breaking news
-
ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!
ఓటీటీల్లో బోర్ కొట్టని జానర్ అంటే థ్రిల్లరే. మిగతా సినిమాల సంగతేమో గానీ థ్రిల్లర్స్ ని థియేటర్లలో కంటే సింగిల్ గా ఇంట్లోనే చూడటం బెస్ట్ అని చెప్పొచ్చు. అలా హాలీవుడ్ లో 2014లోనే వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ 'ప్రీ డెస్టినేషన్'. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నిజంగా అంత బాగుందా? ఏంటనేది డీటైల్డ్ గా చూద్దాం. (ఇదీ చదవండి: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ) 'ప్రీ డెస్టినేషన్' విషయానికొస్తే.. ఈ సినిమాలో బేబీ జేన్, జేన్, జాన్, బార్ కీప్, ఫిజిల్ బాంబర్ అని ఐదు పాత్రలు ఉంటాయి. 1945-1992 మధ్య కాలంలో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అసలు వీళ్ల ఐదుగురికి కనెక్షన్ ఏంటి? చివరకు ఏమైందనేదే అసలు కథ. కొన్ని సినిమాలు చూడటానికి చాలా సాధారణంగా ఉంటాయి. 40 నిమిషాలు అయ్యేవరకు 'ప్రీ డెస్టినేషన్' కూడా అలానే అనిపిస్తుంది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ ఐదు పాత్రలకు సంబంధించిన డీటైల్స్ అన్ని ప్రేక్షకుల అర్థమైన దగ్గర నుంచి థ్రిల్ కలిగిస్తుంది. ఐదు పాత్రలు టైమ్ ట్రావెలింగ్ చేస్తుంటే.. చూస్తున్న మనకు సరికొత్త అనుభూతి, థ్రిల్ అనిపిస్తుంది. ఇక్కడ నిజంగా టైమ్ ట్రావెల్ అనేది సాధ్యమా కాదా అనేది పక్కనబెట్టి చూస్తే మాత్రం మూవీ నచ్చేస్తుంది. ఇంతకంటే ఒక్క విషయం ఎక్కువ చెప్పినా సరే మళ్లీ కథ లీక్ చేసి, మేమే మీకు స్పాయిలర్స్ ఇచ్చేసినట్లు అయిపోద్ది! (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య) 'ప్రీ డెస్టినేషన్' సినిమాని గ్రేటెస్ట్ అని చెప్పలేం కానీ డిఫరెంట్ మూవీస్ అంటే ఇష్టపడే మూవీ లవర్స్ కచ్చితంగా మిస్సవకుండా చూడాల్సిన మూవీ. 2014లోనే రిలీజైన ఈ చిత్రం హాలీవుడ్ ఆడియెన్స్ కి తెగ నచ్చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత గ్లోబల్ ఆడియెన్స్ కి మరింత చేరువైంది. ఇదే మూవీ కథని స్ఫూర్తిగా తీసుకుని తెలుగులో పలు సినిమాలు తీయడం విశేషం. అవేంటో చెబితే మళ్లీ స్టోరీ చెప్పిసినట్లు అవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్.. ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత 'అత్తారింటికి దారేది' సినిమాలోని ఫేమస్ డైలాగ్ కచ్చితంగా గుర్తొస్తుంది. అదేంటనేది 'ప్రీ డెస్టినేషన్' చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కేవలం 97 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాని అలా మొదలుపెడితే ఇలా ముగించేయొచ్చు. మరి ఇంకెందుకు లేటు త్వరగా చూసేయండి. (ఇదీ చదవండి: ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!) -
Love Guru Review: విజయ్ ఆంటోనీ 'లవ్ గురు'.. ఎలా ఉందంటే?
