breaking news
-
లోక్సభ పోలింగ్ : తమిళనాడులో ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)
-
సెల్ఫీ తీసుకుంటే జీఎస్టీ వేస్తారేమో?: ఎంకే స్టాలిన్
చెన్నై: ఎన్డీఏ, ఇండియా కూటమి త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపు సాధించడమే లక్ష్యంగా పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జీఎస్టీని పేదల 'దోపిడీ'గా అభివర్ణించి కీలక వ్యాఖ్యలు చేశారు. హోటల్ నుంచి టూ వీలర్ రిపేర్ వరకు అన్నింటిపైనా జీఎస్టీ? ఒక మధ్యతరగతి కుటుంబం ఎంజాయ్ చేయడానికి హోటల్కి వెళితే బిల్లులో జీఎస్టీని చూసి 'గబ్బర్ సింగ్ టాక్స్' అని బాధపడుతున్నారు. భవిష్యత్తులో సెల్ఫీ తీసుకున్నా జీఎస్టీ పడుతుందా? అని తన ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రశ్నించారు. 1.45 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను మాఫీ బీజేపీ పేదల పట్ల కరుణ చూపలేదా? మొత్తం జీఎస్టీలో 64 శాతం అట్టడుగువర్గాల నుంచి సమకూరుతోంది. 33 శాతం మధ్యతరగతి ప్రజల నుంచి, కేవలం 3 శాతం సంపన్నుల నుంచి జీఎస్టీ సమకూరుతోందని ఎంకే స్టాలిన్ అన్నారు. పేదలను దోపిడీ చేసే ఈ వ్యవస్థను మార్చాలంటే #Vote4INDIA! అంటూ ట్వీట్ చేశారు. GST: வரி அல்ல… வழிப்பறி! “தன் பிணத்தின் மீதுதான் ஜி.எஸ்.டி.யை அமல்படுத்த முடியும்” என்று முதலமைச்சராக எதிர்த்த திரு. நரேந்திர மோடி, பிரதமரானதும், “ஜி.எஸ்.டி பொருளாதாரச் சுதந்திரம்’’ என்று ‘ஒரே நாடு ஒரே வரி’ கொண்டு வந்தார். பேச நா இரண்டுடையாய் போற்றி! ஹோட்டல் முதல் டூ வீலர்… pic.twitter.com/Nnk1YTMw3q — M.K.Stalin (@mkstalin) April 15, 2024 -
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
సీఎం జగన్పై దాడి.. స్పందించిన స్టాలిన్, కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్నగర్కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్పై దాడి జరిగింది. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, సీఎం జగన్పై దాడి ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్..‘జగన్ అన్నా జాగ్రత్తలు తీసుకోండి. మీరు సురక్షితంగా ఉన్నారు సంతోషం. సీఎం జగన్పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఎన్నికల సంఘం ద్వారా కఠినమైన చర్యలు చేపట్టాలని నేను ఆశిస్తున్నాను’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. Glad you are Safe. Take care @ysjagan Anna Strongly condemn the attack on AP CM Jaganmohan Reddy Garu. Violence has no place in democracy and I hope strict preventive measures are put in place by ECI pic.twitter.com/fTBTe17I2T — KTR (@KTRBRS) April 13, 2024 మరోవైపు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘సీఎం జగన్పై దాడి హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు’ అని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం జగన్పై దాడిని ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సభ్యత, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. I condemn the stone-throwing on Hon'ble Andhra Pradesh CM Thiru @ysjagan. Political differences should never escalate to violence. Let's uphold civility and mutual respect as we engage in the democratic process. Wishing him a quick recovery. https://t.co/YtYoOJbVy1 — M.K.Stalin (@mkstalin) April 13, 2024 -
Rahul Gandhi: సీఎం స్టాలిన్ను సర్ప్రైజ్ చేసిన రాహుల్
చెన్నై: దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారమే కనిపిస్తోంది. దీంతో, నేతలు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇండియా కూటమి ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ తమిళనాడుకు వచ్చారు. ఈ సందర్భంగా కోయంబత్తూరులో కూటమి మీటింగ్కు వెళ్లాల్సి ఉండగా.. రాహుల్ ఆశ్చర్యకంగా సింగనల్లూరులోని ఒక స్వీట్ షాప్లోకి వెళ్లి వారిని సర్ప్రైజ్ చేశారు. రాహుల్ ఆ షాప్లోకి వెళ్లడంతో అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం.. అక్కడే స్వీట్స్ తిన్న రాహుల్ దుకాణదారుడు, అక్కడ పనిచేసే వారితో మాట్లాడి ఫొటోలు దిగారు. ఈ క్రమంలో రాహుల్ ఒక కిలో మైసూర్పాక్ కొనుగోలు చేశారు. #RahulGandhi = Wholesome😍🥹🫶✨#RahulGandhiHopeOfIndia #RahulGandhiVoiceOfIndia pic.twitter.com/WYIdihesuw — Kanimozhi Manoharan (@Kaniiii___) April 12, 2024 అయితే, తాను కొనుగోలు చేసిన స్వీట్స్ ప్యాకెట్ ఎవరి కోసమా అని కాంగ్రెస్ నేతలు ఆలోచన పడ్డారు. అనంతరం, కూటమి తలపెట్టిన సభ వద్దకు వెళ్లిన రాహుల్.. ఆ మైసూర్పాక్ స్వీట్ ప్యాకెట్ను తమిళనాడు సీఎం స్టాలిన్కు అందించారు. ఈ సందర్బంగా తన కోసం స్వీట్స్ తేవడంతో స్టాలిన్ ఒకింత ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019