breaking news
-
అండగా ఉంటా.. ఆదుకుంటా
మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్ జగన్ గురువారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్లో కొద్దిసేపు ఆగి ప్రజలతో మమేకమయ్యారు. తనను కలిసిన పలువురు అనారోగ్య బాధితులకు ‘నేనున్నానంటూ’ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. అర్జీలు స్వీకరించారు. అండగా ఉంటానంటూ కన్నీళ్లు తుడిచారు. వారంతా సంతోషంతో సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియచేశారు. –కొత్తపేట/రావులపాలెం జగనన్న న్యాయం చేస్తానన్నారు.. గతేడాది దీపావళి సమయంలో బాణసంచా పేలి నా కుమారుడు వినోద్ కుమార్ కుడిచేతికి తీవ్ర గాయమైంది. మణికట్టు వరకు తొలగించారు. కృత్రిమ చేయి పెట్టించేందుకు అవసరమైన సాయం కోసం ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ద్వారా జగనన్నను కలిశాను. నా బాధ విన్న జగనన్న తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పారు. ఈ ఐదేళ్లలో ఆయన అమలు చేసిన పథకాల ద్వారా రూ.4.75 లక్షలు లబ్ధి పొందాం. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – పువ్వల చినబాబు, జార్జిపేట, తాళ్లరేవు మండలం అడగకుండానే.. నా కాలికి ఆపరేషన్ చేయిస్తానన్నారు మా కుటుంబానికి సీఎం జగన్ మరో దేవుడు. ఆయన వస్తున్నారని తెలిసి చూద్దామని వచ్చాను. కానీ ఆయన్ని కలిసి మాట్లాడే అదృష్టం దక్కింది. నా పోలియో కాలును చూసిన జగనన్న.. ‘ఏమ్మా ఆపరేషన్ చేయించుకోలేదా’ అని అడిగారు. ఇరవై ఏళ్ల క్రితం చేయించుకున్నాను సార్.. అయినా ప్రయోజనం లేదని చెప్పాను. దీంతో జగనన్న ఆపరేషన్ చేయిస్తానని మాట ఇచ్చారు. అడగకుండానే అన్నీ ఇస్తున్న జగనన్నే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా. – మెరుగు పువ్వు శాంతి, గోపాలపురం, రావులపాలెం మండలం భరోసా దొరికింది.. నాకు గుండె సమస్య ఉంది. ఏడాది కిందట ఒకసారి, ఇటీవల మరోసారి గుండెపోటు రాగా.. కాకినాడ జీజీహెచ్లో చికిత్స చేయించుకొని నిన్ననే డిశ్చార్జ్ అయ్యాను. అయినా ఖరీదైన చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో సీఎం జగన్ను కలిసి నా బాధ చెప్పుకున్నాను. ఆయన ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. – మెర్ల చంద్రరావు, ర్యాలీ, ఆత్రేయపురం మండలం బస్సు ఆపి.. బాధలు తెలుసుకున్న సీఎం రాజమహేంద్రవరం రూరల్/రాజమహేంద్రవరం సిటీ: మేమంతా సిద్ధం బస్సుయాత్ర గురువారం రాత్రి రాజమహేంద్రవరం పరిధిలోని కాతేరులో కొనసాగుతుండగా రోడ్డు పక్కన కొందరు వైద్య సహాయం కోసం వేచి ఉన్నారు. వారిని చూసిన సీఎం జగన్ వెంటనే బస్సు ఆపించారు. ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఆరోగ్యశ్రీ ఇన్చార్జి హరికృష్ణను వారి వద్దకు పంపి వివరాలు సేకరించారు. కొంతమూరు అఫీషియల్ కాలనీకి చెందిన బడుగు నర్సశ్రీ తన కుమారుడు సోహిత్ శివకుమార్కు కంటి ఆపరేషన్ చేయించినప్పటికీ రెటీనా దెబ్బతినడంతో కంటి చూపుపోయిందన్నారు. కంటిచూపు వచ్చేలా చూడాలని విన్నవించింది. దేవీపట్నం మండలం చిన్నదేవరపేటకు చెందిన బుడ్డిగ శ్రీనివాస్ కీళ్లవాతంతో బాధపడుతున్నాడని అతడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు వైద్య సహాయం చేయాలని వేడుకుంది. రాజమహేంద్రవరంలోని తాడితోట జంక్షన్ వద్ద ఓ కుటుంబం తమ కుమారుడికి వైద్య సహాయం కోసం వేడుకుంది. బస్సులోంచి వారిని గమనించిన సీఎం జగన్ వెంటనే వారిని దగ్గరకు పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేటలో గల ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన గుర్తుర్తి శ్రీకాంత్ చిరు వ్యాపారి. రెండో కుమారుడు తారకరామ్ ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. అతడికి వైద్యం చేయించేందుకు సాయం చేయాలని వారు కోరారు. -
దేశమంతా ఏపీ వైపు చూస్తోంది