వైవిధ్య పాత్రలను పోషిస్తూ అటు కోలీవుడ్లో, ఇటు టాలీవుడ్లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చిత్రం ‘లవ్ గురు’. ఆయన నటించిన తొలి రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘లవ్ గురు’ కథేంటంటే.. ఆర్థిక సమస్యల కారణంగా మలేసియా వెళ్లిన అరవింద్(విజయ్ ఆంటోని) కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. అప్పటికే ఆయనకు 35 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. డబ్బు సంపాదనలో పడి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. ఇప్పటికైనా ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పాలని సొంతూరు సింహాచలం వెళ్తాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా ఓసారి చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల(మృణాళిని రవి) చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ తల్లిదండ్రులు.. లీల తండ్రితో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తారు. లీలకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీమ్. కానీ ఆమె తండ్రికి కూతురు నటిగా మారడం ఇష్టం ఉండదు. బలవంతంగా అరవింద్తో పెళ్లికి ఒప్పిస్తాడు. పెళ్లైన మరుసటి రోజు అరవింద్కు ఈ విషయం తెలుస్తుంది. హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత అరవింద్ను దూరం పెడుతుంది లీల. విడాకులు తీసుకుందామని చెబుతుంది. లీల డ్రీమ్ గురించి తెలిసిన తర్వాత ఆమెపై మరింత ప్రేమను పెంచుకుంటాడు అరవింద్. ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? భార్య ప్రేమను పొందడానికి అరవింద్ ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న గతమేంటి? లీలా జీవితంలోకి వచ్చిన విక్రమ్ ఎవరు? జనని ఎవరు? ఆమెకు అరవింద్కు ఉన్న సంబంధం ఏంటి? నిప్పు అంటే అరవింద్కు ఎందుకు భయం? హీరోయిన్ కావాలనే లీల కల నెరవేరిందా లేదా? చివరకు వీరిద్దరు విడిపోయారా? లేదా దగ్గరయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విజయ్ ఆంటోని సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఓ మంచి సందేశం ఉంటుంది. ‘లవ్ గురు’ కూడా అదే తరహా కథ. ఓ మహిళ కలకు పెళ్లి అడ్డం కాకూడదని, మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే అసలైన ప్రేమ అనే ఓ సందేశాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది ఇందులో కొత్తదనమేమి ఉండడు. హీరోతో పెళ్లి హీరోయిన్కి ఇష్టం ఉండడు. పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుంటారు. ఆమె ప్రేమను పొందడానికి హీరో రకరకాల ప్రయత్నం చేస్తాడు. చివరకు ఒక్కటవుతారు.. ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. కానీ వినోదాత్మకంగా కథనాన్ని సాగించడం లవ్గురు ప్రత్యేకత. కేలవం భార్యభర్తల రిలేషన్ని మాత్రమే కాకుండా సిస్టర్ సెంటిమెంట్ని కూడా జోడించడం ఈ సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. హీరోహీరోయిన్ల పాత్రలతో చాలా మంది కనెక్ట్ అవుతారు. జీవిత భాగస్వామిని ఎలా ప్రేమించాలి అనేది ఈ సినిమాలో చూపించారు. అరవింద్ని ఓ పీడకల వెంటాడే సీన్తో కథ ప్రారంభం అవుతుంది. మలేసియా నుంచి ఇండియాకు తిరిగి రావడం.. చావు ఇంటిలో లీలను చూసి ఇష్టపడడం.. పెళ్లి చేసుకొని హైదరాబాద్కు మకాం మార్చడం వరకు కథనం సింపుల్గా సాగుతుంది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత లీల స్నేహితులు చేసే హంగామ నవ్వులు పూయిస్తాయి. అలాగే విజయ్ ఆంటోనికి.. వీటీవీ గణేష్ మధ్య జరిగే సంభాషణ కూడా వినోదాన్ని పంచతుంది. యోగిబాబు ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. భార్య ప్రేమను గెలుచుకోవడం