మనోవ్యధను గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి.. సీఎం రేవంత్కు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారామె. -
నేను ఏ ఉద్యోగం చేయలేను
సాక్షి, హైదరాబాద్: తాను ఇప్పుడు ఏ ఉద్యోగం చేసే స్థితిలో లేనని, తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని మాజీ డీఎస్పీ నళినీ చెప్పారు. తెలంగాణ ఉద్యమం తర్వాత 12 ఏళ్లకు తెలంగాణ మూలాలున్న సీఎంగా రేవంత్రెడ్డి ఇన్నాళ్లకు తన పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ఫేస్బుక్లో బహిరంగ లేఖను పోస్ట్ చేశారు. కొద్దిరోజులుగా మీడియా మిత్రులు తన ప్రతిస్పందన తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ఫేస్బుక్లో బహిరంగ లేఖ పెడుతున్నానని చెప్పారు. తన లేఖ చివరిలో డి.నళినీ ఆచార్య, యజ్ఞ బ్రహ్మ, వేద ప్రచారకురాలు అని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో బతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నది నిరూపితమైంది. గతం ఒక రీల్ మాదిరి నా కళ్ల ముందు కదులుతోంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా ‘సోషల్ స్టిగ్మా (కళంకం)’ను మోశాను. నన్ను ఆనాటి ప్రభుత్వం మూ డేళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. క్షణక్షణం ఒక గండంలా గడిచింది’అని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో ప్రజలకు దగ్గరైనా.. తన బంధుమిత్ర పరివారమంతా వెలివేసిందని, పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయి జీవచ్ఛవంలా బతికానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దేవుడు నన్ను క్రిమినాలజీ (నేర శాస్త్రం) నుంచి ఫిలాసఫీ (వేదాంతం) వైపు నడిపించాడు. రెండేళ్ల క్రితం నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. మీరు (సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి) రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ను నేను స్వతంత్రంగా ఉంటూనే వేద, యజ్ఞ, ధారి్మక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను’అని పేర్కొన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలా లైన ’వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నానని, అందువల్ల సీఎం రేవంత్రెడ్డిని కలవలేకపోతున్నట్టు నళినీ చెప్పారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019