ప్రొద్దుటూరు క్రైం: రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణల వల్ల వైద్యరంగంలో గొప్ప మార్పులు వచ్చాయని, దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడీసీ) చైర్మన్ డాక్టర్ బి.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం ఐఎంఏ ఏపీ స్టేట్ జోన్–3 రీజినల్ అకడమిక్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్ట, జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులతో ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం చేరువైందని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపుల ద్వారా 50 రోజుల్లోనే 60 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదన్నారు. సీఎం నిర్ణయాలతో రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతమయ్యాయని చెప్పారు. రానున్న రోజుల్లో వైద్యం, ఆరోగ్యం విషయాల్లో మన రాష్ట్రం దేశానికి దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. గతంలో వైద్య రంగానికి సంబంధించి మన రాష్ట్రం కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల కంటే దిగువన ఉండేదని, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యల కారణంగా ఏపీ ముందు వరుసలో ఉందని చెప్పారు. ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణీందర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం సమీకృత వైద్యాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోందని, ఇది మంచిది కాదన్నారు. ఈ కాన్ఫరెన్స్లో భాగంగా పలువురు వైద్యులు చేసిన అరుదైన శస్త్రచికిత్సల గురించి వీడియో ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జీవీజీ మహేష్, డాక్టర్ త్యాగరాజరెడ్డి, డాక్టర్ ఇ.సాయిప్రసాద్, డాక్టర్ హేమలత, వసుధ, డాక్టర్ హరీ‹Ùకుమార్, అప్నా ప్రెసిడెంట్ డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
జపాన్ మెరుగైన ప్రత్యామ్నాయం
న్యూఢిల్లీ: కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల కోసం భారత్కు చైనా కంటే జపాన్ మెరుగైన ప్రత్యామ్నాయమని మెడికల్ టెక్నాలజీ అసోసియేష్ ఆఫ్ ఇండియా (ఎంటాయ్) పేర్కొంది. ఇతర దేశాల మాదిరే భారత్ సైతం తన మెడికల్ టెక్నాలజీ అవసరాల కోసం ప్రధానంగా అమెరికా, జపాన్, యూరప్, బ్రిటన్, చైనా, సింగపూర్ దేశాలపై ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేసింది. చైనా నుంచి మెడికల్ టెక్నాలజీ దిగుమతుల విలువ పెరుగుతుండడం ఆందోళనకరమని, ప్రాధాన్య ప్రాతిపదికన ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించింది కొన్ని రకాల వైద్య పరికరాలకు భారత్ తగినంత తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకుందని చెబుతూ.. క్లిష్టమైన సాంకేతికతతో కూడిన ఉపకరణాల కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు తెలియజేసింది. నాణ్యమైన, అత్యాధునిక వైద్య పరికరాల దిగుమతులు కష్టమేమీ కాబోదంటూ.. చైనా నుంచి ఈ తరహా ఉత్పత్తుల విలువ పెరగడం ఒక్కటే ఆందోళన కలిగిస్తున్నట్టు ఎంటాయ్ చెప్పింది. చైనా–భారత్ మధ్య గత మూడేళ్లుగా సరిహద్దు, ద్వైపాక్షిక విభేదాలు నెలకొనడం తెలిసిందే. అయినా కానీ కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల విలువ 2020–21లో 327 బిలియన్ డాలర్ల నుంచి 2021–22లో 515 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ‘‘వైద్య పరికరాలు, విడిభాగాల దిగుమతులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద పలు ప్రోత్సాహకాలను ఇప్పటికే ప్రకటించడం విలువైన చర్యే. కానీ, ఇది ఫలితాలను ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపు భారత్ అత్యవసరంగా చైనాకు ప్రత్యామ్నాయాలను చూడాలి’’అని ఎంటాయ్ చైర్మన్ పవన్ చౌదరి పేర్కొన్నారు. -
కనీసం 6 నెలలు బదిలీలు ఆపండి