కోసం హీరో చేసే పని షారుక్ ‘రబ్ నే బనా ది జోడి’ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ఎమోషనల్గా సాగుతుంది. సినిమా అంటూ లీల ప్రెండ్స్ చేసే హంగామా బోర్ కొట్టిస్తుంది. అరవింద్ ప్లాష్బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. అరవింద్గా విజయ్ ఆంటోనీ తన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో తనదైన హావాభావాలతో మెప్పించారు. లీల పాత్రలో మృణాళిని రవి మెప్పించింది. తన అందంతో తెరపై ఆకట్టుకుంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
‘కలియుగం పట్టణంలో’ మూవీ రివ్యూ
టైటిల్: కలియుగం పట్టణంలో నటీనటులు: విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్, దేవీ ప్రసాద్, రూప లక్ష్మీ నిర్మాణ సంస్థ:నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ నిర్మాతలు: డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ రచన-దర్శకత్వం: రమాకాంత్ రెడ్డి సంగీతం: అజయ్ సినిమాటోగ్రఫీ: చరణ్ విడుదల తేది: మార్చి 29, 2024 కథేంటంటే.. నంద్యాలకు చెందిన మోహన్(దేవీ ప్రసాద్), కల్పన(రూప లక్ష్మీ) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. పేర్లు విజయ్(విశ్వ కార్తికేయ), సాగర్(విశ్వ కార్తికేయ). వీరిద్దరిలో సాగర్కి చిన్నప్పటి నుంచే ఓ సైకాలజీకల్ ప్రాబ్లం ఉంటుంది. రక్త చూసి ఆనందపడుతుంటాడు. తన సైకో ప్రవర్తన చూసి భయపడిపోయిన మోహన్..అతన్ని మెంటల్ ఆస్పత్రిలో జాయిన్ చేస్తాడు. విజయ్ మాత్రం చక్కగా చదువుకుంటుంటాడు. కాలేజీలో శ్రావణి(ఆయుషి పటేల్) అతన్ని ఇష్టపడుతుంది. కానీ ఆ విషయాన్ని మూడేళ్ల పాటుగా విజయ్తో చెప్పలేకపోతుంది. మరోవైపు నంద్యాలలో వరుస హత్యలతో పాటు ఆడపిల్లలు బయటకు చెప్పుకోలేని ఘోరాలు జరుగుతుంటాయి. వాటి వెనుక ఉన్నదెవరో కనిపెట్టేందుకు పోలీస్ అధికారి (చిత్రా శుక్లా) నంద్యాలకు వస్తుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతున్న దుండగులను చంపుతున్నదెవరు? హత్యలతో పాటు అక్కడ జరుగుతున్న మరో ఘోరం ఏంటి? సాగర్, విజయ్లలో ఎవరు మంచి వారు? నంద్యాలలో జరిగే ఘోరాలకు వీరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు పోలీసులు నంద్యాల క్రైంకి ఎలా చెక్ పెట్టారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తల్లిదండ్రులు పెంచే తీరుతోనే పిల్లలు ఎదుగుతారు. పెంపకం వల్లే పిల్లలు మంచివారుగా, చెడ్డవారుగా తయారవుతారు.ప్రతీ మనిషిలో సైకిక్ ఫీలింగ్ ఉంటుంది. కానీ తల్లిదండ్రుల పెంపకం వల్లే అది తగ్గుతుంది. ఇదే విషయాన్ని ‘కలియుగం పట్టణంలో’ చూపించాడు దర్శకుడు రమాకాంత్ రెడ్డి. దర్శకుడు ఓ మంచి పాయింట్ని ఎంచుకొని దాని చుట్టు ఆసక్తికరమైన కథను అల్లుకున్నాడు. ప్రతీ ఒక్క పాత్రకు డిఫరెంట్ షేడ్స్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కానీ తెరపై తాను అనుకున్నది అనుకున్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. సంబంధం సీన్లను చూపిస్తూ.. ఫస్టాఫ్ అంతా ప్రశ్నలు, చిక్కుముల్లతోనే సాగించాడు. నిజంగా నంద్యాలలో ఏం జరుగుతుంది? అనేది ప్రేక్షకుడికి కూడా ఫస్టాఫ్లో తెలియదు. ప్రతి పాత్రపై అనుమానం కలిగిస్తూ.. సెకండాఫ్పై ఆసక్తికలిగించేలా చేశాడు. ఫస్టాఫ్లోని ప్రశ్నలన్నింటికి సెకండాఫ్లో సమాధానం దొరుకుతుంది. ట్విస్టుల ఒక్కోటి రీవీల్ అవుతుంటే ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. క్లైమాక్స్ ట్విస్టులు, రెండో పార్ట్ కోసం పెట్టుకున్న కథ బాగుంది. స్క్రీన్ప్లేను ఇంకాస్త బలంగా రాసుకొని, పేరున్న నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. విజయ్, సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ చక్కగా నటించాడు. రెండు విభిన్న పాత్రలో కనిపించిన రామ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు.ఆయుషి పటేల్ కి ఇది తొలి సినిమానే అయినా చక్కగా నటించింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. పోలీసు అధికారిణిగా చిత్రా శుక్లా తొలిసారి డిఫరెంట్ రోల్ ప్లే చేసి ఆకట్టుకుంది. ఇక నరేన్ తన పాత్రలో అద్భుతంగా నటించేశాడు. దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్ల ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి. టెక్నికల్ గా కలియుగం పట్టణంలో మెప్పిస్తుంది. అజయ్ పాటలు, అర్ అర్ సినిమాకి ప్లస్. చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. ఆలోచింపజేస్తాయి. నిర్మాణ పరంగా సినిమా బాగుంటుంది. లైవ్ లొకేషన్స్ వల్ల ఫ్రేమ్స్ అన్నీ కూడా ఎంతో సహజంగా అనిపిస్తాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని అర్థం అవుతోంది. -
Tantra Review: 'తంత్ర' సినిమా రివ్యూ
ఏ భాష తీసుకున్నా సరే హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సరిగ్గా తీయాలే గానీ హిట్ కొట్టడం పక్కా. ఈ మధ్య కాలంలో 'మసూద', 'విరూపాక్ష', 'మా ఊరి పొలిమేర' తదితర చిత్రాలు ఇలాంటి కథలతో వచ్చి అందర్ని భయపెట్టాయి. ఇప్పుడు అలాంటి కథతో తీసిన మూవీ 'తంత్ర'. ట్రైలర్తోనే అంచనాలు పెంచిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. అనన్య నాగళ్ల భయపెట్టిందా? హిట్ కొట్టిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథేంటంటే? రేఖ(అనన్య నాగళ్ల)కు దెయ్యాలు కనిపిస్తుంటాయి. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో నాన్న సంరక్షణలో పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన తేజూ (ధనుష్ రఘుముద్రి)ని ఇష్టపడుతుంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఈ కథలో విగత ('టెంపర్' వంశీ), రాజేశ్వరి (సలోని) ఎవరు? వీళ్లకు రేఖకు సంబంధం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఎలా ఉందంటే? హారర్ సినిమాల్లో లాజిక్స్ ఉన్నా లేకున్నా పర్వాలేదు. భయపెట్టే, వణుకు పుట్టించే సీన్స్ కచ్చితంగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. 'తంత్ర' విషయంలో అదే జరిగింది. స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే మంచి పాయింట్. హారర్ కథకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ దాన్ని సినిమాగా తీసే విషయంలో పూర్తిగా తడబడ్డారు. చూస్తున్నంత సేపు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సరికదా బోర్ కొడుతుంది. 'తంత్ర' సినిమాలో రక్త దాహం, పాతాళ కుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, చిన్నామస్తా దేవి.. అని ఆరు భాగాలు ఉంటాయి. అయితే వాటివల్ల పెద్దగా ప్లస్ కాలేదు. ఈ పేర్లు లేకుండా కథ చెప్పినా సరే ఇబ్బంది ఏం ఉండేది కాదు. తాంత్రిక విద్యలు, క్షుద్ర పూజలు లాంటి వాటి గురించి ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు. భయపెడితే చాలు. కానీ దర్శకుడు.. వాటి గురించి ఒక్కోటి వివరించుకుంటూ వెళ్లడం సాగదీతగా అనిపించింది. దీంతో 'తంత్ర'.. సీరియల్ కంటే స్లోగా సాగింది. సాధారణంగా హారర్ సినిమాలు అంటే ఇంట్రెస్టింగ్ అనిపించే ఓ సీన్తో మొదలవుతాయి. 'తంత్ర'లో అలాంటిదేం లేకుండా చాలా ఫ్లాట్గా స్టోరీ వెళ్తుంది. సెకండాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే విసుగు తెప్పిస్తుంది. 