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వైద్యుల బదిలీల సమయం ఇది కాదని, కనీసం ఆరు నెలలు బదిలీలు అపాలని ఏపీ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.శ్యామ్సుందర్ ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఓ హోటల్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. బదిలీల విషయమై పక్షం రోజులుగా ఎటువంటి ఆందోళనలు చేపట్టకుండా, రోడ్లెక్కి నిరసనలు చేయకుండా, శాంతియుతంగా ప్రజా ప్రతినిధులను కలిసి మొర పెట్టుకున్నా స్పందన రాలేదన్నారు. బదిలీల విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య సంఘాలతో చర్చించిన తర్వాతే బదిలీల విషయమై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశాఖ అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్యామ్సుందర్ ఆరోపించారు. కేజీహెచ్లో ఉన్న 300 మందికి పైగా వైద్యులు ఐదేళ్లు పైబడి ఉన్నారని, వారందరినీ ఒకేసారి బదిలీ చేస్తే వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఫలితంగా ప్రజల ప్రాణాలు పోవడమే గాక, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. అసోసియేషన్ విశాఖ అధ్యక్షుడు డాక్టర్ సుందరరాజు, కార్యదర్శి డాక్టర్ బి.రమేష్కుమార్ పాల్గొన్నారు. -
సకాలంలో ఆసుపత్రులకు రావాలి : మంత్రి హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యు లు సకాలంలో హాజరు కావాలని, నిర్ణీత సమయం వరకు ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య మంత్రిగా నియమితులైన ఆయన.. బుధవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సకాలంలో వైద్యులు రాకపోవడం, వచ్చినా నిర్ణీత సమయం వరకు ఉండకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో కరోనా కేసులు ఏ స్థాయిలో నమోదవుతు న్నాయి? థర్డ్వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ వస్తే అందుకు తీసుకునే చర్యల గురించి మంత్రి హరీశ్రావు అడిగి తెలుసుకున్నారని ఓ అధి కారి తెలిపారు. రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలోనే ఉందని, కేసులు తక్కువగానే నమోదవుతున్నాయని అధికారులు వివరించారు. థర్డ్వేవ్ వచ్చి నా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలోని 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో జాతీయ వైద్య కమిషనర్కు దరఖాస్తు చేసినట్లు మంత్రికి వివరించారు. ఆరోగ్యశ్రీ, టీవీవీపీలపై ఆరా... కీలకమైన ఆరోగ్యశ్రీకి ఇన్నాళ్లుగా పూర్తిస్థాయి సీఈవో లేకపోవడంపై ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. వైద్య ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ ఇన్చార్జి సీఈవోగా కొనసాగడం వల్ల రోజువారీ ఆరోగ్యశ్రీ కార్యకలాపాలకు అవాంతరాలు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన దీనిపై అడిగి తెలుసుకున్నారని సమాచారం. కాగా, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)కు కూడా పూర్తిస్థాయి కమిషనర్ లేరు. వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) రమేశ్రెడ్డి దీనికి ఇన్చార్జిగా ఉన్నారు. దీనిపైనా మంత్రి దృష్టి సారించినట్లు సమాచారం. కాగా, వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టులపైనా అడిగి తెలుసుకున్నారని సమాచారం. ‘సమస్యలు పరిష్కరించండి’ వైద్యుల సమస్యలు పరిష్కరించేందుకు వైద్యులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు హరీశ్రావును కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు. వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్రావును తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సెంట్రల్ లీగల్ అధ్యక్షుడు పల్లం ప్రవీణ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (డీహెచ్ విభాగం) అధ్యక్షుడు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, గాంధీ మెడికల్ కాలేజీ కార్యదర్శి డాక్టర్ అజ్మీరా రంగా, ఉస్మానియా యూనిట్ ప్రతినిధి డాక్టర్ శేఖర్, డాక్టర్ వినోద్, డాక్టర్ రవి తమ సమస్యలు విన్నవించారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019