'మా సినిమాకు పిల్ల బచ్చాలు రావొద్దు' అని.. మూవీ రిలీజ్కి కొన్నిరోజుల ముందు హడావుడి చేశారు. కాకపోతే ఒకటి రెండు సీన్లు తప్పితే పెద్దగా హారర్ ఎఫెక్ట్ అనిపించే సినిమా అయితే ఇది కాదు. ఎవరెలా చేశారు? రేఖగా ప్రధాన పాత్ర చేసిన అనన్య నాగళ్ల ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అయితే ఈమెకి తగ్గ సీన్స్ పడలేదు. క్లైమాక్స్లో కాస్త స్కోప్ దక్కింది. తేజూగా చేసిన ధనుష్ రఘుముద్రి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కాకపోతే ఇంకా ఇంప్రూవ్ కావాలి. రాజేశ్వరిగా ప్రత్యేక పాత్ర చేసిన సలోని.. ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసింది. ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. కానీ ఆ పాత్రని ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. మిగతా పాత్రధారులు తమ ఫరిది మేరకు నటించారు. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాతలో విషయం ఉంది. కాకపోతే పేపర్ మీద రాసుకున్నది స్క్రీన్పైకి తీసుకొచ్చేసరికి అనుభవలేమి కనిపించింది. క్షుద్రపూజాల నేపథ్యంలో క్యూరియసిటీ పాయింట్ రాసుకున్నప్పటికీ.. తీసే విషయంలో తడబడ్డారు. సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్.. పాటలు, నేపథ్య సంగీతం పెద్దగా ఎలివేట్ చేయలేకపోయాయి. అలా అని పూర్తి బాగోలేవని కూడా కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఓవరాల్గా చెప్పుకొంటే 'తంత్ర'.. ప్రేక్షకుల్ని భయపెట్టలేకపోయింది. -
ఇంతలా ఎప్పుడు నవ్వుకున్నానో గుర్తులేదు: మహేశ్ బాబు
సూపర్స్టార్ మహేశ్ బాబు తన సినిమాల గురించి కంటే కానీ కొన్నిసార్లు కొత్త లేదంటే చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తుంటాడు. తనే స్వయంగా వెళ్లి, చూసి రివ్యూలు ఇస్తుంటాడు. గతంలో పలు తెలుగు చిత్రాల విషయంలో ఇలా చేశాడు. ఇప్పుడు ఓ మలయాళ డబ్బింగ్ చిత్రానికి తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్తో తీసిన సినిమా 'ప్రేమలు'. గత నెలలో మలయాళంలో రిలీజ్ కాగా.. శివరాత్రి కానుకగా మార్చ 8న తెలుగు డబ్బింగ్ విడుదల చేశారు. దీన్ని స్టార్ డైరెక్టర్ కొడుకు కార్తికేయ.. తెలుగులోకి తీసుకొచ్చాడు. యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తీసిన ఈ చిత్రానికి మన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో సక్సెస్ మీట్ కూడా పెట్టారు. (ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఇప్పుడు ఈ సినిమాని మహేశ్ బాబు చూశారు. తనదైన స్టైల్లో ఎలా ఉందో చెప్పేశారు. ''ప్రేమలు'ని తెలుగులోకి తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ కార్తికేయ. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నాం. గతంలో ఎప్పుడూ ఇంతలా నవ్వుకున్నానో గుర్తులేదు. నాకే కాదు మా ఫ్యామిలీ అందరికీ ఈ మూవీ నచ్చింది. అందరూ టాప్ క్లాస్ యాక్టింగ్ చేశారు. చిత్రబృందానికి కంగ్రాచ్యులేషన్స్' అని మహేశ్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. సంక్రాంతికి 'గుంటూరు కారం'తో వచ్చిన మహేశ్.. కలెక్షన్స్ అయితే సాధించాడు. సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చలేదు. ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మేలో లాంచ్ ఉంటుందని, వచ్చే ఏడాది నుంచి షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: బ్లాక్ బస్టర్ సినిమా పరువు తీసిన ప్రముఖ రచయిత) Thank you @ssk1122 for bringing #Premalu to the Telugu audience... Thoroughly enjoyed it…. Can't remember the last time when I laughed so much while watching a film… The entire family loved it 😁 Top class acting by all the youngsters 🤗🤗🤗Congratulations to the entire team!! — Mahesh Babu (@urstrulyMahesh) March 12, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019